breaking news
German airline
-
లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ వజ్రోత్సవం
న్యూఢిల్లీ: లుఫ్తాన్సా జర్మన్ ఎయిర్లైన్స్ ఢిల్లీకి ఎయిర్లైన్స్ సేవలు ప్రారంభించి 60 ఏళ్లు పూర్తయింది. ఈ వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ ఢిల్లీలోని తాజ్ మహల్ హోటల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. లుఫ్తాన్సా గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫ్రాంక్ నేవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఢిల్లీకి ఏ380 ఫస్ట్క్లాస్ సరీ్వసును తిరిగి అందిస్తున్నట్టు ప్రకటించారు. 1963 సెపె్టంబర్ 1న బోయింగ్ 720 సరీ్వస్ను ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి ఈ సంస్థ ప్రారంభించడం గమనార్హం. భారత వృద్ధి పథాన్ని ముందే నమ్మిన వారిలో తామూ కూడా ఒకరమంటూ, మరో 60 ఏళ్లపాటు భారత్తో బలమైన అనుబంధానికి కట్టుబడి ఉన్నామని లుఫ్తాన్సా గ్రూప్ పేర్కొంది. -
ఎయిర్ లైన్స్ కు షాక్.. ప్రయాణీకుడికి 20 లక్షల పరిహారం!
చెన్నై: ఓ ప్రయాణికుడికి 20 లక్షల పరిహారం చెల్లించాలని జర్మనీ దేశపు లుఫ్తాన్సా ఎయిర్స్ లైన్స్ ను తమిళనాడు రాష్ట్ర కన్స్యూమర్ రీడ్రసల్ కమిషన్ ఆదేశించింది. నాలుగేళ క్రితం ఫ్రాంక్ ఫర్ట్ నుంచి మాడ్రిడ్ కు ప్రయాణించిన సమయంలో ఆరోగ్యం సరిగా లేకపోవడంతో లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ లో బిజినెస్ క్లాస్ బుకింగ్ చేసుకున్నానని, అయితే తనకు చెప్పకుండా ఎకానమీ క్లాస్ కు మార్చారని 70 సంవత్సరాల ప్రయాణీకుడు శివ ప్రకాశ్ గోయెంకా ఎయిర్ లైన్స్ పై ఫిర్యాదు చేస్తూ కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించారు. ఆతర్వాత పరిహారంగా తనకు 1500 యూరోల వోచర్ ఇచ్చారని, కాని తనకు 2.5 లక్షల టికెట్ రుసుం రీఫండ్ చేయాలని, తనకు కలిగిన అసౌకర్యారనికి 65 లక్షలు పరిహారం చెల్లించాలని కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అయితే తాము రెండు ఎకానమీ క్లాస్ టికెట్లను ఇచ్చామని.. వోచర్ ను స్వీకరించారని జర్మన్ ఎయిర్ లైన్స్ తన వాదనను వినిపించింది. ఆ సమయంలో తాను అధికారులతో గొడవకు దిగితే ఫ్లైట్ మిస్ అవుతుందనే కారణంతో వెళ్లిపోయానని కన్స్యూమర్ కోర్టుకు బాధితుడు తెలిపారు. దాంతో గోయెంకాకు 20 లక్షల పరిహారం చెల్లించాలని ఎయిర్ లైన్స్ ను కోర్టు ఆదేశించింది.