breaking news
Google News Initiative
-
గూగుల్ న్యూస్ డైరెక్టర్ ఉద్యోగం ఊడింది.. ‘ఇంటికెళ్లి అమ్మను చూసుకుంటా’!
Google News Director Madhav Chinnappa laid off : ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ భారీ షాకిచ్చింది. ‘గూగుల్ న్యూస్’ డైరెక్టర్ మాధవ్ చిన్నప్పను విధుల నుంచి తొలగించింది. ఆర్ధిక మాంద్యం భయాల కారణంగా 13 ఏళ్ల పాటు గూగుల్లో పనిచేసిన మాధవ్ను తొలగిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ, సుధీర్ఘ కాలం పాటు గూగుల్లో పని చేయడం గర్వంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా..యూకే నుండి గూగుల్ న్యూస్ డైరెక్టర్గా విధులు నిర్వహించిన మాధవ్ చిన్నప్ప తన ఉద్యోగం కోల్పవడంతో మరో కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లు లింక్డిన్ పోస్ట్లో పేర్కొన్నారు. కొత్త అవకాశాలను అన్వేషించేందుకు నెల రోజుల ముందు నుంచే సంస్థను విడిచిపెడుతున్నాను. భారత్కి వెళ్లి అమ్మను చూడాలి. సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 2 వరకు మిగిలిన పనుల్ని పూర్తి చేసుకుంటానని అన్నారు. 12వేల మంది తొలగింపు ఈ ఏడాది జనవరిలో గూగుల్ 12,000 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గత నెలలో మళ్లీ కంపెనీ తన మ్యాపింగ్ యాప్ వేజ్లో ఉద్యోగ కోతలను ప్రకటించింది. అప్పటి నుండి, తొలగింపుల వల్ల ప్రభావితమైన ఉద్యోగుల కథనాలు సోషల్ మీడియాలో పుట్టుకొస్తున్నాయి. కొంతమంది ఉద్యోగులు ప్రసూతి సెలవుల్లో ఉన్నప్పుడు ఉద్యోగం కోల్పోయారు. మరికొందరు సెలవులో ఉన్నప్పుడు పింక్ స్లిప్ అందుకున్నారు. ముఖ్యంగా, కంపెనీ మెంటల్ హెల్త్ హెడ్తో సహా కొంతమంది గూగుల్లో పలు విభాగాల్లో ముఖ్య పాత్రపోషిస్తున్న డైరక్టర్ స్థాయి ఉన్నత ఉద్యోగులు ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారి జాబితాలో ఉన్నారు. -
ఎన్నికల వేళ.. పాత్రికేయులకు గూగుల్ ప్రత్యేక పాఠాలు
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తుండటంతో అసత్య వార్తల వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సంస్థ జర్నలిస్టులకు ఉచితంగా ట్రెయినింగ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వెబ్సైట్లకు తోడు, సోషల్ మీడియాలోనూ తప్పుడు సమాచారం, తప్పుడు వార్తలు బాగా ప్రచారమవుతున్నాయి. ఈ క్రమంలో అలాంటి సమాచారం, వార్తలు జనాలకు ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. తప్పుడు వార్తలను తెలుసుకునేందుకు, మరింత నాణ్యమైన సమాచారాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశ్యంతో డిజిటల్ లీడ్స్, ఇంటర్న్యూస్ సహకారంతో గూగుల్ దేశంలో ఉన్న జర్నలిస్టులకు ఉచితంగా ట్రెయినింగ్ ఇవ్వాలని సంకల్పించింది. ఇప్పటికే 'గూగుల్ న్యూస్ ఇనీషియేటివ్' పేరుతో దేశంలో ఉన్న జర్నలిస్టులకు గూగుల్ ప్రత్యేక వర్క్షాపుల్లో ట్రెయినింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది జూలై 20 నుంచి సెప్టెంబర్ 15 వరకు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో గూగుల్ శిక్షణ తరగతులను నిర్వహించింది. త్వరలో పార్లమెంట్తోపాటూ, వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా గూగుల్ న్యూస్ ఇనీషియేటివ్లో భాగంగా పోల్ చెక్.. కవరింగ్ ఇండియాస్ ఎలక్షన్ పేరుతో శిక్షణ తరగతులను నిర్వహించనుంది. ఆన్లైన్ వెరిఫికేషన్, ఫ్యాక్ట్ చెకింగ్, డిజిటల్ సేఫ్టీ అండ్ సెక్యురిటీ, ఎన్నికల కవరేజీకి యూట్యూబ్ వాడే విధానం, డేటా విజువలైజేషన్వంటి అంశాలపై జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వనున్నట్టు గూగుల్ తెలిపింది. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6వరకు 30 నగరాల్లో ఇంగ్లీష్, హిందీ, మలయాళం, బంగ్లా, కన్నడ, గుజరాతీ, ఒడిషా, తమిళం, తెలుగు, మరాఠీ భాషలకు చెందిన జర్నలిస్టులకు ట్రెయినింగ్ ఇవ్వనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. జర్నలిస్టులుగా విధులు నిర్వహిస్తున్నవారితో పాటూ జర్నలిజం విద్యార్థులు ఉచిత శిక్షణ తరగతులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అందులో అర్హత ఉన్నవారిని ఎంపిక చేసి ఉచితంగా ట్రెయినింగ్ ఇస్తారు. 2016 నుంచి భారత్లో 40 నగరాల్లో 13,000 మందికిపైగా జర్నలిస్టులకు గూగుల్ శిక్షణనిచ్చిందని ఆసియా పసిఫిక్ గూగుల్ న్యూస్ ల్యాబ్ లీడ్ ఐరేన్ జే లియూ పేర్కొన్నారు. ఇక ట్రెయినింగ్ సమయంలో నకిలీ వార్తలు, సమాచారాన్ని ఎలా గుర్తించాలి అనే విషయాలపై జర్నలిస్టులకు అవగాహన కల్పిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్లో మార్చి 13న, విశాఖపట్నంలో మార్చి 23న తెలుగు, ఇంగ్లీష్ బాషల్లో శిక్షణ ఇవ్వనున్నారు. గూగుల్ న్యూస్ ఇనీషియేటివ్లో భాగంగా పోల్ చెక్.. కవరింగ్ ఇండియాస్ ఎలక్షన్ శిక్షణ తరగతులు జరగనున్న తేదీలు, ప్రదేశాల వివరాలు..