breaking news
Kakatiya High School
-
పక్కా ప్రణాళికతో.. ముందుకెళతాం
విద్యార్థి దశలో కీలకమైన పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. సరైన మార్గాన్ని ఎంచుకోవాల్సిన సమయం ఇప్పుడు విద్యార్థుల ముందుంది. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు సాగుతున్నారంటూ పరీక్షలు రాసిన విద్యార్థులను ‘సాక్షి’ పలకరించింది. సమయాన్ని వృథా చేయకుండా పక్కా ప్రణాళికతో ముందుకెలతామని పేర్కొన్నారు. వారి అభి ప్రాయాలు వారి మాటల్లోనే... - భూపాలపల్లి పోలీస్ ఆఫీసర్ అవుతాను చిట్యాలలోని కాకతీయ హైస్కూల్లో టెన్త్ చదివాను. మొదటి నుంచి ప్రణాళిక ప్రకారం చదివాను. పరీక్షలు బాగా రాసాను. ప్రస్తుతం పాల్టెక్నిక్కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నాను. అందులో సీట్ రాకపోతే ఇంటర్, డిగ్రీ పూర్తిచేసి ఎస్సై జాబ్ కొట్టి మంచి పోలీస్ ఆఫీసర్ కావాలని ఉంది. అదే లక్ష్యంతో కష్టపడి సాధిస్తాను. - గౌరిశెట్టి నవీన్, చిట్యాల ఇంజనీర్ అవుతాను చిట్యాల హైస్కూల్లో టెన్త్ చదివాను. 9.8 జేపీఏ పాయింట్లు వస్తాయని నాకు నమ్మకంగా ఉంది. ఇంజనీర్ కావాలని ఉంది. భౌతిక శాస్త్రం అంటే చాలా ఇష్టం. మా అమ్మనాన్నల కలలను నిజం చేస్తాను. కష్టపడి పట్టుదలతో చదివి ఇంజనీర్ నవుతాను. - ముసాపురి రజిత, చిట్యాల సైంటిస్ట్ కావడమే లక్ష్యం పదో తరగతి పరీక్షలు బాగా రాసాను. 9.9 జేపీఏ పాయిం ట్లు వస్తాయని నాకు నమ్మకంగా ఉంది. నాకు సైన్స్ అం టే చాలా ఇష్టం. ప్రయోగాలు చేయాలని ఉంది. మా అమ్మనాన్నల ప్రొత్సాహం ఉంది. నేను పట్టుదలతో చదివి దేశానికి మంచి సైంటిస్ట్ను కావాలని ఉంది. అవుతాను. - కత్తెరశాల సుస్రుత్, నవాబుపేట ఫిజికల్ డెరైక్టర్గా ఎదగాలనుంది పదో తరగతి పరీక్షలో 9/10 జీపీ సాధిస్తా. పదవ తరగతి పరీక్షల్లో 10/10 జీపీకి ప్రయత్నించినప్పటికీ కొన్ని తప్పిదాల కారణంగా 1 పాయింట్ తగ్గితుందనుకుంటున్నా. ఈ వేసవిలో ఏపీఆర్జేసీలో సీటు సంపాదించేందుకు ప్రిపేరవుతున్నా. ఫిజికల్ డైరక్టర్ కావలనేదే లక్ష్యంగా చదువుతున్నా. - బాసని రక్షితగీత, శాయంపేట డాక్టర్ కావాలనే నా కోరిక చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే కోరిక ఉంది. పదవ తరగతిలో 10/10 ర్యాంకు వస్తుందనే నమ్మకం ఉంది. ఎండాకాలంలో కంప్యూటర్పై అవగాహన పెంచుకోవడంతో పాటు చదువుతూ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవడానికి పుస్తకాలను సేకరిస్తున్నాను. - కట్కం సింధూ, రేగొండ -
మమ అనిపించారు
- కాకతీయ హైస్కూల్పై విచారణ - ఇలా వచ్చి అలా వెళ్లిన డీఈఓ, ఏజేసీ - నోటీసు గడువు ముగిసినా చర్యలకు వెనుకంజ తూప్రాన్: మాసాయిపేట దుర్ఘటనలో 18 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, యావత్ దేశం అయ్యోపాపమంటూ కన్నీరుమున్నీరైంది. ఈ ఘటనలో కాకతీయ హైస్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తినా, అధికారులు మాత్రం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైలు ప్రమాద పూర్వాపరాలు, పాఠశాల యాజమాన్యం పాత్ర తదితర అంశాలపై విచారణ చేపట్టేందుకు శనివారం కాకతీయ హైస్కూల్లుకు వచ్చిన ఏజేసీ మూర్తి, డీఈఓ రాజేశ్వర్రావు, ఆర్వీఎం అధికారిని యాసీన్బాషాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ప్రమాద ఘటనపై పాఠశాల పాత్ర ఏమిటన్నదానిపై మూడు రోజుల కిందటే పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేశామని, శనివారంతో ఆ గడువు కూడా ముగిసిందన్న డీఈఓ..స్కూల్పై ఎలాంటి చర్యలు తీసుకుంటామన్న దానిపై స్పష్టత ఇవ్వలేకపోయారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో చర్చించి వారిచ్చే సూచన మేరకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. మరోవైపు ఏజేసీ మూర్తి కూడా కేవలం పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడటంతోనే సరిపెట్టారు. ఇక ఆర్వీఎం అధికారిని యాసీన్బాషా మాత్రం ప్రేక్షకపాత్ర పోషించారు. పాఠశాల తెరవాలంటూ తల్లిదండ్రుల పట్టు! విచారణ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న సుమారు 600 పైగా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాఠశాలను వెంటనే తెరువాలని పట్టుబట్టారు. ఇప్పటికే యూనిఫాం, పుస్తకాలు తీసుకోవడంతో పాటు మొదటి విడత ఫీజులు చెల్లించామని ఏజేసీ దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాల అనుమతులు రద్దు చేస్తే తమ పిల్లల భవిష్యత్తు ఆగమ్యగోచరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంలో పాఠశాలకు చెందిన 18 మంది చిన్నారులు దుర్మరణం చెందడం, మరో 18 మంది ఆస్పత్రిలో చికిత్సలు పొందడం చాలా బాధకరమని, ఇందుకు తాము సైతం చింతిస్తున్నట్లు అదనపు జేసీ ముందు వాపోయారు. ఈ సందర్భంగా అదనపు జేసీ స్పందిస్తూ ఈ పాఠశాలకు చెందిన చిన్నారులను స్థానిక ప్రభుత్వ పాఠశాల, ఇతర ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తామన్నారు. ఇందుకు ఒప్పుకోని తల్లిదండ్రులు కాకతీయ పాఠశాలను తెరిపించాలని పట్టుబట్టారు. దీంతో తమ అభిప్రాయాలను రాసి డీఈఓ రాజేశ్వర్రావుకు అందిస్తే ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటామని ఏజేసీ మూర్తి వారితో తెలిపారు. విద్యార్థుల సంఖ్య కూడా తప్పే కాకతీయ హైస్కూల్లో సుమారు 600 మంది విద్యార్థులు చదువుతుండగా, కేవలం 378 మంది విద్యార్థులే ఉన్నట్లు కాకతీయ హైస్కూల్ యాజమాన్యం వెల్లడించిందని డీఈఓ రాజేశ్వర్ తెలిపారు. అందువల్లే జిల్లాలోని అన్ని పాఠశాలకు చెందిన విద్యార్థుల సంఖ్యను తరగతుల వారీగా సమాచారం అందించాలని అన్ని మండలాలకు చెందిన ఎంఈఓలను ఆదేశించినట్లు డీఈఓ తెలిపారు. ఇందుకోసం ఈ నెల 5న సంగారెడ్డిలో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 15 స్కూల్ బస్సులు సీజ్ చేయగా, నిబంధనలకు విరుద్ధంగా 19 ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్నట్లు గుర్తించి ఆయా పాఠశాలల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశామన్నారు.