breaking news
Meyer
-
Icon Of The Seas: టైటానిక్ కంటే ఐదు రెట్లు పెద్దది
సముద్ర అలలతో పోటీపడేలా ఆశలు ఉప్పొంగేవారికి ఇదో అద్భుతమైన అవకాశం. సముద్ర జలాల్లో ప్రయాణానికి ప్రపంచంలోనే అతి పెద్ద నౌక సిద్ధమైంది. టైటానిక్ కంటే ఇది ఐదు రెట్లు పెద్దది. ఈ నౌకలోనే సకల సదుపాయాలు ఉన్నాయి. ప్రపంచంలోని నౌకల్లో స్వర్గధామంగా మారిన ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’ ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. రకరకాల ధరల శ్రేణుల్లో ఈ విలాసనౌకలో అద్భుత ప్రయాణానికి ఏర్పాట్లున్నాయి. ప్రత్యేకతలివీ.. ► ఫిన్లాండ్లో మెయర్ తుర్కు షిప్యార్డ్ ఈ నౌకని నిర్మించింది ► రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన ఈ నౌక పేరు ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’. ► నౌక పొడవు 1200 అడుగులు, బరువు 2,50,800 టన్నులు, ► ఈ నౌకలో 2,350 మంది సిబ్బంది ఉంటారు. 5,610 మంది ప్రయాణించగలరు ► ప్రపంచ వ్యాప్తంగా 40 ప్రాంతాలకు చెందిన విభిన్న ఆహార పదార్థాలు ఈ షిప్లో లభిస్తాయి. ► నౌకలో వాటర్పార్క్లు, స్విమ్మింగ్పూల్లు, ఫ్యామిలీలు ఎంజాయ్ చేసే సకల సదుపాయాలున్నాయి. ► వచ్చే ఏడాది జనవరిలో మియామి నుంచి బయల్దేరే ఈ నౌక కరేబియన్ సముద్ర జలాల్లో ప్రయాణిస్తుంది. ► ఈ నౌకలో ప్రపంచంలోనే అతి పెద్ద వాటర్ పార్క్ ఉంది. దీనికి కేటగిరీ 6 అని పిలుస్తారు. ఈ వాటర్ పార్కులో ఆరు స్లైడ్లు ఉన్నాయి. ► ఒక వాటర్ స్లయిడ్ నుంచి నేరుగా సముద్రంలోకి డైవ్ చేసేలా పెట్టారు. కానీ ప్రయాణికుల భద్రత రీత్యా దీనిని వారికి అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాల్లేవు. ► జూన్ 22న ఈ నౌక విజయవంతంగా మొదటి ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. ► నౌకలో ఉద్యానవనాలు ఉన్నాయి. పార్కుల్లోనూ ప్రయాణికులు సేద తీరవచ్చు. ► కాలుష్య నివారణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో లిక్విఫైడ్ నేచరల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)ను ఇంథనంగా వాడుకుంటూ ఈ నౌక ప్రయాణం కొనసాగిస్తుంది. ► వచ్చే ఏడాది జనవరిలో మియామి నుంచి ప్రారంభమయ్యే ఈ నౌకలో ప్రయాణం కోసం ఇప్పటికే రికార్డు స్థాయిలో టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ► వివిధ రకాల ప్యాకేజీల కింద ధరలున్నాయి. అన్నింటికంటే తక్కువగా ఏడు రాత్రులు ఓడలో గడపాలంటే 3 వేల పౌండ్ల (రూ. 3 లక్షలకు పైన ) వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ► కరేబియన్లో అత్యంత అందమైన దీవులైన బహమాస్, కొజుమెల్, ఫిలిప్స్బర్గ్, సెయింట్ మార్టెన్, రోటన్, హోండురస్ వంటి వాటి మీదుగా ఈ నౌక ప్రయాణిస్తుంది. ► వినోదమే ప్రధానంగా రూపొందించిన ఈ షిప్లో జరీ్నకి సర్వత్రా ఆసక్తి నెలకొంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ ఫేస్ టూ వేస్ట్’
చికాకు పడిన మేయర్ మధ్యలో నిలిచిన కార్యక్రమం ఫిర్యాదు చేసినా సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురి ఫిర్యాదు సాక్షి,సిటీబ్యూరో: మేయర్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల వేదిక ‘ఫేస్ టూ ఫేస్’ అభాసుపాలైంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజాఫిర్యాదుల్ని పరిష్కరించేందుకు ప్రతినెలా మొదటి శనివారం గంటసేపు నిర్వహిస్తున్నారు. ఇందులో తొలి అరగంట ఫోన్ల ద్వారా వచ్చే ఫిర్యాదుల్ని..అనంతరం వ్యక్తిగతంగా ఇచ్చే ఫిర్యాదుల్ని స్వీకరిస్తారు. శనివారం కార్యక్రమం ప్రారంభం కావడమే నిర్ణీత సమయం కంటే కొద్దిగా ఆలస్యమైంది. ప్రారంభమయ్యాక కూడా ఫోన్ ద్వారా అందే ఫిర్యాదులు మేయర్కు సరిగ్గా వినిపించకపోవడం.. మధ్యమధ్య అవాంతరాలు ఎదురవడంతో చిరాకుకు గురైన మేయర్ టెలిఫోన్ ఫిర్యాదులు ఆపాల్సిందిగా ఆదేశించారు. ప్రతినెలా దాదాపు 20 ఫిర్యాదుల్ని ఫోన్ద్వారా స్వీకరించేవారు. అలాంటిది ముగ్గురి ఫోన్కాల్స్తోనే మేయర్ ఫోన్ కార్యక్రమాన్ని ముగించి, వ్యక్తిగత దరఖాస్తుల్ని స్వీకరించారు. జీహెచ్ఎంసీలో వివిధ విభాగాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేవని ప్రజలు విమర్శిస్తుండ గా..ప్రజా ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ సైతం సక్రమంగా లేకపోవడం జీహెచ్ఎంసీ పనితీరుకు అద్దం పడుతోందని పలువురు వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా హాజరైన వారు కూడా ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా తమ సమస్య పరిష్కారం కావడంలేదని వాపోయారు. మలేసియా టౌన్షిప్లో అక్రమ నిర్మాణాల్ని అడ్డుకోవాలని, ప్రజారోడ్డును మూసివేసిన వారిపై ఇంతవరకు ఎలాంటి చర్యల్లేవని గతంలో ఫిర్యాదు చేసిన గోపాలరావు మరోమారు ఫిర్యాదు చేశారు. ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా కిందిస్థాయి సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా ఇచ్చిన నీటి, కరెంటు కనెక్షన్లు తొలగించాల్సిందిగా పదేపదే ఫిర్యాదులు చేసిన సీహెచ్ కృష్ణ సంబంధిత డాక్యుమెంట్లతో మరోమారు విషయాన్ని మేయర్ దృష్టికి తెచ్చారు. ఇకపై ఫేస్ టూ ఫేస్కు కాకుండా తన చాంబర్కు రావాల్సిందిగా మేయర్ ఆయనకు సూచించారు. దాదాపు 20 ఫిర్యాదులు వ్యక్తిగతంగా అందజేశారు.