breaking news
Hanshitha
-
గ్రాండ్గా దిల్ రాజు కూతురు హన్సిత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అక్టోబర్లోనే 'గేమ్ ఛేంజర్' వస్తాడు: హన్షిత
రామ్చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో చరణ్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఉన్నారు. సౌత్ ఇండియాలో టాప్ డైరెక్టర్గా గుర్తింపు ఉన్న దిల్ రాజు భారీ బడ్జెట్తో గేమ్ ఛేంజర్ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని దిల్ రాజు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. అయితే, తాజాగా ఆయన కూతురు, నిర్మాత హన్షిత అక్టోబర్లో రిలీజ్ కావచ్చని చెప్పారు.తిరుమల శ్రీవారిని తాజాగా దర్శించుకున్న హన్షిత మీడియాతో మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ అక్టోబర్లో రిలీజ్ అవుతుందని చెప్పారు. చాలా డిఫరెంట్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కినట్లు ఆమె పేర్కొన్నారు. దిల్ రాజు సెప్టెంబర్లో విడుదల అవుతుందని చెబితే.. హన్షిత మాత్రం అక్టోబర్ అని క్లారిటీ ఇచ్చేశారు. అంటే దసరా టార్గెట్గా గేమ్ ఛేంజర్ ఉండవచ్చని తెలుస్తోంది. దసరా బరిలో అక్టోబర్ 10వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' కూడా ఉంది. దసరా సెలవులు ముగియగానే గేమ్ ఛేంజర్ రిలీజ్ కావచ్చని మరికొందరు అంచనా వేస్తున్నారు. మరికొందరు మాత్రం రెండూ దసరా సెలవులను టార్గెట్ చేసుకునే ప్రేక్షకుల ముందుకు రావచ్చని అభిప్రాయపడుతున్నారు.దేవర వాయిదా పడుతుందా..?తాజాగా దిల్ రాజు కూతురు హన్షిత చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే దేవర వాయిదా పడే ఛాన్స్ ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం దేవరకు సంబంధించి షూటింగ్ చాలా భాగం మిగిలివున్నట్లు సమాచారం. షూటింగ్ తర్వాత కూడా పోస్ట్ప్రొడక్షన్ వర్క్ కూడా భారీగానే ఉంటుంది. ఒకవేళ దేవర మళ్లీ వాయిదా పడితే ఆక్టోబర్ 10ని తన మిత్రుడు రామ్ చరణ్కు తారక్ ఇవ్వచ్చని ఇండస్ట్రీలో టాక్. జూలై నెలాఖరులోగా గేమ్ ఛేంజర్ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే, దేవర యూనిట్ మాత్రం దసరా బరిలోనే ఉంది. అధికారికంగా వారు ఎలాంటి ప్రకటన చేయలేదు. -
దిల్రాజు అల్లుడి కారు చోరీ.. దొంగిలించిన వ్యక్తి మాటలకు పోలీసులు షాక్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్రాజు అల్లుడు అర్చిత్ రెడ్డికి చెందిన రూ. 1.7 కోట్ల విలువైన పోర్షే కారును దొంగలించారు. దీంతో వెంటనే ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గంటలోనే కారును గుర్తించి.. దొంగలించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అర్చిత్రెడ్డి శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్లోని దసపల్లా హోటల్కు తన పోర్షే కారులో వెళ్లారు. అక్కడ తన కారును బయటే పార్కింగ్ చేసి వెళ్లిన అర్చిత్ రెడ్డి సుమారు 30 నిమిషాల తర్వాత తిరిగొచ్చాడు. ఆ సమయంలో తన కారు అక్కడ కనిపించలేదు. దీంతో వెంటనే ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే సీఐ వీరశేఖర్, ఎస్సై రాజశేఖర్లు రంగంలోకి దిగారు. తమ సిబ్బందిని అలెర్ట్ చేసి నగరంలోని ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పలు సీసీ కెమెరాలను పరిశీలించగా జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద కారు సిగ్నల్ జంప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కేబీఆర్ పార్క్ వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసులను వారు అప్రమత్తం చేయడంతో కారు దొంగలించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పట్టుబడిన వ్యక్తి చెప్తున్న వివారలను తెలుసుకున్న పోలీసులు కంగుతిన్నారు. (ఇదీ చదవండి: అభిమాని అలాంటి ప్రశ్న అడగడంతో ఫైర్ అయిన తమన్నా..) పట్టుబడిన వ్యక్తి తాను ఆకాశ్ అంబానీ వ్యక్తిగత సహాయకుడినని, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కారును తీసుకెళ్లాలని సూచించడంతో దీనిని తీసుకెళ్తున్నట్లు చెప్పి పోలీసులను టెన్షన్ పెట్టాడు. అంతే కాకుండా తాను తన సహాయకుడు హృతిక్ రోషన్తో కలిసి కారులో అత్యవసరంగా అకాశ్ అంబానీని కలవడానికి వెళ్లాల్సి ఉందని, వదిలేయాలని పోలీసులతో చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాక తలలుపట్టుకున్నారు. కొంత సమయం తర్వాత అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా మతిస్థిమితం లేదని, కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్లోని బ్రైట్ లైఫ్ ఫౌండేషన్ సంస్థలో చికిత్స పొందినట్లు పోలీసులు తెలుసుకున్నారు. నిందితుడు మన్సూరాబాద్ ప్రాంతానికి చెందిన మల్లెల సాయికిరణ్గా గుర్తించారు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) -
భర్తతో వెకేషన్లో దిల్ రాజు ముద్దుల తనయ (ఫొటోలు)
-
వెకేషన్లో దిల్ రాజు కుమార్తె
-
వెకేషన్లో దిల్ రాజు కుమార్తె.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్!
టాలీవుడ్ నిర్మాతల్లో దిల్ రాజు గురించి ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు. వరుస సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉంటారు. టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో నిలబడే వారిలో దిల్ రాజు ముందు వరుసలో ఉంటారు. ఇటీవల ఆయన నిర్మించిన శాకుంతలం మూవీ పెద్ద షాకిచ్చిందని వెల్లడించారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. (ఇది చదవండి: ఆ సినిమా నాకు పెద్ద ఝలక్ ఇచ్చింది: దిల్ రాజు) వేకేషన్లో దిల్ రాజు డాటర్ అయితే దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డిని కూడా నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇటీవలే సూపర్ హిట్గా నిలిచిన బలగం సినిమాకు దిల్ రాజు కుమార్తె నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా దిల్ రాజు కూతురు వేకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన ఇన్స్టాలో పంచుకున్నారు. 2014లో మే 4 వ తేదీన అర్చిత్ రెడ్డిని విహహం చేసుకుంది. ఇవాళ హన్షిత పెళ్లి రోజు సందర్భంగా భర్తతో కలిసి వేకేషన్లో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. (ఇది చదవండి: శరత్బాబుకు సంతాపం తెలిపిన కమల్హాసన్.. కాసేపటికే ట్వీట్ డిలీట్) View this post on Instagram A post shared by Hanshithareddy (@hanshithareddy) -
మా నమ్మకం నిజమైంది.. దిల్ రాజు కుమార్తె
‘‘ప్రతి ఊరిలో, ప్రతి కుటుంబంలో జరిగే కథే ‘బలగం’. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని వేణు కథ చెప్పినప్పుడే నమ్మాం. అది నిజమైంది’’ అని నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత (‘దిల్’ రాజు కుమార్తె) అన్నారు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్రామ్ జంటగా వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బలగం’. ‘దిల్’ రాజు సారథ్యంలో శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలైంది. ఈ సందర్భంగా హన్షిత మాట్లాడుతూ– ‘‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై నాన్నగారు (‘దిల్’ రాజు) తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో భారీ సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించడంతో పాటు ప్రయోగాత్మక, వైవిధ్యమైన కథలను చిన్న సినిమాల ద్వారా ప్రేక్షకులకు అందివ్వాలనే ‘దిల్’ రాజు ప్రొడక్షన్ బ్యానర్ని స్థాపించాం. ‘బలగం’ని ప్రేక్షకులతో కలిసి థియేటర్లో చూశాక నాన్నగారు ‘మీరు ఎన్ని సినిమాలు తీసినా ‘బలగం’ మాత్రం గుర్తుండిపోతుంది’ అని అభినందించారు’’ అన్నారు. హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘బలగం’ చిత్రానికి రోజు రోజుకు వసూళ్లు పెరుగుతున్నాయి. మా తొలి సినిమాకే ఇంత మంచి పేరు రావడం హ్యాపీ. ప్రస్తుతం యష్ మాస్టర్ హీరోగా శశి అనే కొత్త డైరెక్టర్తో ఓ సినిమా నిర్మిస్తున్నాం’’ అన్నారు. -
‘దిల్’ మిస్సింగ్
‘దిల్’ సినిమా తీసినందుకు వెంకటరమణకి ‘దిల్’ రాజు అని పేరొచ్చింది. సినిమాల్లో రాణించాడు.. కారణం ఇంట్లో ఉన్న మహరాణి వల్లే. అందరూ పిలుచుకునే ‘దిల్’ రాజుకు ఇప్పుడు ఎంతగానో... ఎంతెంతగానో ‘దిల్’ మిస్సింగ్. ♦ ముందుగా ‘శతమానం భవతి’కి జాతీయ అవార్డు దక్కినందుకు కంగ్రాట్స్ రాజుగారు.. ‘దిల్’ రాజు: థ్యాంక్స్ అండి. మా సంస్థ నుంచి వచ్చిన మరో మంచి ఫ్యామిలీ మూవీ ఇది. ప్రేక్షకాదరణతో పాటు జాతీయ అవార్డు దక్కడం హ్యాపీగా ఉంది. ♦ ఇంత పెద్ద విజయం ఓ వైపు... మీ భార్య (అనిత) మరణంతో ఏర్పడిన పెద్ద వెలితి మరోవైపు... రాజు: చాలా పెద్ద వెలితి. ‘షీ ఈజ్ బెస్ట్’. ఏ భర్తకైనా ఇంట్లో ప్రశాంతత ఉన్నప్పుడే బయట సక్సెస్ కాగలడు. డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ వ్యవహారాలతో బయట నేను ఫుల్ బిజీ. ఆమె ఇంటిని బాగా చూసుకునేది. ఇంటికి రాగానే ఒత్తిడి మొత్తం పోయేది. ♦ అనితగారికి ఆరోగ్య సమస్యలేమైనా? రాజు: పోయిన సంవత్సరం నుంచి మోకాళ్ల నొప్పితో బాధపడుతోంది. ఇప్పుడే ఇలా ఉందంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో అని నేనూ, మా పాప బాధపడేవాళ్లం. వేరే ఆరోగ్య సమస్యలేవీ లేవు. డైట్ స్టార్ట్ చేసి, ఓ 15 కిలోలు తగ్గాలని చెబుతుండేవాణ్ణి. లైపో చేయించుకుంటానని సరదాగా అనేది. మా అమ్మాయికి మాటలు వచ్చి నన్ను ‘డాడీ’ అని పిలవడం మొదలు పెట్టినప్పటి నుంచీ అనిత నన్ను ‘డాడీ’ అనడం మొదలుపెట్టింది. మనవడి తోనూ ‘డాడీ’ అని పిలిపిస్తాననేది. మా 27 ఏళ్ల వైవాహిక జీవితంలో నన్ను పేరు పెట్టి పిలిచింది లేదు. ♦ 27 ఏళ్లు మీతో లైఫ్ పంచుకున్న అనితగారి హఠాన్మరణం... రాజు: నిజంగా పెద్ద షాక్. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని, భోజనం చేస్తుంటే ఏదో వెలితి. ఆమె కూర్చునే కుర్చీ ఖాళీగా కనిపిస్తుంటే ఏదో బాధ. ప్రతిరోజూ ఆ చైర్ చూస్తున్నా. వద్దంటున్నా కొసరి కొసరి వడ్డించేది. ఆ మూమెంట్స్ వెంటాడుతున్నాయి. ఇప్పట్లో తేరుకోవడం అంటే... (కాసేపు మౌనం). డెఫినెట్గా ఓవర్కమ్ అవ్వాలి. అది అంత సులభం కాదని తెలుసు. వాస్తవానికి మా కుటుంబంలో నేను చూసిన రెండో మరణం ఇది. 32 ఏళ్ల క్రితం మా నాన్నగారి మేనత్తగారు చనిపోయారు. నాకు తెలిసిన డెత్ అదే. ఆ తర్వాత మా ఇంట్లో మళ్లీ చూడలేదు. ఇదిగో.. ఈ ఏడాది చూడాల్సి వచ్చింది. ♦ హన్షితా (‘దిల్’ రాజు కుమార్తె).. మీకు బాబు పుట్టి నాలుగు నెలలే అయింది. ఇలాంటి టైమ్లో అమ్మమ్మ అవసరం బేబీకి చాలా ఉంటుంది కదా? హన్షిత: అవునండి. నాకు బాబు పుట్టాలని అమ్మ కోరుకునేది. అది నిజమైనందుకు చాలా ఆనందపడింది. మనవణ్ణి చూసి అమ్మ చాలా మురిసిపోయేది. బాబు ఆలనా, పాలనా చూసుకునేది. ఆవిడ ధ్యాస అంతా వాడి మీదే. ఇప్పుడు అమ్మ లేదనే ఆలోచన భరించలేనంత బాధగా ఉంది. డెఫినెట్గా వియ్ మిస్ హర్. ♦ మీ సినిమాల కథలను అనితగారు వినేవారా? రాజు: నేను, మా పాప సినిమాల గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుంటాం. దాంతో ‘ఎప్పుడూ సినిమాల గురించేనా? వేరే టాపిక్ లేదా’ అనేది. ఇలాంటి కథతో సినిమా చేస్తున్నానని మా పాపకు చెబుతుండేవాణ్ణి. నా భార్యకు కథలు చెప్పింది లేదు. సినిమా రెడీ అయ్యాక చూపించేవాణ్ణి. సాంగ్స్ కావాలంటే వినిపించేవాణ్ణి. ♦ మీకు నేషనల్ అవార్డు తెచ్చిన ‘శతమానం భవతి’ చూసినప్పుడు అనితగారు ఏమన్నారు? రాజు: తనకు చాలా నచ్చిన సినిమా. మేం కలసి చూసిన చివరి సినిమా అదే. కలసి ఎటెండ్ అయిన చివరి ఫంక్షన్ కూడా ఈ సినిమాదే. ‘శతమానం భవతి’ సినిమా ఆడియో ఫంక్షన్కు ఫ్యామిలీ మెంబర్స్ అంతా హాజరయ్యాం. ఆ రోజు నాన్నగారి పుట్టినరోజుని ఆ స్టేజిపైనే సెలబ్రేట్ చేశాం. ఆ తర్వాత ‘శతమానం భవతి’ సక్సెస్మీట్కు అందరం కలసి వెళ్లాం. అదే లాస్ట్. ♦ మీ నాన్నగారు తీసిన సినిమాల్లో మీకు నచ్చినవి? హన్షిత: నాకు బాగా నచ్చిన సినిమా ‘బొమ్మరిల్లు’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’. ‘శతమానం భవతి’ కూడా నచ్చింది. ♦ మీ నాన్నగారు ‘బొమ్మరిల్లు’ టైప్ ఫాదర్ కాదని అర్థమవుతోంది... హన్షిత: ఆ ఫాదర్లా మా నాన్నగారు స్ట్రిక్ట్ కాదు. ఈయన ఫ్రెండ్లీ ఫాదర్. ఎగ్జామ్స్ టైమ్లో నేను ఉదయం ఐదు గంటలకు అలారం పెట్టుకుని పడుకునేదాన్ని. ఐదు గంటలకు మోగినా లేచేదాన్ని కాదు. అమ్మానాన్న కూడా నిద్ర లేపేవాళ్లు కాదు. సరిగ్గా నిద్ర పోకపోతే ఎగ్జామ్స్ రాయడం కష్టం అనేవాళ్లు. అలా చదివితేనే నాకు 60 పర్సెంట్, 70 పర్సెంట్ వచ్చేది. నువ్వింకా ఎక్కువసేపు చదివితే ఇంకా మంచి పర్సంటేజ్ వచ్చేదని ప్రోత్సహించేవారు. ♦ అనితగారు చనిపోయినప్పుడు మీరు అమెరికాలో ఉన్నారు. అక్కణ్ణుంచి ఇక్కడివరకూ రావడానికి పట్టిన టైమ్లో మీరెలా ఫీలయ్యారు? రాజు: నా లైఫ్లో ఆ రోజు వరస్ట్ డే. నాకు 46 ఏళ్లు కంప్లీట్ కావస్తున్నాయి. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. మంచి, చెడు రోజులు చాలానే ఉన్నాయి. కానీ, ఈ వార్తను మాత్రం జీర్ణించుకోలేకపోయాను. నిజానికి కొన్ని సంఘటనలు విచిత్రంగా జరిగాయి. నేను నైట్ జర్నీస్ చేసినప్పుడు ఆమెను నిద్ర లేవద్దని చెప్పేవాణ్ణి. తను కూడా లేచేది కాదు. కానీ, లాస్ట్ మంథ్ సిక్త్స్ నేను రాత్రి రెండు గంటలకు ఎయిర్పోర్ట్కి బయల్దేరినప్పుడు తను నిద్రలేచి సాగనంపింది. ఆ రోజు ఉదయం పావ్ బాజీ చేసి, తినేవరకూ ఊరుకోలేదు. ఆమె చేతుల మీదగా తిన్న చివరి ఫుడ్ అదే. అంతకు ముందు రోజు మనవడు బోర్లా పడుతున్నాడని వాళ్ల అమ్మానాన్నలను ఇంటికి పిలిపించింది. నేనిక్కడ లేనప్పుడు జరగరానిది జరుగుతుంది కాబట్టి, మా పాపకు తోడుగా ఉండటం కోసం అనిత తన అమ్మానాన్నలను మా ఇంటికి పిలిచేలా గాడ్ డిజైన్ చేశాడేమో. ♦ జీవితం ఊహించలేని ఓ ప్రయాణం అనేది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అనిపిస్తుంటుంది కదా? రాజు: అవును. నిజానికి మా ఇంట్లో ఈ చెడు సంఘటన జరగక ముందు నాకెందుకో తెలియని కలవరం. చెడు జరగబోతోందని అనిపిస్తుండేది. నేనొకటి ప్లాన్ చేస్తే వేరే ఒకటి జరిగేది. ఫర్ ఎగ్జాంపుల్.. ‘డీజె’ షూటింగ్ కోసం నేను కర్ణాటకలోని బేలూరు వెళ్లాలి. యూనిట్ మొత్తం వెళ్లారు. నాకు జ్వరం రావడంతో ఆగిపోయాను. తర్వాత రోజు మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసుకుని బెంగళూరు వెళ్లి, అక్కడి నుంచి బేలూరు వెళ్లా. అప్పటికే మధ్యాహ్నం దాటిపోయింది. టెంపుల్లో షూట్ ప్లాన్ చేశాం. కానీ, పర్మిషన్ దొరకలేదు. అందరి డేట్స్ వేస్ట్ అవుతాయి. ఏం చేయాలా? అని ఆలోచిస్తున్నప్పుడు హరీష్ శంకర్ నిజమాబాద్లోనూ, సంఘీ టెంపుల్లోనూ రెండేసి రోజులు షూట్ చేద్దామన్నాడు. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు. ఏదో చెడు జరగబోతుందని నా సిక్త్స్ సెన్స్ చెబుతోంది. నా మనసుకి అనిపించినట్లుగానే చెడు జరిగింది. మార్చి 19న బ్రహ్మోత్సవాలకి వెళ్లాలనుకున్నాం. 11న ఊహించని సంఘటన జరిగింది. ♦ అనితగారి మరణం తర్వాత ‘ఇదే ఇదే జీవితం..’ అనే పాటను పదే పదే విన్నానని ఇటీవల చెప్పారు. ఫిలసాఫికల్గా మీలో ఏమైనా మార్పు వచ్చిందా? రాజు: మార్పు తప్పకుండా ఉంది. అయితే దాని ప్రభావం ఏ రేంజ్లో ఉంటుందనేది లాంగ్ రన్లో తెలుస్తుంది. ఎంత బాధలో ఉన్నా దాన్నుంచి డీవియేట్ అయ్యి, ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలి. నన్ను మావాళ్లందరూ ఒంటరిగా వదలడంలేదు. హర్షిత్ (‘దిల్’ రాజు అన్నయ్య నరసింహారెడ్డి కొడుకు) అయితే నాతోనే ఉంటూ, నా రూమ్లోనే పడుకుంటున్నాడు. నేను పదమూడు రోజు లు ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేదు. ఆ సమయంలో ‘ఇదే ఇదే జీవితం.. సుఖః దుఃఖాల సంగమం’ పాట విన్నా. అప్పుడనిపించింది.. రచయితలు ఊరికే రాయరు. జీవితానుభవాలనే రాస్తారని. ఆ థాట్ ప్రాసెస్లో ఒక స్టోరీ లైన్ తట్టింది. ఆ స్టోరీతో సినిమా తీయాలనుకుంటున్నా. జీవితం చాలా విచిత్రం. గడచిన 5 నెలల్లో ‘శతమానం భవతి’ ఒక హ్యాపీనెస్, గ్రాండ్సన్ ఓ హ్యాపీనెస్, ‘నేను లోకల్’ ఒక హ్యాపీనెస్. అద్భుతంగా లైఫ్ ముందుకు వెళుతోంది అనుకున్నప్పుడు దేవుడు అనుకోని జర్క్ ఇచ్చాడు. ఆ జర్క్లో ఉండగానే నేషనల్ అవార్డు, చక్రపాణి, నాగిరెడ్డిగారి అవార్డు దక్కాయి. 5 నెలల్లో అటూ.. ఇటూ చూపించాడు. ఆ పాట సరిగ్గా నా పరిస్థితికి తగ్గట్టుగా ఉంది. అందుకే విన్నాను. ♦ మీది లవ్ మ్యారేజ్ కదా... రాజు: 1989లో మా కజిన్ పెళ్లిలో తనని చూశా. పెళ్లికూతురితో పాటు వస్తారు కదా.. వాళ్లతో పాటు వచ్చింది. ఆ పెళ్లి సమయంలోనే మా పెద్దమ్మగారి ఇంట్లో ఓ నాలుగు రోజులు అందరం ఉన్నాం. అప్పుడు ఏర్పడిన పరిచయం ఇష్టంగా మారింది. ఇంట్లో కొంచెం కష్టపడే పెళ్లికి ఒప్పించాం. అప్పుడు నాకు 20 ఏళ్లే. ♦ డిస్ట్రిబ్యూటర్గా, నిర్మాతగా మీ విజయాలకు అనితగారు గర్వపడేవారా? రాజు: గర్వం అంటే తెలియదు. సింపుల్ పర్సన్. ఫ్యామిలీ మెంబర్స్ని బాగా చూసుకునేది. కథలు చెప్పడానికి మా ఇంటికి వచ్చినవారిని ఎంతో మర్యాదగా చూసేది. ♦ ఇప్పుడు మీ మనసుకి స్వాంతన మీ మనవడే కదా... రాజు: అవును. ఆర్షాన్ టైమింగ్స్ను బట్టి నా టైమింగ్స్ను ఛేంజ్ చేసుకున్నాను. మార్నింగ్ 7గంటలకి లేస్తాడు. ఆ ౖటైమ్కి ఇంట్లో ఉంటున్నా. సాయంత్రం 5 నుంచి 7 గంటలు కూడా వాడితోనే. ఆర్షాన్తో టైం స్పెండ్ చేయడానికి షూటింగ్ స్పాట్ నుంచి కొంచెం త్వరగానే ఇంటికి వెళుతున్నాను. ఇప్పుడు వాడే నాకు ఊరట. అమ్మ మా మధ్యే ఉందనిపిస్తోంది మా అమ్మ మా మాధ్య లేదన్న నిజాన్ని నమ్మలేకపోతున్నా. పిల్లాడితో ఆడుకుంటున్నప్పుడు ఆమె పక్కనే ఉన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. లేకపోతే కిచెన్లో ఉందనో, మేడ మీదకు వెళ్లిందనో, బయటకు వెళ్లింది.. వచ్చేస్తుందనో అనిపిస్తుంటుంది. నాకు తెలియకుండానే ఒక్కొక్కసారి ‘అమ్మా’ అని పిలుస్తున్నాను. వెంటనే గుర్తొచ్చి కన్నీళ్ళు వస్తాయి. సడన్గా కదా... నమ్మలేకపోతున్నాను. అమ్మను హాస్పిటల్కి తీసుకెళ్లింది నేనే. డాక్టర్స్ హార్ట్ బీట్ లేదంటే, ఏం కాలేదు. ముందు సెలైన్ ఎక్కించండి అంటూ వాదించాను. అమ్మ లేదనే విషయాన్ని నమ్మడానికి ఇంకా టైమ్ పడుతుంది. – హన్షిత మా పాప స్ట్రాంగ్ అయి నన్ను సముదాయించింది అనిత మరణం గురించి ముందు మా అల్లుడు అర్చిత్ చెప్పాడు. అప్పుడు అమెరికాలో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ. ఆ న్యూస్ వినగానే 10 నిమిషాల పాటు బ్లాంక్ అయ్యాను. నా ఆలోచన అంతా మా పాప గురించే. కాసేపటికి హరీష్ శంకర్ (డైరెక్టర్) ఫోన్ చేశాడు. ‘అన్నా తొందరగా రా అన్నా. పాపను చూడలేకపోతున్నాం’ అన్నాడు. అక్కడే నాతోపాటు ఉన్న నా కజిన్ శిరీష్ చాలా బాధపడ్డాడు. అనితకు వాడు బాగా ఎటాచ్డ్. శిరీష్ కంట్రోల్ కావడం లేదు. హర్షిత్ ఏమో నన్ను, శిరీష్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు. ఫ్లైట్ ఎక్కాక మాకు ఫోన్ కాల్స్ లేవు. వాట్సాప్లో టచ్లో ఉన్నారు. నేను ఇంటికి వచ్చిన తర్వాత కుప్ప కూలిపోతానని మా పాపకు తెలుసు. అందుకే తనను తాను సంభాళించుకుంది. తను స్ట్రాంగ్ అయి, నన్ను సముదాయించింది. నేను ఇంటి దగ్గర కారు దిగగానే, తనే బయటకు వచ్చి నన్ను లోపలికి తీసుకెళ్లింది. – ‘దిల్’ రాజు 27తో ఏదో ఉంది! మా అమ్మానాన్నల జీవితంలో ‘27’కి కీ రోల్ ఉందనిపిస్తోంది. వాళ్లిద్దరూ కలిసి చూసిన మొదటి సినిమా ‘గీతాంజలి’ (1990). 27 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సినిమా వచ్చిన 27 ఏళ్లకు ‘శతమానం భవతి’ వచ్చింది. దీనికీ నేషనల్ అవార్డు దక్కింది. అమ్మ చనిపోయాక అమెరికా నుంచి నాన్నగారు ఇక్కడికి రావడానికి 27 గంటలు పట్టింది. పెళ్లయిన 27 ఏళ్లకు అమ్మ చనిపోయింది. – హన్షిత ఆ 27 గంటలూ ఏవో ఆలోచనలు అనిత చనిపోయిందనే కబురు వచ్చాక అమెరికా నుంచి నాకు ఇక్కడికి రావడానికి 27 గంటలు పట్టింది. అన్ని గంటల్లో నాకు కంటి మీద కునుకు రాలేదు. ఏవో జ్ఞాపకాలు కళ్లు మూత పడనివ్వలేదు. ఏదేమైనా ఆ భగవంతుని డిజైన్ విచిత్రంగా ఉంటుంది. – ‘దిల్’ రాజు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు? ‘డీజే’, ‘ఫిదా’ కంప్లీట్ స్టేజ్కి వచ్చేశాయి. జూలై లోపు రెండు ప్రాజెక్ట్స్ రిలీజ్ అవుతాయి. రవితేజతో ‘రాజా ది గ్రేట్’ స్టార్ట్ చేశాం. నాని హీరోగా ‘ఎమ్.సి.ఎ’ స్టార్ట్ చేయాలి. ఇప్పటికే ఈ ఏడాది మా బేనర్ నుంచి ‘శతమానం భవతి’, ‘నేను లోకల్’ వచ్చాయి. రెండూ హిట్. ఈ ఇయర్ ఆగస్ట్లోపు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతాయి. బహుశా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే బ్యానర్లో ఒకే ఏడాది ఆరు సినిమాలు రావడం ఇదే మొదటిసారేమో. చెక్ చేయాలి. ♦ డైరెక్టర్గా మారే ఆలోచన ఉందా? రాజు: లేదు. డైరెక్షన్ తెలియదని కాదు. కానీ చేయను. స్క్రిప్ట్, సీన్స్ గురించి మాత్రం డైరెక్టర్స్తో డిస్కస్ చేస్తాను. సినిమా రిజల్ట్ను చాలావరకూ జడ్జ్ చేయగలుగుతాను. ‘శతమానం భవతి’ క్లాసిక్ అవుతుందనుకున్నా. నంది అవార్డు కూడా వస్తుందనుకున్నా. ఏకంగా నేషనల్ అవార్డు వచ్చింది. 2017లో ‘బాహుబలి–2’ రిలీజ్ అవుతుంది. అవార్డులు ఆ సినిమాకే వచ్చే ఛాన్స్ ఎక్కువ. అందుకే నంది అవార్డు కోసం ‘శతమానం భవతి’ సినిమాని 2016లోనే సెన్సార్ చేయించాం. నా బ్రదర్ నర్సింహారెడ్డి ఎడిటింగ్ రూమ్లో ‘శతమానం భవతి’ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. డెఫినెట్గా నేషనల్ అవార్డు వస్తుందని ఆయన అన్నారు. అది నిజమైంది. ♦ మీ ప్రతి సినిమా రిలీజ్కు ముందు తిరుమల వెళ్లి తలనీలాలు ఇస్తారు.. ఫస్ట్ టైమ్ ఎప్పుడు మొదలుపెట్టారు? రాజు: డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడే. ‘పెళ్లి పందిరి’ నుంచి తలనీలాలు ఇవ్వడం స్టార్ట్ చేశాను. దేవుడు ఈ ఏడాది నాకా అదృష్టం ఇవ్వలేదు. ఈ ఇయర్ నాలుగు సినిమాలు రిలీజ్ అవుతాయి. మరో వన్ ఇయర్ వరకు నేను గుడికి వెళ్లకూడదు కదా. 2016 ప్రొఫెషనల్గా ఇప్పటివరకూ రెండు సక్సెస్లు ఇచ్చింది. పర్సనల్గా ఓ చేదు అనుభవాన్ని మిగిల్చింది. జీవితం ఇంతే. ఒక మంచి... ఒక చెడు... ఒక చెడు... ఒక మంచి. దేవుడు అలా డిజైన్ చేస్తాడు.