స్పీకర్ మధుసూదనాచారికి అస్వస్థత
వరంగల్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ముధుసూదనాచారి సోమవారం అస్వస్థతకు గురయ్యారు. వరంగల్ జిల్లా పరకాలలోని లలిత నర్సింగ్ హోమ్లో ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది. ఫుడ్ పాయిజన్ కారణంగానే స్పీకర్ ముధుసూదనాచారి అస్వస్థతకు గురైనట్టు వైద్యులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.