-
గ్రూప్–2కు తొలగిన అడ్డంకులు
సాక్షి, హైదరాబాద్ : గ్రూప్–2 రాత పరీక్షల్లో బబ్లింగ్, వైట్నర్ వాడకం వివాదంపై హైకోర్టు ధర్మాసనం సోమవారం కీలక తీర్పు వెలువరించింది. రెండుసార్లు బబ్లింగ్కు పాల్పడిన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోరాదన్న సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది. బబ్లింగ్ జరిగింది వ్యక్తిగత వివరాల నమోదులో మాత్రమేనని, ప్రశ్నలకు అభ్యర్థులు ఎంచుకున్న జవాబులకు కాదని ధర్మాసనం తేల్చిచెప్పింది. దీనివల్ల ప్రతిభపై ఎలాంటి ప్రభావం ఉండబోదని, కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్–బీఎం విజయకుమార్ల మధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇక్కడ వర్తించదని ధర్మాసనం ఉదహరించింది. ఇన్విజిలేటర్లకు సరైన అవగాహన లేకపోవడం వల్లే అభ్యర్థులు రెండుసార్లు బబ్లింగ్కు పాల్పడ్డారన్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వాదనతో ఏకీభవించింది. వ్యక్తిగత వివరాల నమోదులో పొరపాట్లు జరిగిన కారణంగానే వైట్నర్ వినియోగించాల్సి వచ్చిందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నియమించిన సాంకేతిక కమిటీ, సబ్ కమిటీల సిఫార్సుల మేరకు నియామక ప్రక్రియను కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. కమిటీ ఏర్పాటులో పక్షపాతం లేదు... టీఎస్పీఎస్సీ నియమించిన సాంకేతిక కమిటీలో టీఎస్పీఎస్సీ ప్రతినిధులు ఎవరూ లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కమిటీలో ఓయూ, జేఎన్టీయూ, నేషనల్ బ్యాంకింగ్ సర్వీస్కు చెందిన వారున్నారని గుర్తించాలని పేర్కొంది. ఈ కమిటీ ఏర్పాటులో ఏమాత్రం పక్షపాతం కనబడలేదని తేల్చింది. కమిటీతో సమస్య జటిలమైంది... ‘ఇన్విజిలేర్ల పొరపాటు కూడా ఉంది. వ్యక్తిగత వివరాల నమోదులో బబ్లింగ్ను పరిగణనలోకి తీసుకోవాలి. సాంకేతిక కమిటీ సిఫార్సులకు లోబడి టీఎస్పీఎస్సీ సబ్ కమిటీ వేసింది. సాంకేతిక కమిటీ సూచనల్ని అమలు చేయాలని సబ్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ కారణంగా టీఎస్పీఎస్సీ తీసుకున్న నిర్ణయం సమర్ధనీయమే. అయితే సింగిల్ జడ్జి... సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా సాంకేతిక వ్యవహారాలపై ముగ్గురు సీనియర్ న్యాయవాదులతో కమిటీని ఏర్పాటు చేయడం తగదు. పైగా న్యాయవాదుల కమిటీ సమస్యను మరింత జటిలం చేసింది. సింగిల్ జడ్జి నియమించిన న్యాయవాదుల కమిటీ కారణంగా రోగికి ఉన్న జబ్బు కంటే చికిత్స దారుణంగా మారినట్లు అయింది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
మంగళసూత్రానికే ‘పరీక్ష’
ఇందూరు: గ్రూప్–2 పరీక్షకు హాజరైన ఓ మహిళను మంగళసూత్రం తీసేసి పరీక్షకు హాజరుకావాలని ఆదేశించడంతో పరీక్ష రాయకుండానే వెనుదిరిగింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని సిద్దార్థ మహిళా డిగ్రీ కళాశాలలో ఆదివారం గ్రూప్–2 పరీక్షకు హాజరైన ఓ మహిళా అభ్యర్థిని మంగళసూత్రం తీసివేయాలని ఇన్విజిలేటర్ ఆదేశించారు. దానికి సదరు మహిళ ససేమిరా అనడంతో 10 నిమిషాలు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు తాళి కంటే పరీక్ష గొప్పేం కాదంటూ వెనుదిరిగింది. విషయం బయటకు తెలియకుండా అధికారులు జాగ్రత్తపడినట్లు సమాచారం. జిల్లాలోని పలు కేంద్రాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని మరో పరీక్ష కేంద్రం లో కొత్తగా పెళ్లైన ఓ మహిళా అభ్యర్థిని పసుపుతాడు తీయాలని ఇన్విజిలేటర్ ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. మహిళా అభ్యర్థులు మంగళసూత్రాలు తీయాలనే నిబంధనలు లేవని ఉన్నతాధికారులు చెబుతున్నా ఇలాంటి సంఘటనలు జరగడం గమనార్హం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement