breaking news
Manipur court
-
'ఉక్కు మహిళ'కు ఎట్టకేలకు విముక్తి
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్తో 14 ఏళ్లుగా నిరాహారదీక్ష చేస్తున్న మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిలకు ఎట్టకేలకు విముక్తి లభించింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్లోని ఆస్పత్రి నుంచి ఆమె బుధవారం విడుదలయ్యారు. తనను విడుదల చేయడం పట్ల ఇరోమ్ షర్మిల సంతోషం వ్యక్తం చేసింది. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్ పై వెనక్కు తగ్గబోనని స్పష్టం చేసింది. నిరాహారదీక్ష కొనసాగిస్తానని ఆమె తెలిపింది. ఆస్పత్రి ప్రత్యేక వార్డులో ఉంచి ఇప్పటివరకు బలవంతంగా ఆమెకు ఫ్లూయిడ్స్ ఎక్కించారు. ఆమె ఉంటున్న గదినే సబ్ జైలుగా మార్చారు. అయితే ఇరోమ్ షర్మిలను విడుదల చేయాలని మణిపూర్ కోర్టు ఆదేశించడంతో ఆమెకు విముక్తి ప్రసాదించారు. -
ఐరోమ్ షర్మిల చానును విడుదల చేయండి:కోర్టు
న్యూఢిల్లీ:ఉద్యమ నాయకురాలు ఐరోమ్ షర్మిలను విడుదల చేయాలని మణిపూర్ కోర్టు ఆదేశించింది. గతంలో ఎఎఫ్ఎస్పిఎ(ఆర్మ్ డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్) రద్దు కోరుతూ ఆమరణ దీక్షకు దిగిన షర్మిలను జ్యూడిషియల్ కస్టడీలో ఉంచిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం విచారించిన కోర్టు.. ఆమె ఆత్మహత్య చేయడానికి యత్నించినట్లు సరైన అధారాలు లేనందున విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 1958 చట్ట పరిధిలో ఉన్న ఎఎఫ్ఎస్పీఏ రద్దు చేయాలని కోరుతూ ఆమె 2000 వ సంవత్సరం నవంబర్ 4 వ తేదీన ఆమరణ దీక్ష కు దిగింది.