-
పట్టని ప్రయోగం
విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ విద్య కీలకం. చదువుతోపాటు ప్రయోగాలు చేయాల్సి ఉంది. లేకపోతే ఆ ప్రభావం మార్కుల మీదు పడుతుంది.ప్రతి సబ్జెక్టుకు 30 మార్కుల చొప్పున ఎంపీసీ వారికి రెండు, బైపీసీ వారికి 4 సబ్జెక్టులకు మార్కులు ఉంటాయి.ప్రయో పరీక్షలు జంబ్లింగ్ విధానంలో జరుగుతున్నా ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు అంతంగా స్పందించడం లేదు. చివరి దశలో నామమాత్రంగా ప్రయోగపరీక్షలు చేయిస్తూ పరీక్షల సమయంలో పైరవీలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో కూడా అంతంత మాత్రంగానే చేయిస్తున్నారు. కొన్ని కళాశాలల్లో ల్యాబ్లకు సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజంపేట ఉర్దూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ల్యాబ్కు గది లేక పరికరాలను బీరువాలో ఉంచి ప్రాక్టికల్స్ సమయంలో బయటికి తీయాల్సిన పరస్థితి నెలకొంది. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభంకానున్న ప్రయోగ పరీక్షల దృష్ట్యా ప్రత్యేక కథనం.. కడప ఎడ్యుకేషన్ : ఈ ఏడాది ఇంటర్ ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 174 కళాశాలల్లో 45 వేలమంది విద్యార్థులు ఉన్నారు.వీరిలో 13,251 మంది ఎంపీసీ, బైపీసీ చదువుతున్నారు. జిల్లావ్యాప్తంగా 63 కేంద్రాల్లో ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి సెంటర్లో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆర్ఐఓ రవి తెలిపారు. నాలుగు విడతల్లో పరీక్షలు ప్రాక్టికల్ పరీక్షలు నాలుగు విడతల్లో జరగనున్నాయి. 1 నుంచి 5 వరకు మొదటి విడత, 6 నుంచి 10 వరకు రెండో విడత, 11 నుంచి 15వరకు మూడో విడత, 16 నుంచి 20 వరకు నాలుగో విడత పరీక్షలు జరగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్ర 5 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సారీ జంబ్లింగ్ విధానంలోనే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహించనున్నారు. కార్పొరేట్ యాజమాన్యాల నుంచి ఒత్తిళ్లు వచ్చినా జంబ్లింగ్ విధానంలోనే ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. పరీక్ష విధులకు హాజరయ్యే సిబ్బందిని కూడా ఏరోజుకారోజు మార్చి అక్రమాలకు అడ్డుకట్ట వేయనున్నారు. ప్రశ్నపత్రాలు అన్లైన్లో ప్రాక్టికల్స్కు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునేలా ఇంటర్ బోర్డు నూతన విధానానికి తెరలేపింది. గతంలో పోస్టల్ ద్వారా పరీక్ష పత్రాలు ఆయా కేంద్రాలకు పంపించేవారు. దీంతో కొన్నిచోట్ల అవకతవకలు జరుగుతున్నట్లు విమర్శలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పరీక్షలకు 30 నిమిషాల ముందు సంబంధిత కేంద్రంలో పశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో పరిస్థితి జిల్లాలో చాలా కళాశాలల్లో వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రాజంపేట మండలంలోని ఉర్దూ జూనియర్ కళాశాలలో ల్యాబ్ సౌకర్యం లేదు. పరిరకాలను బీరువాలో ఉంచుకుని ల్యాబ్ ఉన్న రోజు బయటకు తీసి టేబుల్పైన పెట్టుకుని ప్రయోగాలు చేయించి తిరిగి బీరువాలో భద్రపరచుకునే పరిస్థితి ఉంది. మైదుకూరు ఉర్దూ జూనియర్ కళాశాలకు సొంతభవనాలు లేవు.స్థానిక కొత్తకొట్టాలులో ఉన్న ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఇందులో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు 20 మంది ఉన్నారు.ఇక్కడ ల్యాబ్ సౌకర్యం మాత్రం లేదు.అధ్యాపకులు సొంత డబ్బులతో పరికరాలను కొని అరకొరగా ప్రయోగాలను చేయిస్తున్నారు. జమ్మలమడుగు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ల్యాబ్రూమ్ శిథిలావస్థకు చేరుకుంది. గది పైకప్పు పెచ్చులూడింది.