breaking news
Java harlal Nehru Technological University
-
పారదర్శకత.. నాణ్యమైన విద్యే లక్ష్యం
జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ యాదయ్య సిటీబ్యూరో: జవ హర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ రిజిస్ట్రార్గా జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ యాదయ్య బాధ్యతలు స్వీకరించారు. రిజిస్ట్రార్గా యాదయ్య నియామకానికి బుధవారం సాయంత్రం వర్సిటీ వైస్ చాన్స్లర్ శైలజా రామయ్యర్ ఆమోదం తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన విద్యాశాఖ సమీక్ష సమావేశంలో యాదయ్యను రిజిస్ట్రార్గా నియమించాలని సీఎం కేసీఆర్ స్వయంగా అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రిజిస్ట్రార్గా పనిచేసిన ఎన్వీ రమణారావు ఇకపై సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్గా కొనసాగనున్నారు. నూతన రిజిస్ట్రార్ యాదయ్య ‘సాక్షి’తో మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా కృషి చేస్తామని చెప్పారు. ప్రతి విషయంలో పారదర్శకంగా మెలుగుతానని పేర్కొన్నారు. అందరి సలహాలు, సూచనలతో వర్సిటీ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపచేస్తామని పేర్కొన్నారు. చదువుకున్న చోటే ఉన్నత పదవి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన యాదయ్య...జేఎన్టీయూహెచ్లో ఉన్నత చదువులు అభ్యసించి.. అదే వర్సిటీకి రిజిస్ట్రార్గా నియామకం కావడం విశేషం. 2014లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ ఆయన్ను ఇంజినీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. అంతేగాక ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ... యంగ్ సైంటి స్ట్ ఫెలోషిప్ అందజేసింది. బోధన, పరిశోధనలో 20 ఏళ్ల అనుభవం ఆయన సొంతం. ప్రొఫైల్.. నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం మల్రెడ్డిగూడెం సొంతూరు భార్య పద్మ, సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఇద్దరు అమ్మాయిలు ఒకటి నుంచి పదో తరగతి వరకు సర్వేల్లోని జెడ్పీహెచ్ఎస్ మలక్పేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ 1988లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 1992లో జేఎన్టీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధుల్లోకి 2000లో జేఎన్టీయూహెచ్లో పీహెచ్డీ 2001లో అసోసియేట్ ప్రొఫెసర్గా విధులు 2006లో ప్రొఫెసర్గా పదోన్నతి గతేడాది జేఎన్టీయూహెచ్లో ప్రిన్సిపాల్గా నియామకం -
జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్గా యాదయ్య
ఉన్నత విద్య సమీక్ష సమావేశంలో కేసీఆర్ నిర్ణయం హైదరాబాద్: జవ హర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం-హైదరాబాద్ రిజిస్ట్రార్గా జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ యాదయ్యను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్ వద్ద జరిగిన విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం రిజిస్ట్రార్గా పనిచేస్తున్న ప్రొఫెసర్ రమణారావు తన రిలీవింగ్ లేఖను ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కార్యాలయంలో అందజేశారు. మరోవైపు రమణరావు పదవీకాలం మార్చిలోనే ముగిసినా ఇంజనీరింగ్ ప్రవేశాల నేపథ్యంలో ప్రభుత్వమే మూడ్నెళ్లపాటు పొడిగించింది. ఆ పదవీ కాలం కూడా గత నెల 30తో ముగిసింది. ఈ పరిస్థితుల్లో ఆయన్ని కొనసాగిస్తారా? లేదా? అన్న చర్చలు జరిగాయి. అయితే ఆయనపై పలు కాలేజీల యాజమాన్యాలు ఆరోపణలు, ఫిర్యాదులు చేశాయి. దీంతో ఆయనకు కొనసాగింపు ఇవ్వకుండా ప్రొఫెసర్ యాదయ్యను రిజిస్ట్రార్గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నిర్ధారించారు. నిబంధనల మేరకు పని చేశా: రమణారావు ఇంజనీరింగ్ విద్య, కాలేజీల విషయంలో ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనల మేరకు తాను పని చేశానని రమణారావు పేర్కొన్నారు. నిబంధనల అమలులో పక్కాగా వ్యవహరించానని తెలిపారు. ఇంజనీరింగ్లో నాణ్యత ప్రమాణాల కోసం ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నడుచుకున్నానన్నారు.