breaking news
JSCA International Stadium
-
Ind vs SA : రెండో వన్డేకు వర్షం ముప్పు.. మ్యాచ్ జరిగేనా?
లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఓటమిపాలైన టీమిండియా.. ఇప్పుడు కీలక పోరుకు సిద్దమైంది. ఆదివారం రాంఛీ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ తలపడనుంది. సిరీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా టీమిండియా విజయం సాధించాలి. అయితే ఈ మ్యాచ్కు వరుణుడు అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. ఆదివారం మ్యాచ్ జరిగే సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అని అక్యూవెదర్ తెలిపింది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం రావడానికి 55 శాతం కంటే ఎక్కువ ఆస్కారం ఉంది అని అక్యూవెదర్ పేర్కొంది. అదే విధంగా తేమ కూడా 72 శాతం ఉంటుంది అని అక్యూవెదర్ వెల్లడించింది. కాగా లక్నో వేదికగా జరిగిన తొలి వన్డేకు కూడా వర్షం అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్ను 40 ఓవర్లకు కుదించారు. ఇక రెండో వన్డే కూడా ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తుది జట్లు(అంచనా) టీమిండియా: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభమన్ గిల్, రజిత్ పటిదార్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్ దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, తబ్రైజ్ షమ్సీ చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో రెండో వన్డే.. రుత్రాజ్కు నో ఛాన్స్! పటిదార్ అరంగేట్రం! -
తొలి టి20లో భారత మహిళల గెలుపు
34 పరుగులతో ఓడిన లంక రాంచీ: అనూజా పాటిల్ (17 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు; 3/14) ఆల్రౌండ్ ప్రదర్శనతో... శ్రీలంకతో జరిగిన తొలి టి20 మ్యాచ్లో భారత మహిళల జట్టు 34 పరుగుల తేడాతో విజయం సాధిం చింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. జేఎస్సీఏ అంతర్జాతీయ స్టేడియంలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో... టాస్ గెలిచిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులు చేసింది. హర్మన్ప్రీత్ కౌర్ (36), సృ్మతి మందన (35) రాణించారు. ఓపెనర్లు మిథాలీ రాజ్ (3), వనిత (12) నిరాశపర్చడంతో భారత్ 4 ఓవర్లలో 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే కౌర్, మందన మూడో వికెట్కు 61 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను నిలబెట్టారు. చివర్లో అనూజా వేగంగా ఆడటంతో టీమిండియాకు గౌరవప్రదమైన స్కోరు దక్కింది. సుగందిక 3, కౌసల్య 2 వికెట్లు తీశారు. తర్వాత లంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 96 పరుగులకే పరిమితమైంది. సురంగిక (41 నాటౌట్) టాప్ స్కోరర్. అనూజ ధాటికి లంక వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. సిరివర్ధనే (18), కరుణరత్నే (14) ఫర్వాలేదనిపించారు. దీప్తి శర్మ 2 వికెట్లు తీసింది. అనూజాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 బుధవారం ఇదే వేదికపై జరుగుతుంది.