breaking news
the gas subsidy
-
బాబోయ్..మాకొద్దు నగదు బదిలీ
లబ్ధిదారుల హడల్ పలువురికి నేటికీ అందని సబ్సిడీ ఎన్డీయే ప్రభుత్వంపై ఆగ్రహం నగర శివారు వాంబే కాలనీలో నివసిస్తున్న ఒడగట్ల పైడమ్మ సబ్సిడీ రాక ఫిబ్రవరి నుంచి బ్యాంక్, గ్యాస్ ఏజెన్సీ చుట్టూ తిరుగుతోంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ ఖాతా నంబరు ఇచ్చినా ఆమె డబ్బు జమ పడలేదు. ఏజెన్సీ నిర్వాహకులు తమకు సంబంధం లేదంటున్నారు. భవానీపురానికి చెందిన అలీం జనవరి, ఫిబ్రవరిల గ్యాస్ సబ్సిడీ జమ పడక నానా అగచాట్లు పడుతోంది. ఇటు బ్యాంకర్లు, అటు గ్యాస్ ఏజెన్సీల పట్టించుకోకపోవటంతో డబ్బు వెనక్కి రాలేదని ఆమె గగ్గోలు పెడుతోంది. వాంబే కాలనీకి చెందిన శీలం చుక్కమ్మ పోయిన సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలల్లో తీసుకున్న గ్యాస్ సిలెండర్లకు సంబంధించిన నగదు ఖాతాల్లో జమ పడలేదు. అప్పట్లో రూ. 1300 చొప్పున గ్యాస్ కొనుగోలు చేసినట్లు ఆమె వివరించింది. విజయవాడ : ప్రజల్లో నగదు బదిలీపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మళ్లీ అమలులోకి వస్తే అగచాట్లు తప్పవని నిరసన తెలుపుతున్నారు. యూపీఏ ప్రభుత్వం మార్చి వరకు నగదు బదిలీ అమలు చేసింది. అయితే కొందరు ఖాతాల్లో నగదు పడలేదు. దాని సంగతి ప్రస్తావించకుండా వచ్చే నెల 10వ తేదీ నుంచి పథకాన్ని ఎన్డీయే అమలు చేయడంపై లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 12 వేల మందికి అందని నగదు నగరంలో, జిల్లాలో 11లక్షల గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. జిల్లాలో దాదాపు 12వేల మందికి ఇంకా సబ్సిడీ నగదు జమ పడ లేదు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం గాక, మరికొన్ని అన్లైన్లో పొరపాట్ల వల్ల నగదు అందలేదు. ఈలోగా కోర్టు ఉత్తర్వులు రావటంతో ప్రభుత్వం సబ్సిడీని నేరుగా మినహాయించి గ్యాస్ సరఫరా చేయడంతో నగదు బదిలీ గురించి పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. పేదల్లో భయం గతంలో నగదు బదిలీ పథకంతో ఇబ్బంది పడ్డామని పేద ప్రజలు వాపోతున్నారు. పూర్తిగా డబ్బు చెల్లించి గ్యాస్ కొనుగోలు చేసే స్థోమత తమకు లేదని పేర్కొంటున్నారు. ఆధార్ లేకపోయినా బ్యాంకు ఖాతాలు ఉంటే సబ్సిడీ వేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అసలు బ్యాంకు ఖాతా తెరవాలంటే ఆధార్ లేదా రేషన్ కార్డు తప్పని సరి అని బ్యాంకర్లు అంటున్నారని పేదలు వాపోతున్నారు. నగదు బదిలీతో రానున్న ఇబ్బందులు ఆధార్ కార్డు ఆధారంగా తెరిచిన బ్యాంకు ఖాతాల్లో పేర్లు, గ్యాస్ కనెక్షన్పై ఉన్న పేరుకు తేడా వస్తే సబ్సిడీ గల్లంతే. పేరు మార్చాలంటే కొత్త కనెక్షన్ చార్జి కంపెనీలకు చెల్లించాల్సిందే. ఆధార్ తీయించుకోకున్నా, దాంట్లో పేర్లు తప్పుపడినా గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు తప్పవు. -
అమల్లోకి ‘నగదు బదిలీ’!
