-
అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ క్లారిటీ ఇచ్చిన అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం సరిగా లేదని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. మార్చి 15న రోజంతా కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన చెందారు. అమితాబ్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్లను కోరుతూ వారందరూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా కామెంట్లు చేశారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడటం వల్ల ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారని అక్కడ ఆంజియోప్లాస్టీ చికిత్స చేశారని వార్తలు వచ్చాయి. దీంతో ఆయన అభిమానులు కాస్త ఆందోళన చెందారు. బిగ్ బి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ఆయన బహిరంగ ప్రదేశంలో కనిపించారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) ఫైనల్ మ్యాచ్కు హాజరయ్యారు. థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో మాఝీ ముంబయి, టైగర్స్ ఆఫ్ కోల్కతా మధ్య జరిగిన మ్యాచ్కు కుమారుడితో అమితాబ్ హాజరయ్యారు. మ్యాచ్ చూసేందుకు వెళ్లిన ఆయన్ను ఆరోగ్యం గురించి మీడియా వారు ప్రశ్నించగా... అందులో నిజం లేదని, ఆ వార్తలు ఫేక్ అని తెలిపారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అంతే కాకుండా ఆయన చికిత్స పొందారు అని ప్రచారంలో ఉన్న కోకిలాబెన్ ఆసుపత్రి నుంచి కూడా అమితాబ్ గురించి ఎలాంటి ధృవీకరణ లేదు. దీంతో ఇవన్నీ ఫేక్ అని తెలుస్తోంది. (ISPL) ఫైనల్ మ్యాచ్లో భారత మాజీ క్రికెటర్ సచిన్తో అమితాబ్ కనిపించారు. వారిద్దరినీ ఒకే ఫ్రేమ్లో చూసిని అభిమానులు సంబరపడ్డారు. అమితాబ్ బచ్చన్ సినిమాల విషయానికొస్తే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కల్కి 2898 ADలో కనిపించబోతున్నారు, ఇది 2024లో మే 9న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి స్టార్స్ ఉన్నారు. కోలీవుడ్లో రజనీకాంత్ వెట్టయన్ చిత్రంలో కూడా అమితాజ్ నటించనున్నారు. ఈ ఇద్దరు దిగ్గజ నటీనటుల తెరపై మళ్లీ కలయిక కోసం ఉత్సాహంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఆసుపత్రిలో బిగ్ బీ : ఆంజియోప్లాస్టీ అంటే ఏమిటి?
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. అక్కడ బిగ్బీకి వైద్యులు యాంజియోప్లాస్టీ చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత సమాచారం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఈ ప్రక్రియ జరిగిందని ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని పలు నివేదికలు పేర్కొన్నాయి. దీనికి సంబంధి ఒక కృతజ్ఞతా సందేశాన్ని కూడా బిగ్బీ రోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు క్రికెటర్ గురించి కూడా ఒక ట్వీట్ చేయడం విశేషం. కాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రభాస్, దిశా పటానీ, దీపికా పదుకొణె నటిస్తున్న కల్కి సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది మే 9న థియేటర్లలోకి రానుంది. ఆంజియో ప్లాస్టీ అంటే ఏమిటి? ఎపుడు చేస్తారు? గుండెలోని క్లాట్స్ను తొలగించేందుకు వినియోగించే ఆధునిక టెక్నాలజీ ఆంజియోప్లాస్టీ. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను బెలూన్ డైలేషన్ ద్వారా తొలగించి, అవసరమనుకుంటే తొలగించిన అడ్డంకి స్థానంలో స్టెంట్ను అమర్చడాన్ని ఆంజియోప్లాస్టీ అంటారు. తద్వారా భవిష్యత్తులో తిరిగి రక్తనాళాలలో కొవ్వుపేరుకొని అడ్డంకులు ఏర్పడకుండా నివారించవచ్చు. రక్తనాళాల్లో బ్లాకేజీ 70 శాతం కంటే ఎక్కువగా ఉండే వారికి ఇది చేస్తారు. T 4950 - in gratitude ever .. — Amitabh Bachchan (@SrBachchan) March 15, 2024 ఛాతిలో నొప్పి, వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయాసం రావడం, అలసిపోయినట్టు అనిపించడం బరువైన పనులు చేస్తున్న సమయంలో ఆయాసంగా ఉండడం లాంటి లక్షణాలు కనిపించినపుడు, హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి ఆంజియోగ్రామ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తారు. తరువాత హానికరమైన క్లాట్స్ను గురించినట్టయితే ఆంజియో ప్లాస్టీ ద్వారా చికిత్స అందించి భవిష్యత్తులో సమస్యలు రాకుండా నివారించడంతోపాటు, ప్రాణాపాయం నుంచి కాపాడతారు. -
ఆస్పత్రిలో ప్రముఖ సింగర్.. కుమారుడు చేసిన పనికి తీవ్ర భావోద్వేగం!
ప్రముఖ సింగర్ అంగారాగ్ మహంత అలియాస్ పాపోన్ ఆస్పత్రిలో చేరాడు. తీవ్ర అస్వస్థతకు గురైన ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన తన ఇన్స్టాలో పంచుకున్నారు. తన కుమారుడు కూడా పక్కనే ఉన్న ఫోటోను షేర్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. (ఇది చదవండి: ఉపాసనపై కామెంట్స్.. ఓ వ్యక్తిని చితకబాదిన చెర్రీ ఫ్యాన్స్!) పాపోన్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'మనమందరం ఈ చిన్న చిన్న యుద్ధాలను ఒంటరిగా పోరాడుతున్నాం. ఇలాంటి సంఘటనలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు. కానీ నిన్న రాత్రి జరిగింది మాత్రం వేరు. ఎందుకంటే మొదటిసారి 13 ఏళ్ల నా కుమారుడు ఆసుపత్రిలో రాత్రి నాకు కాపలాగా ఉన్నాడు. ఈ భావోద్వేగ క్షణం గురించి నా స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకోవాలనుకుంటున్నా. నా తల్లితండ్రుల కోసం నేను ఇలాగే చేసినట్లు నాకు గుర్తుంది. ఇప్పుడు వారి మనవడు పుహోర్ తన బాధ్యతను తీసుకోవడం చూసేందుకు వారు చుట్టూ ఉన్నారని అనుకుంటున్నా. నా కోసం ప్రార్థించిన మీ అందరికీ ధన్యవాదాలు! నేను ఇప్పుడు చాలా బాగున్నా.' అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. (ఇది చదవండి: Prabhas: ప్రభాస్ పేరుతో రూ.4 వేల కోట్ల దందా!) కాగా.. పాపోన్ 1998లో తన మ్యూజిక్ కెరీర్ను మొదలుపెట్టారు. అస్సామీలో మంచి ఆల్బమ్స్ చేశారు. 2006లో స్ట్రింగ్స్ అనే సినిమాలో ఓం మంత్ర అనే పాట పాడి బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. అస్సామీతో పాటు హిందీ, తమిళం, మరాఠీ భాషల్లో సాంగ్స్ ఆలపించారు. సినిమాలతో పాటు పలు టీవీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. View this post on Instagram A post shared by Papon (@paponmusic) -
రిషభ్ పంత్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్! మరో రెండు వారాల్లో..
టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ అభిమానులకు శుభవార్త! మరో రెండు వారాల్లో ఈ యువ ఆటగాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నట్లు తెలుస్తోంది. మేజర్ సర్జరీలు విజయవంతంగా పూర్తైన నేపథ్యంలో అతడిని ఇంటికి తీసుకువెళ్లేందుకు వైద్యులు అనుమతించినట్లు తెలుస్తోంది. కాగా బంగ్లాదేశ్ పర్యటన ముగిసిన తర్వాత కుటుంబంతో కలిసి న్యూఇయర్ వేడుకలు చేసుకునేందుకు స్వదేశానికి తిరిగి వచ్చిన పంత్ ఘోర ప్రమాదానికి గురైన విషయం విదితమే. గతేడాది డిసెంబరు 30న స్వస్థలం ఉత్తరాఖండ్కు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పంత్ను మెరుగైన చికిత్స కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ముంబైకి తరలించింది. ఈ క్రమంలో కోకిలాబెన్ ధీరూబాయి అంబానీ ఆస్పత్రిలో అతడికి పలు శస్త్రచికిత్సలు జరిగినట్లు సమాచారం. మోకాలి సర్జరీ పూర్తైన నేపథ్యంలో మరో రెండు వారాల్లో అతడిని డిశ్చార్జ్ చేసేందుకు అంతా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పంత్ రిహాబ్ సెంటర్లో ఆరు వారాల పాటు ఉండనున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది. ఈ మేరకు బీసీసీఐ అధికారి.. ‘‘లిగమెంట్ల(రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎముకలను కలిపి ఉంచే భాగాలు)కు సంబంధించిన గాయాల నుంచి కోలుకోవడానికి దాదాపు 4 నుంచి 6 వారాల సమయం పడుతుంది. ఆ తర్వాత రిహాబిలిటేషన్ మొదలవుతుంది. తను మళ్లీ ఎప్పుడు మైదానంలో దిగాలన్న అంశంపై మరో రెండు నెలల్లో ఓ అంచనాకు రాగలం. పంత్ జీవితంలో ఇదొక కఠిన దశ. తను మానసికంగా కూడా మరింత బలంగా తయారవ్వాలంటే కౌన్సిలింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. సెషన్లవారీగా తనకు కౌన్సిలింగ్ ఉంటుంది. ముందు చెప్పినట్లు మరో నాలుగు నుంచి ఆరు వారాల తర్వాతే తను ఆట మొదలుపెట్టేది లేనిదీ తెలుస్తుంది’’ అని పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. చదవండి: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి టీమిండియా కీలక పేసర్గా! ఆ ఒక్క లోటు తప్ప! కెప్టెన్ మాటలు వింటే.. Shakira: మాజీ బాయ్ఫ్రెండ్ మొహం చూడకూడదని గోడ కట్టించింది -
రిషభ్ పంత్ మోకాలి సర్జరీ సక్సెస్.. కానీ!
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. అతడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. పంత్ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో పంత్కు శుక్రవారం శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. కోకిలాబెన్ ఆసుపత్రిలోనే అతడి మోకాలి లిగమెంట్లకు సర్జరీ చేయించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా పంత్ ఆరోగ్యం కాస్త కుదుటపడ్డాక లండన్లో సర్జరీ చేయంచాలని తొలుత బీసీసీఐ భావించింది. కానీ ఇప్పడు ముంబైలోనే చేయించినట్లు సమాచారం. "రిషభ్ పంత్ మోకాలి లిగమెంట్ల శస్త్రచికిత్స శుక్రవారం విజయవంతమైంది. ప్రస్తుతం అతడు వైద్యుల పరిశీలనలో ఉంచారు. తదుపరిగా ఏం చేయాలో, పునరావాసం(రిహాబిలిటేషన్)కు ఎప్పుడు పంపించాలో డాక్టర్ దిన్షా పార్ధీవాలా నేతృత్వంలోని వైద్యబృందం తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ వైద్య బృందం, బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ టీంతో నిరంతరం టచ్లో ఉంటుంది" అని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐతో పేర్కొన్నారు. అయితే పంత్ మాత్రం పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించడానికి దాదాపు 7 నుంచి 9 నెలల సమయం పట్టనున్నట్లు సమాచారం. దీంతో అతడు స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్కు కూడా దూరమయ్యే ఛాన్స్ ఉంది. చదవండి: IPL 2023: ఐపీఎల్ వేలానికి ముందు ఈ సిరీస్ జరిగి ఉంటేనా! కానీ పాపం..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement