breaking news
Gudur court
-
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి విడుదల వాయిదా
సాక్షి, నెల్లూరు: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి విడుదల వాయిదా పడింది. కోర్టు ఆర్డర్స్ ఆలస్యంతో కాకాణి ఆలస్యమైంది. గూడూరు కోర్టులో ఉదయమే ఆర్డర్స్ కోసం కాకాణి లాయర్లు అప్లై చేశారు. సాయంత్రం 5:30 గంటలు దాటాక కోర్టు ఆర్డర్స్ రిలీజ్ చేసింది. జైలు రిలీజింగ్ సమయం ముగిసిందని జైలు అధికారులు తెలిపారు.వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా కేసుల మీద కేసులు పెడుతూ జైలు నుంచి బయటకు రాకుండా చేస్తున్న కూటమి ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాక్నిచ్చిన సంగతి తెలిసిందే. రుస్తుం మైనింగ్ కేసులో ఏపీ హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించినట్లయ్యింది. బెయిల్పై ప్రాసిక్యూషన్ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. ఆ అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. కొన్ని షరతులతో కాకాణికి బెయిల్ మంజూరు చేస్తూ.. తీర్పు ఇచ్చింది.‘సహ నిందితుని వాంగ్మూలం ఆధారంగానే దర్యాప్తు చేశారు. సహ నిందితుని వాంగ్మూలాన్ని సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకోలేం. దాదాపు 36 మంది సాక్షులను విచారించారు. వారి వాంగ్మూలాలను రికార్డ్ చేశారు. కాబట్టి సాక్షులను బెదిరిస్తారని, సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న ఆందోళన ఎంత మాత్రం అవసరం లేదు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఏమీ లేదు. దర్యాప్తులో ప్రాథమిక భాగమంతా పూర్తయింది. కాబట్టి దర్యాప్తు ప్రభావితమయ్యే అవకాశం లేదు.కాకాణి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా. కాబట్టి ట్రయల్ సందర్భంగా ఆయన హాజరుకాకపోవడం అంటూ జరగదు. కాకాణిపై నమోదైన 14 కేసుల్లో ఇది కూడా ఒకటి. ఈ కేసులన్నింటినీ కూడా సహ నిందితుల వాంగ్మూలాల ఆధారంగా నమోదు చేసినవే. కాకాణి సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే. ఈ కేసులో సాక్ష్యం ఇచ్చింది మాజీ మంత్రి, ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే. ఒకే నియోజకవర్గానికి చెందిన రెండు పార్టీలకు చెందిన ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య జరుగుతున్న న్యాయ, రాజకీయ పోరాటం ఇది.’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.కాకాణిపై 13 కేసులు ఉన్నాయని, ఆయనకు బెయిలిస్తే దర్యాప్తులో జోక్యం చేసుకోవడంతోపాటు సాక్షులను బెదిరిస్తారన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఒకటి కంటే ఎక్కువ కేసులు ఉన్నంత మాత్రాన దానిని నేర చరిత ఉన్నట్లుగా భావించలేమని, ఈ కారణంగా బెయిల్ను నిరాకరించలేమని తేల్చి చెప్పారు. కాకాణిపై నమోదైన దాదాపు అన్నీ కేసుల్లోనూ బెయిల్ వచి్చందని, బెయిల్ షరతులను దుర్వినియోగం చేసినట్లు గానీ, సాక్ష్యాలను తారుమారు చేసినట్లు, సాక్షులను బెదిరించినట్లు గానీ ఎలాంటి ఫిర్యాదులు లేవని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.బెయిల్ ఇస్తే ట్రయల్ సందర్భంగా కాకాణిని కోర్టు ముందు హాజరుపరచడం కష్టమవుతుందన్న వాదననూ న్యాయమూర్తి తోసిపుచ్చారు. కాకాణి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. బెయిల్ మంజూరు చేస్తే కాకాణి సాక్షులను, సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న వాదననూ తిరస్కరించారు. అరెస్ట్కు ముందు ఆయన సాక్షులను బెదిరించినట్లు ఎలాంటి ఆరోపణలు లేవని పేర్కొన్నారు. -
ఘర్షణ కేసులో 97 మందికి జైలు
► ముద్దాయిల్లో మాజీ ఎమ్మెల్యే కొమ్మి ► గూడూరు జడ్జి సంచలన తీర్పు పొదలకూరు : టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఘర్షణకు దిగిన ఘటనలో అడ్డుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన కేసులో గూడూరు జూనియర్ సివిల్ జడ్జి కేపీ సాయిరాం ఇరువర్గాలకు చెం దిన 97 మందికి ఆరు మాసాల జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు చె ప్పారు. ఎస్సై కే.ప్రసాద్రెడ్డి తెలిపిన వివరాలు..19-07-2000 సంవత్సరంలో పొదలకూరు మండలంలోని సూరాయపాళేం గ్రామంలో పాఠశాల భవన ప్రారంభోత్సవంలో టీడీపీ, కాంగ్రెస్ వర్గాలకు ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. ఇరువర్గాలను అదుపు చేసే నేపథ్యంలో అప్పటి ఎస్సై రవికిరణ్ తీవ్రంగా గాయపడ్డారు. సీఐ కంపా ప్రసాద్రా వు అప్పట్లో రెండు పార్టీలకు చెందిన 117 మందిపై పొదలకూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. క్రైమ్ నెం బరు 69/2000 కింద పోలీసులు కేసునమోదు చేశారు. 117 మందిలో ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు, అప్పటి సూరాయపాళేం సర్పంచ్ పులి సుబ్బారెడ్డిలు ఉన్నారు. సుదీర్ఘకాలం గూడూరు కోర్టులో కేసు నడిచిన తర్వాత నిందితులకు శిక్షలు పడ్డాయి. ఈ కేసులో ఉన్న 117 మందిలో 20 మంది వయోభారం మీ దపడి, వివిధ కారణాల వల్ల మృతి చెందారు. మిగిలిన 97 మందికి శిక్షణలు పడ్డాయి. శిక్షణలు ప డిన వారిలో ఏఎస్పేట మండలం విజిఆర్ సుబ్బారెడ్డి, పొ దలకూరు మండలంలోని చెన్నారెడ్డిపల్లి, నావూరు, సూరాయపాళేం, మాముడూరు తదితర గ్రామాలకు చెందిన టీ డీపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ(ప్రస్తుతం) నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.15ఏళ్ల తర్వాత పదుల సంఖ్యలో నిందితులకు శిక్షలు పడటం, సుదీర్ఘ రాజకీయాల్లో కొనసాగుతు న్న నాయకులు కా వడం వల్ల జి ల్లాలో ఈ కేసు సంచల నాత్మక తీర్పుగా మారింది. ఈ కే సులో ఏపీపీలు గా నాగేశ్వర్రావు, రమేష్లు కేసును వాదించారు.