breaking news
MiG-21 Bison fighter aircraft
-
మిగ్ స్థానంలో తేజస్
శత్రుసేనల గుండెల్లో భయం పుట్టిస్తూ, భారత వాయుసేనకు ఆరు దశాబ్దాలపాటు సేవలందించిన, ఘన చరిత గల మిగ్–21 యుద్ధవిమానాల స్థానంలో అధునాతన తేజస్ ఎంకే–1ఏ తేలికపాటి యుద్ధవిమానాలను విధుల్లోకి తీసుకోవాలని భారతవాయుసేన నిర్ణయించింది. సెప్టెంబర్లో మిగ్–21 యుద్ధవిమానాలకు వాయుసేన వీడ్కోలు పలకనుంది. సెప్టెంబర్ 19న చండీగఢ్లోని వైమానిక స్థావరంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వీటి సేవలకు లాంఛనంగా స్వస్తిపలకనున్నట్లు ఇప్పటికే వాయుసేన ఒక ప్రకటనలో పేర్కొంది. చండీగఢ్ ఎయిర్బేస్లోనూ మిగ్–21 యుద్ధవిమానాలు విధుల్లో ఉన్న విషయం విదితమే. ఇకమీదటా వీటి బాధ్యతలను తేజస్ తమ భుజస్కంధాలపై మోయనున్నాయి. అమెరికాలోని జనరల్ ఎలక్ట్రిక్(జీఈ) ఎఫ్404 అత్యంత శక్తివంతమైన ఇంజిన్ అమర్చిన తేజస్ 4.5 తరం అధునాతన యుద్ధవిమానం. పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకున్న తేలికపాటి యుద్ధవిమానంగానూ ఇది రికార్డులకెక్కింది. ప్రస్తుతం రెండు మాత్రమే మిగ్–21 స్క్వాడ్రాన్లు విధుల్లో ఉన్నాయి. ఇందులో మొత్తంగా 36 మిగ్ విమానాలు ఉన్నాయి. రాజస్థాన్లోని నాల్ ఎయిర్బేస్లోనూ మిగ్–21 విమానాలు విధులు నిర్వర్తిస్తున్నాయి. 1963లో మొదలైన మిగ్ ప్రస్థానం ఒక్కటే ఇంజిన్, ఒక్కటే పైలట్ సీటుతో రూపుదిద్దుకున్న బహుళ ప్రయోజన మిగ్–21 యుద్ధవిమానాలను భారతసైన్యం తొలిసారిగా 1963లో తమ దళాల్లోకి తీసుకుంది. భూతలం మీది లక్ష్యాలను చేధించేందుకు ప్రధానంగా దీనిని వినియోగించారు. నాటి సోవియట్ యూనియన్లోని మికోయన్–గురేవిచ్ డిజైన్ బ్యూరో(ఓకేబీ) దీని డిజైన్ను అభివృద్ధిచేసింది. 1965లో ఇండో–పాకిస్తాన్ యుద్ధం, 1999 కార్గిల్ యుద్ధం, 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో మిగ్–21 యుద్ధవిమానాలు కీలకపాత్ర పోషించాయి. పాకిస్తాన్లోని బాలాకోట్లో భారత వాయుసేన జరిపిన సర్జికల్ స్ట్రైక్లోనూ మిగ్ విమానాలు దాడులచేశాయి. గగనతలంలో శత్రువిమానాలతో పోరులో పాకిస్తాన్కు చెందిన అత్యంత అధునాతన ఎఫ్–16 యుద్ధవిమానాన్ని భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఈ మిగ్–21 నడుపుతూనే బాంబులతో నేలకూల్చి మిగ్ సత్తాను చాటారు. దాంతో ఆనాడు మరోసారి మిగ్ల శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయి. విమర్శలకూ కేంద్రబిందువుగా.. కీర్తితోపాటు అపకీర్తిని మిగ్ విమానాలు భారీగా మూటగట్టుకున్నాయి. ఎన్నో విమానాలు సాంకేతిక సమస్యలతో కుప్పకూలాయి. ఎంతో ప్రతిభావంతులైన పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పైలట్ల మరణాలతో వారి సతీమణులను వితంతువులుగా మార్చే క్రతువులో మిగ్లు బిజీగా మారాయని గతంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. గగనతలంలో విధి నిర్వహణలో ఇప్పటిదాకా ఏకంగా 500 మిగ్ విమానాలు కుప్పకూలినట్లు, 170 మందికిపైగా పైలట్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక గణాంకాలే చెబతున్నాయి. ఆధునిక పంతాలో వాయుసేన కాలంచెల్లిన విమానాల స్థానంలో సమకాలీన అవసరాలు తీర్చే ఆధునిక సాంకేతికత దన్నుతో గగనతలాన్ని ఏలా కొత్త విమానాలను రంగంలోకి దింపాలని వాయుసేన గతంలోనే నిర్ణయించింది. అందులోభాగంగానే హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారీ తేలికపాటి యుద్ధవిమానం(ఎల్సీఏ) రకం తేజస్ను వాయుసేనలోకి తీసుకుంటున్నారు. ఇజ్రాయెల్ తయారీ ఈఎల్/ఎం 2025 ఏసా రాడార్, కొత్తతరం ఎల్రక్టానిక్ ఉపకరణాలు, జామర్, నేరుగా కనిపించంత దూరంలో ఉన్న లక్ష్యాన్ని సైతం చేధించే సత్తాతో కొత్త విమానాన్ని వాయుసేన రంగంలోకి దింపుతోంది. పాతకాలంనాటి మెకానికల్ ఫ్లైట్ కంట్రోలర్లకు బదులుగా ఎలక్ట్రానిక్ ఇంటర్ఫేజ్ కంట్రోల్ కంప్యూటర్ సదుపాయాలు తేజస్లో ఉన్నాయి. మొత్తంగా తొమ్మిది వేర్వేరు రకాలైన ఆయుధాలను ఇది ప్రయోగించగలదు. ఇజ్రాయెల్ తయారీ డెర్బీ క్షిపణులతోపాటు దేశీయంగా తయారైన అస్త్ర మిస్సైల్ను తేజస్ సునాయసంగా ప్రయోగించగలదు. దీనికి రిపేర్లు చేయడం కూడా చాలా సులువు. గగనతల రక్షణతోపాటు నిఘా, దాడి వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. 48వేల కోట్ల డీల్ తేజస్ ఎంకే–1ఏ రకం 83 విమానాలను తయారుచేసి సరఫరాచేసేందుకు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ సంస్థతో భారత రక్షణ మంత్రిత్వ శాఖ రూ.48,000 కోట్ల ఒప్పందాన్ని 2021 ఫిబ్రవరిలోనే కుదుర్చుకుంది. ఇవిగాక మరో 97 యుద్దవిమానాల కొనుగోలు కోసం ప్రభుత్వం రూ. 67,000 కోట్లు ఖర్చుచేసేందుకు సిద్ధపడింది. అయితే తేజస్లో అమర్చేందుకు కావాల్సిన జీఈ ఎఫ్404 రకం 99 ఇంజిన్ల కొనుగోలు కోసం అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్తో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ రూ.5,375 కోట్ల విలువైన ఒక ఒప్పందాన్ని 2021 ఆగస్ట్లోనే కుదుర్చుకుంది. ఏడాది ఆలస్యంగా ఇవి సంస్థకు అందాయి. తొలి దశలో 12 తేజస్ విమానాలను వాయుసేనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. విదేశీ ఇంజిన్ను చెక్చేసి, ప్రధాన బాడీకి బిగించి, మళ్లీ తనిఖీచేయడం సుదీర్ఘప్రక్రియ. అందుకే తేజస్ల తుది డెలివరీ ఆలస్యమవుతోంది. – సాక్షి, నేషనల్డెస్క్ -
స్త్రీ శక్తి: సూపర్ ఫైటర్
సవాలుకు దీటైన సమాధానం విజయంలోనే దొరుకుతుంది. ‘అమ్మాయిలు బైక్ నడపడం కష్టం’ అనే మాట విన్నప్పుడు పట్టుదలగా బైక్ నడపడం నేర్చుకుంది. ‘ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ప్రవేశించడం చాలా కష్టం’ అనే మాట విన్న తరువాత ఫైటర్ పైలట్ కావాలనుకునే లక్ష్యానికి బీజం పడింది. ‘మిగ్–21 బైసన్’ యుద్ధ విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించిన స్క్వాడ్రన్ లీడర్ అవని చతుర్వేది జపాన్లో జరగబోయే ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్లలో పాల్గొనబోతోంది... ఇండియా, జపాన్ దేశాలు కలిసి ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్లు నిర్వహించనున్నాయి. ఎయిర్ డిఫెన్స్కు సంబంధించి పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకునే లక్ష్యంగా ఇండియన్ ఎయిర్ఫోర్స్(ఐఏఎఫ్), జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్(జేఎఎస్డీఎఫ్)లు గగనతల విన్యాసాలకు శ్రీకారం చుట్టనున్నాయి. జపాన్లో హైకురీ ఎయిర్బేస్ కేంద్రంగా జరిగే ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్లు (వీర్ గార్డియన్ 2023) ఈ నెల 12 నుంచి 26 వరకు జరగనున్నాయి. మన దేశానికి సంబంధించి సుఖోయ్–30 ఎంకేఐ, సీ–17 హెవీ–లిఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్లు దీనిలో భాగం అవుతాయి. ఈ కార్యక్రమంలోపాల్గొంటున్న ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలట్గా స్క్వాడ్రన్ లీడర్ అవని చతుర్వేది చరిత్ర సృష్టించనుంది. మన దేశంలో జరిగిన కంబాట్ ఎక్సర్సైజ్లలో మహిళా ఫైటర్ పైలట్లుపాల్గొన్న సందర్భాలు ఉన్నప్పటికీ, వేరే దేశంలో జరిగే దానిలో ఒక మహిళా ఫైటర్ పైలట్పాలుపంచుకోడం ఇదే తొలిసారి. మధ్యప్రదేశ్కు చెందిన అవని చతుర్వేది జైపూర్లో బీటెక్ చేసింది. విమానాలపై ఉన్న ఆసక్తితో రాజస్థాన్లోని వనస్థలి యూనివర్శిటీ ‘ప్లయింగ్ క్లబ్’లో చేరింది. అక్కడ మొదలైన ఆమె ప్రయాణం విజయపరంపరలతో సాగుతూనే ఉంది. ‘మిగ్–21 బైసన్’ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా ఫైటర్ పైలట్గా 2018 చరిత్ర సృష్టించింది అవని. రాష్ట్రపతి చేతుల మీదుగా 2020లో ‘నారీశక్తి’ పురస్కారాన్ని అందుకున్న అవని, వైమానిక రంగంలో పనిచేయాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకోవడానికి ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిని ఇచ్చింది. అవని తండ్రి నీటిపారుదలశాఖలో ఇంజనీరు. సోదరుడు సైన్యంలో పనిచేస్తున్నాడు. సోదరుడి స్ఫూర్తితోనే సైన్యంలోకి వచ్చింది అవని. భారతీయ వైమానికదళంలో పనిచేయాలనే తన లక్ష్యాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు ‘ఫ్లైయింగ్ క్లబ్లో చేరినంత సులువు కాదు’ అని వెక్కిరించిన వాళ్లూ ఉన్నారు. అయితే వాటిని అవని సీరియస్గా తీసుకోలేదు. ఎఎఫ్సిఎటీ పరీక్షలో రెండో స్థానంలో నిలిచి ప్రశంసలు అందుకుంది. దుండిగల్(హైదరాబాద్)లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో కఠినమైన శిక్షణ పొందింది. సాహసాలతో చెలిమి చేసింది. అవనికి బాస్కెట్బాల్, చెస్ ఆడడం, పెయింటింగ్ అంటే ఇష్టం. బాస్కెట్బాల్ వల్ల తెగువ, చెస్తో లోతైన ఆలోచన, పెయింటింగ్తో సృజనాత్మక శక్తులు తనలో వచ్చి చేరాయి. ‘ప్రతిరోజూ ఒక కొత్త విషయం నేర్చుకోవాలనేది నా విధానం. మంచి ఫైటర్ పైలట్గా పేరు తెచ్చుకోవాలనేది నా లక్ష్యం’ అంటోంది అవని చతుర్వేది. ‘కఠినమైన ఫైటర్–ఫ్లయింగ్ షెడ్యూల్స్’ అంటూ ఒకప్పుడు ఐఏఎఫ్ మహిళలను కంబాట్ స్ట్రీమ్లోకి తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు ఐఏఎఫ్ ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. దీనికి తాజా ఉదాహరణ జపాన్లో జరిగే ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్కు అవని చతుర్వేదిని ఎంపిక చేయడం. -
రాజస్థాన్లో కుప్పకూలిన సైనిక విమానం
జైపూర్: భారత వాయుసేన (ఎయిర్ ఫోర్స్-ఐఏఎఫ్)కు చెందిన మిగ్-21 బైసన్ విమానం రాజస్థాన్లో కుప్పకూలింది. అయితే అందులో పైలట్ మాత్రం సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రాజస్థాన్లోని బర్మార్లో బుధవారం సాయంత్రం ఆకాశానికి ఎగిరిన విమానం 5.30 గంటల సమయంలో కూలిందని భారత వాయుసేన (ఐఏఎఫ్) ప్రకటించింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. (చదవండి: ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ చేశారని విషం తాగిన టీచర్లు) కాగా మిగ్ విమానాలు కూలడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది మే 21వ తేదీన శిక్షణ విమానం పంజాబ్లోని మోగా జిల్లాలో కూలింది. ఆ ఘటనలో స్కా్వడ్రన్ లీడర్ అభినవచౌదరి మృతి చెందారు. ఇదే సంవత్సరం మార్చిలో మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో మిగ్-21 బైసన్ జెట్ విమానం టేకాఫ్ అవుతుండగా కూలిపోగా ఒకరు మరణించారు. జనవరిలో రాజస్థాన్లోని సూరత్గడ్లో మిగ్-21 బైసన్ విమానం టేకాఫ్ అయ్యి శ్రీగంగానగర్ జిల్లాలో కూలింది. అయితే ఈ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. తాజాగా జరిగిన ఘటన నాలుగోది. మిగ్-21 విమానాలు ప్రమాదానికి గురవడంపై వాయుసేన దర్యాప్తు చేస్తోంది. చదవండి: శ్రీలంక యువతి కేసులో కీలక మలుపు: హీరో ఆర్యకు బిగ్ రిలీఫ్ At around 1730 hrs today, an IAF MiG-21 Bison aircraft airborne for a training sortie in the western sector, experienced a technical malfunction after take off. The pilot ejected safely. A Court of Inquiry has been ordered to ascertain the cause. — Indian Air Force (@IAF_MCC) August 25, 2021


