-
యువతపైనే దేశ భవిష్యత్తు:అవంతి శ్రీనివాస్
సాక్షి, విశాఖపట్నం: దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని..దేశ నిర్మాణానికి వారు కృషి చేయాలని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం విశాఖ వీఎంఆర్డీఏ చిల్ర్డన్ ఎరీనాలో ప్రారంభమయిన రాష్ట్రస్థాయి యువజనోత్సవాలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశానికి ఒకే ఒక హీరో స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. 125 కోట్ల జనాభా ఉన్న దేశానికి యువతే మార్గదర్శకమన్నారు. యువత దేశ,రాష్టాభివృద్ధి తోడ్పడాలన్నారు. యువత కనీసం వారానికోసారి చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ఆదుకోవాలని సూచించారు. హస్త కళాకృతులను కొని కళాకారులను ఆదుకోవాలని పేర్కొన్నారు. యువత దేశభక్తి పెంపొందించుకోవాలన్నారు. యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతుందన్నారు. అవినీతికి తావులేకుండా నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఏకైక నేత వైఎస్ జగన్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 13 జిల్లాలకు చెందిన యువత పాల్గొన్నారు. -
యువతే దేశ భవిత
రాంగోపాల్పేట్: దేశ భవిష్యత్ యువతపైనే ఆధారపడి వుందని మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళుతూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని మహావీర్ చక్ర అవార్డు గ్రహీత లెప్టినెంట్ జనరల్ మహ్మద్ జాకీ అన్నారు. సోమవారం సంజీవయ్య పార్కులోని జాతీయ జెండా వద్ద సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్, స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు ప్రముఖులు వారి చిత్రపటాల వద్ద ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లెప్టినెంట్ జనరల్ మహ్మద్ జాకీ.. 1965, 1971 యుద్దాల గురించి యువతకు వివరించి వారిలో ఉత్తేజాన్ని నింపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ మాట్లాడుతూ దేశ భక్తి విద్యార్థి దశ నుంచే పెంపొందించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని సూచించారు. రామకృష్ణ మఠానికి చెందిన బోధనానంద స్వామీజీ మాట్లాడుతూ , సంస్కృతి ఫౌండేషన్ అధ్యక్షులు రాజు తదితరులు మాట్లాడారు. -
యువత.. కుతకుత
ఉపాధి కల్పన, శిక్షణ వట్టిమాటే నిధులు లేక నిర్వీర్యమైన సెట్వెల్ విభాగం ఏలూరు (టూ టౌన్) : ‘దేశానికి యువతే వెన్నుముక. దేశ భవిష్యత్ వారిపైనే ఆధారపడి ఉంది’.. అవకాశం దొరికినప్పుడల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఇవే మాటలు చెబుతుంటారు. ఎన్నికల సమయంలో యువ ఓటర్లను, నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇవే మాటలు వల్లెవేశారు. అంతేకాకుండా నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.రెండు వేల చొప్పున ఇస్తానని ఢంకా బజాయించి మరీ చెప్పారు. ఆయన అధికార పీఠమెక్కి 8 నెలలు కావస్తోంది. నేటికీ ఆ హామీ నెరవేరలేదు. నిరుద్యోగ భృతి మాట దేవుడెరుగు కనీసం స్వయం ఉపాధి పథకం కింద ఏదైనా వ్యాపారం చేసుకుందామనుకునే నిరుద్యోగులకు కనీస ప్రోత్సాహం కూడా అందటం లేదు. స్వయం ఉపాధి ఎలా పొందవచ్చనే అంశంపై శిక్షణ కూడా ఇవ్వటం లేదు. దీంతో సెట్వెల్ అధికారులు, ఉద్యోగులు గోళ్లు గిల్లుకుంటున్నారు. ఈ సంస్థ ద్వారా నిరుద్యోగులకు, పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన యువతకు ఏటా శిక్షణ ఇచ్చి, వారిలో 50శాతం మందికి యువశక్తి పథకం కింద బ్యాంకుల ద్వారా 50 శాతం రాయితీతో కూడిన రుణా లు అందించే ఏర్పాటు చేసేవారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత రాజీవ్ యువశక్తి పథకాన్ని ముఖ్యమంత్రి యువశక్తి పథకంగా మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది జీవో-13 ద్వారా 2014 సెప్టెంబర్ 25న ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇంతవరకూ మార్గదర్శకాలు మాత్రం విడుదల కాలేదు. దీంతో యువతకు ఉపాధి, శిక్షణ లేకుండా పోయాయి. 