Indian investors
-
దుబాయ్లో కంపెనీ గల్లంతు.. రూ.కోట్లు నష్టపోయిన భారతీయులు
దుబాయ్కు చెందిన ఓ బ్రోకరేజీ సంస్థ రాత్రికి రాత్రే గల్లంతైంది. రూ.కోట్ల కొద్దీ ఇన్వెస్టర్ల సొమ్ముతో ఆచూకీ లేకుండా మాయమైంది. దుబాయ్ లోని బిజినెస్ బేలోని క్యాపిటల్ గోల్డెన్ టవర్లో అప్పటి వరకూ ఆ కంపెనీ ఉన్న ఆఫీస్ బయట ఒక బకెట్, అందులో ఒక మాప్, చెత్త సంచి మాత్రమే కనిపించాయి. కొన్ని వారాల క్రితం ఈ స్థలంలో గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్స్ కార్యాలయం ఉండేదని, అదే ఇప్పుడు అదృశ్యమైనట్లు కనిపిస్తోందని ఖలీజ్ టైమ్స్ నివేదిక తెలిపింది.గల్లంతైన సంస్థ..గత నెల వరకు గల్ఫ్ ఫస్ట్ దుబాయ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లోని క్యాపిటల్ గోల్డెన్ టవర్ 302, 305 సూట్ లలో సుమారు 40 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండేది. ఔత్సాహిక ఇన్వెస్టర్లను సంప్రదించడం, ఫారెక్స్ పెట్టుబడులను ప్రోత్సహించడం వారి పని.క్యాపిటల్ గోల్డెన్ టవర్లోని ఆ రెండు గదులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఫోన్ లైన్లు తెగిపోయి ఫ్లోర్లు దుమ్ముతో నిండిపోయి ఉన్నాయి. తాళాలు తిరిగి ఇచ్చి, అన్నీ క్లియర్ చేసి హడావుడిగా వెళ్లిపోయారని క్యాపిటల్ గోల్డెన్ టవర్ సెక్యూరిటీ గార్డు ఒకరు మీడియాకు తెలిపారు. ఇప్పుడు రోజూ జనం వచ్చి వారి గురించి అడుగుతున్నారని చెప్పారు.నష్టపోయిన భారత ఇన్వెస్టర్లుగల్ఫ్ ఫస్ట్ బాధితుల్లో భారతీయ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీలో పెట్టుబడి పెట్టి కోట్లాది రూపాయలు నష్టపోయినట్లు బాధితులు చెబుతున్నారు. కేరళకు చెందిన మహ్మద్, ఫయాజ్ పొయిల్ గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్స్ బ్యాంకర్స్ ద్వారా 75,000 డాలర్లు అంటే రూ.64 లక్షలకు పైగా ఇన్వెస్ట్ చేసి మోసపోయారు.మరో భారతీయ ఇన్వెస్టర్ అయితే ఏకంగా 2,30,000 డాలర్లు భారతీయ కరెన్సీలో దాదాపు రూ.2 కోట్లు నష్టపోయారు. ఇన్వెస్ట్ చేసే సయమంలో కంపెనీ రిలేషన్షిప్ మేనేజర్ తనతో తన మాతృ భాష కన్నడంలో మాట్లాడారని చెప్పుకొచ్చారు. మొదట చిన్న చిన్న లాభాలను చూపించి డబ్బును ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించిన కంపెనీ ఆ తర్వాత ఉపసంహరణలకు వీలు లేకుండా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయించారని బాధితుడు పేర్కొన్నారు.కంపెనీ సిబ్బంది తనతో మాట్లాడేటప్పుడు గల్ఫ్ ఫస్ట్, సిగ్మా-వన్ పేర్లను మార్చి మార్చి చెప్పారని, అవి రెండూ ఒకే కంపెనీగా ఉన్నాయని 50,000 డాలర్లు (సుమారు రూ.42 లక్షలు) నష్టపోయిన మహమ్మద్ అనే మరో ఇన్వెస్టర్ వివరించారు. రెండు సంస్థలపై కేసు నమోదు చేసిన పోలీసులు సిగ్మా-వన్ క్యాపిటల్ కు డీఎఫ్ఎస్ఏ లేదా ఎస్సీఏ అనుమతి లేదని నిర్ధారించారు. -
దిరియాపై దేశీ దిగ్గజాల కన్ను
