breaking news
icet application
-
టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
కేయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తు తేదీని పొడిగించింది. రూ.250 అపరాధ రుసుముతో ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్ ఐసెట్ కన్వీనర్, కాకతీయ వర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి సోమవారం తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 15 నుంచి 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఇప్పటివరకు టీఎస్ ఐసెట్కు 67,361 దరఖాస్తులు వచ్చాయని, గత ఏడాదితో పోలిస్తే 1,700 దరఖాస్తులు పెరిగినట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 18 నుంచి హాల్టికెట్లు సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 27, 28 తేదీల్లో మూడు సెషన్లలో టీఎస్ ఐసెట్–2022 నిర్వహించనున్నట్లు తెలిపారు. -
ఐసెట్ దరఖాస్తు గడువు పెంపు
హైదరాబాద్ సిటీ: అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో దూరవిద్య ద్వారా ఎంబీఏ చేయాలనుకునేవారు ఈ నెల 23 వరకు ఐసెట్- 2015 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ ఆచార్య సి.హెచ్.వి రామచంద్రమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. దూర విద్యలో చేరడానికి ఆసక్తి కలిగిన విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో పంపాలని చెప్పారు. ఇతర కళాశాలల్లో రెగ్యులర్ విధానంలో ఎంబీఏలో చేరే విద్యార్థులు రూ. 500 అపరాధ రుసుముతో ఈ నెల 20 వరకు దరఖాస్తు చేయవచ్చన్నారు.