-
పోలింగ్ ముమ్మరం దేనికి సంకేతం?
దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో సోమవారం గతంతో పోల్చితే ముమ్మరంగా పోలింగ్ జరిగింది. ఓటర్ల అనాసక్తికి ఈ నగరం పెట్టింది పేరు. అలాంటిది ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చాక జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇంత భారీగా ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనడం ఇదే మొదటిసారి. 1967 తర్వాత 2014లో తొలిసారి పోలింగ్ రికార్డు స్థాయిలో జరిగింది. బాలీవుడ్ నటి ఊర్మిళా మాటోండ్కర్(కాంగ్రెస్) పోటీచేస్తున్న ముంబై నార్త్ స్థానంపై అందరి దృష్టి నిలిచింది. ఇక్కడ 60 శాతం పోలింగ్ జరిగింది. ముంబై సౌత్ నియోజకవర్గంలో దశాబ్దాలపాటు అతి తక్కువ పోలింగ్ జరిగింది. ఈసారి కూడా నగరంలోని ఆరు నియోజకవర్గాల్లో అతి తక్కువ పోలింగ్ జరిగిన స్థానంగా నిలిచింది. కాని, గతంతో పోల్చితే మెరుగ్గా అంటే 51.2 శాతం ఓటర్లు ఓటేశారు. మొత్తంమీద నగరంలోని అన్ని స్థానాల్లోనూ 50 శాతానికి మించి పోలింగ్ జరగడం విశేషం. గుజరాతీలున్న ప్రాంతాల్లో ముమ్మరంగా పోలింగ్ గుజరాతీలు అధిక సంఖ్యలో ఉన్న ముంబై నార్త్ నియోజకవర్గంలో 2014లో 53 శాతం పోలింగ్ జరగగా, ఇది 2019లో 60 శాతానికి పెరగడం విశేషం. నగరంలోని పశ్చిమ మలాడ్ నుంచి బొరివిలీ వరకూ విస్తరించిన ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఊర్మిళ, బీజేపీ సిట్టింగ్ ఎంపీ గోపాల్ షెట్టి మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది. 2014లో కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ను గోపాల్ షెట్టి నాలుగున్నర లక్షల ఓట్ల మెజారిటీతో ఓడించారు. గుజరాతీలు అధిక సంఖ్యలో నివసించే కాండివిలి, బొరివిలీ, దహీసర్ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ భారీగా జరిగింది. బొరివిలీలో పోలింగ్ 66.2 శాతం రికార్డయింది. కిందటిసారి 57.3 శాతం జనం ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే, గుజరాతీ, మరాఠీ మాట్లాడే ప్రజలు ఎక్కువ ఉన్న ములుంద్లో 63.7 శాతం పోలింగ్ జరిగింది. ఇలా మరాఠీలు, గుజరాతీలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొనడం బీజేపీ అభ్యర్థికి అనుకూలాంశమని ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు. మొదట కాంగ్రెస్ అభ్యర్థిగా ఊర్మిళ పేరు ప్రకటించగానే గోపాల్షెట్టి గెలుపు అంత తేలిక కాదని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఈ నియోజకవర్గంలో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్న మాల్వానీ వంటి ప్రాంతాల్లో పోలింగ్ 56.9 శాతం మించలేదు. కాంగ్రెస్కు