breaking news
Koramandal
-
ఒడిశా రైలు ప్రమాద బాధితులకే ఈ డబ్బు: నిర్మాత
తాను హీరోగా నటిస్తూ నిర్మించిన ‘అనంత’ చిత్రానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ నుంచి వచ్చే ప్రతి రూపాయి (థియేటర్ ఖర్చులు పోను) ఇటీవల ఒడిశాలో ప్రమాదానికి గురైన ‘కోరమండల్’ ఎక్స్ప్రెస్ బాధితుల కుటుంబాల సహాయ నిధికి ఇవ్వనున్నామని ప్రశాంత్ కార్తీ పేర్కొన్నారు. గతంలో రామ్చరణ్ ‘ధృవ’, ‘చెక్’, రాంగోపాల్వర్మ ‘కొండా’ చిత్రాలలో నటించిన ప్రశాంత్ కార్తీ తాజాగా శ్రీనేత్ర క్రియేషన్స్ పతాకంపై ‘అనంత’ చిత్రాన్ని నిర్మించారు. ఆయన సరసన రిత్తిక చక్రవర్తి నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఒక నిమిషం 46 సెకన్ల నిడివిగల ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. (ఇదీ చదవండి: Jr NTR: ఎన్టీఆర్ కోసం క్రేజీ హీరోయిన్ను ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్) అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 9న గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అని చిత్ర నిర్మాత, హీరో ప్రశాంత్ కార్తీ మీడియాతో ముచ్చటించారు. ‘‘మా తండ్రి సివిల్ కాంట్రాక్టర్. నాకు చిన్నప్పటి నుండి సినిమా అంటే ప్యాషన్. దాంతో సినిమాలలో నటించాలనే బలమైన కోరిక ఉండడంతో రామ్చరణ్ నటించిన ‘ధృవ’ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేసే అవకాశం దక్కింది. ఆ తరువాత ‘చెక్’, రాంగోపాల్ వర్మ ‘కొండా’ సినిమాలో నక్సలైట్ నాయకుడు ఆర్.కె. పాత్రలో నటించాను. అది నాకు మంచి పేరు తీసుకువచ్చింది. దయచేసి అందరూ థియేటర్స్లో ఈ సినిమాను రైలు ప్రమాద బాధితుల సహాయ నిధి కోసమైనా చూడాలని కోరుకుంటున్నా. మీ టిక్కెట్ డబ్బులు ఆయా కుటుంబాలకు ఎంతో కొంత సహాయపడితే అంతకు మించిన ఆనందం ఏముంటుంది మీకు’’ అంటూ ముగించారు. (ఇదీ చదవండి: Custody Movie: ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన అమెజాన్ ప్రైమ్, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?) -
ప్రమాద బాధితులకు పూర్తి సహాయ సహకారాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ) : ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద బాధితులకు పూర్తి సహాయ, సహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పని చేస్తోందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ ఘటనపై శనివారం ఆయన విశాఖ జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్, కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, పోలీసు కమిషనర్ త్రివిక్రమ్ వర్మలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంఘటనలో రాష్ట్రానికి చెందిన క్షతగాత్రులు, చనిపోయిన వారు, ప్రమాదానికి గురైన వారిని తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు, చనిపోయిన వారిని వారి బంధువులకు అప్పగించేందుకు పూర్తి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ముగ్గురు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల బృందం ఒడిశాలోని ఘటనా స్థలికి చేరుకుందని తెలిపారు. మంత్రి బొత్స ఇంకా ఏం చెప్పారంటే.. 482 మంది ఏపీ ప్రయాణికులు ► రైల్వే సమాచారం ప్రకారం ప్రమాదానికి గురైన కోరమండల్ రైలులో ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు 482 మంది ఉన్నారు. 309 మంది విశాఖలో దిగవలసి ఉండింది. అయితే వీరిలో 57 మంది ప్రయాణం చేయలేదు. మిగతా వారిలో 165 మంది సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. 11 మంది గాయపడ్డారు. 76 మంది జాడ ఇంకా తెలియాల్సి ఉంది. ► రాజమండ్రిలో దిగవలసిన 31 మందిలో 22 మంది సురక్షితంగా ఉన్నారు. మిగతా తొమ్మిది మంది సమాచారం తెలియాల్సి ఉంది. విజయవాడలో 137 మంది దిగవలసి ఉండగా, 80 మంది సురక్షితంగా ఉన్నారు. ఏడుగురు గాయపడ్డారు. 22 మంది ప్రయాణం చేయలేదు. 28 మంది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఏలూరులో దిగాల్సిన ఐదుగురిలో ముగ్గురు ప్రయాణం చేయలేదు. మిగతా ఇద్దరు స్వల్వంగా గాయపడ్డారు. ► యశ్వంతపూర్ రైలులో 89 మంది ఆంధ్రప్రదేశ్లో దిగవలసిన వారు వున్నారు. ఆదివారం ఉదయానికి పూర్తి సమాచారం అందుతుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ జిల్లాల కలెక్టరేట్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశాం. బాధితుల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాం. ఇచ్ఛాపురం నుంచి ఒంగోలు వరకు ఉన్న అన్ని ప్రభుత్వాసుపత్రులను అలర్ట్ చేశాం. ► ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశా రైలు సంఘటన స్థలానికి 108 వాహనాలు 25, ప్రైవేట్ అంబులెన్స్లు, 15 మహాప్రస్థానం వాహనాలను పంపించాం. నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇతర శాఖల అధికారుల సహాయం కూడా తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారెవరూ చనిపోయినట్లు సమాచారం లేదు. ► కటక్, భువనేశ్వర్లో రెండు చోట్ల రెండు మెడికల్ టీములను ఏర్పాటు చేశాం. సంఘటన స్థలం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారికి ప్రత్యేక ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రయాణికుల బంధువులు వాట్సాప్ ద్వారా ప్రయాణికుల ఫొటోలు, వివరాలు ఆయా కలెక్టరేట్లలోని కంట్రోల్ రూమ్లకు తెలియజేయాలి. -
వార్జోన్ను తలపించిన ప్రమాద స్థలం..
బాలాసోర్/హౌరా: మూడు రైలు ప్రమాదాల బాధితుల సహాయార్థం 200 అంబులెన్సులు, పదుల సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వ బస్సులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన మొబైల్ హెల్త్ యూనిట్స్ మోహరించారు. 1,200 మంది అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ సిబ్బంది అలుపు లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఒకబోగీపై మరో బోగీ పడటంతో భూమిలోకి కూరుకుపోయిన బోగీలను తీసేందుకు క్రేన్స్, బుల్డోజర్స్ ఏర్పాటు చేశారు. కానీ ఆ భారీ కోచ్లను తొలగించడానికి అవి పనికి రాలేదు. కోల్కతా నుంచి ప్రత్యేక క్రేన్లు తెప్పిస్తే తప్ప.. పైన పడ్డ బోగీలను తీయలేమని, అప్పుడే కింది వాగన్లను తొలగించడానికి వీలవుతుందని సిబ్బంది తెలిపారు. ‘బోగీలు నేలకు అతుక్కుపోయాయి. ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి గుర్తించలేనంత వికృతంగా శవాలు మారిపోయాయి. వర్ణించలేనంత భయంకరంగా అక్కడి దృశ్యాలున్నాయి’ అని ప్రయాణికుల్లో ఒకరు మీడియాతో పంచుకున్నారు. కంపార్ట్మెంట్ నుంచి విసిరేసినట్టుగా.. ‘రైల్వే ట్రాక్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. నుజ్జునుజ్జయిన బోగీలు చెల్లా చెదురుగా పడిపోయాయి. కొన్ని ఒకదాని మీదకు ఒకటి ఎక్కాయి. కొన్నయితే.. తాబేలు తరహాలో నేలకు అతుక్కుపోయాయి’ అని పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ముర్షీదాబాద్ జిల్లాకు చెందిన బ్రెహంపూర్ వాసి పీయూష్ పోద్దార్ వివరించారు. ఆయన ఉద్యోగం కోసం కోరమండల్ ఎక్స్ప్రెస్లో తమిళనాడు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ‘ఉన్నట్టుండి రైలు పట్టాలు తప్పడంతో బోగీ ఒకవైపు పడిపోయింది. చాలామందిమి కంపార్టుమెంట్ బయట విసిరేసినట్టుగా పడ్డాం. ప్రమాదం నుంచి ఎలాగోలా పాక్కుంటూ బయటికి వచ్చేసరికే ఎక్కడ చూసినా శవాలే కనిపించాయి’ అని పోద్దార్ తెలిపారు. అదృష్టవశాత్తూ పోద్దార్ ఫోన్ సురక్షితంగా ఉండటంతో బంధువులకు ఫోన్ చేశాడు. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డ ఆయన.. ముందు ఇంటికి చేరుకుని, ఆ తరువాతే చికిత్స చేయించుకుంటానంటున్నాడు. స్థానికుల సహాయం.. ‘‘పెద్దపెద్దగా అరుపులు వినిపించడంతో ఘటన జరిగిన స్థలానికి చేరుకున్నాం. రైలు పట్టాలు తప్పి, బోగీలు పక్కకు పడి కనిపించాయి. బోగీలు నుజ్జయిపోయి ఇనుము కుప్పగా కనబడింది’’ అని ఆ పక్కనే నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు తెలిపారు. వెంటనే.. బాధితులను బయటికి లాగడం, మంచి నీటిని అందించడం, రక్తం కారుతున్నవారికి బ్యాండేజ్ కట్టడం వంటి సాయం చేశామని కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేస్తున్న 45 ఏళ్ల ఫోర్మెన్ దీపక్ బేరా తెలిపారు. యుద్ధ వాతావరణం.. క్షతగాత్రులను బాలాసోర్, సోరో, భద్రక్, జాజ్పూర్, కటక్లోని ఎస్సీబీ మెడికల్కాలేజీ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద జరిగిన చోట సహాయక చర్యల్లో పాల్గొనేందుకు భువనేశ్వర్ ఎయిమ్స్ డాక్టర్ల బృందాలను బాలాసోర్, కటక్ ఆస్పత్రులకు పంపించామని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. బాధితుల విలువైన ప్రాణాలను కాపాడేందుకు వైద్య సిబ్బంది కృషి చేస్తున్నారని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను తాము అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. బెడ్లు, స్ట్రెచర్లు, ఆస్పత్రి కారిడార్లు.. ఎక్కడ చూసినా గాయాలతో రక్తమోడుతున్న బాధితులతో బాలాసోర్ జిల్లా ఆస్పత్రి మొత్తం వార్జోన్ను తలపించింది. ఈ ఒక్క ఆస్పత్రిలోనే 526 మందిని చేర్చారు. బాధితులంతా పలు రాష్ట్రాలకు చెందినవారు కావడంతో భాషాపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతూనే వైద్య సిబ్బంది చికిత్స అందించారు. శవాల గుట్టలతో... ప్రమాదం కారణంగా అనేక రైళ్లు రద్దవ్వడం, కొన్ని రైళ్లు దారి మళ్లించడంతో బాధితుల బంధువులు ఘటనా స్థలానికి చేరుకోవడానికి ఆలస్యమవుతోంది. దీంతో మృతదేహాల గుర్తింపు ఇంకా పూర్తి కాలేదు. తెల్లటి వస్త్రాలు చుట్టిన శవాల గుట్టలతో ఆస్పత్రి ఆవరణ నిండిపోయింది. ఒక్కసారిగా భారీ శబ్దం.. ఆపై చీకటి! రైలు ప్రమాద బాధితుల అనుభవాలు కోల్కతా: మరికొద్ది సేపట్లో తమ రైలు బాలాసోర్కు చేరుకుంటుందనగా రాత్రి 7 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించిందనీ, బెర్త్లపై నుంచి తాము కిందపడిపోవడం, బోగీలో అంధకారం అలుముకుందని బెంగళూరు–హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుప్రయాణికులు కొందరు తాము ఎదుర్కొన్న భయానక అనుభవాలను వివరించారు. ఒడిశాలో ప్రమాద ఘటనలో బెంగళూరు–హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు కూడా చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే, పట్టాలు తప్పని 17 బోగీలతో 635 ప్రయాణికులతో ఈ రైలు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హౌరాకు చేరుకుంది. అందులో క్షతగాత్రులైన సుమారు 50 మంది ప్రయాణికులకు సహాయక సిబ్బంది వైద్య చికిత్సలు అందించారు. క్షతగాత్రుల్లో అయిదుగురిని ఆస్పత్రికి తరలించారు. రైల్వే అధికారులు అందరికీ ఆహారం అందించారు. ఈ సందర్భంగా కొందరు ప్రయాణికులు పీటీఐతో తమ అనుభవాలను పంచుకున్నారు. షెడూŠయ్ల్కు మూడుగంటలు ఆలస్యంగా బెంగళూరు–హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరినట్లు మిజాన్ ఉల్ హక్ చెప్పారు. ‘బాలాసోర్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉందనగా రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించింది. బోగీ అటూఇటూ కదలడం మొదలైంది. అప్పర్ బెర్త్ నుంచి కిందపడిపోయా. కంపార్ట్మెంట్లో లైట్లన్నీ ఆరిపోయాయి. చీకట్లు అలుముకున్నాయి’అని హక్ చెప్పారు. బర్దమాన్కు చెందిన హక్ కర్ణాటకలో జీవనోపాధి నిమిత్తం వెళ్లారు. దెబ్బతిన్న కోచ్ నుంచి అతికష్టమ్మీద బయటపడ గలిగినట్లు హక్ చెప్పారు. అప్పటికే చాలా మంది తీవ్ర గాయాలతో ప్రయాణికులు ధ్వంసమైన బోగీల్లో పడి ఉన్నారని చెప్పారు. బెంగళూరుకు చెందిన రేఖ కోల్కతా సందర్శనకు ఇదే రైలులో వస్తున్నారు. ‘ప్రమాదం కారణంగా అంతటా గందరగోళంగా మారింది. మా బోగీ నుంచి దిగి బయటకు వచ్చాము. ఆ చీకట్లోనే పక్కనే ఉన్న పొలాల్లో కూర్చున్నాం. హౌరా ఎక్స్ప్రెస్ ఉదయం తిరిగి బయలుదేరే వరకు అక్కడే ఉండిపోయాం’అని రేఖ చెప్పారు. బర్దమాన్కు చెందిన మరో ప్రయాణికుడు కూడా బెంగళూరు నుంచి వస్తున్నారు. ఈయనకు చాతీ, కాలు, తల భాగాలకు గాయాలయ్యాయి. కంపార్టుమెంట్ అద్దాలు పగులగొట్టుకుని బయటకు దూకామని ఆయన అన్నారు. -
కోరమాండల్లో లిబర్టీ ఫాస్ఫేట్, లిబర్టీ ఉర్వారక్ విలీనం
హైదరాబాద్: అనుబంధ సంస్థలు లిబర్టీ ఫాస్ఫేట్ (ఎల్పీఎల్), లిబర్టీ ఉర్వారక్లను (ఎల్యూఎల్) విలీనం చేసుకునే ప్రతిపాదనకు కోరమాండల్ ఇంటర్నేషనల్ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఎల్పీఎల్లో కోరమాండల్, ఎల్యూఎల్లకు 79.62 శాతం వాటాలు ఉన్నాయి. విలీన ప్రతిపాదన ప్రకారం.. షేర్హోల్డర్లకు ప్రతి 8 ఎల్పీఎల్ షేర్లకు 7 కోరమాండల్ షేర్లను కేటాయించనున్నారు. ఎల్పీఎల్ షేర్ ముఖవిలువ రూ. 10 కాగా, కోరమాండల్ షేర్ ముఖవిలువ రూ. 1.