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 472 యువతీ, యువకులకు రాజీవ్ యువశక్తి పథకం కింద రుణాలు మంజూరయ్యాయి. వారిలో 372 మంది యూనిట్లను స్థాపిం చారు. అదే ఏడాది మార్చి 3న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మిగిలిన 100 మందికి రుణాలు అందలేదు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పట్టిం చుకోకపోవటంతో వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కరికి కూడా స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయకపోగా, కనీసం శిక్షణ కూడా ఇవ్వలేదు. దీంతో యువత దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. -
నవతరంగం
నేటి యువత చేతిలో..నేతల భవిత నిర్ణయాత్మక శక్తిగా మారిన నవతరంగం జిల్లాలోని ఓటర్లలో పది శాతం వారే .. యువనాయకత్వం కోసం ఎదురుతెన్నులు వరుస ఎన్నికల్లో విశ్వసనీయతకు పెద్ద పీట మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మేలు మరువలేం అంతరంగ ఆవిష్కరణలో యువ గళం... ‘దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది..’ అన్నారు స్వామి వివేకానంద. ‘శక్తి అంతా మీలోనే ఉంది.. ధీరులై లేచి నిలబడండి..’ అంటూ పిలుపునిచ్చారు. అవును.. యువ శక్తి అమోఘమైనది. నవతరం ఆలోచనలు ఎంతో విశాలమైనవి. భావి నిర్దేశకులు వీరే.. దేశాభివృద్ధిలో కీలక పాత్ర వీరిదే. తమ ప్రతినిదులను ఎన్నుకునే సమయం ఆసన్నమైన ఈ తరుణంలో తమ ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడి వెన్నంటి నడిచేందుకు యువత సమాయుత్తమవుతోంది. తమ సమస్యలపై నిగ్గదీసేందుకూ సిద్ధమవుతోంది. అదే విధంగా తమకు మేలు చేసిన ‘మారాజు’లను మరిచిపోబోం.. అంటూ ప్రతినబూనుతోంది. ఎన్నికల నేపథ్యంలో ఇదీ యువగళం.. -
ఎన్నికలపై దేశ భవిష్యత్తు ఆధారపడింది
విజయపుర, న్యూస్లైన్ : దేశ భవిష్యత్తు ఈ ఎన్నికలపై ఆధారపడి ఉందని, సమర్థుడైన నేతను దేశ ప్రధానిగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఓటర్లకు యలహంక ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్ పిలుపునిచ్చారు. కేంద్రంలో యూపీఏ పాలనతో దేశ ప్రజలు విసుగెత్తిపోయారని అన్నారు. చిక్కబళ్లాపురం పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బి.ఎన్.బచ్చేగౌడకు మద్దతుగా చన్నరాయణపట్టణ పంచాయతీ పరిధిలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఏనాడు ప్రజా సమస్యలపై ఏ నాయకుడూ స్పందించలేదని అన్నారు. గ్రామ స్థాయి నుంచే అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు. నరేంద్ర మోడిని ప్రధానిగా చేసేందుకు బచ్చేగౌడను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అభ్యర్థి బచ్చేగౌడ మాట్లాడుతూ.. పథకాలతో పబ్బం గడుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని ఎద్దేవా చేశారు. ఒక్క రూపాయికి నాసిరకం బియ్యం ఇచ్చే బదులు ఆ బియ్యాన్ని పండించే రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తే దేశం ఏనాడో అభివృద్ధి చెంది ఉండేదని అన్నారు. పంట పండించేందుకు సాగునీరు లేదు. కనీసం బోరు నీరు వాడుకుందామన్నా విద్యుత్ సౌకర్యం లేక అన్నదాత అప్పుల్లో కూరుకుపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీకి ఏనాడూ రైతుల కష్టాలు గుర్తుకు రాలేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మాత్రం ఎత్తినహొళె పథకం గుర్తుకు వచ్చి శంకుస్థాపన చేశారని, అయితే ఈ పథకం ద్వారా రైతులకు ఒనగూరే లాభం ఏదీ లేదని అన్నారు. ఈ సందర్భంగా జేడీఎస్కు చెందిన పలువురు స్థానిక నేతలు, కార్యకర్తలు బీజేపీ చేరారు. కార్యక్రమంలో జెడ్పీసభ్యుడు రాజన్న, మాజీ ఎమ్మెల్యే జి.చంద్రప్ప, ఏపీఎంపీ మాజీ అధ్యక్షుడు గోపాలగౌడ, నేతలు నాగరాజు, నాగరాజ గౌడ పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement