-
PM Narendra Modi: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ భావజాలం
షహరాన్పూర్/అజ్మీర్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో స్వాతంత్య్ర ఉద్యమం నాటి ముస్లిం లీగ్ భావజాలాన్ని, ఆలోచనా విధానాన్ని పోలి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. కాంగ్రెస్, ముస్లిం లీగ్ ఒక్కటేనని పరోక్షంగా తేలి్చచెప్పారు. స్వాతంత్య్ర పోరాటం నాటి కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాల క్రితమే అంతరించిపోయిందని చెప్పారు. మహాత్మా గాం«దీతోపాటు ఎందరో మహామహులకు కాంగ్రెస్తో అనుబంధం ఉండేదని గుర్తుచేశారు. ఇప్పుడు మిగిలిపోయిన కాంగ్రెస్కు దేశ ప్రయోజనాల పట్ల ఒక విధానం, అభివృద్ధి పట్ల ఒక విజన్ లేవని ఆక్షేపించారు. ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోను పరిశీలిస్తే ప్రజల ఆశలు, ఆకాంక్షల నుంచి కాంగ్రెస్ పూర్తిగా దూరమైనట్లు తెలుస్తోందన్నారు. శనివారం ఉత్తరప్రదేశ్లోని షహరాన్పూర్లో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్లో ‘ఇద్దరు బాలలు’ అనే సినిమా గత ఎన్నికల్లో దారుణంగా పరాజయం పాలైందని, అయినా ఈ ఎన్నికల్లో రీరిలీజ్ చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్పై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు గంటకొకరు మారిపోతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వారసత్వ, అవినీతి పార్టీ కాంగ్రెస్ లూటీ దుకాణాన్ని తాను మూసివేశానని, అందుకే ఆ పార్టీ ఆందోళన చెందుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఎన్నికల్లో నెగ్గడానికి కాకుండా అవినీతిపరులను కాపాడడానికి కాంగ్రెస్ ర్యాలీలు, సభలు నిర్వహిస్తోందని మండిపడ్డారు. శనివారం రాజస్తాన్లోని అజ్మీర్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ ముమ్మాటికీ వారసత్వ, అవినీతి పార్టీ అని ధ్వజమెత్తారు. ఆ పారీ్టకి విలువలు, సిద్ధాంతాలు లేవన్నారు. -
జైహింద్ స్పెషల్: బట్వాటా యోధుడు రంగారావు పట్వారీ
ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో సంస్థానాధీశులు, రాజులు, వారి సైనికులు మాత్రమే కాదు.. అజ్ఞాతంగా చిన్న చిన్న జమిందార్లు, గ్రామాధికార్లయిన పట్వారీల వంటివారు కూడా కీలక పాత్ర పోషించారు. అటువంటి విస్మృత యోధులలో నిజామాబాద్ జిల్లాలోని కౌలాస్ను కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ వారిపై తిరుగుబాటుకు పథక రచన చేసిన రంగారావు కూడా ఒకరు. తిరుగుబాట్ల రహస్య సమాచారం పొందుపరిచి ఉన్న లేఖలను నానా సాహెబ్కు, నిజాం పాలనలోని సమర యోధులకు చేర్చడానికి ఆయన అనేక కష్టాలు పడ్డారు. చివరికి బ్రిటిష్ సైనికుల చేతికి చిక్కారు. చదవండి: గాంధీజీ గ్రామ స్వరాజ్యానికి చంద్రమౌళి చెక్ పవర్ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి దేశవ్యాప్తంగా మరాఠా పీష్వా బాలాజీ బాజీరావు (నానాసాహెబ్), చివరి మొగల్ చక్రవర్తి బహదూర్ షా, ఆయన కుమారుడు మిర్జా మొగల్ తదితరులు నాయకత్వం వహిస్తున్న సమయంలో రంగారావు నిజాం ప్రాంతంలోని నార్కెట్ గ్రామ పట్వారిగా ఉన్నారు. రంగారావుతో పాటు కౌలాస్ జమిందార్ రాజా దీప్ సింగ్ (రాజా సాహెబ్), నిజాం ఆస్థానంలోని సఫ్దర్ ఉద్దౌలా మరికొంతమంది కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు వ్యూహ రచన చేస్తుండగా 1857 ఫిబ్రవరిలో రహస్య సమర యోధుడు, బ్రిటిష్ సైనిక ఉద్యోగి అయిన సోనాజీ పండిట్ నుండి పిలుపు రావడంతో రంగారావు ఆయన్ని కలిశారు. సోనాజీ పండిట్ ఆయనకు ఒక లేఖ ఇచ్చి నానా సాహెబ్కు అందజేయమని కోరారు. ఎక్కడో ఉత్తరభారతంలో ఉన్న నానా సాహెబ్ ను కలవడానికి బయలుదేరిన రంగారావు నర్మద, యమున నదులను దాటి లక్నో సమీపంలోని బెర్వతోడ గ్రామం వద్ద నానాసాహెబ్ కు తాను తీసుకు వచ్చిన ఉత్తరాన్ని అందజేశారు! ఆ లేఖ ద్వారా నిజాం రాజ్యంలోని బ్రిటిష్ పాలనా పరిస్థితులను అవగాహన చేసుకున్న నానాసాహెబ్... సొనాజీ పండిట్ లేఖకు సమాధానంగా... నిజాం రాజ్యంలో ఉన్న డఫేదారులు, జమిందార్లు, రోహిల్లాలు తిరుగుబాటు జెండా ఎగురవేసి సాధ్యమైనన్ని చోట్ల బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలని కోరుతూ ఒక లేఖ రాసి దానిపై తన రాజ ముద్ర వేశారు. అలాగే సఫ్దర్ ఉద్దౌలా, రావు రంభా నింబాల్కర్, గులాబ్ ఖాన్, బుజురీలను ఉద్దేశించి విడివిడిగా రాసిన లేఖలను రంగారావుకు అందజేసి ఎవరి లేఖలు వారికి అందజేయాలని కోరారు. నిజామాబాద్లోని కౌలాస్ కోట: కౌలాస్ జమిందార్ రాజా దీప్ సింగ్ (రాజా సాహెబ్), మరికొందరు కలిసి బ్రటిషర్లపై తిరుగుబాటుకు వ్యూహరచన చేశారు. రంగారావు విస్మృత యోధుడిగా మిగిలిపోయినట్లే.. వ్యక్తిగా ఆయన రూపురేఖల్ని తెలిపే చిత్రాలు కూడా చరిత్రలో మిగలకుండా పోయాయి. తిరిగి వచ్చేలోగా..! రంగారావు ముందుగా ఔరంగాబాద్ చేరుకుని గులాం ఖాన్, బుజురీలను కలిసి వారి లేఖలను వారికి అందజేశారు. ఆ క్రమంలో కొండలు, నదీనదాలు, అడవులను అధిగమిస్తూ అలుపెరగని ప్రయాణం చేస్తున్న రంగారావును ఒకరోజు బందిపోటు దొంగలు చుట్టుముట్టారు. డబ్బు, ఆహార పదార్థాలతో పాటు ఆయన చేతిలో ఉన్న సఫ్దర్ ఉద్దౌలా, నింబాల్కర్లకు ఉద్దేశించిన లేఖలను కూడా దోచుకున్నారు. రంగారావు ధైర్యం వీడలేదు. సోనాజీ పండిట్ కి రాసిన లేఖ, మరో లేఖ తలపాగాలో దాచి ఉంచడం వల్ల వాటిని దొంగలపాలు కాకుండా రక్షించుకోగలిగారు. చివరికి అలసిసొలసి సోనాజీ పండిట్ ఉండే గ్రామానికి తిరిగివచ్చిన రంగారావుకు సోనాజీ మరణించాడనే వార్త తెలిసి ఖిన్నుడయ్యాడు. ఆ ఘటనతో రంగారావు తనే స్వయంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసి ఉద్యమ నాయకత్వాన్ని భుజానికెత్తుకుని హైదరాబాద్ వైపు కదిలారు. తన ప్రయత్నంలో ఎటువంటి లోపం లేకుండా ఎంతో మందిని కలిసి మద్దతు పొందడానికి ప్రయత్నించారు. వెళ్లే మార్గంలో మాదాపూర్ గ్రామ నాయక్కు, తర్వాత హల్లి గ్రామానికి వెళ్లి బాబూ పటేల్కు, ఆ తర్వాత చక్లి గ్రామం చేరి అధికారిని కలిసి సోనాజీకి నానాసాహెబ్ రాసిన లేఖ చూపించారు. అయితే ఎవరూ ఆయనకు సహాయం చేయలేదు. దీంతో హైదరాబాద్ వెళ్లకుండా నిజామాబాద్ జిల్లాలో ఉన్న కౌలాస్ చేరారు. అక్కడే కొంతకాలం గడిపారు. ఈ కాలంలో నాలుగుసార్లు కౌలాస్ రాజాతో చర్చలు జరిపారు. ఇక్కడ ఉండటం ఎవరికీ శ్రేయస్కరం కాదని, కాబట్టి మకాం మార్చమని రాజా సాహెబ్ చెప్పడంతో నీలేకర్ గ్రామం చేరి రఘునాథ్ పజ్జీ దగ్గర రెండువారాలు ఆశ్రయం పొందారు. అయితే రఘునాథ్.. తిరుగుబాటుకు సంబంధించి ఎటువంటి సహాయం అందించడానికి నిరాకరించడమే కాక సొంత ఊరికి పోయి హాయిగా శేష జీవితం గడపమని రంగారావుకు సలహా ఇచ్చాడు. పట్టువదలని విక్రమార్కుడిలా రంగారావు మాణిక్ నగర్ వైపు నడిచి మాణిక్ ప్రభుని కలిసి తన కథను వినిపించారు. ప్రభు వద్ద ఎనిమిది రోజులు గడిపి, అతడి ఆశీస్సులతో నీలేకర్ గ్రామానికి వెళ్లి బడే అలీని కలిశారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలలో తిరుగుబాటు వచ్చినప్పుడు తాను తప్పకుండా సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కనిపెట్టిన బ్రిటిషర్లు! ఈ పరిస్థితుల్లో స్వగ్రామం వైపు బయల్దేరిన రంగారావు మార్గమధ్యంలో బ్రిటిష్ సైన్యానికి చిక్కాడు. 1859, ఏప్రిల్12 న ‘ఇంగ్లిష్మెన్’ అనే ఆంగ్లపత్రికలో ఆయన ఆరెస్టు వార్త వచ్చింది. బ్రిటిష్ సైన్యం రంగారావుతో పాటు కౌలాస్ రాజా దీప్ సింగ్, సఫ్దరుద్దౌలాలను, వారి అనుచరులను అరెస్టు చేసింది. రాజా దీప్ సింగ్ కు మూడు సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. జాగీరును కూడా స్వాధీనం చేసుకుంది. తర్వాత ఆ జాగీర్ ను ఆయన కుమారునికి ఇచ్చింది. సఫ్దరుద్దౌలాను పదవి నుంచి తొలగించి అతడి స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకుని జీవిత ఖైదు విధించారు. రంగారావుకు మరణశిక్ష విధించినా... తరువాత దానిని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చి అండమాన్కు పంపారు. ఆయన 1860 సంవత్సరంలో అక్కడే చనిపోయారు. – జి. శివరామకృష్ణయ్య -
జైహింద్ స్పెషల్: గోడలు పేల్చిన అక్షర క్షిపణులు
స్వాతంత్య్రోద్యమంలో గోడ పత్రికలు ఉద్యమకారులకు ఏమాత్రం తక్కువకాని పాత్రను పోషించాయి. బ్రిటిషర్ల దురహంకారాన్ని వేలెత్తి చూపించాయి. గోడల వైపు తలెత్తి చూడటానికే బ్రిటిష్ అధికారులు సంశయించేంతగా మన తెలుగువాళ్లు గోడ పత్రికలపై నిజాలను నిర్భయంగా రాశారు. నాటి గోడపత్రికల ఆనవాళ్లు నేడు లేవు కానీ, ఆనాటి స్వాతంత్య్ర స్ఫూర్తి నేటి అమృతోత్సవాలలో మహా నగరాల గోడలపై వర్ణ చిత్రాలుగా ప్రతిఫలిస్తూ ఉంది. చదవండి: పెనంలోంచి పొయ్యిలోకి పడిన రోజు! యూరప్లో జరిగిన ఫ్యూడల్ వ్యతిరేకోద్యమంలో ఆయుధాలుగా ఆవిర్భవించిన పత్రికలు, ఆ సమాజాన్ని ఆధునీకరించడంలో అమోఘమైన పాత్రను నిర్వహించాయి. అలాగే భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కూడా పత్రికలు అక్షరాయుధాలుగా కీలక భూమికను పోషించాయి. వాటిల్లో గోడ పత్రికలు, కరపత్రాలు కూడా ఉన్నాయి. అవి కూడా ఉద్యమజ్వాలల్ని రగిలించాయి. తొలి గోడపత్రిక ‘నగరజ్యోతి’ దేశంలోనే తొలి గోడ పత్రికగా నెల్లూరులో ‘నగర జ్యోతి’ నాలుగున్నర దశాబ్దాలపాటు ప్రజలలో స్వాతంత్రేచ్ఛతోపాటు విజ్ఞానాన్ని వెలిగించింది. నెల్లూరులో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న తూములూరి పద్మనాభయ్య ఉద్యోగానికి రాజీనామా చేసి, వలస పాలనకు వ్యతిరేకంగా ఒక రహస్య సైక్లోస్టైల్ పత్రికను నడిపారు. అది బైటపడడంతో బ్రిటిష్ పోలీసులు ఆయనను ఆరెస్టు చేసి, జైల్లో పెట్టి హింసించారు. జైలు నుంచి విడుదలై వచ్చాక 1932లో నెల్లూరు ట్రంకు రోడ్డులోని తిప్పరాజువారి సత్రం గోడలపై ‘నగరజ్యోతి’ని వెలిగించారు. కాగితాలపై పెద్ద పెద్ద అక్షరాలతో వార్తలు రాసి సత్రం గోడలకు అంటించేవారు. ఆ కాగితాలను పశువులు తినేయడంతో, ఆ గోడలను బ్లాక్ బోర్డుగా చేసి చాక్పీసులతో వార్తలు రాయడం మొదలు పెట్టారు. ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందించేవారు. స్వాతంత్య్రం రాకముందే తూములూరి పద్మనాభయ్య క్షయ వ్యాధితో మృతి చెందారు. ఓకే పత్రిక... రెండు గోడలు! పద్మనాభయ్యకు సహాయకులుగా పనిచేస్తున్న ముత్తరాజు గోపాలరావు, ఇంద్రగంటి సుబ్రమణ్యం చెరొక గోడపై ‘నగరజ్యోతి’ కొనసాగించారు. వారిద్దరూ గాంధేయ వాదులు. ముత్తరాజు గోపాలరావు వార్తలలో ఆవేశం పాళ్లు ఎక్కువ. తెలంగాణా సాయుధ పోరాట సమయంలో కమ్యూనిస్టు నాయకుడు కొండయ్యకు ఆశ్రయం కల్పించారని ముత్తరాజు గోపాలరావును పోలీసులు ఆరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇంద్రగంటితో పోటీ పడలేక, ముత్తరాజు గోపాలరావు తన గోడను కూడా ఆయనకు అప్పగించేశారు. ఇంద్రగంటి తాను వాస్తవమని నమ్మినవే వార్తలుగా రాసేవారు. ఇటు విజయవాడ, అటు మద్రాసు నుంచి వచ్చే రైళ్ల కోసం అర్ధరాత్రి అయినా వేచి చూసి, వేరే వారి కోసం వచ్చిన ఇండియన్ ఎక్స్ప్రెస్, ఫ్రీ ప్రెస్, పేట్రియాట్ వంటి పత్రికలను చూసి గబగబా వార్తలు రాసుకునే వారు. ఆ పత్రికలలో వచ్చిన కార్టూన్లను కూడా వేసేవారు. బ్రిటిష్ వ్యతిరేక ప్రచారం ఇంద్రగంటి సుబ్రమణ్యం ‘నగర జ్యోతి’ ద్వారా బ్రిటిష్ వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. ఆ సమయంలో ఆయనను అరెస్టు చేసి వేలూరు జైలుకు తరలించారు. జైలు నుంచి విడుదలై వచ్చాక చివరి వరకు ఖద్దరునే ధరించారు. స్వాతంత్య్రమే తప్ప కుటుంబాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. వార్తలు రాయడానికి చాక్పీసుల కోసం తప్ప, తన కోసం ఏనాడూ చేయిచాచలేదు. తాజా వార్తలను అందించడం తప్ప, ఇంద్రగంటికి వేరే వ్యాపకమే లేదు. నయాపైసా ఆదాయం లేకపోయినా, నాలుగు దశాబ్దాలపాటు ‘నగర జ్యోతి’ని ఆరిపోకుండా కాపాడారు. ఇంద్రగంటి 1976 సెప్టెంబర్ 16వ తేదీన తుదిశ్వాస విడిచేవరకు వార్తలను విడవలేదు. స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రభుత్వం రెండున్నర ఎకరాలను ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంది. ప్రపంచ తెలుగు మహాసభల్లో శాలువాతో సరిపెట్టుకుంది. విద్వాన్ విశ్వంకి జైలు! కవి, రచయిత, పండిత పాత్రికేయుడు, స్వాతంత్య్ర సమరయోధుడు విద్వాన్ విశ్వం బ్రిటిష్ పాలనలో ‘యుద్ధం వల్ల కలిగే ఆర్థిక ఫలితాలు’ అన్న కరపత్రం వేసినందుకు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. స్వాతంత్య్ర సమరయోధుడు ఖాసా సుబ్బారావు టంగుటూరి ప్రకాశం పంతులు స్థాపించిన ‘స్వరాజ్య’ పత్రికలో ఎడిటర్గా 12 ఏళ్లు పనిచేశారు. మరెందరో చరిత్రకందని పాత్రికేయులు స్వాతంత్య్రోద్యమంలో పాలుపంచుకున్నారు. – రాఘవ శర్మ -
పన్నుపోటు మీద తిరుగుబాటు
సహాయ నిరాకరణోద్యమం సాగుతున్న క్రమంలోని అద్భుత ఘట్టమే చీరాల–పేరాల ఉద్యమం. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య దీనికి నేతృత్వం వహించారు. నాటి గుంటూరు జిల్లాలో చేనేత, రంగుల అద్దకం వంటి వృత్తులతో జీవించే జనాభాతో ఉన్నదే చీరాల యూనియన్. చీరాల, జాండ్రపేట, పేరాల, వీరరాఘవపేట గ్రామాలు కలిపి చీరాల పంచాయతీ యూనియన్. 1919 నవంబర్లో మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వం చీరాల–పేరాల కలిపి మునిసిపాలిటీగా ఏర్పాటు చేస్తున్నట్టు ఆకస్మికంగా ప్రకటించింది. మునిసిపాలిటీ ఆవిర్భవిస్తే అప్పటిదాకా రూ.4 వేలుగా ఉన్న పన్నులు పదిరెట్లు, అంటే రూ.40 వేలకు చేరతాయి. ఈ పరిణామం ప్రజలకు ఆందోళన కలిగించింది. 1920 ఫిబ్రవరి 20న రేట్ పేయర్స్ అసోసియేషన్ పేరుతో స్థానికులు నిరసన ప్రదర్శనలు చేశారు. అయినా రెండు నెలలలోనే చీరాలను మునిసిపాలిటీగా మార్చినట్టు ప్రకటన వచ్చింది. ఆర్డీఓ చైర్మన్గా, పదకొండు మంది కౌన్సిలర్లతో ప్రభుత్వమే కౌన్సిల్ను ఏర్పాటు చేసింది. పన్నులు కట్టలేమని ప్రజలు ఆర్డీఓకు విన్నవించుకున్నారు. ‘ముందు పన్నులు కట్టండి, తరువాత అప్పీలు సంగతి చూద్దాం’ అన్నాడాయన. ఈమాట నమ్మి ఆరుమాసాల పన్నులు చెల్లించారు. కానీ ప్రభుత్వం కనికరించే సూచనలేవీ కానరాలేదు. అప్పుడు బ్రిటిష్ రాజభక్తి నరనరాన నింపుకున్న జస్టిస్ పార్టీ మద్రాస్ ప్రెసిడెన్సీని ఏలుతున్నది. అలాంటి జస్టిస్ పార్టీ ప్రభుత్వానికి కళ్లు బైర్లు కమ్మే పరిణామం చీరాలలో జరిగింది. ప్రజల ఆవేదన వాస్తవమేనంటూ ప్రభుత్వం నియమించిన పదకొండు మంది కౌన్సిలర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. చివరకు మద్రాస్ ప్రెసిడెన్సీ స్థానిక స్వయంపాలన వ్యవహారాల మంత్రి రాజా రామరాయణింగార్ (పానగల్ రాజా) కౌన్సిల్ అభిప్రాయాన్ని చెత్తబుట్టలో వేసి 1921 ఏప్రిల్ 1న ఒక చైర్మన్ను నియమించారు. దీంతో మండిపడ్డ జనం టోల్గేట్ను ధ్వంసం చేసి, రైలు పట్టాల మీద వేసి దహనం చేశారు. వందమంది రిజర్వు పోలీసుల సాయంతో చైర్మన్ ప్రజలను హింసించడం మొదలుపెట్టాడు. పన్నులు కట్టని నేరానికి పన్నెండు మందిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. వారిలో ఒకరు రావూరి అలిమేలుమంగమ్మ, నిరుపేద మహిళ. గాంధీయుగం ఆరంభమైన తరువాత రాజకీయ నేరారోపణతో దేశం మొత్తం మీద జైలుకు వెళ్లిన తొలి మహిళ అలిమేలుమంగమ్మ. గోపాలకృష్ణయ్య నాయకత్వం ‘బ్రిటిష్ సామ్రాజ్యంలో రవి అస్తమించడంటారు. ఎందుకో తెలుసా? చీకట్లో ఇంగ్లిష్ వాళ్లని నమ్మడం మరీ కష్టం!’ అని ఒక సందర్భంలో వ్యాఖ్యానించిన ధైర్యశాలి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. జాతీయోద్యమంలో చేరిన ఆయన అప్పటికే భార్య ఆరోగ్యం కోసం చీరాల వచ్చారు. తిలక్ స్వరాజ్య నిధి వసూలులో భాగంగా బెజవాడ నుంచి ఏప్రిల్ 6న చీరాల వచ్చిన గాంధీ పన్నుల చెల్లింపునకు నిరాకరించి జైలుకు వెళ్లిన అలిమేలుమంగమ్మ సహా అందరినీ సత్కరించారు. అప్పుడే గాంధీని గోపాలకృష్ణయ్య సలహా కోరగా, ‘మీరు చేసే కార్యం విజయవంతమైతే కాంగ్రెస్ మిమ్మల్ని అభినందిస్తుంది. అపజయం పొందితే ఆ బాధ్యత కాంగ్రెస్ తనపై పెట్టుకోదు’ అంటూ మెలిక పెట్టారు. చీరాల శివార్లలోని భూములలో రావ్ునగర్ పేరిట ఒక గ్రామాన్ని నిర్మించారు గోపాలకృష్ణయ్య. 1921 ఏప్రిల్ 25 నడి రాత్రి వేసవి చీరాలపేరాల ప్రజలు పేద, ధనిక; ఉన్నత, చిన్న కులాల తేడా లేకుండా అంతా తమ సామగ్రితో తాత్కాలికంగా నిర్మించిన రావ్ునగర్కు ప్రయాణమయ్యారు. గోపాలకృష్ణయ్య అక్కడే పంచాయతీ, న్యాయ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ‘అక్కడ గవర్నర్ పాలన లేదు, ఉన్నదల్లా గోపాలకృష్ణయ్య పాలనే’ అని ఆ ఏడాది మార్చి 31న విజయవాడలో చిత్త రంజన్దాస్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితికి అద్దం పడతాయి. తనను నమ్మి రావ్ునగర్కు వచ్చిన పేదలను ఆదుకోవడం గోపాలకృష్ణయ్యకు శక్తికి మించిన పనే అయింది. టంగుటూరి ప్రకాశం పంతులు రూ.3 వేలు విరాళం ఇచ్చారు. నిధి వసూలు కోసం 1921 సెప్టెంబర్ 28న బరంపురంలో జరిగిన ఆంధ్ర మహాసభలకు దుగ్గిరాల హాజరయ్యారు. ఆ వేదిక మీద మంత్రి రామరాయణింగార్ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. దాంతో గుంటూరు జిల్లా కలెక్టర్ టీజీ రూథర్ఫర్డ్ సంతకంతో ఆ రోజు సాయంత్రం వారెంట్ జారీ అయింది. గోపాలకృష్ణయ్య రెండు నెలల పాటు ఎక్కడా నోరు విప్పరాదని దాని సారాంశం. ఆ ఆదేశాన్ని ఉల్లంఘిస్తున్నట్టు ప్రకటించారాయన. అక్టోబర్ 1న అరెస్టు చేసి తిరుచ్చి జైలుకు తరలించారు. 1922 అక్టోబర్లో విడుదలయ్యారు. గోపాలకృష్ణయ్య జైలుకు వెళ్లాక రామ్నగర్ ఉద్యమం సడలి పోయింది. చీరాలపేరాల ప్రజలు పన్నులు చెల్లించకుండా ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేశారు. కానీ గాంధీ తన అహింసా సిద్ధాంతం ప్రాతిపదికగా జరిగిన ఓ గొప్ప ప్రజా ఉద్యమానికి సహాయ నిరాకరణ చేయడమే చారిత్రక వైచిత్రి. ఏమైనా, పదకొండు మాసాల పాటు ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి వినూత్నంగా నిరసన చెప్పడం చరిత్రలో అపురూపమైన విషయం. నాటి ప్రజానీకం ఓడినా, చీరాలపేరాల ఉద్యమం చరిత్రలో తన స్థానాన్ని గెలుచుకుంది. - డా. గోపరాజు నారాయణరావు -
స్వాతంత్య్ర సంగ్రామంలో నంద్యాల యోధుల పోరాటం
బొమ్మలసత్రం: స్వాతంత్య్ర సంగ్రామంలో నంద్యాల యోధులు ప్రాణాలను ఫణంగా పెట్టి బ్రిటీష్ పాలకులను ఎదిరించారు. కుటుంబ సభ్యులకు దూరమై, ఆస్తులను త్యాగం చేసి స్వాతంత్ర పోరాటం చేశారు. కొందరు యోధులు బ్రిటీష్ పాలకుల చిక్కకుండా నల్లమలలో అజ్ఞాత జీవితం గడపగా, మరి కొందరు జైలు పాలై ప్రత్యక్ష నరకాన్ని చవిచూశారు. నేడు వీరు భౌతికంగా లేకున్నా, వారి త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయాయి. నంద్యాల ప్రాంతానికి చెందిన స్వాతంత్య్ర సమర యోధులు జాతిపిత మహాత్మాగాంధీ అడుగు జాడల్లో అహింసా మార్గంలో స్వాతంత్య్ర ఉద్యమం చేశారు. ప్రస్తుతం ఆర్డీఓ, వన్టౌన్ పోలీసు స్టేషన్, డీఎస్పీ బంగ్లా, తహసిల్దార్ కార్యాలయాల్లో బ్రిటీష్ పాలకులు ఉంటూ పాలన చేసేవారు. వన్టౌన్ పోలీసు స్టేషన్లో పోలీసు బలగాలు ఉండేవి. నంద్యాల 25వేల జనాభాతో, చిన్న పట్టణంగా ఉందేది. జాతీయ స్థాయిలో గాం«ధీజీ ఉప్పు సత్యగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలకు పిలుపునిచ్చినా, ఏ నేతను బ్రిటీష్ పాలకులు అరెస్టు చేసినా నంద్యాల నేతలు త్రీవంగా స్పందించేవారు. 19వ శతాబ్ధంలో ఉద్యమం: నంద్యాలలో 19వ శతాబ్ధంలో నంద్యాలలో స్వాతంత్య్ర ఉద్యమం ఊపందుకొనేది. బిట్రీష్ పాలకులకు వ్యతిరేకంగా నేతలు సభలు, సమావేశాలను నిర్వహించేవారు. గాడిచర్ల హరి సర్వోత్తమరావు, నివర్తి వెంకటసుబ్బయ్య, టీఆర్కే శర్మ, గడ్డం సుబ్రమణ్యం, కోడి నరసింహం, దేశాయి కుప్పూరావు తదితరులు బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేవారు. దీంతో బ్రిటీష్ పోలీసులు వెంట పడి, వీరిని అరెస్టు చేయడానికి యత్నించేవారు. దీంతో నేతలు నక్సలైట్లలా నల్లమల అడవిలోకి పారిపోయి, అజ్ఞాత జీవితం