ఆరు జిల్లాలకు వర్తింపు = మూడు జిల్లాల్లో నమోదు సాక్షి, చెన్నై : రాష్ట్రంలో నగదు బదిలీ అమల్లోకి వచ్చింది. దక్షిణాదిలోని ఆరు జిల్లాల్లో బుధవారం నుంచి ఈ పథకం అమల్లోకి తెచ్చారు. మరో మూడు జిల్లాల్లో గ్యాస్కు ఆధార్ నెంబర్ తప్పనిసరి చేశారు. ఆధార్ నెంబర్లను నమోదు చేసుకోవాలన్న ఆదేశాలు జారీ చేశారు. గ్యాస్ సబ్సిడీని నేరుగా వినియోగదారులకు అందించేందుకు కేంద్రం నిర్ణయించింది. అయితే, దీనికి ఆధార్ కార్డును లింక్ పెట్టడం వివాదానికి దారి తీసింది. సుప్రీం కోర్టు సైతం అక్షింతలు వేయడంతో కేంద్రం కాస్త వెనక్కు త గ్గింది. పూర్తి స్థాయిలో ఆధార్ కార్డుల జారీ అనంతరం, ఆ నెంబరు ఆధారంగా గ్యాస్ సబ్సిడీ వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో పడే విధంగా చర్యలు చేపట్టారు. అయితే, దీనిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నది. కేంద్రం మాత్రం రాష్ట్రంలో తన నిర్ణయాన్ని అమలు చేయించడం లక్ష్యంగా ముందుకెళుతోంది. ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఫొటోలు, వేలి ముద్రల సేకరణ చేసినప్పటికీ, కార్డుల జారీలో మాత్రం జాప్యం జరుగుతోంది. ఇప్పటి వరకు ఆధార్ కార్డులు నామమాత్రంగానే అందారుు. అమలు: ఇటీవల మదురై, శివగంగై జిల్లాల్లో లాంఛనంగా నగదు బదిలీ పథకాన్ని ఆరంభించారు. తాజాగా ఆ జిల్లాల్లో పూర్తి స్థాయిలో పథకం అమల్లోకి వచ్చింది. తిరునల్వేలి, తూత్తుకుడి, తేని, దిండుగల్, రామనాధపురం, కన్యాకుమారి జిల్లాల్లో కొత్త సంవత్సరం కానుకగా బుధవారం నుంచి నగదు బదిలీ అమల్లోకి తెచ్చారు. ఈ జిల్లాల్లో వంద శాతం ఆధార్ కార్డుల పంపిణీ పూర్తి అయిందంటూ కేంద్రం పేర్కొంటుంటే, తమకు కార్డులు వస్తే ఒట్టు అని వినియోగదారులు వాపోతున్నారు. గ్యాస్ సబ్సిడీని ఆధార్ నెంబర్లు, బ్యాంక్ ఖాతా నెంబర్లకు ముడి పెట్టడాన్ని ఆ జిల్లాల్లోని వినియోగదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీ బ్యాంకు ఖాతాలో పడేనా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నారుు. నగరాల్లో, పట్టణాల్లో ఉండే వాళ్లరుుతే, సబ్సిడీ బ్యాంకుల్లో పడుతున్నాయా లేదా అని పరిశీలించగలరని, అయితే, తమలాంటి వారి పరిస్థితి ఏమిటంటూ దక్షిణాదిలోని మారుమూల గ్రామీణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నుంచి మదురై, శివగంగై కాకుండా మరో ఆరు జిల్లాల్లో పూర్తి స్థాయిలో నగదు బదిలీ ఆరంభమైందో లేదో, విల్లుపురం, వేలూరు, కాంచీపురం జిల్లాల్లో ఆధార్ నెంబర్లను తప్పని సరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోపు ఆధార్ నెంబర్లను తప్పని సరిగా గ్యాస్ నెంబర్లకు జత పరచాలని, బ్యాంకు ఖాతా నెంబర్లను అందజేయాలని ప్రకటించారు. అయితే, ఈ జిల్లాల్లో ఇంత వరకు ఆధార్ కార్డుల శిబిరాలు సక్రమంగా కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. అంతలోపు కార్డుల నెంబర్లను తప్పనిసరిగా నమోదు చేయాల్సిందేనన్న హుకుం జారీ కావడంతో, ఈ నగదు బదిలీకి అడ్డుకట్ట వేసే రీతిలో రాష్ర్ట ముఖ్యమంత్రి జే జయలలిత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువే.