breaking news
Gurazala
-
సాల్మన్ హత్య కేసులో చంద్రబాబే దోషి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ మూకలు సాగిస్తున్న రాక్షస దాడులపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో దళితుడు సాల్మన్ హత్య కేసులో చంద్రబాబే దోషి అని స్పష్టంచేశారు. ‘రెడ్బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో ఏ స్థాయికి పోయిందనటానికి ఇదో ఉదాహరణ. గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో సర్పంచ్, ముగ్గురు ఎంపీటీసీలు వైఎస్సార్సీపీకి చెందినవారు. ఈ నలుగురితోపాటు 300 పైచిలుకు కుటుంబాలు ఊరు విడిచిపెట్టి వెళ్లేలా రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. ఊరిలో వారికున్న ఆస్తులు, పొలాలు అన్నింటినీ వదిలేసేలా దౌర్జన్యం చేసి గ్రామాన్ని వీడేలా సాక్షాత్తు చంద్రబాబునాయుడే ప్రోత్సహిస్తున్నారు. పోలీసు భద్రతతో పికెట్ ఏర్పాటుచేసి వారు గ్రామంలోకి తిరిగి వచ్చేలా ఆదేశించాలంటూ హైకోర్టును అభ్యర్థిస్తూ దాఖలైన పిటిషన్ పెండింగ్లో ఉంది. ఈ క్రమంలో ఆ గ్రామాన్ని వీడి వెళ్లిపోయిన ఒక దళితుడు, పేదవాడు అయిన సాల్మన్ భార్య తన ఇల్లు చూసుకునేందుకు అక్కడకు వెళ్లింది. అయితే అనారోగ్యం బారిన పడి అక్కడే ఉండిపోవడంతో తన భార్యను చూడటానికి వెళ్లిన సాల్మన్పై దాడిచేసి రాడ్లతో దారుణంగా కొట్టి చంపారు. చంపేందుకు పావులుగా వాడిన వ్యక్తులకు, సాల్మన్కు ఎలాంటి గొడవలు లేవు. పైనుంచి చెప్పి అతడిని చంపించారు. ఈ హత్యలో సీఐ, ఎస్ఐలు, ఎస్పీ, చంద్రబాబునాయుడి ఎమ్మెల్యేలు, సాక్షాత్తూ చంద్రబాబునాయుడు.. వీరంతా దోషులే. చంద్రబాబు ఓ తప్పుడు మనిషి ..!ఈ మనిషి చంద్రబాబు.. నాయకుడు, పాలకుడు కాదు. అన్నీ చెడ్డ గుణాలు, చెడ్డ అలవాట్లున్న ఒక తప్పుడు మనిషి. భగవద్గీత చదివినా, బైబిల్ చదివినా, ఖురాన్ చదివినా దేవుళ్లు మనకు చెప్పిందేమిటి..? మోసం చేయకండి, అబద్ధం ఆడకండి.. నిజాయితీగా బతకాలని నేర్పిస్తారు. కానీ చంద్రబాబునాయుడుకున్న అలవాటు, తన కుమారుడికి నేర్పించిన అలవాటు.. చివరికి ఆయన పార్టీ వారికి కూడా చంద్రబాబు చెప్పేదేంటంటే.. దౌర్జన్యం చేయండి, మోసం చేయండి తప్పులేదు! అబద్ధాలు ఆడినా తప్పులేదు... వెన్నుపోటు పొడిచినా తప్పులేదు... అధికారమే ముఖ్యం..! ఇవీ ఆయన నేర్పించేవి! జరుగుతున్న పరిణామాలు కోర్టుల దృష్టికి తీసుకొస్తాం. ఎన్హెచ్ఆర్సీ(జాతీయ మానవ హక్కుల కమిషన్)కి కూడా ఫిర్యాదు చేస్తాం. కోర్టుల రక్షణ ద్వారా గ్రామస్తులందరికీ మంచి రోజులు వస్తాయి. తిరిగి గ్రామంలోకి పునఃప్రవేశం కూడా జరుగుతుంది. ఎల్లకాలం చంద్రబాబునాయుడు రోజులుండవు. ఇప్పటికే రెండేళ్లయిపోయింది. మరో మూడేళ్లు కూడా అయిపోతాయి. తర్వాత ఇదే చందబ్రాబునాయుడికి తాను వేసిన విత్తనాలు వృక్షాలైతే ఎలా ఉంటుందో తెలుస్తుంది. పాలకులుగా న్యాయం, ధర్మం వైపు నిలబడాలి దెబ్బలు తిన్న సాల్మన్ను ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆరో రోజు మరణించాడు. చనిపోయిన ఆ మనిషిని సొంత గ్రామంలో ఖననం చేయడానికి కూడా గ్రామంలోకి వెళ్లకూడదని పోలీసులు అడ్డుకున్నారు. ఎలా అడ్డుకుంటారని మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మృతుడి బంధువులు, వేలమంది నిలదీస్తే... తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామంలోకి ప్రవేశానికి అనుమతించారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. లేదా? అని ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆలోచించాలి. ఇలా చేసి తప్పుడు సంప్రదాయానికి బీజం వేస్తున్నారు. ఇదే సంప్రదాయం కొనసాగితే చంద్రబాబు వేసిన విషపు విత్తనాలు రేపు చెట్లు అవుతాయి. మీరు ఏవైతే నాటారో.. అవే పండుతాయి. నష్టపోయిన వారు చూస్తూ ఊరుకోరు. సహజంగా ఇది మానవ నైజం. పాలకులుగా ప్రతి అడుగూ ఆచితూచి వేయాలి. న్యాయం ధర్మం వైపు నిలబడాలి. పాలకులు న్యాయం, ధర్మం తప్పితే విషపు గింజలు నాటినట్లవుతుంది. రేపు ఎవరూ నియంత్రించలేని విధంగా ఆ విషపు బీజాలు చెట్లు అవుతాయి. -
వైఎస్ జగన్ను కలిసిన పిన్నెల్లి గ్రామస్తులు
సాక్షి, తాడేపల్లి: గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త సాల్మన్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. టీడీపీ గూండాల చేతుల్లో దారుణంగా హత్యకు గురైన సాల్మన్ ఉదంతాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించి.. బాధిత కుటుంబానికి ఆసరాగా ఉంటామని ప్రకటించారు కూడా. ఈ క్రమంలో పిన్నెల్లి గ్రామస్తులు బుధవారం వైఎస్ జగన్ను కలిశారు. పిన్నెల్లి గ్రామస్తులతో పాటు బాధిత కుటుంబం కూడా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయానికి వచ్చింది. తమ తండ్రిని రాజకీయ కక్షతోనే అత్యంత కిరాతకంగా చంపారని సాల్మన్ కుమారులు మరియదాసు, భిక్షం(ప్రవీణ్), కుమార్తె రాహేలు జగన్ వద్ద వాపోయారు. తండ్రి మరణంతో తమ కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లను ఓదార్చిన జగన్.. అధైర్య పడొద్దని, పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు.. అక్రమ కేసులు పెడతామని టీడీపీ గూండాలు, పోలీసులు తమను ఎలా బెదిరించారనే విషయాన్ని గ్రామస్తులు జగన్కు తెలియజేశారు. ప్రభుత్వ దన్నుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, వ్యవస్ధలు దిగజార్చేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును ఈ సందర్భంగా తీవ్రంగా తప్పుబట్టారాయన. ఎవరూ భయపడవద్దని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇలాంటి వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని.. పార్టీ తరఫున లీగల్ సెల్ అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని చెప్పారు. పిన్నెల్లి గ్రామస్తుల వెంట గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్ రెడ్డి, స్ధానిక నాయకులు, లీగల్ సెల్ సభ్యులు ఉన్నారు.చల్లా నాగరాజుకు భరోసా.. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం తేలుకుట్ల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త చల్లా నాగరాజు.. 2024 అక్టోబర్లో టీడీపీ గూండాల చేతిలో తీవ్రంగా గాయపడ్డాడు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్గా ఉన్నందుకు రాడ్లతో దాడిచేసి, నాగరాజు రెండు కాళ్ళు విరగ్గొట్టి తీవ్రంగా గాయపరిచారు. తనపై టీడీపీ గూండాలు ఏ విధంగా దాడిచేశారనేది, తన కుటుంబాన్ని ఎలా ఇబ్బందులు పెడుతున్నారనేది వైయస్ జగన్కు వివరించాడు. రెండు కాళ్ళు విరిగిపోవడంతో వీల్ ఛైర్కే పరిమితమై కుటుంబ పోషణ తీవ్ర ఇబ్బందిగా ఉందని జగన్ దృష్టికి తీసుకెళ్లాడు. నాగరాజు పరిస్థితికి చలించిపోయిన వైఎస్ జగన్.. పార్టీ తరపున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. -
సాల్మన్ హత్యపై భగ్గుమన్న దళితులు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త మందా సాల్మన్ హత్యపై రాష్ట్రవ్యాప్తంగా దళితులు భగ్గుమన్నారు. టీడీపీ మూకలు పథకం ప్రకారం మందా సాల్మన్ను హత్య చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శనివారం అన్ని జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేశారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు జరిగిన ఈ నిరసనల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు దళితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.చంద్రబాబు రెడ్బుక్ పాలనలో రాష్ట్రంలోని దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు నిత్యకృత్యంగా మారాయని నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సాల్మన్ హంతకులను కఠినంగా శిక్షించాలని, ఆయన కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాకుండా మంత్రి నారా లోకేశ్ రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దళితులు, వైఎస్సార్సీపీ శ్రేణులను దారుణంగా హత్య చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉంటున్నారనే దళితులను లక్ష్యంగా చేసుకుని దారుణాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.టీడీపీ మూకల రక్తదాహానికి మందా సాల్మన్ బలయ్యారని, ఇది ముమ్మాటికి చంద్రబాబు ప్రభుత్వం చేయించిన హత్యేనని స్పష్టం చేశారు. హంతకులను ఇంకా అరెస్టు చేయకపోవడంపై మండిపడ్డారు. తక్షణమే నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, వారికి కొమ్ముకాసిన టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, సీఐ, ఎస్ఐలపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని నినదించారు. దళితులపై దాడులకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమిస్తామని ప్రకటించారు. వివిధ ప్రాంతాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు దళిత నాయకులు వినతి పత్రాలు సమర్పించారు.పలు ప్రాంతాల్లో ర్యాలీలు.. నల్లరిబ్బన్లతో నిరసనలుసాల్మన్ హత్యకు నిరసనగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లా అమలాపురం మండలం బొంతువారిపేట నుంచి ఈదరపల్లి వంతెన వరకు వైఎస్సార్సీపీ శ్రేణులు, దళితులు ర్యాలీ నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేసేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులు, దళితులను పోలీసులు అడ్డుకున్నారు.ఈ కార్యక్రమానికి ముందస్తు అనుమతి లేదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే కేసులు పెడతామని బెదిరించారు. కడపలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సర్కిల్లో వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు కట్టుకుని ధర్నా చేశారు. కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. నల్ల రిబ్బన్లు ధరించి చంద్రబాబు డౌన్..డౌన్, జోహార్ అంబేడ్కర్... జైభీమ్.. పోలీసుల జులుం నశించాలి.. దళితులపై దాడులు అరికట్టాలి... రెడ్ బుక్ రాజ్యాంగం నశించాలి.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాపట్లలోనూ వైఎస్సార్సీపీ శ్రేణులు, దళితులు ర్యాలీ నిర్వహించారు. -
పిన్నెల్లి ఘటన.. ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, తాడేపల్లి: పల్నాడు జిల్లా పిన్నెల్లిలో మందా సాల్మన్ అనే కార్యకర్త హత్య ఘటనకు నిరసనగా వైఎస్సార్సీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చింది. తాము విధించిన బహిష్కరణను అతిక్రమించి ఊరిలో అడుగు పెట్టాడని టీడీపీ గూండాలు కొందరు ఇనుప రాడ్లతో సాల్మన్ను కొట్టి తీవ్రంగా గాయపరిచారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లి సాల్మన్.. చివరకు కన్నుమూశారు. అయితే.. పిన్నెల్లిలో టీడీపీ దాష్టీకాన్ని ఎండగట్టేందుకు వైఎస్సార్సీపీ సిద్ధపడింది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గురజాల పరిధిలో 7గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి దారుణాలకు గానూ అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ సిద్ధపడింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు రాజ్యాంగ రూపకర్త డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించనున్నాయి పార్టీ శ్రేణులు. ఇప్పటికే సాల్మన్ కేసులో న్యాయం జరిగేదాకా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఆ కుటుంబానికి పార్టీ తరఫున రూ.5 లక్షల సాయం కూడా ప్రకటించారు. మరోవైపు..శుక్రవారం సాల్మన్ మృతదేహానికి పిన్నెల్లిలో అంత్యక్రియలు జరగకుండా టీడీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మృతదేహంతో వస్తున్న వాహనాన్ని పోలీసులతో కలిసి అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ నేతల రాక కారణంగానే తాము అడ్డుకుంటున్నట్లు పోలీసు బాహాటంగా ప్రకటించారు. దీంతో ఇరువర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఆ సమయంలోనే మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వైఎస్ జగన్ను ఫోన్ చేసి మాట్లాడారు. అంత్యక్రియలను అడ్డుకుంటూ పోలీసులు వ్యవహరించిన తీరుపైనా ఆయన భగ్గుమన్నారు. అలా గంటన్నర తర్వాత పిన్నెల్లి గ్రామంలోని సాల్మన్ మృతదేహాన్ని, వైఎస్సార్సీపీ నేతలను అనుమతించారు. పిన్నెల్లి గ్రామానికి చెందిన దళితుడు సాల్మన్ మొదటి నుంచి వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉంటున్నాడు. అయితే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఊరు వదిలి వెళ్లిపోవాలని సాల్మన్కు తెలుగుదేశం నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రాణభయంతో కుటుంబంతో సహా బ్రహ్మణపల్లికి మకాం మార్చాడు. వైఎస్సార్సీపీ నేతలు ధైర్యం చెబుతుండడంతో రెండు నెలల కిందట సాల్మన్ కుటుంబం తిరిగి పిన్నెల్లికి వచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొందరు స్థానికుల సాయంతో టీడీపీ నేతలు వాళ్లను అడ్డుకున్నారు. పంచాయితీ తర్వాత చివరకు సాల్మన్ మినహా కుటుంబ సభ్యులను మాత్రమే ఊర్లో ఉండేందుకు అనుమతి ఇచ్చారు. అయితే.. సాల్మన్ భార్య ఈ మధ్య అస్వస్థతకు గురైంది. దీంతో.. ఈనెల 10వ తేదీన పిన్నెల్లి వెళ్లి ఆమెను చూడటానికి సాల్మన్ ప్రయత్నించాడు. రావొద్దన్నా.. ఎందుకు వచ్చావ్ అంటూ టీడీపీ గూండాలు ఆయన్ని రాడ్లతో చితకబాదారు. తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న టైంలోనే కోమాలోకి వెళ్లిన సాల్మన్.. చివరకు నాలుగు రోజుల తర్వాత కన్నుమూశాడు. త్వరలో బాధిత కుటుంబాన్ని కలిసి వైఎస్ జగన్ పరామర్శిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
రెడ్ బుక్ రాజ్యాంగానికి గురజాల DSP జగదీష్ బలి
-
జగనన్న కాలనీ కబ్జా.. పల్నాడులో బరితెగించిన టీడీపీ గూండాలు
సాక్షి, పల్నాడు జిల్లా: గురజాల నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను సైతం వదలడం లేదు. టీడీపీ నాయకులు యథేచ్ఛగా సాగిస్తున్న భూ దందా సాగిస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో టీడీపీ నాయకులు మరింత రెచ్చిపోతున్నారు.గురజాల మండలంలోని పులిపాడు గ్రామంలో జగనన్న కాలనీని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు కబ్జా చేసేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పులిపాడులో 70 సెంట్ల లో 40 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ భూములంటూ యరపతినేని అనుచరులు నకిలీ సర్టిఫికెట్ సృష్టించారు. పొజిషన్ సర్టిఫికెట్ జారీ చేయడంలో వీఆర్వో జ్యోతి కీలక పాత్ర పోషించారు.పొజిషన్ సర్టిఫికెట్ ఆధారంగా 70 సెంట్లు జగనన్న కాలనీని తొమ్మిది మంది టీడీపీ నేతలు తమ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎవరైనా గొడవ చేస్తే చంపేస్తామంటూ టీడీపీ గూండాలు బెదిరింపులకు దిగుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. -
టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..
-
ముఖ్యమంత్రి జగన్ పాలన సౌలభ్యాన్ని తీసుకొచ్చారు: ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి
-
మాచర్లలో భరతుడంటా!.. లోకేశ్ మళ్లీ ఏసేశాడు
సాక్షి, నరసరావుపేట : ‘యుద్ధానికి వెళుతున్న భరతుడికి వీర తిలకం దిద్దిన ప్రాంతం మా చర్ల’ అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ తన అ జ్ఞానాన్ని మరోసారి చాటుకున్నారు. పల్నా డు జిల్లా గురజాలలో బుధవారం జరిగిన బహిరంగ సభలో లోకేశ్ పైవిధంగా నాలుక ను మడతేసిపడేశారు. వాస్తవానికి బాలచంద్రుడికి వీర తిలకం దిద్ది పంపింది మగువ మాంచాల. పల్నాటి గడ్డపై పసివాడిని అడిగినా ఈ విషయం ఇట్టే చెప్పేస్తాడు. కానీ లోకేశ్ మాత్రం తన మిడిమిడి జ్ఞానంతో భరతుడిని మాచర్లలోకి దించేశారు. పిడుగురాళ్ల వావెళ్ల గార్డెన్స్ నుంచి ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర సత్తెనపల్లి నియో జకవర్గం రాజుపాలెం మండలం మీదుగా పెద కూరపాడు నియోజకవర్గంలోకి ప్రవేశించింది చదవండి: చంద్రబాబు, సీఎం జగన్ మధ్య తేడా ఇదే.. -
ఎవరు చర్చకు వచ్చినా రెడీ.. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఓపెన్ సవాల్
సాక్షి, పిడుగురాళ్ల: గురజాల అభివృద్ధిపై చర్చకు నేను సిద్దమంటూ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఓపెన్ సవాల్ విసిరారు. కాగా, మహేష్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘2019-2022 మధ్య కాలంలో గురజాల అభివృద్ధి కోసం రూ.2,673 కోట్లు ఖర్చు చేశాము. టీడీపీతోపాటు ఏపార్టీ వచ్చినా చర్చకు రెడీ. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో గత 40 నెలలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. పల్నాడులోని గురజాల వెనుకబడ్డ ప్రాంతం. వైఎస్సార్ హయంలోనే ఇక్కడ అభివృద్ధి మొదలైంది. విద్య, వైద్య సదుపాయాలను మెరుగుపరిచాము. ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపేందుకు చర్యలు చేపట్టాము. టీడీపీ హయంలో ఒక్క పథకమైనా చేపట్టారా?’ అని ప్రశ్నించారు. -
గురజాల అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధం
-
‘ఆ ప్రశ్నకు టీడీపీ నుంచి ఇంతవరకు సమాధానమే లేదు’
సాక్షి, గుంటూరు: యుద్ధాలు చేస్తాం, మీసాలు తిప్పుతాం, తొడలు చరుస్తాం అనే మాటలన్నీ టీడీపీ వాళ్లు సోషల్ మీడియాలో ప్రచారం కోసం చేసే చీప్ ట్రిక్స్ అని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. మున్సిపల్ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. 2019లో వైఎస్సార్సీపీ సత్తా ఏంటో చూపించాం. ప్రజలే నిర్ణయించారు మగాళ్లు ఎవరు.. మడత గాళ్లు ఎవరు అనేది. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో చంద్రబాబు డబ్బులు పంపితే రేవంత్రెడ్డి పట్టుబడలేదా, అదేమైనా ప్రతపక్షాల కుట్రా..?. దాచేపల్లి పట్టణంలో చంద్రబాబు డబ్బులు పంపితే మద్యం పంచుతూ ఒకరిద్దరు టీడీపీకి చెందిన వ్యక్తులను అరెస్ట్ చేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి సంబంధం..?. దాచేపల్లి పట్టణానికి తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో చెప్పాలి అని ప్రశ్నిస్తే ఇంతవరకు జవాబు లేదు. దమ్ము, ధైర్యం గురించి టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. దమ్ము ధైర్యం పుష్కలంగా ఉండబట్టే కదా 2019లో పోరాటాలు చేసి గెలిచింది. రాష్ట్రంలో ఏ ఎలక్షన్కి వెళ్లిన వైఎస్సా్ర్సీపీనే గెలుస్తుంది అంటే ప్రజల మనసుల్లో మా పార్టీ పదిలంగా ఉంది అని అర్థం. 1996 నుంచి ఎన్నికల్లో డబ్బులు పంచే సంస్కృతిని చంద్రబాబే తీసుకువచ్చాడు. డబ్బులు పంచే సంస్కృతి ఈ రోజు యావత్తు రాష్ట్రాన్ని దహించివేస్తుంది. మేము పట్టుబట్టి దాచేపల్లి, గురజాలని మున్సిపాల్టీలుగా చేశాం. తెలుగుదేశం నాయకులు కోర్టులకు వెళ్లి ఎన్నికలు ఆపాలని చూశారు. ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు' అంటూ కాసు మహేష్రెడ్డి మండిపడ్డారు. చదవండి: (అసలు లోకేష్కు ఎయిడెడ్ విద్యాసంస్థలంటే ఏంటో తెలుసా..?: ఆదిమూలపు సురేష్) -
ఆయనెవరో నాకు తెలీదు.. చంపితే మాకేం వస్తుంది!
సాక్షి, గుంటూరు : దీక్ష చేస్తున్న వంగవీటి రంగాను నడిరోడ్డుపైన హత్య చేసిన చరిత్ర చంద్రబాబుదని గురజాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనలో జరిగిన హత్యలన్ని ఆయన ప్రేరేపించాడని భావించాలా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం శవ రాజకీయాలు చేయటం మంచిది కాదని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంగళవారం జిల్లాలో మాట్లాడుతూ.. తెలుగుదేశం నాయకుడు అంకులు హత్యపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారని తెలిపారు. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారని, విచారణలో అసలు విషయాలు బయటపడతాయని పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కఠినంగా ఉన్నారని, తెలుగుదేశం నాయకుడు అంకులు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఇప్పటి వరకు నేను ఆయనను చూడలేదన్నారు. ఆయన్ను చంపితే మాకేం వస్తుందని, ఈ హత్య కేసులో ఎంతటి వారున్నా కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. చదవండి: కూల్చే సంస్కృతి టీడీపీదే: జయరామ్ తెలుగుదేశం నాయకులు శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన ఇంత గొప్పగా ఉంటుందని తెలుగుదేశం నాయకులు ఊహించలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజల దృష్టి మళ్లించడానికే టీడీపీ శవ రాజకీయాలు, దేవాలయాలపై దాడులు చేపిస్తోందన్నారు. యరపతినేని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నాలుగైదు హత్యలు జరిగాయని, అంటే వాటిని ఆయన చేయించాడా అని సూటిగా ప్రశ్నించారు. యరపతినేని నరేంద్ర హత్య కేసులో ముద్దాయి అన్న సంగతి మర్చిపోయాడా అని నిలదీశారు. కాగా గుంటూరు జిల్లాలో టీడీపీ నేత, మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకులు ఆదివారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. -
అభివృద్ధి పథంలో గురజాల
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయి. గురజాల నియోజకవర్గంలో కూడా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి ప్రజా సమస్యలకు పరిష్కార మార్గం చూపేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన చేపడుతున్న పనులకు విశేష ఆదరణ లభిస్తోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే నియోజకవర్గానికి ఆసుపత్రితో కూడిన వైద్య కళాశాల, పిడుగురాళ్లలో ప్రతి ఇంటికీ త్రాగునీరు, గ్రామాల్లో సీసీ రోడ్లు.. వంటి పథకాలు మంజూరు అయ్యేలా చేశారు. ఇలా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆయన చేస్తున్న కృషిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న జననేత సీఎం వైఎస్ జగన్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సొంత ఇల్లు లేని 19 వేల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నట్టు తెలిపారు. ► రూ. 350 కోట్లతో ఆసుపత్రితో కూడిన వైద్య కళాశాల.. తన అదే బాట కార్యక్రమంలో భాగంగా కాసు మహేష్రెడ్డి గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ఒక గర్భిణీ కాన్పు కొరకు సుమారు 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందడం ఆయనను కలచివేసింది. ఆ సమయంలో ఆయన మదిలో మెదిలిన ఆలోచనే ఈ ఆసుపత్రి తో కూడిన వైద్య కళాశాల. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పల్నాడు లోని ఏ ఒక్కరూ వైద్యం అందక ఇబ్బంది పడకూడదనే కృత నిశ్చయంతో తన మొదటి ప్రాధాన్యత క్రింద ఈ విషయాన్ని జననేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం వైఎస్ జగన్.. మొదటి బడ్జెట్లోనే నిధులు మంజూరు చేయడమే కాక, పరిపాలనా పరమైన అన్ని ఆమోదాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి శ్రావణ మాసంలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా భూమి పూజ చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ► రూ. 2650 కోట్లతో 7 నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి తాగునీరు.. మహేష్రెడ్డి ఆయన తాత దివంగత సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి నమ్మిన జలం జనానికి జీవనమనే సిద్ధాంతాన్ని అనుసరించి ముందుకు సాగుతున్నారు. పశ్చిమ గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజల కోసం బ్రహ్మానందరెడ్డి సాధించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు సాగునీరు అందించే విషయంలో సఫలీకృతం అయింది. అయితే త్రాగునీరు విషయంలో పల్నాడు నియోజకవర్గాలైన మాచర్ల, గురజాలతోపాటు వినుకొండ, చిలకూరిపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుండటంపై మహేష్రెడ్డి దృష్టిసారించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పటికీ.. మహేష్రెడ్డి ఇందుకు సంబంధించి తానే స్వయంగా ఒక ప్రణాళిక రూపొందించారు. నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలతోపాటు మిగిలిన ఆరుగురు శాసససభ్యులను కలుపుకుని ఈ సమస్యను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాకుండా సమస్య తీవ్రతను వివరించి సీఎం జగన్ అభినందనలు కూడా పొందారు. అలాగే తాను కోరిన పథకానికి కావాల్సిన ఆర్థిక, పరిపాలన పరమైన అన్ని అనుమతులు అందుకున్నారు. ► రూ. 34 కోట్లతో డ్రెయినేజీ నిర్మాణం.. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో రహదారుల తర్వాత మురుగు కాల్వల నిర్మాణం ప్రధానమైనది. ఈ నేపథ్యంలో మురుగు నీటి వ్యవస్థ క్రమబద్దీకరణ ఆవశ్యకతను మహేష్రెడ్డి గుర్తించారు. రహదారి నిర్మాణం జరిగే ప్రతి చోటా రహదారి ఇరువైపుల మురుగు నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు కాల్వల నిర్మాణం కొరకు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ వారితో అంచనాలు తయారు చేయించారు. రూ. 34 కోట్లతో అవసరమైన ప్రతి గ్రామంలో మురుగు నీటి పారుదల వ్యవస్థ ను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తున్నారు. ► రూ. 140 కోట్లతో పిడుగరాళ్ల పట్టణంలో ప్రతి ఇంటికి తాగునీరు.. మహేష్రెడ్డి తండ్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మంత్రిగా ఉన్న కాలంలో పిడుగురాళ్ల నగర పంచాయతీగా మార్పు చెందింది. అయితే పిడుగరాళ్ల పట్టణంలోని ప్రజలు త్రాగునీరు కొరకు విపరీతమైన ఇబ్బందులు పడటాన్ని తన అదే బాట కార్యక్రమంలో మహేష్రెడ్డి ప్రత్యక్షంగా గమనించారు. ఈ విషయంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, ముఖ్యంగా తాగునీరు తెచ్చుకునే సమయంలో మహిళలు పడుతున్న అవస్థలను సీఎం వైఎస్ జగన్కు మహేష్రెడ్డి వివరించారు. దగ్గరలోని బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి నేరుగా పిడుగురాళ్ల పట్టణానికి త్రాగు నీరందించే పథకానికి యుద్ధ ప్రాతిపదికన అంచనాలు తయారు చేయించి వాటికి సీఎం జగన్ను మెప్పించారు. రెండవ అసెంబ్లీ సమావేశాల్లోనే నిధులు మంజూరు చేయించడమే కాకుండా త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పనులు ప్రారంభ కార్యక్రమం జరపటానికి ప్రయత్నం చేస్తున్నారు. ► రూ. 55 కోట్లతో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మాణం.. గత ప్రభుత్వం గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను అందించటం లో పూర్తిగా విఫలమైన విషయాన్ని తన అదే బాట కార్యక్రమంలో కాసు మహేష్రెడ్డి నిశితంగా గమనించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ అంతర్గత రహదారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన ప్రతి గ్రామంలో.. కులాలకు, వర్గాలకు, పార్టీలకు అతీతంగా 55 కోట్ల రూపాయలతో అంతర్గత రహదారుల నిర్మాణానికి అంకురార్పణ చేయటం జరిగింది. ► మున్సిపాలిటీలుగా గురజాల, దాచేపల్లి గ్రామాలు గురజాల, దాచేపల్లి ప్రజల చిరకాల కోరిక ఆ రెండు గ్రామాలు మున్సిపాలిటీలుగా మార్పు చెందటం. ఈ మేరకు తన ఎన్నికల ప్రచారంలో కాసు మహేష్రెడ్డి ఆ రెండు గ్రామాలను మున్సిపాలిటీలుగా మారుస్తానని వాగ్దానం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సహకారంతో గురజాల, దాచేపల్లి గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చటం ద్వారా కాసు మహేష్రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆ రెండు గ్రామాల ప్రజల ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు కారణమయ్యారు. -
గురజాల కోర్టు తీర్పును రద్దు చేసిన హైకోర్టు
సాక్షి, అమరావతి: ఓ వ్యక్తి హత్య కేసులో నలుగురికి మరణశిక్ష విధిస్తూ 2018లో గుంటూరు జిల్లా, గురజాల పదో అదనపు జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. ఆ నలుగురు నిర్దోషులని ప్రకటించింది. ఇతర ఏవైనా కేసుల్లో వీళ్ల అవసరం లేకుంటే, వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. కాలిబాటకు సంబంధించిన వివాదంలో గుంటూరు జిల్లా, తంగేడ గ్రామానికి చెందిన సైదా అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన గాదెరిపల్లె సుభాని, పెదజాన్, మౌలాలి, మహ్మద్ కత్తితో పొడిచి చంపారన్న ఆరోపణలపై దాచేపల్లి పోలీసులు 2011లో కేసు నమోదు చేశారు. 2012లో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ జరిపిన గురజాల పదో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు.. సుభాని తదితరులు సైదాను హత్య చేశారని నిర్ధారిస్తూ 2018లో మరణశిక్ష విధించింది. అదే సమయంలో మరణశిక్ష పడ్డ దోషులు నలుగురు కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది కె.సురేశ్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హతుడిని ఈ నలుగురు వ్యక్తులు చంపుతుండగా చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరన్నారు. అరుదైన, హేయమైన కేసుల్లోనే మరణశిక్ష విధిస్తారని నివేదించారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.శ్రీనివాస్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసు మరణశిక్ష విధించదగ్గ కేసు కాదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం మృతుడు సైదాతో ఆ నలుగురు వ్యక్తులకు ఏవో వివాదాలు ఉన్నంత మాత్రాన అతనిని వారే హత్య చేశారని చెప్పడానికి ఏ మాత్రం వీల్లేదంది. గురజాల కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. -
రాత్రి దాడులు.. పొద్దున్న రాజీలు..!
సాక్షి, గుంటూరు: రాత్రి పూట ఇష్టానుసారం దాడులకు తెగబడటం.. పొద్దున్నే పోలీసుల ద్వారా రాజీలకు పంపడం.. టీడీపీ నేతల తీరిది. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారనే అక్కసుతో ఎస్సీ, ముస్లిం మైనార్టీ వర్గాలే టార్గెట్గా దాడులకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతలు విచక్షణా రహితంగా దాడులకు తెగబడుతుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు శాంతి కమిటీల పేరుతో వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇరువర్గాలపై కేసుల నమోదు పేరుతో హడావుడి చేసి, ఇరువర్గాల పెద్దలను పిలిపించి రాజీ కుదిర్చి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి. పోలింగ్ నిలిపేశారంటూ గ్రామస్తులు తిరగబడితే మాత్రం హత్యాయత్నం కేసులు నమోదు చేస్తూ పోలీసుస్టేషన్లకు లాక్కెళుతున్నారు. దీన్ని బట్టి చూస్తే పోలీసులు పక్షపాత ధోరణి ఏవిధంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. గుంటూరు జిల్లాలో ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతూనే ఉన్నాయి. పోలీసుల కళ్లెదుటే దౌర్జన్యకాండ జిల్లాలో ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఓటమి భయంతో టీడీపీ నేతలు రెచ్చిపోతూ అరాచకాలకు, దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే టార్గెట్గా పోలీసుల ఎదుటే వీరంగం వేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. తమకు ఓట్లు వేయలేదనే అక్కసుతో ఎన్నికలు ముగిసిన వెంటనే టీడీపీ నేతలు గురజాల పట్టణంలోని ముస్లింల ఇళ్లపై విచక్షణా రహితంగా దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేశారు. మూడు గంటల పాటు గురజాల పట్టణంలో తిరుగుతూ విధ్వంస కాండకు పాల్పడ్డారు. ఇదంతా అక్కడి సీఐ రామారావు సమక్షంలోనే జరగడం గమనార్హం. డీఎస్పీ హెడ్క్వార్టర్ అయిన గురజాల పట్టణంలో మూడు గంటలపాటు రోడ్లపై కత్తులు, రాడ్లు, కర్రలతో టీడీపీ నేతలు వీరంగం సృష్టిస్తున్నా పోలీసులు అడ్డుకున్న దాఖలాలు లేవంటే వీరు టీడీపీ నేతలకు ఏ స్థాయిలో ఊడిగం చేస్తున్నారో అర్థమవుతోందని బాధితులు వాపోతున్నారు. ఎట్టకేలకు ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు తీసుకుని రెండు కేసులు నమోదు చేశారు. అయితే విధ్వంసం సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా శాంతి కమిటీల పేరుతో రాజీ అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇంత దారుణ ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా ఏ ఒక్కరినీ అరెస్టు చేసిన దాఖలాలు లేవు. దాడులు చేస్తే కేసులు పెట్టరా? పెదకూరపాడు మండలం లగడపాడు గ్రామంలో ఆదివారం రాత్రి అంబేడ్కర్ జయంతి వేడుకలు జరుపుకుంటున్న ఎస్సీ వర్గీయులను టీడీపీ నేతలు అడ్డుకుని దాడులకు యత్నించారు. వైఎస్సార్సీపీకి ఓట్లు వేస్తారా అంటూ దూషిస్తూ తరుముకుంటూ వెళ్లారు. కర్రలు, రాడ్లతో వీరంగం సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో ఎస్సీ మహిళలంతా అంబేడ్కర్ విగ్రహం ఎదుట ధర్నాకు దిగినప్పటికీ టీడీపీ నేతలు వెనక్కు తగ్గలేదు. ఇదిలా ఉండగా ఎస్సీలపై దాడికి దిగిన టీడీపీ నేతలపై కేసు నమోదు చేయని పోలీసులు సోమవారం రాత్రి ఇరువర్గాల పెద్దలతో రాజీ కోసం తెరతీసినట్లు సమాచారం. ఇరువర్గాలతో శాంతి కమిటీలు ఏర్పాటు చేసి గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నట్లుగా కలరింగ్ ఇస్తున్నారు. నిజంగా పోలీసులకు గ్రామాల్లో శాంతిని నెలకొల్పాలనే ఉద్దేశమే ఉంటే దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలా చేస్తేనే వారు భవిష్యత్లో దాడులకు దిగకుండా భయం ఉంటుందని పలువురు సూచిస్తున్నారు. పోలింగ్ సమయంలో బూత్లోకి వెళ్లి రెండు గంటలపాటు తలుపులు మూసుకుని ఉద్రిక్తతకు కారణమైన స్పీకర్ కోడెలపై కేసు నమోదు చేయకుండా, అది తప్పు అని చెప్పినా వినకపోవడంతో తిరగబడిన గ్రామస్తులపై మాత్రం హత్యాయత్నం కేసు నమోదు చేసి వేధింపులకు గురిచేయడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. -
టీడీపీ నేతల దౌర్జన్యం.. ఆదినారాయణ ఆత్మహత్యాయత్నం
సాక్షి, గుంటూరు: జిల్లాలోని గురజాలలో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ అనుచరులు మరోసారి రౌడీయిజం ప్రదర్శించారు. మాజీ ఎమ్మెల్యే గడిపూడి మల్లికార్జునరావుకు చెందిన క్వారీ ఆక్రమణకు సంబంధించి ఆయన కుమారుడు ఆదినారాయణ, యరపతినేని శ్రీనివాస్ను ప్రశ్నించారు. దీంతో యరపతినేని అనుచరులు ఆదినారాయణపై దౌర్జన్యానికి దిగారు. టీడీపీ నేతల అమానుష ప్రవర్తనతో మనస్తాపానికి లోనైన ఆదినారాయణ ఆత్మహత్య యత్నం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆదినారాయణ సోదరుడు కోటి మీడియాతో మాట్లాడుతూ.. యరపతినేని వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపించారు. యరపతినేని తమ క్వారీని బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు. యరపతినేని ఆరాచాకాలపై పోలీసులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోటి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కూడా టీడీపీ నేతలు అతనిపై దౌర్జన్యానికి దిగారు. టీడీపీ నేతలు చికెన్ బాబు మరికొందరితో కలిసి కోటిని అక్కడి నుంచి బలవంతంగా లాక్కెళ్లారు. -
టీడీపీ నేతల దౌర్జన్యం.. ఆదినారాయణ ఆత్మహత్యాయత్నం
-
టీడీపీ నేతల వల్లే వేధింపులు
-
గురజాల పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత
-
అక్రమం చేసిందొకరు.. బలయ్యేది ఎందరో..?
