-
ద్విచక్ర వాహన అమ్మకాలు అదుర్స్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల విక్రయాలు సెప్టెంబర్లో పుంజుకున్నాయి. ప్రధాన కంపెనీల అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. ఒక్క టీవీఎస్ మోటార్ విక్రయాలు మాత్రం స్వల్పంగా క్షీణతను చవిచూశాయి. దేశవ్యాప్తంగా అన్లాక్ ప్రక్రియ 5.0 ప్రారంభం కావడం, కోవిడ్ వ్యాప్తి భయాలతో పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో వ్యక్తిగత రవాణాకు ప్రాధాన్యత పెరగడం తదితర కారణాలు అమ్మకాలను పుంజుకునేలా చేశాయి. ఈ సెప్టెంబర్లో హీరో మోటోకార్ప్, హోండా మోటర్సైకిల్, టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీల మొత్తం విక్రయాలు 17,33,777 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో నమోదైన 15,43, 353 యూనిట్లతో పోలిస్తే 1 శాతం ఎక్కువ. ఇదే ఏడాది ఆగస్ట్ నెల విక్రయాల(14,41041)తో పోలిస్తే 20 శాతం అధికమని గణాంకాలు చెబుతున్నాయి. అవుట్లుక్: కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు ఆరోగ్య భద్రత దృష్ట్యా వ్యక్తిగత రవాణాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా వర్షపాతం అంచనాలకు మించి నమోదైంది. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనాలకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ కొంత స్తబ్ధుగా ఉంది. పండుగ సీజన్ సందర్భంగా ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇది పట్టణ ప్రాంతంలోని విక్రయాల లోటును భర్తీ చేసే అవకాశం ఉంది. -
స్పీడ్ పెరిగిన... హీరో మోటార్స్
న్యూఢిల్లీ: దేశీ ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 1,257 కోట్ల నికర లాభం ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన రూ. 925 కోట్లతో పోలిస్తే 36 శాతం వృద్ధి సాధించింది. జాతీయ విపత్తు సహాయక నిధి కోసం గతంలో కేటాయించిన రూ. 737 కోట్లు రీఫండ్ కావడం.. తాజాగా లాభాల వృద్ధికి కారణమైందని సంస్థ వెల్లడించింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో హీరో మోటోకార్ప్ ఆదాయం రూ. 8,913 కోట్ల నుంచి రూ. 8,186 కోట్లకు తగ్గింది. హరిద్వార్లోని ప్లాంటుపై సెస్సుకు సంబంధించి జాతీయ విపత్తు సహాయక నిధికి నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించాలన్న ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, తమకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయని, దీంతో రీఫండ్గా వస్తున్న ఆ మొత్తాన్ని ఆర్థిక ఫలితాల్లో ప్రత్యేక అంశంగా పేర్కొనడం జరిగిందని హీరో మోటోకార్ప్ తెలిపింది. ఫలితాల నేపథ్యంలో మంగళవారం బీఎస్ఈలో హీరో మోటోకార్ప్ షేరు 6 శాతం క్షీణించి రూ. 2,259.35 వద్ద ముగిసింది. -
నేడు హీరో మోటార్స్కు భూమిపూజ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సత్యవేడు మండలం మదనపల్లి ఇండస్ట్రియల్ పార్కులో హీరో మోటార్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిశ్రమ నిర్మాణ పనులకు శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భూమి పూజ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంట లకు హీరో మోటార్స్ కంపెనీ ప్రతిపాదిత ప్రాంతానికి చేరుకునే సీఎం అరగంట భూమిపూజలో పాల్గొంటారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో కొద్దిసేపు మాట్లాడతారు. తిరిగి ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరతారని కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న తెలిపారు. గురువారం మధ్యాహ్నం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన హీరో మోటార్స్ కంపెనీ వివరాలను వెల్లడించారు. ఈ మధ్యనే