breaking news
Kodandaramalayam
-
ఒంటిమిట్టలో వేడుకగా ధ్వజారోహణ
ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజారోహణతో ప్రారంభమయ్యాయి. తొలుత శాస్త్రోక్తంగా హోమం, పూజలు నిర్వహించిన వేదపండితులు పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ధ్వజస్తంభంపై గ రుడ పతాకాన్ని ఎగురవేశారు. ధ్వజస్తంభానికి నవకళ పంచామృతాభిషే కం చేసి సకల దేవతలు, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. విష్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహవాచనం, ధ్వజస్తంభ రక్షాబంధనం, ఆరాధన చేశారు. ఆలయ డిప్యూటీ ఈవో నటే‹Ùబాబు ఆధ్వర్యంలో సతీసమేతంగా రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి, జేసీ సాయికాంత్వర్మ, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కె.హెచ్.రాజేష్ సంప్రదాయబద్ధంగా ఉత్సవాన్ని నిర్వహించారు. నేటి కార్యక్రమాలు: శ్రీకోదండరామాలయంలో శనివారం ఉదయం 7:30 గంటలకు వేణుగానాలంకారం ఉంటుంది. రాత్రికి కోదండరాముడు హంసవాహనాన్ని అధిరోహించి భక్తులను కటాక్షించనున్నారు. -
ప్రేమ పెళ్లి.. అడ్డంగా బుక్కైన జంట
సాక్షి, కడప : ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని భయపడ్డారు. ఇందుకోసం స్నేహితుల సహకారంతో గుడిలో వివాహం చేసుకునేలా పథకం రచించారు. అనుకున్న ప్రకారం తమ ప్లాన్ అమలు చేశారు. మరికొద్ది సేపట్లో తంతు ముగిసేదే.. ఇంతలో అనుకోని విధంగా వారి పెళ్లి పెటాకులైంది. వివరాలు.. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఓ ప్రేమ జంట రహస్య వివాహం చేసుకోవడానికి ఒంటిమిట్ట కోదండ రామాలయానికి వచ్చారు. అయితే వారు తీరుతో అనుమానం వచ్చిన అధికారులు, వారి గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఇద్దరూ మైనర్లుగా ఆలయ అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు వారిని ఒంటిమిట్ల పోలీసులకు అప్పగించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్లోనే కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం వారి తల్లిదండ్రలకు విషయాన్ని తెలిపి, ఒంటిమిట్ట రావాలని సూచించారు. -
ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాల్లో కనీవినీ ఎరుగని బీభత్సం
-
నిన్ను బ్రోచేవారెవరురా!
► ఒంటిమిట్ట కోదండరామాలయంలో మూడేళ్లవుతున్నా ముందుకు సాగని అభివృద్ధి ► అధికారముద్ర పడినా.. అంతంత మాత్రమే ► చుట్టూ మాడవీధుల్లో సిమెంటురోడ్లు మినహా కనిపించని పురోగతి ► టీటీడీ 2015లోనే రూ.100 కోట్లు కేటాయించినా.. ► రూ.10 నుంచి 15 కోట్ల మేర మాత్రమే ఖర్చు చేసిన వైనం సాక్షి, కడప: ఒంటిమిట్ట కోదండ రామాలయానికి ఆంధ్ర భద్రాద్రిగా అధికారముద్ర పడి మూడేళ్లవుతున్నా పురోగతిమాత్రం శూన్యం. 2015 సెప్టెంబరులో టీటీడీలోకి ఒంటిమిట్ట రామాలయాన్ని విలీనం చేసుకున్నా అభివృద్ధిలో అధోగతే. ప్రత్యేకంగా టీటీడీ రూ. 100 కోట్లు కేటాయించినా ఇప్పటివరకు 10 నుంచి 15 శాతంలోపే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మూడేళ్లు గడుస్తున్నా అభివృద్ధి ముందుకు సాగకపోవడంతో భక్తులు పెదవి విరుస్తున్నారు. మళ్లీ ఈ ఏడాది ఏప్రిల్లో ఒంటిమిట్టలో ప్రభుత్వ లాంఛనాలతో శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఏకశిలా నగరంలో ఇప్పటికీ చెప్పుకోదగ్గ రీతిలో అభివృద్ధి లేకపోవడంపై భక్తుల్లో తీవ్ర నిరాశ కనిపిస్తోంది. ఇప్పటికే రెండుమార్లు శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదో చేస్తున్నట్లు..పూర్తి స్థాయిలో రూపురేఖలు మారుస్తున్నట్లు చెప్పుకొచ్చినా హామీకే పరిమితమైందే తప్ప అమలులో చిత్తశుద్ధి కరువైంది. ప్రభుత్వ నిర్లక్ష్యం.. టీటీడీ వైఫల్యం.. పురావస్తుశాఖ అనుమతులు ఇవ్వకపోవడం.. వెరసి ఆలయ అభివృద్ధి అటకెక్కింది. పూర్తయిన మాడ వీధులు ప్రభుత్వం అధికార లాంఛనాలతో శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహిస్తున్న తరుణంలో ఆలయ పరిసరాలు అందంగా రూపుదిద్దుకోవాలి్సన తరుణమిది. కానీ ఒంటిమిట్ట కోదండ రామాలయం చుట్టూ మాడవీధులు తప్ప మిగతా ఎక్కడా కూడా అభివృద్ధి పనులు పూర్తి కాలేదు. ఆలయ సమీపంలో స్వామి వారి కల్యాణం నిర్వహించేందుకు మండపం తప్ప మరేమీ కనిపించడం లేదు. చెరువులో బోటింగ్తోపాటు కట్టపై ఆంజనేయస్వామి విగ్రహం, బమ్మెరపోతన థీం పార్కు ఏర్పాటు చేయాలని సంకల్పించినా ఇంతవరకు అతీగతీ లేదు. ఉత్సవ విగ్రహాలకు ఏరోజుకారోజు ఉత్సవాల్లో భాగంగా అలంకరించేందుకు ప్రత్యేకంగా అలంకార మండపం ఏర్పాటు కాలేదు. ఇప్పటికీ పూర్తికాని వసతి గృహం శ్రీ సీతారాముల కల్యాణ మండపం సమీపంలోని మైదానంలో కల్యాణ మండపాన్ని (వసతి గృహాన్ని) నిర్మిస్తున్నా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. దాదాపు ఆరు నెలల క్రితం పనులు ప్రారంభించినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పైన వసతి గదుల నిర్మాణ పనులు సాగుతున్నాయి. రెండు రోజుల క్రితం మైదానంతోపాటు ఆలయ పరిసరాలు, ఇతర అన్నిచోట్ల పిచ్చిమొక్కలు, కంపచెట్లు తొలగించారు. టీటీడీ జీఈఓ పోలా భాస్కర్ వచ్చి పరిశీలించి వెళ్లిన తర్వాత పనులను వేగవంతం చేశారు. చెరువులో పిచ్చిమొక్కలు కడప–తిరుపతి ప్రధాన రహదారిలోని ఒంటిమిట్ట వద్ద ఉన్న చెరువులో ప్రస్తుతం ఎక్కడ చూసినా పిచ్చిమొక్కలు దర్శనమిస్తున్నాయి. నీరు కూడా తగ్గిపోవడంతో ఎక్కడ చూసినా కంపచెట్లు, పిచ్చిమొక్కలు తప్ప మరేమీ కనిపించడం లేదు. బోటింగ్ సిస్టమ్ అంటూ గత ఏడాది పర్యాటకశాఖ రెండు బోట్లు తెచ్చినప్పటికీ ముందుకు కదల్లేదు. తాగునీటి వసతి, మరుగుదొడ్లు తప్ప మరెలాంటి వసతులు ఊపందుకోలేదు. రూ. 100 కోట్లు కేటాయించినా.! తిరుమల–తిరుపతి దేవస్థానం ఒంటిమిట్ట అభివృద్ధికి సుమారు రూ. 100 కోట్లు కేటాయించినా ఇప్పటివరకు 10 నుంచి 15 శాతం నిధులను మాత్రమే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఆలయం పురావస్తుశాఖ ఆధ్వర్యంలో నడుస్తుండడంతో అనుమతులు రాని కారణంగానే పనులు జరగలేదని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. గత ఏడాది కూడా కనీసం అనుమతులు లేని పరిస్థితుల నేపథ్యంలో ఆలయ గాలిగోపురానికి రంగులు కూడా వేయని పరిస్థితి. ఇప్పుడిప్పుడు ఆలయ పరిసరాల్లో తాగునీటి పైపులైన్లు.. రెడీమేడ్ క్యూలైన్లు....బయట పడమర వైపున గడ్డిని నాటి పచ్చదనం కోసం పనులను వేగవంతం చేస్తున్నారు. ఇంకా చేయాల్సినవి చాలా పనులు ఉన్నా అధికారులు మాత్రం ఉత్సవాలు అనగానే ఒంటిమిట్టలో వాలిపోవడం, అయిపోగానే వెళ్లిపోవడం తప్ప అభివృద్ధిని విస్మరించారని ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు. ఏదీ ఆహ్లాదకర వాతావరణం నెలరోజుల్లో ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అప్పటికప్పుడు అధికారుల హడావుడి తప్ప ముందస్తు చర్యలు లేవు. ప్రత్యేకంగా ఏడాది క్రితం నుంచే మండపం సమీపం నుంచి ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం, పార్కులు ఏర్పాటు చేయడం, భక్తులకు వసతి ఏర్పాట్లు చేసి ఉంటే కొంత ఆహ్లాదకర వాతావరణం ఉండేది. కనీసం రాత్రి సమయంలో పడుకోవడానికి కూడా భక్తులకు అనువైన వసతులు లేవంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. అంతంత మాత్రంగానే రైల్వేస్టేషన్ ఒంటిమిట్ట రామాలయానికి అధికారిక గుర్తింపు వచ్చినా. ఇప్పటికీ ఒంటిమిట్టలో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలయం నుంచి రైల్వేస్టేషన్కు వెళ్లాలంటే రోడ్డు వెంబడి కంపచెట్లు, అధ్వానమైన రహదారి సమస్యగా మారింది. కనీసం ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అయినా ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగేలా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకుంటే దూర ప్రాంతాల భక్తులకు అనువుగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. -
ఒంటిమిట్టలో వైభవంగా ధ్వజారోహణం
-
ఒంటిమిట్టలో వైభవంగా ధ్వజారోహణం
ఒంటిమిట్ట : కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా శనివారం ఉదయం ధ్వజారోహణం నిర్వహించారు. ధ్వజారోహణ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. కాగా ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ వేడుకలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. శుక్రవారం సాయంత్రం అంకురార్పణతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఏప్రిల్ 2న జరిగే సీతారాముల కల్యాణోత్సవంలో గవర్నర్ నరసింహన్తో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు.