breaking news
Head regulator gates
-
నీటి విడుదల
వైఎస్ఆర్సీపీ తోడ్పాటుతో పీబీసీకి అదనపు కోటా పీబీసీ నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పులివెందుల/లింగాల : ఈ ఏడాది పీబీసీ నీటి సాధనలో రైతుల కృషి ఎనలేనిదని వైఎస్ఆర్ సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. గురువారం చిత్రావతి నదిలో నిల్వ ఉన్న పీబీసీ నీటిని కుడికాలువ హెడ్ రెగ్యులేటర్ గేట్లను ఎత్తి పులివెందుల బ్రాంచ్ కెనాల్కు విడుదల చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ సీజీసీ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ తుంగభద్ర జలాశయం నుంచి పీబీసీకి కేటాయించిన నీటిని సీబీఆర్కు విడుదల చేయించాలని పీబీసీ ఆయకట్టు రైతులు నాయకులపై, అధికారులపై ఒత్తిడి తెచ్చారన్నారు. నీటి విడుదలలో అన్యాయం జరగకుండా రైతులే తుంపెర మళ్లింపు కాలువ వద్ద నిరంతర పర్యవేక్షణ చేశారన్నారు. పీబీసీకి అదనంగా మరో టీఎంసీ నీటిని కేటాయించాలని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుతో ఫోన్లో చర్చించారన్నారు. అదేవిధంగా ఇక్కడి రైతుల, ప్రజల సమస్యలను ఆయనకు వివరించి అదనపు కోటా నీటిని సాధించారన్నారు. తాను నిరంతరం హెచ్ఎల్సీ, ఐఏబీ అధికారులను అనంతపురం కలెక్టర్ను కలుస్తూ పీబీసీ నీటిని సాధించగలిగామని ఆయన అన్నారు. ప్రస్తుత సీబీఆర్ నుంచి పీబీసీకి నీటిని విడుదల చేయడంతో ఆయకట్టు రైతులలో సంతోషం కనిపిస్తోందన్నారు. ప్రస్తుతం సీబీఆర్లో 1.20టీఎంసీల నీరు ఉన్నాయని.. అదేవిధంగా కేటాయించిన ప్రత్యేక నీటి కోటా మరో టీఎంసీ నీరు సీబీఆర్లోకి వచ్చి చేరుతున్నాయన్నారు. రైతులు అధైర్యపడొద్దని, సంయమనంతో నీటిని వినియోగించుకోవాలన్నారు. మొదట కామసముద్రం చెరువుకు, అనంతరం పులివెందుల పట్టణ ప్రజల దాహార్థి తీర్చేందుకు నక్కలపల్లె ఎస్ఎస్ ట్యాంకుకు విడుదల చేస్తారన్నారు. తాగునీటి అవసరం అనంతరం సింహాద్రిపురం మండల ఆయకట్టు రైతులకు, అనంతరం లింగాల కుడికాలువకు, చిత్రావతి నదికి నీరు విడుదల చేస్తామన్నారు. లింగాల కాలువకు నీరు విడుదల చేయాలి : వైఎస్ వివేకా త్వరితగతిన లింగాల కాలువకు నీరు విడుదల చేయాలని వైఎస్ఆర్ సీపీ సీజీసీ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. అదేవిధంగా చిత్రావతి నదికి నీటిని విడుదల చేసేందుకు అదనంగా కనీసం 0.5టీఎంసీల నీటిని కేటాయించాలన్నారు. నది ద్వారా కొండాపురం వరకు నీటిని పారించాలన్నారు. దీని ద్వారా తాగడానికి నీరు కూడా లభించని చిత్రావతి పరివాహక ప్రాంతాలలో సుమారు 40గ్రామాల ప్రజలకు తాగునీరు అందుతాయన్నారు. సొంత ఖర్చులతో కుడికాలువ పనులు : ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సొంత ఖర్చులతో కుడికాలువ పనులు నిర్వహింపజేస్తున్నారు. కుడికాలువ 27.700 కి.మీ. వద్ద కాలువకు అడ్డంగా ఉన్న తండును తొలగింపజేసేందుకు ఇప్పటికే సుమారు రూ.10లక్షల వ్యయం చేశారు. తీవ్ర అనావృష్టితో కొట్టుమిట్టాడుతున్న మండల ప్రజలను, రైతాంగాన్ని ఆదుకొనేందుకు కనీసం చిన్నకుడాల వరకైనా లింగాల కాలువలో నీరు ప్రవహింపజేసేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు. గేట్లకు పూజలు చేసిన వైఎస్ అవినాష్, వైఎస్ వివేకా, సతీష్: చిత్రావతి నది నుంచి కుడికాలువ హెడ్ రెగ్యులేటర్ ద్వారా పీబీసీకి నీటిని విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా కుడికాలువ హెడ్ రెగ్యులేటర్ గేట్లకు పూజలు చేసి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ఆర్ సీపీ సీజీసీ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డి, రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చెర్మైన్ సతీష్రెడ్డిలు కలిసి పూజలు చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఆర్డీవో వినాయకం, పీబీసీ ఈఈ మురళీకృష్ణ, డీఈఈ జయకుమార్బాబు, ఏఈ నాయక్, లింగాల ఎంపీపీ పి.వి.సుబ్బారెడ్డి, సింహాద్రిపురం ఎంపీపీ భర్త కసనూరు పరమేశ్వరరెడ్డి, లింగాల, సింహాద్రిపురం మండలాల రైతులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఏకేబీఆర్ గేట్లకు మరమ్మతులేవీ?
హెడ్రెగ్యులేటర్ గేట్లకు రబ్బర్సీళ్లు అరిగిపోయి భారీగా లీకేజీలు - ఆనకట్టపై పూర్తిగా తొలగించని చెట్లు - పట్టింపులేని ప్రాజెక్టు అధికారులు పెద్ద అడిశర్లపల్లి, న్యూస్లైన్ అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (ఏకేబీఆర్) అధికారుల నిర్లక్ష్యంతో కునారిల్లుతోంది. హెడ్రెగ్యులేటర్కు ఏర్పాటు చేసిన షట్టర్లకు రబ్బరుసీళ్లు అరిగి పోయాయి. వాటికి కొత్తవి బిగించలేదు. దీంతో గేట్లు ఎత్తకుండానే సందుల్లోంచి భారీగా ప్రధానకాల్వలోకి నీళ్లు లీకవుతున్నాయి. నీటి విడుదల క్రమబద్ధీకరణ లేకుండానే నీటి విడుదల జరుగుతోంది. గేట్ల నిర్వహణ నుడివిజన్-4 అధికారులు ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్టు ఇచ్చారు. వారు బిల్లులు డ్రా చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యతను నిర్వహణకు ఇవ్వడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఏకేబీఆర్ గేట్లు పూర్తిగా మూసివేసి ప్రధానకాల్వకు నీటి విడుదల నిలిపివేయడం సాధ్యం కావడం లేదు. గత మార్చి 29న అక్కంపల్లికి చెందిన చెందిన తల్లీకొడుకులు రిజర్వాయర్లో బట్టలు ఉతకడానికి వెళ్లి నీళ్లలోపడిపోయిన సమయంలో గేట్లను మూయడానికి అధికారులకు సాధ్యపడలేదు. నీటి విడుదల జరుగుతుం డగా మృతదేహాలను వెతకడం కష్టసాధ్యమైంది. కాల్వలకు మరమ్మతుల సమయంలోనూ నీటి విడుదల ఆపివేయలేకపోతున్నారు. జంటనగరాలకు కోదండపురం ప్లాంటులో శుద్ధిచేసేందుకు ప్రతిరోజూ 350 క్యూసెక్కులు లీకేజీల నీటినే వాడుతున్నారు. రబ్బర్సీల్ బిగించి నీటి విడుదల క్రమబద్ధీకరించని పక్షంలో గేట్లు ఆపరేటింగ్ చేయడం భవిష్యత్తులో ఇబ్బందికరమే. ప్రమాదకర పరిస్థితుల్లో పూర్తిగా ఏకేబీఆర్ నుంచి నీటివిడుదల ఆపివేయడం సాధ్యంకాదు. అలాగే ఆనకట్టపై కంపచెట్లు పెరిగిపోతున్నా అధికారులు తొలగించడానికి చర్య లు తీసుకోవడంలేదు. రిజర్వాయర్ రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్య త ఇచ్చి పటిష్టతకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు