breaking news
Indian Ambassador to the US
-
భావప్రకటన అంటే.. హింసకు పాల్పడటం కాదు..
వాషింగ్టన్: శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ పై ఖలిస్థాన్ వేర్పాటువాదుల దాడిని అక్కడి ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. గత నెల ఖలిస్థాన్ వేర్పాటువాది భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ప్రతీకారంగా అతని అనుచరులు ఈ హింసాకాండకు తెరతీశారు. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ పేరిట వేర్పాటువాద సంస్థకు నాయకుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్ పై 10 లక్షల ప్రైజ్ మనీ కూడా ఉంది. కెనడాలో గురుద్వారా గుమ్మం వద్దే అతడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. దీంతో అమెరికాలోని ఖలిస్థాన్ మద్దతుదారులు అక్కడి భారత దౌత్య కార్యాలయంపై దాడికి పాల్పడి నిప్పు కూడా పెట్టిన విషయం తెలిసిందే. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఖలిస్తానీలు హింసకు ప్రతిగా హింస అంటూ నినదించారు. గడిచిన ఐదు నెలల్లో శాన్ ఫ్రాన్సిస్కోలోని దౌత్య కార్యాలయంపై దాడులు జరగడం ఇది రెండో సారి. దీంతో అమెరికా ప్రజాప్రతినిధుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. భారత దౌత్య కార్యాలయంలో పనిచేస్తున్న దౌత్యాధికారుల భద్రత మాకు చాలా ముఖ్యమని, శాంతికి భంగం కలిగిస్తే ఎవ్వరినీ సహించేది లేదని వైట్ హౌస్ జాతీయ భద్రతా విభాగానికి చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. మరో ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధి RO ఖన్నా మాట్లాడుతూ.. నాకు భారత దౌత్యాధికారి సంధు వ్యక్తిగతంగా కూడా తెలుసు. ఆయనంటే నాకు చాలా గౌరవం. ఎప్పుడన్నా మానవ హక్కుల గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఆలోచనతోనూ, పరిపక్వతతోనూ నిజాయతీగా స్పందిస్తూ ఉంటారు. అలాంటి వారికి హాని కలిగించే విధంగా ప్రవర్తించడం దారుణం, అప్రజాస్వామికం. అమెరికాలో ప్రతి ఒక్కరికీ భావప్రకటన స్వేఛ్చ ఉంటుంది. అలాగని దాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టి, హింసను ప్రేరేపించమని కాదు దానర్ధం. ప్రభుత్వం ఈ హింసాకాండపై విచారణ జరిపించి దీని వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: భారత్ ఆరోపణల్ని తప్పుబట్టిన కెనడా ప్రధాని.. ‘అది వాస్తవం కాదు’ Khalistan supporters’ try to set on fire Indian consulate in San Francisco; US 'strongly condemns’@siddhantvm and @live_pathikrit share their views@Sriya_Kundu | #Khalistan #SanFrancisco pic.twitter.com/wEtGKyfn35 — News18 (@CNNnews18) July 4, 2023 -
అమెరికాలో భారత రాయబారిగా హర్షవర్ధన్ శ్రింగ్లా
సాక్షి, న్యూఢిల్లీ : భారత దౌత్యవేత్త హర్షవర్ధన్ శ్రింగ్లాను అమెరికాలో భారత రాయబారిగా నియమించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుత రాయబారి నవ్తేజ్ సర్నా స్థానంలో త్వరలోనే హర్షవర్ధన్ బాధ్యతలు స్వీకరించనున్నారని గురువారం ప్రకటన విడుదల చేసింది. కాగా ఇండియన్ ఫారెన్ సర్వీస్ 1984 బ్యాచ్కు చెందిన హర్షవర్ధన్ ప్రస్తుతం బంగ్లాదేశ్లో భారత హైకమీషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికా రాయబారిగా నియమితులవుతున్న నేపథ్యంలో.. ఆయన స్థానంలో రివా గంగూలీ దాస్ బంగ్లాదేశ్ భారత హైకమీషనర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. -
అమెరికా భారత రాయబారిగా నవతేజ్
న్యూఢిల్లీ: అమెరికాలో భారత రాయబారిగా నవతేజ్ సర్నా నియమితులవనున్నారు. విదేశీ వ్యవహా రాల మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. త్వరలోనే నవతేజ్ భాద్యతలను స్వీకరిస్తారని స్పష్టం చేసింది. ఇప్పటిదాకా ఈ పదవిలో కొనసాగిన అరుణ్కుమార్ సింగ్ ఆగస్టులో రిటైరయ్యారు. అరుణ్ కుమార్, నవతేజ్లో గతంలో ఇజ్రాయెల్లో భారత రాయబారులుగా పనిచేయడం తెలిసిందే.