breaking news
Master mahendran
-
ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా
ప్రతివారం థియేటర్లలో అయినా సినిమాలు మిస్ అవుతాయేమో గానీ ఓటీటీల్లో మాత్రం తెలుగు, డబ్బింగ్ చిత్రాలు స్ట్రీమింగ్లోకి వస్తూనే ఉంటాయి. అలా వచ్చే వారం రాజాసాబ్, నారీ నారీ నడుమ మురారి లాంటి సంక్రాంతి మూవీస్.. డిజిటల్గా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడు వీటితో పాటే మరో తెలుగు చిత్రం కూడా ఓటీటీలోకి వచ్చేయనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఏంటా మూవీ?(ఇదీ చదవండి: 'మన శంకరవరప్రసాద్' ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడేనా?)బాలనటుడిగా పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించిన మహేంద్రన్.. పెద్దయ్యాక 'మాస్టర్' తదితర తమిళ చిత్రాల్లోనూ నటించాడు. ప్రస్తుతం హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేశాడు. అలా చేసిన ఓ మూవీ 'నీలకంఠ'. ఈ నెల 2వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న స్టార్స్ లేకపోవడంతో ఎప్పుడొచ్చి వెళ్లిందో అన్నంత వేగంగా మాయమైపోయింది. ఇప్పుడీ చిత్రం ఫిబ్రవరి 6వ తేదీ నుంచి సన్ నెక్స్ట్లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.'నీలకంఠ' విషయానికొస్తే.. సరస్వతిపురం గ్రామం. ఊరిలో ఎవరూ తప్పు చేసినా గ్రామపెద్ద రాఘవయ్య(రాంకీ) కఠిన శిక్షలు విధిస్తుంటాడు. ఇదే ఊరికి చెందిన టైలర్ నాగభూషణం(కంచరపాలెం రాజు) కొడుకు.. పదో క్లాసు చదువుతున్న ఓ తప్పు చేస్తాడు. దీనికి శిక్షగా 15 ఏళ్లపాటు ఊరి దాటి వెళ్లొద్దని రాఘవయ్య ఆదేశిస్తాడు. ఈ కారణం వల్ల నీలకంఠ పెద్ద చదువులు చదవలేకపోతాడు. కబడ్డీ ప్లేయర్ అవుతాడు గానీ శిక్ష వల్ల మండల స్థాయి కబడ్డీ పోటీలకు వెళ్లలేకపోతాడు. మరోవైపు ఇదే ఊరి సర్పంచ్(పృథ్వీ) కూతురు సీత(యష్న ముతులూరి)తో నీలకంఠ ప్రేమలో ఉంటాడు. ఓ సందర్భంగా సీత తండ్రితోనే సర్పంచ్ అవుతానని, తర్వాత పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేస్తాడు. చివరకు ఏమైందనేదే మిగతా కథ.(ఇదీ చదవండి: నమ్మలేని పనులన్నీ చేస్తున్న రాజమౌళి) -
మాస్టర్ మహేంద్రన్ ‘నీలకంఠ’ మూవీ రివ్యూ
మాస్టర్ మహేంద్రన్ హీరోగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్లుగా రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘నీలకంఠ’. ఎం.మమత, ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మించిన ఈ చిత్రం నేడు(జనవరి 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..కట్టుబాట్లకు పెట్టింది పేరు సరస్వతిపురం గ్రామం. అక్కడ తప్పుడు చేసిన వారికి గ్రామ పెద్ద రాఘవయ్య(రాంకీ) కఠిన శిక్షలు విధిస్తాడు. ఆ ఊరి ట్రైలర్ నాగభూషణం(కంచరపాలెం రాజు) కొడుకు నీలకంఠ(మాస్టర్ మహేంద్రన్) పదో తరగతి చదువుతున్న సమయంలో ఓ తప్పు చేస్తాడు. దానికి శిక్షగా 15 ఏళ్ల పాటు ఊరి దాటి వెళ్లొద్దని రాఘవయ్య ఆదేశిస్తాడు. ఆ శిక్ష కారణంగా నీలకంఠ ఉన్నత చదువులు చదవలేకపోతాడు. దీంతో ఊర్లోనే కబడ్డీ ఆట ఆడడం మొదలుపెడతాడు. ఊర్లో జరిగే అన్ని కబడ్డీ పోటీల్లోనూ గెలుస్తాడు. కానీ ఆయనకి పడ్డ శిక్ష కారణంగా మండల స్థాయి కబడ్డీ ఆటల్లో పాల్గొనలేకపోతాడు. దీంతో ప్రతిసారి సరస్వతిపురం మండలస్థాయిలో ఓడీపోతూనే ఉంటుంది. ఇదిలా ఉంటే..టెన్త్ క్లాస్లో నీలకంఠ ఆ ఊరి సర్పంచ్(పృథ్వీ) కూతురు సీత(యష్న ముతులూరి) ఇష్టపడతాడు. ఆమె ఉన్నత చదువుల కోసం వెళ్లి.. 15 ఏళ్ల తర్వాత తిరిగి ఊరికి వస్తుంది. తన కూతురు నీలకంఠతో ప్రేమలో ఉందన్న విషయం తెలుసుకున్న సర్పంచ్.. వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు రెడీ అవుతుంటాడు. నీలకంఠ అడ్డుకొని.. సీత వాళ్ళ నాన్న ఏది అయితే స్థాయి అనుకుంటున్నాడో ఆ సర్పంచ్ పదవికి పోటీ చేసి గెలిచిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేస్తాడు. దొంగగా ముద్ర వేసుకున్న నీలకంఠ సర్పంచ్గా గెలిచాడా? మండల స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిసారి ఓడిపోతున్న సరస్వతీ గ్రామాన్ని నీలకంఠ ఎలా గెలిపించగలిగాడు? అసలు నీలకంఠ చేసిన తప్పేంటి? తల్లికి ఇచ్చిన మాటను నెరవేర్చడం కోసం నీలకంఠ ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా(Nilakanta Review) చూడాల్సిందే. ఎలా ఉందంటే..ఒక ఊరు..అక్కడ కొన్ని కట్టుబాట్లు.. అవి పాటించకపోతే ఓ పెద్దమనిషి శిక్ష వేయడం.. చేయని తప్పుకు హీరో శిక్ష అనుభవించడం..చివరకు ఊరి కోసం హీరో ఏదో ఒక మంచి పని చేసి..వారందరిచేత జై కొట్టించుకోవడం..ఇలాంటి నేపథ్యంలో తెలుగులో ‘పెదరాయుడు’ తో పాటు చాలా సినిమాలు వచ్చాయి. నీలకంఠ నేపథ్యం కూడా అలానే ఉంటుంది. అయితే ఇక్కడ కోర్ పాయింట్ కాస్త కొత్తగా ఉంటుంది. తప్పు చేస్తే ఊరు నుంచి వెలేయడం గత సినిమాల్లో చూశాం..కానీ ఇందులో మాత్రం తప్పు చేసినవాడిని ఊర్లోనే ఉంచి..ఇఫ్టమైనది దూరం చేయడం అనేది ఆసక్తికర అంశం. సినిమా ప్రారంభంలోనే ఆ విషయం చెప్పి.. అసలు కథను ప్రారంభించారు దర్శకుడు. నాన్ లినియర్ స్క్రీన్ ప్లేతో కథను ముందు వెనక్కి జరుపుతూ.. తర్వాత ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలిగించేలా చేశారు. ఫస్టాఫ్ అంతా హీరో ఎమోషనల్ జర్నీతో పాటు హీరోయిన్తో లవ్స్టోరీని చూపించి.. ఓ సస్పెన్స్తో ఇంటర్వెల్ సీన్ కట్ చేశారు. ఇక సెకండాఫ్ అంతా సీరియస్గా సాగుతుంది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగుంటాయి.ఊరు లో జరిగే కబడ్డీ స్పోర్ట్స్ ని బాగా చిత్రీకరిచారు. చివరి 25 నిముషాలు కథనం ఆసక్తికరంగా సాగుతుంది. కధకి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ని లాస్ట్ లో కొత్తగా చూపించారు. తాను చెప్పాలి అనుకున్న పాయింట్ ని ఆడియన్స్ కి అర్ధం అయ్యేలా చెప్పడం లో దర్శకుడు విజయం సాధించాడు.అయితే ఫస్టాఫ్ కథని మరింత బలంగా రాసుకొని.. స్క్రీన్ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే..పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా ఆకట్టుకున్న మాస్టర్ మహేంద్రన్.. ఈ మూవీతో హీరోగా మారి..తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్లతో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ అదరగొట్టేశాడు. సీత పాత్రకి యష్న ముతులూరి న్యాయం చేసింది.స్నేహ ఉల్లాల్ డాన్స్ చాల గ్రేస్ తో చేసింది.రాంకీ గారిని చాల రోజుల తరువాత స్క్రీన్ మీద చూడటం బాగా అనిపించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మార్క్ ప్రశాంత్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు వింటేజ్ ఫిలింగ్ని కలిగిస్తాయి. ఎడిటింగ్ పర్వాలేదు.సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- రేటింగ్: 2.5/5 -
హీరోగా పెద రాయుడు బాలనటుడు ఎంట్రీ.. ఆసక్తిగా టీజర్
మాస్టర్ మహేంద్రన్.. బాల నటుడిగా ఎన్నో సినిమాలు చేశాడు. పెద్దరాయుడు, దేవి, సింహరాశి, సింహాద్రి.. లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. అన్ని బాషలలో కలిపి 200లకు పైగా సినిమాలు చేసాడు. అయితే పెద్దరాయుడు చిత్రంతో అందరి గుండెల్లో నిలిచాడు. 'నేను చూసాను తాతయ్య' అంటూ 'పాపారాయుడు' రజినీకాంత్కు విషయం చెప్పి పెద్దరాయుడు సినిమానే మలుపు తిప్పిన పిల్లాడు మన మహేంద్రనే. అప్పటి పిల్లాడే.. ఇప్పుడు హీరో అయ్యాడు.మహేంద్రన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'నీలకంఠ'. ఈ చిత్రానికి రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో యష్నా చౌదరి, నేహా పఠాన్ కథానాయికలుగా నటించారు. మరో హీరోయిన్ స్నేహ ఉల్లాల్ కీలక పాత్రలో కనిపించారు. ఎల్ఎస్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా న్యూ ఇయర్ కానుకగా జనవరి 2 విడుదలకు సిద్ధమైంది. నైజాంలో బడా నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ రిలీజ్ చేస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ అందరిని ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. -
మైథలాజికల్ మూవీగా 'వసుదేవ సుతం'.. ఆసక్తిగా గ్లింప్స్
మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటిస్తోన్న మైథలాజికల్ చిత్రం వసుదేవ సుతం. ఈ మూవీకి వైకుంఠ్ బోను దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ చైత్ర శ్రీ, మాస్టర్ యువాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో రెయిన్బో సినిమాస్ బ్యానర్పై ధనలక్ష్మి బాదర్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మణిశర్మ చేతుల మీదగా అదిరిపోయే గ్లింప్స్ను రిలీజ్ చేశారు.విశ్వాన్ని చూపించడం.. అందులోంచి భూమి.. భూమీ మీదున్న ఓ గుడి.. ఆ గుడిలో ఉన్న పాము.. ఆ తరువాత హీరో ఎంట్రీ ఇలా అన్నీ అదిరిపోయేలా ఉన్నాయి. గుడిలోని నిధి చుట్టూ ఈ కథ తిరిగేలా కనిపిస్తోంది. తాజాగా విడుదలైన గ్లింప్ చూస్తే ఈ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ, ఒరియా భాషల్లో రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో అంబికావాణి, జాన్ విజయ్, మిమ్గోపి, సురేష్చంద్ర మీనన్, ఐశ్వర్యలక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, జబర్ధస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
మహేంద్రన్ హీరోగా పక్కం నంబర్ 143
మాస్టర్ మహేంద్రన్గా తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించి మహుళ ప్రాచుర్యం పొందిన నటుడు మహేంద్రన్ ఇప్పుడు కథానాయకుడి స్థాయికి ఎదిగిన విషయం తెలిసిందే.కాగా తాజాగా మహేంద్రన్ పక్కమ్ నంబర్ 143 అనే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.శ్రీలక్ష్మి నరసింహా సినీ స్టూడియోస్ పతాకంపై క్రిష్ణబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం,మాటలు,దర్శకత్వం బాధ్యతల్ని ఏ.జగన్ నిర్వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఆయన వెల్లడిస్తూ కాలం మారుతున్నా కొందరు మనుషులు మాత్రం మారరన్నారు. వారి గుణగణాల్లోనూ మార్పు రాదన్నారు. అలాంటి ఒక క్రూర మనస్తత్వం గల యువకుడి ఒక యువతి ఎలా మంచి వాడిగా మార్చిందన్న విభిన్న కథాంశంతో తెరకెక్కించనున్న చిత్రం పక్కమ్ నంబర్ 143 అని తెలిపారు. చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూసి ఆనందించే విధంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. చిత్రానికి సంగీతాన్ని మధుకర్, చాయాగ్రహణం కర్ణ అందిస్తున్నట్టు దర్శకుడు తెలిపారు.