ముస్లిం ఓట్లు పడతాయనే అంచనా ప్రకారం చూస్తే ఇక్కడ తక్కువ శాతం పోలింగ్ వల్ల ఊర్మిళకు నష్టదాయకమని అంచనా. నగరంలో మరాఠీలు, గుజరాతీలు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు రావడం బీజేపీ–శివసేన కూటమికి లాభదాయకమని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ముంబై సౌత్లోనూ ఇదే ట్రెండ్ కాంగ్రెస్ దివంగతనేత, కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవరా కొడుకు, కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ దేవరా పోటీలో ఉన్న మరో కీలక నగర నియోజకవర్గం ముంబై సౌత్లోనూ మరాఠీ, గుజరాతీ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన జనం నివసించే ప్రాంతాల్లో పోలింగ్ బాగా జరిగింది. అలాగే, కాషాయ కూటమికి మద్దతు తక్కువ లభించే ముస్లింలు, దళితుల ప్రాంతాల్లో ఓటింగ్ తక్కువ స్థాయిలో జరిగింది. ఈ నియోజకవర్గంలో శివసేన సిట్టింగ్ సభ్యుడు అరవింద్ సావంత్ మళ్లీ పోటీకి దిగారు. ఈ స్థానం పరధిలోకి వచ్చే భెండీ బజార్, మహ్మద్ అలీ రోడ్, డోంగ్రీ ప్రాంతాల్లో ముస్లింలు, మైనారిటీల జనాభా ఎక్కువ. ఈ ప్రాంతాల్లో పోలింగ్ 48.3 శాతమే జరిగింది. అయితే సంపన్నులు నివసించే మలబార్ హిల్ అసెంబ్లీ సెగ్మెంట్లో నగర సగటు పోలింగ్ (52 శాతం) కన్నా ఎక్కువగా అంటే 56 శాతం జరిగింది. మోదీ ప్రభంజనం కనిపించిన 2014లోనూ ఇక్కడ జనం అధిక సంఖ్యలో ఓట్లేశారు. ఫలితంగా బీజేపీ కూటమి లబ్ధి పొందింది. ఇదే స్థానంలో ముస్లింలు పెద్ద సంఖ్యలో నివసించే బైకుల్లా సెగ్మెంట్లో పోలింగ్ 53.01 శాతం జరిగింది. ఈ పరిణామం మిలింద్ దేవరాకు అనుకూలాంశం కావచ్చని కూడా కొందరు విశ్లేషకులు అంచనావేస్తున్నారు. మధ్య తరగతి ఓటర్లు కాషాయ కూటమికి అనుకూలమా? నగరంలో మరాఠీ, గుజరాతీ మధ్య తరగతి ప్రజలు అధిక సంఖ్యలో నివసించే ప్రాంతాల్లో పోలింగ్ బాగా జరగడానికి బీజేపీ, శివసేన కార్యకర్తలు, నేతలు గట్టి కృషి చేసి విజయం సాధించారు. ఈ వర్గాలతో పోల్చితే దళితులు, ముస్లింలు, పేదలు పెద్ద సంఖ్యలో స్థిరపడిన ప్రాంతాల్లో పోలింగ్ తక్కువ జరిగింది. మధ్య తరగతి ఓటర్లు బీజేపీ–శివసేన కూటమికి అనుకూలంగా, ఎస్సీలు, మైనారిటీలు, బడుగువర్గాలు కాంగ్రెస్కు ఓటేస్తారనే అభిప్రాయం బలంగా ఉంది. ఈ లెక్కన ఈ తరహా ఓటింగ్ సరళి శివసేన, బీజేపీకి కలిసొచ్చే అంశమని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్–ఎన్సీపీ కూటమిలో ముఠా తగాదాల వల్ల కూడా కాంగ్రెస్ సంప్రదాయ ఓటర్లుగా ముద్రపడిన ప్రాంతాల ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లడానికి అంత ఉత్సాహం చూపలేదని తెలుస్తోంది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకం కావడమే భారీ పోలింగ్కు కారణమా? ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకం కావడంతో బీజేపీ–సేన మద్దతుదారులు కూడా పట్టుదలతో ఓటేయడానికి ముందుకొచ్చారని రాజకీయ విశ్లేషకుడు ఒకరు వివరించారు. ‘‘మోదీకి వ్యతిరేకంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) నేత రాజ్ ఠాక్రేను కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి ఎన్నికల ప్రచారంలోకి దింపడం వాస్తవానికి వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చినట్టు కనిపిస్తోంది. మోదీకి ఓటేయవద్దంటూ రాజ్ చేసిన ప్రసంగాలు కాషాయ కూటమి సానుభూతిపరుల్లో పట్టుదల పెంచాయి,’’ అని ఆయన తెలిపారు. ఫలితంగా బీజేపీ–శివసేన కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. అనేక ప్రాంతాల్లో పోలింగ్ పెరగడంపై బీజేపీ నేతలు కూడా ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తం చేశారు. ‘‘ సంపన్నులు నివసించే ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగంపై చైతన్యం బాగా పెరిగింది. దేశాన్ని రక్షించేది నరేంద్రమోదీ ఒక్కరేననే అభిప్రాయం మొదటిసారి ఓటేసే యువత, చదువుకున్న మధ్య తరగతి ఓటర్లలో బాగా పెరిగింది. ఈ వర్గాల్లో మతం, జాతి, కులం వంటి జనాన్ని విడదీసే అంశాలకు అతీతంగా మోదీకి మద్దతు పలకడానికి ఓటేశారు,’’అని చార్కోప్ బీజేపీ ఎమ్మెల్యే అతుల్ భట్ఖాల్కర్ చెప్పారు. పేదలు సొంతూళ్లకు పోవడంతోనే తక్కువ పోలింగ్ మురికివాడలు, పేద ప్రజానీకం ఎక్కువ ఉన్న ప్రాంతాల జనం వారాంతపు సెలవులు ఎక్కువ రావడంతో సొంతూళ్లకు పోయారనీ, అందుకే ఇలాటి చోట్ల తక్కువ పోలింగ్ నమోదైందని వర్లీ శివసేన శాసనసభ్యుడు సునీల్ షిండే అభిప్రాయపడ్డారు. అయితే, పాలకపక్షాలైన బీజేపీ, శివసేన కుట్రల వల్లే తమకు ఎప్పటి నుంచో బలమున్న ప్రాంతాల్లో తక్కువ పోలింగ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ‘‘ ఎన్నికల అధికారులు దురుద్దేశంతోనే ఓటర్ స్లిప్పుల తయారీలో కావాలనే తప్పులు చేశారు. అనేక మురికివాడల ఓటర్లకు ఇచ్చిన ఓటర్స్లిప్పుల్లో ఫోటోలు, పేర్లు తప్పులతో ప్రచురించారు. చిరునామాలు కూడా మారిపోయాయి. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన పేదలు ఈ గందరగోళం వల్ల ఓట్లు లేవని చెబితే ఓటేయకుండా వెనక్కితిరగాల్సి వచ్చింది. ఇంకా, అనేక మంది ఓటర్లకు తమ ఇళ్లకు చాలా దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. ఈ కారణాల వల్ల పేదలు నివసించే ప్రాంతాల్లో పోలింగ్ తగ్గిపోయింది’’ అని మాల్వానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అస్లమ్ షేక్ వివరించారు. -
పల్లెల్లో జోరు... పట్టణాల్లో బేజారు!
