breaking news
Jersey Controversy
-
కాషాయ రంగులోకి టీమిండియా జెర్సీ.. దిగ్గజ గోల్కీపర్ కీలక వ్యాఖ్యలు
భారత హాకీ జట్టు సంప్రదాయ నీలం రంగు స్థానంలో కాషాయ రంగు జెర్సీ ధరించడంపై కొనసాగుతున్న వివాదానికి దిగ్గజ గోల్కీపర్ పీఆర్ శ్రీజేష్ తెరదించే ప్రయత్నం చేశారు. జెర్సీ రంగు మార్చడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే నీలం జెర్సీ వల్ల నీలం టర్ఫ్పై ఆటగాళ్లకు కనిపించడం కష్టమవుతుందనే కారణం మాత్రం తనకు అర్థం కావడం లేదని అన్నారు.ఆగస్టు 15 నుంచి నెదర్లాండ్స్, బెల్జియంలో జరగనున్న హాకీ ప్రపంచకప్లో భారత పురుషుల, మహిళల జట్లు తమ ప్రధాన కిట్గా కాషాయ జెర్సీని ధరించనున్నాయి. దీనిపై మాజీ కెప్టెన్లు వీరెన్ రస్కిన్హా, ధన్రాజ్ పిళ్లే, అజిత్ పాల్ సింగ్, వాసుదేవన్ భాస్కరన్, పర్గత్ సింగ్ తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు.“జెర్సీ రంగు మార్చడమే వివాదమైతే 2014, 2018 ప్రపంచకప్ల సమయంలోనూ ఇది జరగాలి. అప్పుడు మేం పసుపు, లైట్ బ్లూ రంగు జెర్సీలు ధరించాం. రంగు మార్చడంపై నాకు సమస్య లేదు. కానీ అందుకు చెబుతున్న కారణమే విచిత్రంగా ఉంది” అని శ్రీజేష్ పేర్కొన్నారు.నీలం టర్ఫ్ కారణంగా నీలం జెర్సీ కనిపించడం కొంత కష్టంగా ఉండొచ్చని అంగీకరించినప్పటికీ, 2012 లండన్ ఒలింపిక్స్ నుంచి నీలం టర్ఫ్పై భారత్ ఎన్నో టోర్నీల్లో నీలం జెర్సీతోనే ఆడిందని గుర్తుచేశారు.రాజకీయాలకు దూరంగా ఉండాలిజెర్సీ మార్పుకు ఆటగాళ్లు అంగీకరించి ఉంటే ఇక ఈ అంశంపై చర్చ అవసరం లేదని శ్రీజేష్ స్పష్టం చేశారు.“క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచాలి. ఆటగాళ్లే అత్యంత ముఖ్యమైన వారు. వారికి ఎలాంటి సమస్య లేకపోతే బయటివారు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు” అని అన్నారు.అయితే కొత్త జెర్సీని ప్రపంచకప్కు ముందే కొన్ని మ్యాచ్ల్లో ఉపయోగించి ఉంటే ఆటగాళ్లు దానికి అలవాటు పడేవారని అభిప్రాయపడ్డారు.50 ఏళ్ల నిరీక్షణకు తెరదించే అవకాశంప్రపంచకప్లో భారత్ 50 ఏళ్లుగా టైటిల్ కోసం ఎదురుచూస్తోందని, ఈసారి సెమీఫైనల్ చేరే అవకాశం బలంగా ఉందని శ్రీజేష్ అభిప్రాయపడ్డారు.ఇంగ్లండ్ మాత్రమే తమ గ్రూప్లో ప్రధాన సవాల్ అని, గ్రూప్లో అగ్రస్థానంలో నిలిస్తే తర్వాతి దశలో మార్గం కొంత సులభంగా ఉండొచ్చని చెప్పారు.“బయటి చర్చలను పక్కన పెట్టి అత్యుత్తమ హాకీ ఆడండి. 50 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికి పతకం సాధించండి” అని శ్రీజేష్ భారత జట్టుకు సూచించారు. -
విరాట్ కోహ్లికి అవమానం.. 18 నంబర్ జెర్సీ మరొకరికి కేటాయింపు
భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన విరాట్ కోహ్లికి అవమానం జరిగింది. టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ జెర్సీ నంబర్ 18ని మరొకరి కేటాయించారు. ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న మ్యాచ్లో భారత-ఏ జట్టు ఆటగాడు ముకేశ్ కుమార్ 18 నంబర్ జెర్సీని ధరించి కనిపించాడు. బీసీసీఐ ఏ ఉద్దేశంతో ముకేశ్కు ఈ జెర్సీ నంబర్ కేటాయించిందోతెలీదు కానీ, విరాట్ అభిమానులు మాత్రం ఈ విషయమై మండిపడుతున్నారు. ఇది తమ ఆరాధ్య ఆటగాడిని అవమానించినట్లే అని బీసీసీఐని టార్గెట్ చేస్తున్నారు.