breaking news
hug of love
-
అబ్బాయిలకు ఫుల్ డిమాండ్.. ఒక్క ‘హగ్’ ఇవ్వండి.. 600 తీసుకోండి..
బీజింగ్: మారుతున్న జీవనశైలి కారణంగా ఉరుకులు పరుగుల జీవితం నడుస్తోంది. ప్రేమ, ఆప్యాయతలకు, కుటుంబాలకు కొందరు దూరం అవుతున్నారు. డబ్బు సంపాదించే క్రమంలో ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే చైనాలో ఓ కొత్త ట్రెండ్ హాట్ టాపిక్గా మారింది. ఒత్తిడికి గురవుతున్న యువతులు.. అబ్బాయిలను హగ్ చేసుకుంటున్నారు. ఈ హగ్ ఊరికే కాదు.. ఒక్కసారి హగ్ చేసుకుంటే సదరు యువతి.. 50 యువాన్లు (భారత కరెన్సీలో దాదాపు 600 రూపాయలు) చెల్లించి ఉంటుంది. దీంతో, చైనా అబ్బాయిలకు ఫుల్ గిరాకీ నడుస్తోంది.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. ఒత్తిడి అధిగమించేందుకు చైనాలోని యువతులు ఓ వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నారు. మానసిక సాంత్వన కోసం డబ్బులు చెల్లించి 'మ్యాన్ మమ్స్' (man mums) అని పిలవబడే వ్యక్తుల నుంచి కొద్దిసేపు హగ్ పొందుతున్నారు. గతంలో 'మ్యాన్ మమ్స్' అనే పదాన్ని కండలు తిరిగిన శరీరంతో జిమ్లో కసరత్తులు చేసే పురుషులను ఉద్దేశించి వాడేవారు. అయితే, ఇప్పుడు ఈ పదం అర్థం మారింది. శారీరకంగా ధృడంగా ఉంటూనే, సున్నితత్వం, ఓర్పు, ఆప్యాయత వంటి లక్షణాలున్న పురుషులను 'మ్యాన్ మమ్స్'గా పరిగణిస్తున్నారు. వీరు అందించే కౌగిలింతలు ఒత్తిడిని తగ్గించి, ఓదార్పునిస్తాయని యువతులు భావిస్తున్నారు. చైనా ప్రస్తుతం మ్యాన్ మమ్స్ ట్రెండ్లోకి వచ్చింది. ఇక, ఈ ట్రెండ్ ప్రకారం.. అమ్మాయికి ఎవరైనా అబ్బాయి ఐదు నిమిషాల పాటు హగ్ ఇస్తే రూ. 600 చెల్లిస్తారు అమ్మాయిలు. ఎవరైనా అబ్బాయిలు.. ఐదు నిమిషాల పాటు హగ్ ఇస్తే రూ. 200 నుంచి రూ. 600 వరకు పే చేస్తున్నారు. ఆన్ లైన్లో ముందుగానే ఈ హగ్స్ కోసం అమ్మాయిలు.. నచ్చిన కుర్రాడిని బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత మాల్స్, పార్కులు, అండర్ గ్రౌండ్ రోడ్లు.. ఇలా పబ్లిక్ ప్లేసుల్లో ఇలా చేస్తున్నారు. ఇలా నచ్చినవారిని హగ్ చేసుకోవడం వల్ల తమ ఒత్తిడి తగ్గిపోతుందని అమ్మాయిలు భావిస్తున్నారు.In China, some young women are paying strangers — not for therapy or romance, but for something far simpler: a five-minute hug.They’re called “man mums” — gentle, muscular men who offer warmth and emotional comfort in public spaces. The cost? Just US$3 to US$7 for five minutes.… pic.twitter.com/4kD1FpPpws— Ashwini Roopesh (@AshwiniRoopesh) June 7, 2025ఈ సందర్భంగా ఒక యువతి మాట్లాడుతూ.. మూడు గంటల పాటు ఓవర్టైమ్ పని చేసిన తర్వాత, ఒక 'మ్యాన్ మమ్'ను కలుసుకున్నాను. అతను మూడు నిమిషాల పాటు నన్ను కౌగిలించుకున్నాడు. ఉద్యోగం, ఆఫీసు ఒత్తిడికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తుండగా అతడు నెమ్మదిగా నా భుజం తట్టాడు. దీంతో, ఒత్తిడి దూరమే ప్రశాంతంగా అనిపించింది’ అని చెప్పుకొచ్చింది.అంతకుముందు.. ఒక విద్యార్థిని, తనకు ఓదార్పునిచ్చేందుకు దయగల, ఫిట్గా ఉండే 'మ్యాన్ మమ్' నుంచి కౌగిలింత కావాలని, అందుకు డబ్బులు చెల్లిస్తానని ఆన్లైన్లో పోస్ట్ చేసింది. ‘నాకు సెకండరీ స్కూల్లో ఉన్నప్పుడు ఒకసారి ఇలాగే కౌగిలించుకుంటే చాలా సురక్షితంగా అనిపించింది. మనం ఒక అండర్గ్రౌండ్ స్టేషన్లో ఐదు నిమిషాలు కౌగిలించుకుంటే చాలు’ అని ఆమె రాసుకొచ్చింది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది, లక్షకు పైగా కామెంట్లు వచ్చాయి. -
అంతరాలు దాటిన కల్లాకపటంలేని ప్రేమ
కొన్ని విషయాలు పిల్లల చూసి నేర్చుకునేలా ఉంటాయి. వాళ్ల పసిమనసు, నిష్కల్మషమైన హృదయం, అమాయకత్వంతో చేసే పనులు చాలా గొప్పగా అనిపిస్తాయి. మనకే అనిపిస్తుంది వాళ్లలా మనమెందుకు అంత స్వచ్ఛంగా లేం అని. బహుశా అందువల్లనే ఏమో చిన్నపిల్లలను దేవుడుతో సమానం అంటారు. పైగా వారి అల్లరిని చూస్తే చాలు అప్పటి వరకు ఉన్న టెన్షన్లు చికాకులు అన్ని ఎగిరిపోతాయి. ఒక్కసారిగా చాలా రిలీఫ్గా ఫీలవుతాం కూడా. ఇక్కడొక సన్నివేశం కూడా అచ్చం అలానే చాలా సంతోషాన్ని ఇవ్వడమే కాక మనసును కదిలించేలా చేస్తోంది. (చదవండి: కారులోనే ఆల్కహాల్ టెస్టింగ్ టెక్నాలజీ... మోతాదుకు మించి తాగితే కారు స్టార్ట్ అవ్వదు!!) అసలు విషయంలోకెళ్లితే...కియాన్ష్ దేటే అనే బాలుడు బొమ్మలు అమ్ముకునే మహిళ కొడుకు ముందు నిలబడి ఉత్సహంగా డ్యాన్స్ చేస్తాడు. పైగా ఆ బాలుడిని కూడా డ్యాన్స్ చేయమంటూ కియాన్ష్ ప్రోత్సహిస్తాడు. అయితే ఆ మహిళ కొడుకు కియాన్ష్ దగ్గరకు వచ్చి ప్రేమగా హగ్ చేసుకుంటాడు. ఒక్కసారిగా కియాన్ష్ డ్యాన్స్ చేయడం ఆపి అలా చూస్తాడు. కాసేపటికీ కియాన్ష్ కూడా ఆ మహిళ కొడుకుని ప్రేమగా ఆలింగనం చేసుకుంటాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని కియాన్ష్ తల్లి అశ్విని నికమ్ దేటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా ఈ వీడియోకి మిలియన్లకు పైగా వ్యూస్, లైక్లు వచ్చాయి. (చదవండి: 48 గదులతో కూడిన తొలి పాడ్ వెయిటింగ్ రూమ్!) View this post on Instagram A post shared by Kiansh Dete & Ayansh Dete (@kiansh_ayansh) -
ఢిల్లీని తాకిన ముద్దుల పోరాటం!
న్యూఢిల్లీ/కొచ్చి: మొన్న కిస్ ఆఫ్ లవ్... నిన్న హగ్ ఆఫ్ లవ్... కేరళలోని కొచ్చి విద్యార్థులు నైతిక పోలీసింగ్ (నైతిక నియమావళి పేరుతో ఆంక్షలు)ను వ్యతిరేకిస్తూ తలపెట్టిన నిరసనలు రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సంప్రదాయ వాదులు వీరికి అడ్డు తగులుతుండడంతో ఘర్షణాత్మక వాతావరణానికి దారి తీస్తోంది. సంప్రదాయ వాదులు తమ యత్నాలను అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ‘కిస్ ఆఫ్ లవ్’ మద్దతు దారులు కొందరు శనివారం సాయంత్రం ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన తలపెట్టగా పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన సుమారు 60 మంది విద్యార్థులు జందేవాలన్ మెట్రో స్టేషన్ నుంచి ఆర్ఎస్ఎస్ కార్యాలయం వరకు ప్రదర్శనగా రాగా రెండంచెల బారికేడ్లతో పోలీసులు అడ్డుకున్నారు. వీరికి దీటుగా హిందూసేన కూడా అదే సమయంలో మరో ప్రదర్శన తలపెట్టగా వారి మధ్య వాగ్వాదానికి దారి తీసింది. మరోవైపు కిస్ ఆఫ్ లవ్కు మద్దతు ప్రకటిస్తూ కొచ్చిలోని మహారాజా కాలేజీ విద్యార్థులు ‘హగ్ ఆఫ్ లవ్’ కార్యక్రమం నిర్వహించారు. -
ముద్దు తెచ్చిన ముప్పు.. 10 మంది సస్పెన్షన్
ఒక్క ముద్దు, మరొక్క కౌగిలింత.. చివరకు సస్పెన్షన్కు దారితీశాయి. ఏబీవీపీకి చెందినవాళ్లు మోరల్ పోలీసింగ్ చేస్తున్నారంటూ.. దానికి వ్యతిరేకంగా కేరళలోని కొచ్చిలో 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. దానికి సంఘీభావంగా 'హగ్ ఆఫ్ లవ్' అనే కార్యక్రమాన్ని కూడా కొంతమంది విద్యార్థినీ విద్యార్థినులు నిర్వహించారు. అయితే.. ముందస్తు సమాచారం లేకుండా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారంటూ పదిమంది విద్యార్థులను అక్కడి కాలేజి ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు. ఇప్పటికే కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమం విషయంలో పోలీసులు సైతం వంద వరకు కేసులు పెట్టారు. ఇప్పుడు ఏకంగా కాలేజి నుంచి సస్పెన్షన్ వరకు దారితీసింది. ఈ ముద్దుల వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి మరి.