సాక్షి, హైదరాబాద్: ఓటు వేసినా ప్రయోజనం లేదనే భావనలో ఉన్నారో, వరుస సెలవులని ఎంజాయ్ చేశారోగానీ రాష్ట్రంలోని పట్టణ ప్రాంత ఓటర్లు ఈసారి పోలింగ్పై పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. ఓ మోస్తరు పట్టణాలు, కొత్త జిల్లా కేంద్రాలు, కొన్ని మండలాలు కలిసి ఉన్న పట్టణ నియోజకవర్గాల్లో 70 శాతానికి మించి ఎక్కడా పోలింగ్ జరగకపోవడం శుక్రవారం జరిగిన పోలింగ్ సరళి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అదే సమయంలో గ్రామీణ ఓటర్లు మాత్రం పోటెత్తారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు గ్రామీణ ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో క్యూలు కట్టి మరీ ఓట్లేశారు. రాష్ట్రవ్యాప్తంగా 25 గ్రామీణ నియోజకవర్గాల్లో 70 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. అత్యధికంగా 83 శాతం వరకు గ్రామీణ ప్రాంతాల్లో జరగడం గమనార్హం. అధిక పోలింగ్ నియోజకవర్గాలివే... 70 శాతానికిపైగా పోలైన నియోజకవర్గాల్లో సిర్పూర్, ఆసిఫాబాద్, మానకొండూరు, హుజూరాబాద్, చేవె ళ్ల, షాద్నగర్, దేవరకద్ర, మక్తల్, ఆలంపూర్, హుజూర్నగర్, తుంగతుర్తి, వైరా, భద్రాచలం, భూపాలపల్లి, పరకాల, అశ్వారావుపేట, ములుగు, ఆలేరు, వికారాబాద్, దుబ్బాక లాంటి గ్రామీణ ప్రాంతాలుండడం గమనార్హం. కొమురంభీం, సిద్దిపేట జిల్లాల్లో 78 శాతం పైగా ఓటింగ్ జరిగింది. హైదరాబాద్లో గడప దాటని ఓటర్ ఎన్నికల కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం 2014లో తెలంగాణలో 69.5 శాతం ఓటింగ్ జరగ్గా, ఈసారి 67 శాతానికి పడిపోయింది. హైదరాబాద్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ కేవలం 50.86 శాతం ఓటింగ్ జరగడం గమనార్హం. కంటోన్మెంట్, బహదూర్పుర, చాంద్రాయణగుట్ట, యాకుత్పుర, చార్మినార్, నాంపల్లి నియోజకవర్గాల్లో 50 శాతంకన్నా తక్కువగా పోలింగ్ జరిగింది. నాంపల్లి నియోజకవర్గంలోనైతే కేవలం 44.02 శాతమే నమోదైంది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోనూ తక్కువగానే నమోదైంది. శుక్రవారం నుంచి మూడు రోజులు వరుస సెలవులు రావడంతో నగరంలోని అనేకమంది ప్రయాణాలు పెట్టుకున్నారు. అటు పట్టణ ప్రజలకు సంబంధించి పెద్దగా ఎన్నికల వాగ్దానాలు లేకపోవడం కూడా ఓటింగ్ శాతం తగ్గడానికి ఒక కారణంగా చెబుతున్నారు. గ్రామాల్లోనైతే పథకాలతో లబ్ది పొందడంతోపాటు అన్ని పార్టీల మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీలు కూడా గ్రామీణ ప్రజలను ఉద్దేశించినవే ఎక్కువ కావడంతో పల్లెల్లో ఓటింగ్పై ఆసక్తి కనబరిచారు. ఫలితాలు తారుమారవుతాయా? గ్రామీణ ప్రాంతాల ఓటర్లు పోలింగ్పై ఆసక్తి చూపడం, పట్టణ ఓటర్లు పెద్దగా స్పందించకపోవడం ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల గ్రామీణ ప్రజల్లో సానుకూలత ఉందని, పట్టణ ప్రాంతాల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, పోలింగ్లో గ్రామీణ ఓటర్లే ఎక్కువగా పాల్గొనడంతో అధికార పార్టీకి మేలు జరుగుతుందనే వాదన వినిపిస్తోంది. వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో ఓటరు స్పందించకపోవడం, గత ఎన్నికలకన్నా పోలింగ్ శాతం పెద్దగా పెరగకపోవడం లాంటి అంశాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయనే భావన వ్యక్తమవుతోంది. -
పెరిగిన ఓట్ల శాతం మోడీకి అనుకూలమేనా?
ఈ సారి లోకసభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. ఏప్రిల్ 30 వరకూ 438 లోకసభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఈ నియోజకవర్గాల్లో సగటున గత ఎన్నికలకంటే కనీసం ఎనిమిది శాతం అదనపు పోలింగ్ జరిగింది. ఈ అధికపోలింగ్ శాతం దేన్ని సూచిస్తోంది? బిజెపి వర్గాలు, ఎన్డీఏ వర్గాలు చెప్పుకుంటున్నట్టుగా వారికి అనుకూలంగా ఏదైనా భారీ వేవ్ ఉందా? ఈ అదనపు ఓట్లన్నీ యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పడతాయా? గతానుభవాలు ఏం చెబుతున్నాయి? ఓటింగ్ పెరిగితే ప్రభుత్వం మారుతుందా? * ఇప్పటి వరకూ దేశంలో అయిదు ఎన్నికల్లో ఒక పక్షం లేదా కూటమికి భారీ వేవ్ కనిపించింది. అవి 1977 ఎన్నికలు, 1984 ఎన్నికలు, 1989 ఎన్నికలు, 1999 ఎన్నికలు, 2004 ఎన్నికలు. 1977 లో ఎమర్జెన్సీ వ్యతిరేక ఓటు పడింది. తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. 1984 లో ఇందిరా గాంధీ హత్యానంతరం ఎన్నికలు జరిగాయి. 1989 లో బోఫోర్స్ కుంభకోణం నేపథ్యంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. 1999 లో వాజ్ పేయి వేవ్ ఎన్నికలను ప్రభావితం చేసింది. 2004 లో ఎన్డీయే ఓడి, యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఓటింగ్ పెరిగినా అధికారపక్షమే గెలిచింది * చరిత్రను మార్చిన ఈ అయిదు ఎన్నికల్లో మూడు ఎన్నికలు 1989, 1999, 2004 లో అంతకు ముందరి ఎన్నికల పోలింగ్ శాతం కన్నా తక్కువ వోట్లు పోలయ్యాయి. ఓటరు ఊపు కనిపించలేదు. కానీ ఈ మూడు సార్లూ ప్రభుత్వాలు మారాయి. అంటే ఓట్ల శాతానికి , ప్రభుత్వాల మార్పిడికి ఎలాంటి సంబంధమూ లేదు. అత్యధిక ఓటింగ్ శాతం - అయినా అధికార పక్షానికే పట్టం * చరిత్ర మార్చిన 1984 ఎన్నికల్లో 12 శాతం అదికంగా ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో ప్రభుత్వం మారలేదు. అధికారంలో ఉన్న పార్టీయే మళ్లీ గెలిచింది. దేశ చరిత్రను మార్చిన 1977 ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడింది. కానీ ఓట్లు మాత్రం అంతకు ముందరి ఎన్నిక కన్నా 4 శాతం మాత్రమే పెరిగాయి. కాబట్టి ఎన్నికల్లో భారీగా పోలింగ్ జరిగినంత మాత్రాన ప్రభుత్వాలు మారిపోతాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ లేవు. కొందరు నిపుణులు చెబుతున్నట్టు ఇది మోడీ అనుకూల వోటు అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సాయిధరమ్ తేజ్పై దాడి జరగలేదు : డీఎస్పీ
తాటిపర్తి ఘటనలో మాజీ ఎమ్మెల్యే వర్మ హస్తం
పొలంలో ధాన్యం రాశుల దగ్ధం
మిత్ర పురుగులతో తెల్లదోమ నివారణ
దంపతులను ఢీకొన్న లారీ
రత్నగిరికి ఉత్సవ శోభ
వాహనాల తనిఖీలో రూ.2.71 కోట్ల పట్టివేత
ట్రిపుల్ ఐటీ.. భవితకు మేటి
రేపటి నుంచి జిల్లా స్థాయి పోస్టల్ బ్యాలెట్
గూగుల్, ఓపెన్ఏఐ కంటే పెద్ద ఏఐమోడల్ తయారీ
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement