breaking news
K.samba siva rao
-
పలు ప్యాసింజర్ రైళ్ల సర్వీసులు పెంపు
సాక్షి, హైదరాబాద్: వివిధ రూట్లలో నడిచే డెమూ ప్యాసింజర్ రైళ్ల సర్వీసులను పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వారానికి 5 రోజులు నడుస్తున్న రైళ్లు శుక్రవారం నుంచి వారానికి 6 రోజులు నడుస్తాయి. నంద్యాల-కర్నూలు, బీదర్-హుమ్నాబాద్, బీదర్-హుమ్నాబాద్, హుమ్నాబాద్-బీదర్ ప్యాసింజర్ రైళ్లు ఇకపై వారానికి 6 రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఫలక్నుమా-మనోహరాబాద్ , మనోహరాబాద్-సికింద్రాబాద్ , సికింద్రాబాద్-మనోహరాబాద్, మనోహరాబాద్-సికింద్రాబాద్ మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లు కూడా 6 రోజుల పాటు రాకపోకలు సాగించనున్నాయి. రద్దయిన రైళ్లు వివిధ మార్గాల్లో డెమూ ప్యాసింజర్ సర్వీసులు పెంచడం వల్ల రాయ్చూర్-కాచిగూడ, గద్వాల్-రాయ్చూర్, సికింద్రాబాద్-ఉందానగర్,ఉందానగర్-ఫలక్నుమా, ఫలక్నుమా-బొల్లారం, ఫలక్నుమా-ఉందానగర్, సికిం ద్రాబాద్-మనోహరాబాద్, ఉందానగర్-సికింద్రాబాద్ మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయనున్నట్లు సీపీఆర్వో తెలిపారు. -
సిర్పూర్ కాగజ్నగర్కు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ మధ్య ప్రత్యేక మెమూ రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ (07035) మెమూ ట్రైన్ అక్టోబర్ 4వ తేదీ ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు సిర్పూర్ కాగజ్నగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సిర్పూర్ కాగజ్నగర్-సికింద్రాబాద్ ట్రైన్ (07036) అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
పలు ఎక్స్ప్రెస్ రైళ్లలో అదనపు బెర్తులు
సాక్షి,హైదరాబాద్: వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు ఎక్స్ప్రెస్ రైళ్లలో అదనపు బెర్తులను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో 47,820 బెర్తులు ప్రయాణికు లకు అదనంగా అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల డిమాండ్ మేరకు ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వీటిలో 6,716 సెకెండ్ ఏసీ, 31,744 థర్డ్ ఏసీ, 9,360 స్లీపర్ క్లాస్ బెర్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సికింద్రాబాద్-ముంబై మధ్య నడిచే బై వీక్లీ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్-షాలిమార్ ఏసీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30 వరకు, సికింద్రాబాద్-నిజాముద్దీన్ బై వీక్లీ ఎక్స్ప్రెస్లో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 28 వరకు, సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే దురంతో ట్రై వీక్లీ ఎక్స్ప్రెస్లో ఏప్రిల్ 2 నుంచి మే 1వ తేదీ వరకు అదనపు బెర్తులు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే పద్మావతి ఎక్స్ప్రెస్లో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 29 వరకు, సికింద్రాబాద్-తిరుపతి బై వీక్లీ ఎక్స్ప్రెస్,సికింద్రాబాద్-పాట్నా ఎక్స్ప్రెస్లలో ఏప్రిల్ 1 నుంచి మే 1 వరకు, సికింద్రాబాద్-దర్బంగా బై వీక్లీ, సికింద్రాబాద్-సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి సెవెన్హిల్స్ ఎక్స్ప్రెస్, తిరుపతి-కరీంనగర్ బై వీక్లీ, బికనూర్-సికింద్రాబాద్ బైవీక్లీ, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్-మచిలీపట్నం ఎక్స్ప్రెస్, తదితర రైళ్లలో ఏప్రిల్ మొత్తం అదనపు బెర్తులు అందుబాటులో ఉంటాయి. కాచిగూడ-చిత్తూరు వెంకటాద్రి ఎక్స్ప్రెస్,కాచిగూడ-యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్, కాచిగూడ-చెన్నై ఎగ్మూర్ ఎక్స్ప్రెస్,కాకినాడ-చెన్నై ఎగ్మూర్, కాచిగూడ-మంగళూర్ ఎక్స్ప్రెస్, కాకినాడ-సాయినగర్ ట్రై వీక్లీ, కాకినాడ-భావ్నగర్ ట్రై వీక్లీ, సికింద్రాబాద్-రాజ్కోట్ మధ్య నడిచే బై వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లలోను ఏప్రిల్ 1 నుంచి మే 1వ తేదీ వరకు అదనపు బెర్తులు ఏర్పాటు చేస్తారు.