సాక్షి, గుంటూరు : టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్రావు గురజాలలో చేసిన అక్రమ మైనింగ్ వ్యవహారంలో కిందిస్థాయి ఉద్యోగులను బలి చేసే కుట్ర జరుగుతోందని అధికారులు వాపోతున్నారు. అక్రమ మైనింగ్లో ఉద్యోగుల్ని బాధ్యుల్ని చేసి.. అక్రమ సున్నపురాయి క్వారీల కేసును ప్రభుత్వం నీరుగార్చేందుకు పావులు కదుపుతోందని వారు అంటున్నారు. ఈ కేసు నుంచి ఎమ్మెల్యే యరపతినేనిని తప్పించడానికి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోందని వారు చెప్తున్నారు. అక్రమ మైనింగ్ జరిగిన పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో గతంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తోన్న అధికారులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మైనింగ్ అక్రమాలపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ నలుగురు తహశీల్దార్లు, ఐదుగురు వీఆర్వోలు, ఐదుగురు గ్రామ కార్యదర్శులకు ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చారు. కిందిస్థాయి ఉద్యోగుల్ని బదిలీ చేసి అక్రమాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం కోర్టుకు నివేదిక ఇవ్వాలని భావిస్తోందని, అందుకే కిందిస్థాయిలో ఉన్న తమను టార్గెట్ చేస్తున్నారని ఉద్యోగులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మైనింగ్కు పాల్పడిన రాజకీయ నేతలు, వారికి సహకరించిన ఉన్నత అధికారులపై చర్యలు తీసుకోకుండా.. తమను లక్ష్యంగా చేసుకోవడంపై వారు మండిపడుతున్నారు. -
పోలీసుల అదుపులో తప్పించుకున్న ఖైదీ
గురజాల (గుంటూరు) : భార్యను చంపిన కేసులో ముద్దాయిగా ఉండి మూడు సంవత్సరాలు శిక్ష అనుభవించిన అనంతరం పేరోల్ పై బయటకు వచ్చి అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా దుర్గి మండలం కంచరకుంట గ్రామంలో చోటుచేసుకుంది. గుంటూరుకు చెందిన కొప్పుల యోగయ్య(45) 1990 నవంబర్ 26న భార్యను హత్య చేశాడు. దీంతో గుంటూరు కోర్టు 1991లో అతనికి జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. అప్పటి నుంచి మూడేళ్ల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించిన యోగయ్య 1994 జూలై 6న పేరోల్ పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా.. కళ్లు కప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. యోగయ్య దుర్గి మండలం కంచరగుంటలో నివాసముంటున్నాడనే సమాచారం అందడంతో.. జైలర్ తన సిబ్బందితో రంగంలోకి దిగి అతన్ని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. -
అనుమానం పెనుభూతమై..
- మాడుగులలో భార్యను చంపిన భర్త - జమ్మలమడకలో కొడవలితో భార్య గొంతు కోసిన భర్త - తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు అనుమానం రెండు సంసారాల్లో చిచ్చుపెట్టింది. భార్యను శంకించి ఒకరేమో కొడవలితో గొంతు కోశాడు. ఆమె తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మరో ప్రబుద్ధుడు సుత్తితో భార్య తలపై మోది హత్య చేశాడు. ఈ రెండు ఘటనలు పల్నాడులోని మాచర్ల, గురజాల మండలాల్లో జరిగాయి. బాధితులు ఇద్దరూ గురజాల మండలం మాడుగుల గ్రామానికి చెందిన ఆడపడుచు, కోడలు కావడం విషాదకరం. గురజాల: అనుమానంతో భార్యను కడతేర్చిన ఘటన మండలంలోని మాడుగులలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురజాలకు చెందిన చిటిమాల మల్లమ్మ(38)కు మాడుగుల గ్రామానికి చెందిన పగిడిపల్లి సుందరరావుతో 17 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మల్లమ్మ మాడుగుల గ్రామంలో అంగడీవాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. మల్లమ్మపై భర్త అనుమానం పెంచుకోవడంతో కుటుంబ కలహాలు పెరిగాయి. ఈ క్రమంలో ఏడాదిన్నరగా మల్లమ్మ పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటూ మాడుగులలో విధులు నిర్వర్తిస్తోంది. అనుమానంతో తన భర్త వేధిస్తున్నాడని గతంలో మల్లమ్మకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం సుందరరావు మాడుగులలోని అంగన్వాడీ కేంద్రం వద్దకు వెళ్లి.. మనస్పర్థలు మరిచి కలిసి ఉందామని మల్లమ్మకు నమ్మబలికాడు. అనంతరం ఇంటికి తీసుకువెళ్లి ఇనుప సుత్తితో తలపై బలంగా కొట్టి చంపేశాడు. అనంతరం ఇంటిలోంచి మల్లమ్మ శవాన్ని బయట పడేసి, పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలాన్ని ఎస్హెచ్వో ఎం.రాజేష్కుమార్ సందర్శించి, వివరాలు సేకరించారు. మృతిరాలి తండ్రి చిటిమాల వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. జమ్మలమడకలో భార్య గొంతు కోసిన భర్త మాచర్ల టౌన్: అనుమానంతో భార్య గొంతు కోసి, హతమార్చేందుకు ఓ ప్రబుద్ధుడు ప్రయత్నించిన ఘటన మండలంలోని జమ్మలమడక గ్రామంలో గురువారం జరిగింది. ఆస్పత్రిలో బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆలేటి విక్రమ్కు గురజాల మండలం మాడుగులకు చెందిన సౌజన్యతో ఏడేళ్ల కిందట వివాహమైంది. ఇటీవల సౌజన్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న విక్రమ్ తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం భార్యతో గొడవపడ్డాడు. మాటమాట పెరగడంతో ఇంట్లో ఉన్న కొడవలితో సౌజన్య గొంతు కోసేందుకు విక్రమ్ యత్నించాడు. ఆమె ప్రతిఘటించి చేతులను అడ్డుపెట్టుకోవడంతో తెగాయి. చేతులు పక్కకు తీయగానే గొంతు కోశాడు. గొడవను గమనించి భయపడిన వారి కుమారుడు వినయ్కుమార్ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. దీంతో విక్రమ్ అక్కడినుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న సౌజన్యను చికిత్స కోసం పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ ఎస్ఐ సోమేశ్వరరావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రికి వెళ్లి సౌజన్య నుంచి వివరాలు సేకరించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.