క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లకు సంబంధించిన జెర్సీ నంబర్లను ఇతరులకు కేటాయించకపోవడం ఆనవాయితీ. అయితే ఈ ఆనవాయితీకి బీసీసీఐ తూట్లు పొడిచింది. విరాట్ విషయంలో మొదటి నుంచి పట్టీపట్టనట్లుండే బీసీసీఐ మరోసారి దిగ్గజ ఆటగాడిని అవమానింది. టెస్ట్ల్లో టీమిండియాను తిరుగులేని శక్తిగా నిలబెట్టడంతో విరాట్ కీలకపాత్ర పోషించాడు. అతను కెప్టెన్గా ఉన్న సమయంలో భారత్ చాలాకాలం పాటు నంబర్ వన్ జట్టుగా కొనసాగింది. విరాట్ నాయకత్వంలో టీమిండియా అపురూప విజయాలు సాధించింది. వ్యక్తిగతంగానూ విరాట్కు టెస్ట్ల్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది.అలాంటి విరాట్కు టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించాక బీసీసీఐ కనీసం వీడ్కోలు సభ కూడా ఏర్పాటు చేయలేదు. సాధారణంగా దిగ్గజ ప్లేయర్లు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించినా సంబంధిత క్రికెట్ బోర్డులు వారిని గౌరవించుకుంటాయి. అయితే బీసీసీఐ అలాంటి ప్లాన్లు ఏమీ చేయకపోగా.. దిగ్గజ ఆటగాడిని అవమానిస్తుంది. విరాట్ జెర్సీ నంబర్ను ఇతరులకు కేటాయించడంపై విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు. భారత క్రికెట్కు విరాట్ ఎంతో చేశాడని, అతని జెర్సీని ఇతరులకు కేటాయించకపోవడం కనీస ధర్మమని అంటున్నారు.ఇదిలా ఉంటే, తొలుత టీ20లకు, ఆతర్వాత టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతను ఐపీఎల్ 2025తో బిజీగా ఉన్నాడు. విరాట్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్సీబీ ఈ సీజన్లో ఫైనల్కు చేరింది. ఈసారి టైటిల్ సాధించి ఐపీఎల్ కెరీర్కు ముగింపు పలకాలని విరాట్ భావిస్తున్నాడు. జూన్ 3న ఐపీఎల్ 2025 ఫైనల్ జరుగుతుంది. ఇవాళ (జూన్ 1) జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్లో (ముంబై వర్సెస్ పంజాబ్) విజేతతో ఆర్సీబీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. -
భారత బాక్సర్లకు లైన్ క్లియర్!
రియో ఒలింపిక్స్ బరిలో ఉన్న భారత బాక్సర్లకు లైన్ క్లియర్ అయింది. ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో.. అందుకు సంబంధించిన డ్రెస్ కోడ్(జెర్సీ) పాటించకపోవడంపై కాస్త సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య సూచించిన విధంగా ఉన్న జెర్సీని భారత బాక్సర్లకు ఏర్పాటుచేశారు. లిథువేనియా బాక్సర్ పెట్రాస్కస్తో 64 కేజీల విభాగంలో జరిగిన బౌట్లో మన బాక్సర్ మనోజ్ కుమార్ భారత్ పేరున్న డ్రెస్ కోడ్ పాటించకపోవడం గమనించిన అధికారులు సాంకేతికంగా జరిగిన పొరపాటుగా దీనిని గుర్తించారు. మరో బాక్సర్ వికాస్ కృష్ణన్ తొలి బౌట్లో నెగ్గిన విషయం తెలిసిందే. 56 కేజీల విభాగంలో క్యూబా బాక్సర్ తో భారత బాక్సర్ శివ థాపా పోటీపడనున్న నేపథ్యంలో జెర్సీలు అందుబాటులోకి రావడం సంతోషకర అంశం. దీంతో భారత బాక్సర్లు ఎలాంటి అనర్హత వేటుకు గురికాకుండా తర్వాతి బౌట్లలో తలపడవచ్చు.


