breaking news
Juba
-
'ఇది నిజంగా దేవుడి లీల'
జుబా : దక్షిణ సుడాన్లో కూలిపోయిన కార్గో విమాన ప్రమాదంలో అనూహ్యంగా తండ్రీ కూతుళ్లిద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. 37 మందిని పొట్టన బెట్టుకున్న ఈ ప్రమాదంలో 13 నెలల పసిపాప నిలౌ స్వల్పగాయాలతో బయటపడడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సుడాన్ రాజధాని జుబాలోని విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది. స్థానిక టీవీ ప్రతినిధి ఆచల్ డెంగ్ తొలిసారిగా పాపను గుర్తించారు. అపస్మారక స్థితలో పడి ఉన్న తండ్రి ఛాతీపై గాయాలతో పడి ఉండడన్ని ఆమె గమనించి రక్షణ దళాలకు సమాచారం అందించారు. ఒక కాలు విరిగి, నుదురుమీద స్వల్ప గాయాలతో చిన్నారి బయటపడింది. అయితే ఈ ఘోర ప్రమాదంలో చిన్నారి తల్లి, చెల్లి ప్రాణాలు కోల్పోయారు. ఇది నిజంగా దేవుడి లీల అంటూ డెంగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయినా.. కూతురిని తన గుండెలపై వేసుకుని రక్షించాడని తెలిపారు. పాప తండ్రి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను స్పృహలోకి వచ్చిన తరువాత పాప వివరాలు తెలిపాడన్నారు. కాగా నివాసం ప్రాంతంలో విమానం కుప్పకూలడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. 37మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా ,మరికొంత మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. పరిమితికి మించిన ఎక్కువ పరిమాణంలోసరుకులు తీసుకెళ్లడం వల్లనే నైలు నది సమీపంలో విమానం కూలిపోయిందని దేశ రవాణా శాఖమంత్రి తెలిపారు. మృతుల సంఖ్య 37కి పెరిగిందని ప్రకటించారు. విచారణకు ఆదేశించామని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రయాణికులకు అనుమతిలేని ఈ విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారన్న విషయంలో స్పష్టత లేదని తెలిపారు. -
కుప్పకూలిన విమానం; 36 మంది మృతి
36 మంది మృతి.. సూడాన్లో దుర్ఘటన జుబా: ఆఫ్రికా ఖండంలోని దక్షిణ సూడాన్లో బుధవారం ఓ రవాణా విమానం కూలిపోయింది. దక్షిణ సూడాన్ రాజధాని జుబాలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. విమానాశ్రయానికి సుమారు 800 మీటర్లదూరంలోనే నైలునదిలోని ఓ చిన్న ద్వీపంలో ఈ విమానం కుప్పకూలిపోయింది. ఈ సంఘటనలో సుమారు 36 మంది వరకు మృతిచెందినట్టు తెలుస్తోందని ఐక్యరాజ్యసమితి సహాయంతో నడుస్తున్న రేడియో మరియా తెలిపింది. విమానం కూలిన ద్వీపంలో కొన్ని రైతు కుటుంబాలు జీవిస్తున్నాయని, విమానం కూలినకారణంగా దానికిందపడి పలువురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోందని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. కాగా, విమానం శకలాలు నది వెంట చెల్లాచెదురుగా పడ్డాయని ఆ వార్తలు తెలిపాయి. మృతదేహాలను స్థానికులు వెలికి తీశారని ఓ వార్తాసంస్థ విలేకరి తెలిపారు. అంతర్యుద్ధంతో సతమతమవుతున్న సూడాన్లో జుబా విమానాశ్రయం రద్దీగా ఉంటుంది. పలు వాణిజ్య, రవాణా విమానాలే కాకుండా మిలిటరీ విమానాలు కూడా ఇక్కడినుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. ద్వీపం వద్ద కూలి ముక్కలుచెక్కలైన విమానం. పక్కన పడి ఉన్న మృతదేహాలు -
సూడాన్లో కూలిన విమానం