కడప బాలుర, బాలికల జూనియర్ కళాశాల, ఓబులవారిపల్లె, రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, పొద్దుటూరులోని పలు కళాశాలల్లో ల్యాబ్స్, పరికరాలు బాగానే ఉన్నాయి. రాయచోటి, నందలూరు, మైలవరం, పెండ్లిమర్రి, పుల్లంపేట, మైదుకూరులలో పరికరాలు అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలిసింది. భయం భయంతో మా కళాశాలలో ల్యాబ్ సౌకర్యం లేదు. దీంతో పరికరాలను బీరువాలో ఉంచుతాం. ల్యాబ్ క్లాస్ ఉన్నప్పడు వాటిని బయటకు తీసి చిన్న టేబుల్పైన పెట్టుకుని భయం భయంగా ప్రయోగాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారుల స్పందించి వసతులన కల్పనకు చర్యలు తీసుకోవాలి. – షేక్ తాసిఫ్,ఉర్దూ జూనియర్ కళాశాల, రాజంపేట -
ఇంటర్ రూపురేఖలు మారుస్తాం: కడియం
హైదరాబాద్: విద్యార్థులకు ఇంటర్మీడియెట్ ఎంతో కీలకమైన దశ అని, మరో ఆరు నెలల్లో ఇంటర్ విద్యా వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన విద్యా వ్యవస్థను నిర్మాణం చేసుకోవాల్సి ఉందని, ఇంటర్ విద్యను కొత్త ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ పబ్లిక్గార్డెన్స్లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో ‘తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉచిత ఇంటర్ విద్య-సంబరాలు, ఉచిత విద్య-అధ్యాపకుల పాత్ర’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్రెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సుకు కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉచిత ఇంటర్ పాఠ్యపుస్తకాలను ఆవిష్కరించిన మంత్రి.. ప్రభుత్వ కళాశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులకు వాటిని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా ఇంటర్ ఉచిత విద్యను ప్రవేశపెట్టడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. ప్రస్తుతం సాంఘిక, ఆర్థికపరమైన అసమానతలను చూస్తున్నామని, వీటన్నింటి కంటే ప్రమాదకరమైన విద్యా అసమానతలు రానున్నాయని చెప్పారు. 2016-17 విద్యా సంవత్సరం నుంచి కేజీ నుంచి పీజీ ఉచిత విద్యను అందజేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇందులో భాగంగా అందరి అభిప్రాయాలను సేకరించి సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నట్లు చెప్పారు. కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, జీఏడీ గైడ్లైన్స్ రావడానికి వారం పడుతుందని, అవి అందగానే కాంట్రాక్టు లెక్చరర్లు శుభవార్తను వింటారని చెప్పారు. కళాశాలల్లో అడ్మిషన్లు పెంచే బాధ్యత తమదైతే.. విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో బోధన చేయాల్సిన బాధ్యత అధ్యాపకులదే అని అన్నారు. కొత్త రాష్ట్రంలో ప్రమాణాలు పెంచే ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రస్తుతం జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.140 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి పూనుకోవాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉచిత విద్యతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలని కోరారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉచిత విద్య ఒక వరం లాంటిదని, ఇలాంటి పథకాలతో తెలంగాణ విజ్ఞాన సొసైటీ కావాలని ఆకాంక్షించారు. మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈసారి 10 శాతం అడ్మిషన్లు పెరిగినట్లు చెప్పారు. అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సదస్సులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు సి.విఠల్, ఇంటర్ కమిషనర్ డాక్టర్ ఎ. అశోక్ మాట్లాడారు. అనంతరం ఉచిత పాఠ్యపుస్తకాల ముద్రణకు సహకరించిన మేథా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యుగంధర్రెడ్డిని సత్కరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement