-
కంటి వ్యాధులకు జన్యు చికిత్స
న్యూఢిల్లీ: వంశపారంపర్యంగా వచ్చే కంటి వ్యాధులను నయం చేసేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రిలయన్స్ లైఫ్ సైన్సెస్కు లైసెన్స్ ఇచ్చింది. ఈ జన్యు చికిత్సను రిలయన్స్ లైఫ్ మరింత అభివృద్ధి చేసి వాణిజ్యపరం చేయనుంది. జన్యు చికిత్సకు (జీన్ థెరపీ) సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, భారత్లోని ఒక విద్యాసంస్థ నుండి కంపెనీకి బదిలీ చేయడం ఇదే మొదటిసారి అని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఐఐటీ కాన్పూర్కు చెందిన బయాలాజికల్ సైన్సెస్, బయో ఇంజనీరింగ్ విభా గానికి చెందిన జయంధరణ్ గిరిధర రావు, శుభమ్ మౌర్య ఈ పేటెంటెడ్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. జంతువుల్లో దృష్టి లోపాన్ని సరిదిద్దడంలో ఇది మెరుగ్గా పనిచేసిందని ఐఐటీ కాన్పూర్ తెలిపింది. -
‘థెరపీ’ ప్రకటనలపై గూగుల్ బ్యాన్
శాన్ప్రాన్సిస్కో: శాస్త్రీయంగా నిర్థారణ కాని వైద్య చికిత్సలకు సంబంధించిన ప్రకటనలపై నిషేధం విధిస్తున్నట్లు సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ శుక్రవారం ప్రకటించింది. స్టెమ్ సెల్ థెరపీ, సెల్యూలార్ థెరపీ, జీన్ థెరపీల వంటి శాస్త్రీయంగా పూర్తిగా నిర్ధారణకాని ప్రయోగాత్మక వైద్య విధానాలకు సంబంధించిన యాడ్లు ఇకపై గూగుల్లో కనుమరుగు కానున్నాయని గూగుల్ పాలసీ సలహాదారు ఆడ్రిన్నె బిడ్డింగ్స్ తెలిపారు. బయో మెడికల్, సైంటిఫిక్ ఆధారాలు లేని అన్ని వైద్యవిధానాలు, థెరపీ ప్రకటనల నియంత్రణ కోసం కొత్త పాలసీ తీసుకొచ్చినట్లు ఆమె చెప్పారు. రోగాలతో బాధపడుతున్న వారు ఈ తరహా యాడ్స్ కారణంగా తప్పుదోవ పడుతున్నారని గూగుల్ పేర్కొంది. ఇది మెడికల్ పరిశోధనలను తప్పుబట్టడం కాదని, నిర్థారణ కానటువంటి వాటిపై ఓ కన్నేసి ఉంచడం మాత్రమే అని స్పష్టం చేసింది. దీన్ని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్ అధ్యక్షుడు దీపక్ శ్రీవత్సవ స్వాగతించారు. సంపూర్ణ చికిత్సా విధానాలుగా అభివృద్ధిగాని ఇలాంటి చికిత్సలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటివి ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయన్నారు. ఇలాంటి సందేశాలను నియంత్రించడంలో ఆన్లైన్ సర్వీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. -
జన్యు చికిత్సతో పక్షవాతానికి చెక్
లండన్ : పక్షవాత బాధితులకు ఊరటగా మెరుగైన చికిత్సా పద్ధతులను శాస్త్రవేత్తలు ఆవిష్కరించే క్రమంలో జన్యు చికిత్స వేలాది బాధితులకు వరంగా మారనుంది. జీన్ థెరఫీ ద్వారా పక్షవాత రోగులు చచ్చుబడిపోయిన కాళ్లు, చేతులు, భుజాలపై తిరిగి నియంత్రణ సాధించేలా చేయవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పక్షవాతానికి గురైన ఎలుకలపై పరిశోధకులు చేపట్టిన అథ్యయనం సానుకూల ఫలితాలను ఇవ్వడంతో జన్యు చికిత్స ద్వారా అద్భుతాలు ఆవిష్కరించవచ్చని అంచనా వేస్తున్నారు. లండన్లోని కింగ్స్ కాలేజ్కు చెందిన న్యూరోసర్జన్ల బృందం చేపట్టిన ఈ అథ్యయనంలో పక్షవాత చికిత్సలో మేలి మలుపు వంటి అంశాలను గుర్తించారు. ఇక వెన్నుపూస గాయాలతో రోజువారీ పనులు చేసుకునేందుకు ఇబ్బందిపడే వారికి ఆయా అవయవాల్లో తిరిగి కదలిక రావడం అసాధ్యమవుతున్న క్రమంలో తాజా అథ్యయన వివరాలు చికిత్సా పద్ధతులను కొత్తపుంతలు తొక్కిస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. పక్షవాతం, వెన్నుపూస గాయాలతో ఇబ్బంది పడే వారికి సరికొత్త చికిత్సా పద్ధతుల ద్వారా మెరుగైన జీవితాన్ని అందించేలా తమ అథ్యయన ఫలితాలు వెల్లడయ్యాయని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఎలిజమెత్ బ్రాడ్బురీ తెలిపారు. -
మధుమేహానికి జన్యుచికిత్స!
జన్యువుల్లో మార్పులు చేస్తే బోలెడన్ని వ్యాధులకు సమర్థంగా చికిత్స కల్పించవచ్చు. అయితే ఇందుకోసం జన్యువులను కత్తిరించాలి. అవసరమైన కొత్త జన్యువులను చేర్చాలి లేదంటే తొలగించాలి. ఈ మార్పులు చేర్పులు దీర్ఘకాలంలో శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియని కారణంగా ఇప్పటివరకూ జన్యుచికిత్స అంతగా అందుబాటులోకి రాలేదు. సాల్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు ఈ లోటు కూడా తీరనుంది. జన్యు ఎడిటింగ్ టెక్నాలజీ క్రిస్పర్ –క్యాస్ 9 సాయంతో వీరు ఎలాంటి కత్తిరింపులు లేకుండానే మధుమేహంతోపాటు కొన్ని ఇతర జబ్బులను సమర్థంగా నయం చేయగలిగారు. ఎలుకలపై జరిపిన ఈ ప్రయోగాల్లో అవసరమైన జన్యువులను చైతన్యపరచడం లేదంటే ఆఫ్ చేయడం ద్వారా తాము వ్యాధులను నయం చేయగలిగినట్లు ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త జువాన్ కార్లోస్ అంటున్నారు. క్రిస్పర్ క్యాస్ 9 టెక్నాలజీలో జన్యువులను కత్తిరించే క్యాస్ 9 ఎంజైమ్ స్థానంలో తాము చైతన్యం లేని డీక్యాస్ 9ను ఉపయోగించామని, దీనివల్ల ఇది నిర్దిష్ట జన్యువును కచ్చితంగా చేరుకోగలిగినా.. దానికి ఏమాత్రం నష్టం కలిగించదని జువాన్ తెలిపారు. డీక్యాస్ 9 ఎంజైమ్కు కొన్ని రసాయనాలను జోడించడం ద్వారా కావాల్సిన జన్యువులను ఆన్/ఆఫ్ చేయగలదని వివరించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితోపాటు మధుమేహం, మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధులపై తాము ఈ టెక్నాలజీని ప్రయోగించిన సత్ఫలితాలు రాబట్టామన్నారు. -
150 ఏళ్లు జీవిస్తాడట!
లండన్: పెళ్లి పెటాకులు లేకుండా తాను నిక్షేపంగా 150 ఏళ్లు బతుకుతానని ‘యాంటీ ఏజింగ్ ఎక్స్పర్ట్’ డాక్టర్ అలెక్స్ జావోరొంకోవ్ చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతోపాటు వయోభారాన్ని అరికట్టే మందులు, సప్లిమెంట్లు తీసుకుంటూ జీవిస్తానని తెలిపారు. పెళ్లి, పిల్లలు బాదరబందీ లేకుండా తన భావి జీవితాన్ని మొత్తం ఏజింగ్ను అరికట్టే ప్రయోగాలకే అంకితం చేస్తానని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆయన బ్రిటన్లోని బయోజెరంటాలోజీ రీసెర్చ్ ఫౌండేషన్కు డైరెక్టర్గా పని చేస్తున్నారు. భవిష్యత్తులో జన్యువుల చికిత్సకు సంబంధించిన వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తాయని, వాటిని కూడా తాను తీసుకుంటానని ఆయన చెప్పారు. మానవుల ఆయుషు ప్రమాణం 150 ఏళ్లకు చేరుకున్నప్పుడు 74 ఏళ్లకు వృద్ధాప్యం ప్రారంభమవుతుందని అన్నారు. జాతీయ గణాంకాల ప్రకారం బ్రిటన్లో ఆయుషు ప్రమాణం మగవాళ్లలో 78.8 ఏళ్లు, ఆడవాళ్లలో 82.8 ఏళ్లని ఆయన చెప్పారు. ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రావడం వల్ల బ్రిటన్లో ఆయుషు ప్రమాణం గణనీయంగా పెరిందన్నారు. మానవుల ఏజింగ్ను అరికట్టే ప్రయోగాలెన్నో ఇప్పటికే విజయం సాధించాయని, అయితే అవి మందుల రూపంలో మనకు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూ.2.71 లక్షల వంచన
ఎన్నికల సామగ్రితో తరలిన సిబ్బంది
జిల్లాలో నేటి ఓటింగ్కు సర్వం సిద్ధం
ఓటుకు రూ.100–200ల పంపిణీ
సురపుర విజేత ఎవరో?
ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
ట్రాక్టర్ ఇంజిన్ బోల్తా పడి డ్రైవర్ మృతి
నేడే మలివిడత ఎన్నికలు
ఎమ్మెల్యే కారును ఢీకొని ఇద్దరు మృతి
నేటి పోలింగ్కు అన్ని ఏర్పాట్లు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement