జాగృత భారత్ ఆధ్వర్యంలో మహా ధర్నా
హైదరాబాద్: కేరళలో సీపీఎం హత్యా రాజకీయాలను ఖండిస్తూ ఇందిరా పార్కు ధర్నా చౌక్లో మహా ధర్నా జరిగింది. జాగృత భారత్, ఎంఎంఆర్ఐ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. మాజీ డీజీపీ దినేష్రెడ్డి, ఆర్ఎస్ఎస్ ప్రచారక్ శ్యాంకుమార్, ఎనీవీఎస్ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, బీజేపీ, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ వివిధ సంఘాల కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.