న్యూఢిల్లీ/దావోస్: సౌదీ అరేబియాలో దిరియా పేరుతో తలపెట్టిన అతిభారీ(గిగా) టూరిజం ప్రాజెక్టుపై దేశీ కార్పొరేట్ దిగ్గజ గ్రూప్లు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 63 బిలియన్ డాలర్ల పెట్టుబడితో రూపొందనున్న ఈ ప్రాజెక్టులో దేశీ దిగ్గజాలు టాటా గ్రూప్, ఒబెరాయ్ గ్రూప్ తదితరాలు ఇన్వెస్ట్ చేయనున్నట్లు దిరియా సీఈవో జెర్రీ ఇన్జెరిల్లో పేర్కొన్నారు. సిటీ ఆఫ్ ఎర్త్గా పేర్కొంటున్న ఈ ప్రాజెక్టును సౌదీ అరేబియా రాజధాని రియాద్ చివర్లో నెలకొల్పుతున్నారు. లక్ష మంది ప్రజలకు గృహాలు, మరో లక్ష మందికి కార్యాలయ ప్రాంతాలతో ప్రాజెక్టు రూపొందనుంది. ఈ కొత్త నగరం 40 విలాసవంత హోటళ్లు, 1,000కుపైగా షాపులు, 150 రెస్టారెంట్లు, 20,000 సీట్ల సామర్థ్యంగల మలీ్టపర్పస్ ఈవెంట్లకు వీలయ్యే ఒపేరా హౌస్సహా గోల్ఫ్ కోర్స్, కేఫ్లు, యూనివర్శిటీలు, కల్చరల్ అసెట్స్, మ్యూజియంలు తదితరాలతో ఏర్పాటుకానుంది. -
‘కూ’ కోసం దేశీ ఇన్వెస్టర్ల క్యూ!
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్కు పోటీగా తెరపైకొచ్చిన దేశీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫాం ‘కూ’ భారీగా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. టికెట్ల బుకింగ్ పోర్టల్ బుక్మైషో సీఈవో ఆశీష్ హేమ్రాజానీ, డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థ జిరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. కొత్త ఇన్వెస్టర్లు ముందుకొస్తుండటంతో.. మరో ఉత్పత్తి కోసం గతంలో ‘కూ’లో ఇన్వెస్ట్ చేసిన చైనా సంస్థ షున్వై .. తన వాటాలను విక్రయించి పూర్తిగా వైదొలగాలని భావిస్తోంది. పలువురు దేశీ ఔత్సాహిక వ్యాపారవేత్తలు .. ఇన్వెస్ట్ చేయడంపై ఆసక్తిగా ఉన్నట్లు ‘కూ’ సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ తెలిపారు. బుక్మైషో వ్యవస్థాపకుడు, సీఈవో ఆశీష్ హేమ్రాజానీ, బౌన్స్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు వివేకానంద హలెకెరె, జిరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ సహా పలువురు ఇన్వెస్టర్లు ముందుకు వచ్చినట్లు వివరించారు. ‘దేశీ ఇన్వెస్టరు 3వన్4 క్యాపిటల్ సారథ్యంలోని ఇన్వెస్టర్లు .. ‘కూ’ మాతృ సంస్థ బాంబినేట్ టెక్నాలజీస్లో ఇటీవలే 4.1 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. మా సంస్థలో భారతీయ ఇన్వెస్టర్లు మరింతగా పెట్టుబడులు పెడుతున్నారనడానికి ఇదే నిదర్శనం‘ అని రాధాకృష్ణ తెలిపారు. గతంలో వోకల్ అనే ఉత్పత్తి కోసం ‘కూ’ లో ఇన్వెస్ట్ చేసిన షున్వై .. కొత్త ఇన్వెస్టర్లకు వాటాలను విక్రయించి పూర్తిగా వైదొలగనుందని ఆయన వివరించారు. ‘ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన 3వన్4 క్యాపిటల్, కలారి తదితర సంస్థలు కూడా మరికొంత వాటాలు కొనుగోలుచేయనున్నాయి’ అని రాధాకృష్ణ తెలిపారు. పది రెట్లు పెరిగిన డౌన్లోడ్స్ .. ప్రస్తుతం ‘కూ’ యాప్నకు ముప్ఫై లక్షలకు పైగా యూజర్లు ఉన్నారు. ఈ వారంలో యాప్ డౌన్లోడ్లు ఏకంగా పది రెట్లు పెరిగాయి. భారతీయ వ్యవస్థాపకులు, దేశీయంగా రిజిస్ట్రేషన్తో పూర్తి దేశీ యాప్గా కూ కొద్ది రోజులుగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రులు మొదలుకుని వివిధ ప్రభుత్వ శాఖలు కూడా దీన్ని ప్రోత్సహిస్తూ ప్రచారం చేస్తున్నాయి. విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను కట్టడి చేయాలన్న ఆదేశాలను పట్టించుకోవడం లేదంటూ ట్విటర్పై అసంతృప్తిని వ్యక్తం చేయడానికి కేంద్ర ఐటీ శాఖ కూడా ‘కూ’ నే ఎంచుకుంది. పీయూష్ గోయల్ లాంటి కేంద్ర మంత్రులు సైతం ‘కూ’ యాప్నకు మళ్లాలంటూ పిలుపునివ్వడంతో.. దీనికి మరింతగా ప్రాచుర్యం పెరిగింది. ఆత్మనిర్భర్ చాలెంజ్ విజేత.. ‘కూ’ సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ గతంలో ఆన్లైన్ క్యాబ్ బుకింగ్ సంస్థ ట్యాక్సీఫర్ష్యూర్ను నెలకొల్పారు. ఆ తర్వాత దాన్ని మరో ఆన్లైన్ క్యాబ్ బుకింగ్ కంపెనీ ఓలాకు విక్రయించారు. అటుపైన మయాంక్ బిదావత్కాతో కలిసి 2017లో ప్రాంతీయ భాషల్లో ఆన్లైన్ ప్రశ్నోత్తరాల ప్లాట్ఫాం వోకల్ను ప్రారంభించారు. ఆ తర్వాత ‘కూ’ ప్లాట్ఫామ్ను గతేడాది ఆవిష్కరించారు. యూజర్లు భారతీయ భాషల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే వేదికగా దీన్ని రూపొందించారు. తెలుగు, హిందీ, బెంగాలీ సహా పలు ప్రాంతీయ భాషలను ఇది సపోర్ట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం గతేడాది నిర్వహించిన ఆత్మనిర్భర్ ఇన్నోవేషన్ చాలెంజ్లో గెలుపొందిన వాటిల్లో ‘కూ’ కూడా ఒకటి. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ ఎగ్జిక్యూటివ్ టీవీ మోహన్దాస్ పాయ్ వంటి ప్రముఖులు .. దీనికి మద్దతుగా ఉన్నారు. గత వారమే యాక్సెల్, కలారి క్యాపిటల్, బ్లూమ్ వెంచర్స్, డ్రీమ్ ఇన్క్యుబేటర్, 3వన్4 క్యాపిటల్ తదితర సంస్థలు ‘కూ’లో ఇన్వెస్ట్ చేశాయి. -
సౌతాఫ్రికా ట్రేడ్ ఫెయిర్ ఆరంభం
హైదరాబాద్: దక్షిణాఫ్రికా 6వ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడ్ ఫెయిర్ సోమవారమిక్కడి మాదాపూర్ ట్రైడెంట్ హోటల్లో ఆరంభమయింది. దక్షిణాఫ్రికాకు చెందిన 26 కంపెనీలతో పాటు పలువురు భారతీయ ఇన్వెస్టర్లు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని దక్షిణాఫ్రికా పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఉప మంత్రి మిజ్వాండిల్ మసీనా, ముంబయిలోని దక్షిణాఫ్రికా కాన్సుల్ జనరల్ పూల్ మల్ఫేన్ ఆరంభించారు.సాధారణ ఎగుమతులతో తమ ట్రేడ్ ఫెయిర్ ఆరంభమయిందని, దీని ద్వారా 2009-2014 మధ్య 44 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దక్షిణాఫ్రికాకు తరలి వచ్చాయని వారు తెలియజేశారు. ఆఫ్రికాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి దక్షిణాఫ్రికా అనేది వ్యూహాత్మక కేంద్రమని ఈ సందర్భంగా మసీనా చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ ఆంద్రప్రదేశ్ అండ్ తెలంగాణ చాంబర్స్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అద్వర్యంలో వ్యాపార రంగం అబివృద్ది, పెట్టుబడి అవకాశాలపై భారత్, సౌత్ఆప్రికా ప్రతినిదులు ఈ సందర్భంగా చర్చించుకున్నారు.