breaking news
Inter-district robbers
-
ప్రొద్దుటూరు సబ్ జైలు నుంచి అంతర్ జిల్లా దొంగ పరార్
ప్రొద్దుటూరు క్రైం: జైళ్లలో నిఘా లోపాలను బయటపెడుతున్న వ్యవహారం ఇది. మూడు రోజుల క్రితమే దొంగతనం కేసులో అరెస్టయిన మహమ్మద్ రఫీ అనే అంతర్ జిల్లా దొంగ, వైఎస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు సబ్ జైలు నుంచి పరారయ్యాడు. రఫీపై కడప, కర్నూలు, అనంతపురంసహా వివిధ జిల్లాల్లో 25 చోరీ కేసులు ఉన్నాయి. గతంలో ఒక కేసులో అరెస్టయిన రఫీ, 2021లో జమ్మలమడుగు సబ్ జైలు నుంచి కూడా పరారవడం గమనార్హం. తాజా ఘటనలో శనివారం ఉదయం 7.30 గంటల సమయంలో మిగిలిన ఖైదీలతోపాటు కాలకృత్యాల కోసం జైలు గది నుంచి ఆవరణలోకి వచ్చిన రఫీ, అటు తర్వాత తహసీల్దార్ కార్యాలయం వైపు ఉన్న గోడ దూకి పరారయ్యాడు. రిమాండ్లో ఉన్న ఖైదీ పరారైన విషయాన్ని జైలు సిబ్బంది ఉన్నతాధికారులకు తెలిపారు. శుక్రవారం రాత్రి విధుల్లో ఇన్చార్జి సూపరింటెండెంట్ శ్రీనివాసరావుతోపాటు మరో ఇద్దరు సిబ్బంది ఉన్నారు. సమాచారం అందుకున్న జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్, కడప జైలర్ అమర్ బాషా శనివారం ప్రొద్దుటూరు సబ్ జైలుకు వెళ్లి పరిస్థితులను సమీక్షించారు. దీనిపై తనకు నివేదిక పంపాలని కడప జైలర్ బాషాను డీఐజీ ఆదేశించారు. ఘటనపై ప్రొద్దుటూరు సబ్ జైలు ఇన్చార్జి సూపరింటెండెంట్ త్రీటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించి.. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సబ్ జైలు చుట్టూ ఎత్తయిన గోడ ఉంది. ప్రహరీ చుట్టూ విద్యుత్ ప్రవాహ కంచెను ఏర్పాటు చేశారు. అయినా దొంగ పారిపోవడం చర్చనీయాంశంగా ఉంది. -
ఇద్దరు అంతర్ జిల్లా దొంగల అరెస్ట్
115.75 సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం సూళ్లూరుపేట: జిల్లాలో పలు దొంగతనాలతో సంబంధాలు ఉన్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.16.97 లక్షలు విలువచేసే 115.75 సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ విశాల్గున్నీ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన నిందితుల వివరాలు వివరించారు. ఈ నెల 10వ తేదీ రాత్రి షార్ బస్టాండ్ సమీపంలో కొక్కు శంకరయ్య ఇంటి తాళాలు పగులగొట్టి 18 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.30 వేలు నగదు చోరీ జరిగింది. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా చెంగాళమ్మ ఆల యం సమీపంలోని పాత చెక్పోస్టు వద్ద అనుమానాస్పదంగా ఉన్న చిత్తూరు జిల్లా గుడిపాల మండలం యామ్నూరు కు చెందిన రహంతుల్లా మస్తాన్ను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. 2015 జూలైలో నెల్లూరురూరల్ మండలం కల్లూరుపల్లి హౌసింగ్బోర్డు కాలనీలోని ఓ ఇంట్లో 8 సవర్లు, 2015 లో ఏప్రిల్లో వెంకటగిరిలో 12 సవర్లు, నవంబర్లో తడ హైస్కూల్ రోడ్డులోని ఓ ఇంట్లో 3 సవర్లు, 2016 జనవరిలో తడకండ్రిగ రాజీవ్నగర్లో మరో ఇం ట్లో ఒకటిన్న సవర, అదే నెలలో వెంకటగిరి ఓ ఇంట్లో అర సవర , ఫిబ్రవరిలో గూడూరు మార్కెట్ వీధిలో ఓ ఇంట్లో 30 సవర్ల బంగారు నగలను అపహరించినట్లు విచారణలో తేలింది. అతని నుంచి 72 సవర్ల ఆభరణాలను స్వాధీ నం చేసుకున్నామని, వీటి విలువ రూ. 10.61 లక్షలు ఉంటుందని తెలిపారు. మరో దొంగ.. ఆనంతపురం జిల్లా తాటిపర్తికి చెందిన ఆకుల రాంబాబు (35) ప్రస్తుతం తెలంగాణలోని మెదక్ జిల్లా నర్సాపూర్లో నివాసం ఉంటూ జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ నెల 2వ తేదీ రాత్రి మండలంలోని జంగాల పల్లిలో నాగారపమ్మ ఆలయంలో అమ్మవారి మెడలో ఉన్న ఆరున్నర సవర్ల బం గారు ఆభరణాలు, హుండీలో ఉన్న రూ. 10వేలు నగదు అపహరించాడు. నింది తుడు స్థానిక రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా ఉండటంతో అనుమానించి పట్టుకుని విచారించగా సూళ్లూరుపేట, గూడూరు, మనుబోలు, రాపూరు, వెంకటగిరి పట్టణాల్లో సుమారు ఏడు దొంగతనాలు చేనినట్టు ఒప్పుకున్నాడని చెప్పా రు. అతని వద్ద నుంచి 43.5 సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ రూ. 6,36 లక్షలు ఉంటుంది. ఈ కేసులను ఛేదిం చిన డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ విజయకృష్ణ, ఎస్సైలు గంగాధర్రావు, సురేష్, ఐడీ పార్టీ సిబ్బందిని అభినందించారు.