breaking news
mallayya
-
మల్లయ్య కొండలపై మైనింగ్ బాబుల కన్ను
మదనపల్లె: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలోని ప్రఖ్యాత మల్లయ్య కొండలను ఐరన్ ఓర్ పేరుతో కొల్లగొట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పథకం వేసింది. వేల కోట్ల విలువైన ఇనుప ఖనిజాన్ని దోచుకునేందుకు రహస్యంగా పావులు కదిపింది. ముందుగా కాంపోజిట్ లైసెన్స్కు అత్యంత రహస్యంగా టెండర్లు పిలిచింది. ఆ తర్వాత మైనింగ్కు అనుమతించాలనేది ప్రభుత్వ వ్యూహమని సమాచారం. ఈ విషయం సోమవారం వెలుగులోకి వచి్చంది. ప్రభుత్వ చర్యపై శివ భక్తుల్లో తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. మల్లయ్య కొండల్లో మైనింగ్ జరగనివ్వబోమని గతంలో చెప్పిన చంద్రబాబే ఇప్పుడు మాట తప్పి, ఆ కొండలపై ఉన్న మల్లికార్జున స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ సాధుకొండను తొలిచి అమ్ముకొనేందుకు తన అనుంగులకు కట్టబెట్టే ప్రయత్నాలు సాగిస్తుండటంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఐరన్ ఓర్ దోపిడీకి వ్యూహం తంబళ్లపల్లె సమీపంలో మల్లయ్య కొండల సమూహంలో సాధుకొండ, ఇనుము కొండ, మల్లయ్య కొండ ఉన్నాయి. ఇవి 6,079 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. మల్లయ్య కొండపై పురాతన మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. నిత్యం అనేక మంది భక్తులు కొలిచే ఈ ఆలయం ఉండటం వల్ల ఈ కొండలపై మైనింగ్ చేయడంలేదు. 1893లోనే బ్రిటిష్ ప్రభుత్వం ఈ కొండల ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించింది. ఈ కొండల్లో 100 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం ఉందని 2006 నుంచి కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. మల్లయ్య కొండల్లో మైనింగ్ చేపట్టరాదని ఈ ప్రాంత ప్రజలు గతంలో తీవ్రస్థాయిలో ఉద్యమించారు. గత ప్రభుత్వాలు కూడా భక్తుల మనోభావాలను గౌరవించి ఈ కొండల జోలికి వెళ్లలేదు. దీన్ని లీజు పేరుతో దక్కించుకునేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో జియో మైసూర్ సంస్థ పావులు కదిపింది.అప్పట్లో 89 సంస్థలు పోటీ పడినప్పటికీ, జియో మైసూర్ సంస్థకు ఎక్స్ప్లరేషన్ లైసెన్స్ మంజూరయింది. దీనిపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచి్చంది. ఆ సంస్థ మొక్కుబడిగా పరిశీలన జరిపి, ఆ తర్వాతి చర్యలు నిలిపివేసింది. 2009 ఎన్నికల్లో తంబళ్లపల్లి నియోజకవర్గం ప్రచారానికి వచి్చన చంద్రబాబు మల్లయ్య కొండల్లో మైనింగ్ జరగనివ్వబోమని, భక్తుల మనోభావాలను గౌరవిస్తామని ప్రకటించారు. ఇప్పుడు దీన్ని విస్మరించి కొండలను కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. భక్తుల మనోభావాలను పక్కన పెట్టి వేల కోట్ల రూపాలయ విలువైన ఇనుప ఖనిజాన్ని అనుకూల కంపెనీలకు దోచి పెట్టేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది.అనుకూల సంస్థలకు ముందుగా కంపోజిట్ లైసెన్స్ మంజూరు చేసి..ఆ తర్వాత మైనింగ్ లైసెన్స్ జారీ చేసేలా వ్యూహం పన్నినట్టు అర్థమవుతోంది. దీనికోసం గత ఏడాది నవంబర్ 27న మల్లయ్య కొండల సమూహంలోని సాధుకొండలో 900 హెక్టార్లు, శివపురం పరిధిలోని ఇదే కొండకు చెందిన 626 హెక్టార్లలో (మొత్తం 3,815 ఎకరాలు) ఐరన్ ఓర్ కోసం పరిశోధనలు జరపడం, అంచనాలు వేసుకునేందుకు తొలి విడతలో కాంపోజిట్ లైసెన్స్ పొందేందుకు సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఈ బిడ్ల స్వీకరణ జనవరి 16న ముగిసింది. టెండర్ల ఆహా్వనం, బిడ్ల స్వీకరణ మొత్తం అత్యంత గుట్టుగా సాగిపోయింది. బిడ్ల దాఖలు చేసిన సంస్థలు ఏవి అన్న విషయం కూడా రహస్యంగానే ఉంచారు.భక్తుల మనోభావాలు గౌరవించి సౌకర్యాలు కల్పించిన వైఎస్ జగన్మల్లయ్య కొండల్లో వేల కోట్ల విలువైన ఇనుప ఖనిజం ఉన్నప్పటికీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా భక్తుల మనోభావాలకే గౌరవమిచ్చారు. మైనింగ్ కంపెనీలు వీటిపై దృష్టి పెట్టకుండా చర్యలు చేపట్టారు. అక్కడ ఉన్న మల్లికార్జున స్వామి ఆలయానికి జీరో్ణద్ధరణ పనులు చేశారు. భక్తులకు తాగునీరు, రహదారి సహా అనేక సౌకర్యాలు కల్పించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతూ మైనింగ్కు సిద్ధమవుతోంది. -
బీఆర్ఎస్ నేత దారుణహత్య
నూతనకల్: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో బీఆర్ఎస్ నేత ఉప్పుల మల్లయ్య (55) దారుణ హత్యకు గురయ్యాడు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఆధిపత్యపోరులో ఈ ఘర్షణ జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్కు రిజర్వు అయ్యింది. బీఆర్ఎస్ మద్దతుదారుగా మాదాసు వెంకన్న, కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా దేశపంగు మురళి సర్పంచ్ బరిలో నిలిచారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత ఉప్పుల మల్లయ్య కోడలు ఉప్పుల శైలజ 4వ వార్డు నుంచి బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిగా పోటీలో ఉంది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఇరు పార్టీల వారు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు ప్రచారం ముగించుకొని గ్రామంలోని పార్టీల జెండా దిమ్మెల సమీపంలో కూర్చున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ వారు ఓటర్లను కలిసివస్తున్న సమయంలో.. శైలజకు ప్రత్యర్థిగా ఉన్న ఆకుల రజిత వర్గానికి చెందిన ఉప్పుల సతీశ్, కొరివి గంగయ్య, వీరబోయిన సతీశ్, ఉప్పుల గంగయ్య, ఉప్పుల ఎలమంచి, వీరబోయిన లింగయ్య, కారింగుల రవీందర్, దేశపంగు అవిలయ్యలు గొడవ పడడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చేసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు.. బీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మున్నా మల్లయ్యపై దాడి చేయగా, అడ్డుకోవడానికి వెళ్లిన ఉప్పుల మల్లయ్యపై కూడా కర్రలతో దాడి చేశారు. దీంతో మల్లయ్య తలకు తీవ్రగాయాలై కిందపడిపోయాడు. ఇదే సమయంలో తలపై బండరాయితో మోపడంతో అపస్మారకస్థితికి చేరుకున్నాడు. అతడిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో సూర్యాపేటకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి ఉప్పుల మల్లయ్య మృతి చెందినట్టు చెప్పారు. ఈ దాడిలో మున్నా మల్లయ్యతోపాటు అతని సోదరుడు లింగయ్య, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మల్లయ్య మృతదేహానికి సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం భారీ పోలీస్ బందోబస్తు మధ్య గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా, రాజకీయ కక్షలతోపాటు దాయాదుల గొడవలు కూడా ఈ దాడికి కారణమైనట్టు తెలిసింది. ఎనిమిది మంది నిందితుల అరెస్ట్ఉప్పుల మల్లయ్య హత్య కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టు సూర్యాపేట జిల్లా అడిషనల్ ఎస్పీ రవీందర్రెడ్డి తెలిపారు. మృతుడి భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దాడికి పాల్పడి, మృతికి కారకులైన ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు వివరించారు. -
మరుగుదొడ్డే ఇల్లుగా..
ఎడపల్లి(బోధన్): అందరూ ఉన్నా అనాథల్లా మారిన వృద్ధ దంపతులు, నివసించేందుకు నీడ లేక మరుగుదొడ్డినే ఇల్లుగా మార్చుకుని జీవనం సాగిస్తున్నారు. ఎడపల్లి మండలం పోచారం గ్రామానికి చెందిన బెజ్జంకి మల్లయ్య(82), మైసమ్మ(70) దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వృత్తిరీత్యా ఒకరు జిల్లా కేంద్రంలో పెయింటింగ్ పని చేస్తుంటాడు. మరొక కొడుకు దుబాయ్లో ఉంటున్నాడు. ఆయన భార్య, పిల్లలు పోచారంలో నివసిస్తున్నారు. వృద్ధాప్యంలో అయినవారు ఎవరూ చూడకపోవడంతో కొన్నేళ్లుగా పోచారంలో కొడుకు ఇంటి ఆవరణలో ఉన్న మరుగుదొడ్డిలో నివాసం ఉంటూ, కూలీనాలీ చేసి పొట్టపోసుకుంటున్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు గ్రామా నికి వెళ్లగా వారి పరిస్థితి వెలుగులోకి వచ్చింది. తమను ఆదుకోవాలని ఆ వృద్ధ దంపతులు కాంగ్రెస్ నాయకులను వేడుకున్నారు. దీంతో వారు స్పందించి తాము అధికారంలోకి రాగానే అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
చెరువులో పడి పశువుల కాపరి మృతి
మంగపేట : మండల కేంద్రంలోని గంపోనిగూడేనికి చెందిన మేకల మల్లయ్య(80) అనే పశువుల కాపరి ఉమ్మన్నకుంట చెరువులో పడి సోమవారం సాయంత్రం మృతి చెందినట్లు ఎస్సై ననిగంటి శ్రీకాం త్రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రోజువారీగా మల్లయ్య పశువులను మేతకు తీసుకెళ్లాడు. ఈక్రమంలో కొన్ని గేదెలు కనిపించకపోవడంతో వాటిని వెతుకుతూ ఉమ్మన్నకుంట చెరువు సమీపంలోకి వెళ్లాడు. చెరువులో ఉన్న గేదెలను బయటికి వెళ్లగొట్టే క్రమంలో నీటిలో మునిగి మృతిచెందాడు. మంగళవారం ఉదయం గ్రామస్తులు చెరువులో మల్లయ్య మృతదేహాన్ని గుర్తిం చారు. మృతుడి కుమారుడు నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
రుణం చె ల్లించకుంటే ఫ్లాట్ల స్వాధీనం
ఆలంపల్లి, న్యూస్లైన్: రాజీవ్ గృహకల్ప కింద మంజూరైన ఇళ్లకు సంబంధించి బ్యాంకు రుణాలు చెల్లించకుంటే ఫ్లాట్లను స్వాధీనం చేసుకుంటామని తాండూరు, వికారాబాద్ రాజీవ్ గృహకల్ప సముదాయాల లైజన్ అధికారి మల్లయ్య పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ ఆంధ్రాబ్యాంక్లో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం 2007లో రాజీవ్ గృహకల్ప సముదాయాన్ని నిర్మించి, పేద ప్రజలకు 1458 ఫ్లాట్లను కేటాయించిందని అన్నారు. వీటిని లబ్ధిదారులు సొంతం చేసుకునేందుకు వీలుగా వికారాబాద్లోని ఐదు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేసిందన్నారు. దక్కన్ గ్రామీణ బ్యాంకు 190 ఫ్లాట్లకు, జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్బ్యాంక్ 387, ఆంధ్రా బ్యాంకు 389, కెనరా బ్యాంకు 216, ఎస్బీహెచ్ 276 ఫ్లాట్ల లబ్ధిదారులకు రుణాలు ఇచ్చాయని వివరించారు. అయితే లబ్ధిదారులు అప్పటినుంచి బ్యాంకు రుణాలు చెల్లించడం లేదని పేర్కొన్నారు. అన్ని బ్యాంకులకు సంబంధించి దాదాపు రూ.15కోట్ల వరకు రుణాలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రుణ బకాయిలు కట్టకుంటే ఇళ్లు రద్దు చేస్తామని పలుమార్లు లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసినా స్పందన లేకపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో 185 జీఓ ప్రకారం రుణాలు చెల్లించని వారితో పాటు స్థానికంగా నివాసం ఉండని, వేరొకరికి అద్దెకు ఇచ్చిన వారి ఫ్లాట్లను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఇందుకోసం హౌసింగ్ జిల్లా పీడీ, సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత బ్యాంకు మేనేజర్తో కమిటీ వేశామన్నారు. క్షేత్రస్థాయిలో ఈ కమిటీ పరిశీలించి రుణాలు చెల్లించని వారితో పాటు స్థానికంగా ఉండని, ఇళ్లకు తాళాలు వేసిన వారిని గుర్తించి నోటీసులు జారీ చేస్తుందని వివరించారు. నోటీసులు ఇచ్చిన 15 రోజుల్లో రుణాలను చెల్లించకపోతే గృహాలను స్వాధీనం చేసుకుంటారని తెలిపారు. రాజీవ్ గృహకల్పలో లబ్ధిదారుల నుంచి ఇతరులు ఫ్లాట్లు కొంటే చెల్లదని, పూర్తిహక్కు గృహనిర్మాణ శాఖదేనని స్పష్టం చేశారు. సమావేశంలో ఆంధ్రా బ్యాంకు రీజినల్ మేనేజర్ కృష్ణారావు, కెనరా బ్యాంకు మేనేజర్ సుబ్బారావు, దక్కన్ గ్రామీణ బ్యాంకు మేనేజర్లు రాజారావు, రవీందర్, నరోత్తంరెడ్డి, జిల్లా కో ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వన్టైమ్ సెటిల్మెంట్... రాజీవ్గృహకల్పలో గృహాలకు సంబంధించి రుణాలను పొంది వాయిదాలు చెల్లించని వారికి వన్టైమ్ సెటిల్మెంట్కు అవకాశం ఇస్తున్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. ఇచ్చిన రుణంలో 60శాతం చెల్లిస్తే సరిపోతుందని అన్నారు. ఆరు సంవత్సరాలకు సంబంధించి 84 వాయిదాలు నిర్ణయించామని, ఇప్పటివరకు 34 నెలలు గడిచాయని అన్నారు. వాయిదాలు చెల్లించని వారు రూ.34 వేలు చెల్లిస్తే వడ్డీ ఉండదని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