శ్రీసిటీ ప్రాంతంలో అపోలో టైర్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఇప్పుడు హీరో మోటార్స్ వస్తోందని, చిత్తూరు, నెల్లూరుతో పాటు రాయలసీమలోని జిల్లాలన్నీ హీరో మోటార్స్ వల్ల లాభపడతాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం ఆటోమొబైల్ హబ్లా మారుతుందని తెలిపారు. త్వరలో తిరుపతి దగ్గరలో రిలయన్స్ జియో ఫోన్ల తయారీ యూనిట్ పనులు కూడా ప్రారంభం కానున్నాయని, ఇందుకోసం 150 ఎకరాలను సిద్ధం చేశామని పేర్కొన్నారు. టూ వీలర్స్,వాటి విడి భాగాల తయారీ.. సత్యవేడు మండలం మదనపల్లి ఇండస్ట్రియల్ పార్కు పరిధిలోని 632 ఎకరాలను 2007లోనే ఏపీఐఐసీ సేకరించింది. అప్పట్లో ఎకరాకు రూ.లక్ష చొప్పన చెల్లించి ఏపీఐఐసీ భూ సేకరణ పూర్తి చేసింది. హీరో మోటార్స్ కంపెనీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు రూ.1,600 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఏపీఐఐసీ స్థలాన్ని కేటాయించింది. ప్రభుత్వంతో కంపెనీ ప్రతినిధులు ఎంవోఓ చేసుకున్నారు. కంపెనీ ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ 15,000 మందికి ఉపాధి లభిస్తుందని తెలియజేసింది. ప్రభుత్వం 2016లో హీరో మోటార్స్కు స్థలం కేటాయింపులు జరిపింది. ఆ తర్వాత ప్లాంట్ చుట్టూ ప్రహరీ గోడ, రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రూ.22.83 కోట్లతో కాంపౌండ్ వాల్ను నిర్మించారు. రూ.8.94 కోట్లతో రెండు లేన్ల బీటీ రోడ్డు పనులు పూర్తి చేశారు. రూ.48 లక్షలతో ఇక్కడున్న కోదండ రామాలయాన్ని మరో చోట నిర్మించారు. రూ.42 లక్షలతో 33/11 కేవీ విద్యుత్ లైన్ షిప్ట్ చేశారు. మరో రూ.2.93 కోట్లతో 132 కేవీ టవర్ లైన్లను పక్కకు మార్చారు. ఈ పనులన్నీ పూర్తయ్యాక ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులను కూడా మూడు దశల్లో పూర్తి చేస్తామని హీరో మోటార్స్ ప్రకటించింది. 2023 నాటికి నిర్మాణ పనులన్నీ పూర్తిచేసి తొలి దశ ఉత్పత్తిని చూపుతామని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. -
హీరో.. మూడు కొత్త బైక్లు!
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ‘హీరో మోటోకార్ప్’ తాజాగా మూడు కొత్త బైక్లను మార్కెట్లో ఆవిష్కరించింది. 125 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో ‘సూపర్ స్లె్పండర్’ను, 110 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో ‘ప్యాషన్ ప్రో’ను, 110 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో ‘ప్యాషన్ ఎక్స్ప్రొ’ను తీసుకువచ్చింది. ఈ బైక్స్ను అధునాతన ఫీచర్లతో ఆకట్టుకునే డిజైన్తో రూపొందించామని, వీటి సాయంతో దేశీ మోటార్సైకిల్ విభాగంలో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని కంపెనీ తెలియజేసింది. కాగా 100–125 సీసీ విభాగంలో హీరో కంపెనీదే హవా. ఇందులో స్లె్పండర్, ప్యాషన్, హెచ్ఎఫ్ డీలక్స్, గ్లామర్, సూపర్ స్లె్పండర్ వంటి బ్రాండ్లతో దూసుకుపోతోంది. కంపెనీ ఈ కొత్త మోడళ్ల ధరలను త్వరలో ప్రకటించనుంది. -
మహిళా పోలీసులకు హీరో స్కూటీలు
హైదరాబాద్: మహిళ సాధికారతను ప్రోత్సహించేందుకు తెలంగాణ మహిళా పోలీసులకు హీరో మోటార్స్ 159 స్కూటీలను అందజేసింది. గురువారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో హీరో మోటార్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులకు 70, సైబరాబాద్కు 50 స్కూటీలను, రాచకొండ కమిషనరేట్కు 39 స్కూటీలను అందజేశారు. ఈ కార్యక్రమానికి షీ టీం ఇన్చార్జ్ స్వాతిలక్రా, సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనర్లు హాజరయ్యారు.
Pagination
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
Advertisement