breaking news
life impriosnment
-
అంకితా భండారీ హత్య కేసులో దోషులకు జీవితఖైదు
-
చంద్రబాబుకు యావజ్జీవ కారాగార శిక్ష ?
-
‘వాల్మార్ట్’ కాల్పుల దోషికి 90 జీవిత ఖైదులు
ఎల్ పాసో: అమెరికాలోని ఎల్ పాసో నగరంలోని వాల్మార్ట్ స్టోర్లో 2019లో కాల్పులు జరిపి 23 మంది మృతికి కారణమైన వ్యక్తికి కోర్టు 90 వరుస జీవిత ఖైదులను విధించింది. దోషి పాట్రిక్ క్రుసియస్(24)పై సుమారు 50 ఫెడరల్ విద్వేష నేరాభియోగాలున్నాయి. దీనిపై జిల్లా కోర్టు విచారణ జరిపి, శిక్షలు ప్రకటించింది. రాష్ట్ర కోర్టులో విచారణకొస్తే మరణ శిక్ష సహా మరిన్ని శిక్షలపై పట్టుబడతామని న్యాయవాదులు అంటున్నారు. ఈ నేరానికి పాల్పడేందుకు పథకం ప్రకారం క్రుసియస్ డల్లాస్లోని సొంతింటి నుంచి ఏకే రైఫిల్తో తన వాహనంలో 700 మైళ్ల దూరంలోని ఎల్ పాసోకు వచి్చనట్లు పోలీసులు తెలిపారు. హిస్పానిక్ ప్రజలే లక్ష్యంగా అతడు వాల్ మార్ట్ స్టోర్ లోపల, వెలుపల యథేచ్ఛగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 23 మంది చనిపోగా మరో 25 మంది గాయపడ్డారు. 2006 తర్వాత అమెరికాలో జరిగిన జాత్యహంకార కాల్పుల ఘటనల్లో అత్యంత తీవ్రమైందిగా ఎల్ పాసో ఘటనను పరిగణిస్తున్నారు. -
న్యూజిలాండ్లో చరిత్రలోనే అరుదైన తీర్పు
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ మసీదులో హింసాకాండకు పాల్పడిన ముష్కరుడు బ్రెంటన్ టారెంట్కు పెరోల్ లేని జీవితఖైదును విధిస్తూ గురువారం కోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. మసీదులో ప్రార్థనలు చేస్తున్న 51మంది అమాయకపు ప్రాణాలను బలితీసుకొని ఆ దుర్మార్గాన్ని ఫేస్బుక్లో చిత్రీకరించిన ట్రెంటన్ను అమానవీయ వ్యక్తిగా కోర్టు పేర్కొంది. ఘటన సమయంలో 3 ఏళ్ల శిశువు తన తండ్రి కాలికి చుట్టుకొని ఉంటే ఉద్దేశపూర్వకంగా ఈ పసిప్రాణాన్ని కూడా చంపేసిన బ్రెంటన్ అత్యంత దుర్మార్గుడిగా కోర్టు వ్యాఖ్యానించింది. ఇంతటి దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తికి పెరోల్ లేని జైవిత ఖైదు విధిస్తున్నాం అని న్యాయమూర్తి కామెరాన్ మాండర్ తీర్పు చెప్పారు. అయితే న్యూజిలాండ్ చరిత్రలో ఇప్పటివరకు పెరోల్ లేని జీవితఖైదును ఎవరికి విధించలేదు. (చైనా తీరుపై యూకే, యూఎస్, జర్మనీ విమర్శలు) గతేడాది మార్చిలో న్యూజిలాండ్లోని క్రైస్ట్చర్చ్లోని అల్ నూర్ మరియు లిన్వుడ్ మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్న వారిపై ముష్కరుడు బ్రెంటన్ నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. తదనంతరం ఈ దుశ్చర్యను వీడియో తీసి సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో పోస్ట్ చేసి రక్షసానందం పొందాడు. నిందితుడు బ్రెంటన్పై ఇదివరకే 51 హత్యారోపణలు, 40 హత్యాయత్నాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. మొదట తనకు ఏం తెలియదని బుకాయించినా విచారణలో తను చేసిన నేరాలను అంగీకరించాడు. న్యూజిలాండ్ చరిత్రలో గతేడాది జరిగిన హింసాకాండ అత్యంత బాధాకరమైన ఘటన అని ప్రాసిక్యూటర్ మార్క్ జరీఫె అన్నారు. ఇక ఈ ఘటనలో తమవాళ్లను పొట్టనపెట్టేకొని తీరని శోకాన్ని మిగిల్చిన బ్రెంటన్కు అత్యంత కఠినమైన శిక్ష వేయాలని బాధితులు కోర్టు ఎదుట తమ గోడును వెళ్లగక్కారు. (యూఎస్లో దారుణం: ‘మీ అమ్మ, బామ్మను చంపేశా’ ) -
హత్యకేసులో ఐదుగురికి యావజ్జీవ శిక్ష
చల్లపల్లి(కృష్ణా జిల్లా): అవనిగడ్డ మండలంలోని పులిగడ్డలో జరిగిన ఓ హత్య కేసులో ఐదుగురికి మచిలీపట్నం జిల్లా కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. 2009లో పులిగడ్డ గ్రామానికి చెందిన దిడ్ల ధనుంజయ్ అనే మావోయిస్టు హత్యకేసులో మిట్టా రమేశ్, దాసరి వెంకయ్య, దోవారి వెంకటరమణ, అరిగ లంకయ్య, మాతంగి పూర్ణచంద్రరావు అనే ఐదుగురికి శిక్ష పడింది.