గడిపేవారు. వీరు మహానంది, బండి ఆత్మకూరు ప్రాంతాల్లోని అడవుల్లో తలదాచుకున్నప్పుడు, కొందరు నేతలు, గ్రామస్తులు వీరికి ఆహారాన్ని పంపేవారు. ఖ్యాతి తెచ్చిన గాడిచర్ల, నివర్తి స్వాతంత్య్ర సంగ్రామంలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు, నివర్తి వెంకటసుబ్బయ్య, రాష్ట్ర స్థాయిలో నంద్యాలకు ఘనకీర్తిని తెచ్చారు. ఆంధ్రా తిలక్గా పేరొందిన గాడిచర్ల కర్నూలు ప్రాంతానికి చెందినవారు. నంద్యాలలో విద్యాభ్యాసం చేశారు. తర్వాత ఆయన నంద్యాల కేంద్రంగా కొన్నేళ్లు ఉద్యమాన్ని నడిపారు. స్వరాజ్య పత్రికను స్థాపించి, బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడారు. తిలేస్వరంలో బ్రిటీష్ ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులపై జరిపిన కాల్పుల సంఘటనలను తీవ్రంగా విమర్శిస్తూ స్వరాజ్య పత్రికలో ఆయన వ్యాసాలు రాశారు. దీంతో ప్రభుత్వం ఆయనను జైలుకు పంపిండి తలకు మురికి టోపీ పెట్టి, కాళ్లకు, చేతులకు గోలుసులు వేసి, మట్టి చిప్పలో భోజనం పెట్టి తిడ్తూ, కొట్టినా ఆయన ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. తర్వాత ఆయన నంద్యాల నుండి మద్రాస్ కౌన్సిల్కు ఎన్నికయ్యారు. పత్తికొండకు చెందిన నివర్తి వెంకటసుబ్బయ్య నంద్యాలకు వలస వచ్చారు. స్వాతంత్య్రోద్యమ పోరాటానికి తాలూకా ఆఫీసులోని ఉద్యోగానికి రాజీనామా చేసి, ఉద్యమ బాట పట్టారు. వ్యక్తి సత్యగ్రహంలో పాల్గొన్న నివర్తిని ఆయన 140మంది సహచరులను అక్టోబర్ 14, 1940లో ప్రభుత్వం ఆరెస్టు చేసి, 8నెలలు జైలు శిక్ష వేసింది. జైలు నుండి బయటకు రాగానే మళ్లీ ఉద్యమంలోకి వెళ్లారు. విద్యార్థులతో, కాంగ్రెస్ సభ్యులతో రహస్య దళాలను ఏర్పాటు చేశారు. 1942లో విప్లవోద్యమాన్ని నడిపించడానికి విధి విధానాలను నిర్ధేశిస్తూ ఆయన రూపొందించిన సర్క్యూలర్ను బ్రిటీష్ ప్రభుత్వం నిషేదించింది. ఆయనను అరెస్టు చేయడానికి ప్రయత్నించడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తర్వాత గాంధీజీ సలహా మేరకు ఆయన లొంగిపోయారు. స్వాతంత్రం వచ్చాక, 1968 నుండి 78వరకు శాసన మండలి అధ్యక్షుడిగా పని చేశారు. రథసారథులు వీరే...: ఖాదర్బాద్ నర్సింగరావు ఫిరంగి పాలనకు వ్యతిరేకంగా 1910లో కాంగ్రెస్లో చేరీ, ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. 1928లో బ్రిటీష్ పాలకులు భారతీయులు చదువుకోవడానికి పెద్దగా సహకరించలేదు. కాని స్థానిక బ్రిటీష్ పాలకులు వ్యతిరేకించినా మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతిని తీసుకొని వచ్చి, ఆరెకరాల భూమిని విరాళంగా ఇచ్చి నంద్యాల మున్సిపల్ హైస్కూల్ ఏర్పాటు చేశారు. ఈ స్కూల్ వేల మంది రాజకీయ నాయకులకు, శాస్త్రవేత్తలకు, వైద్యులకు ఇంజనీర్లకు, పారిశ్రామిక వేత్తలకు అక్షరాలను నేర్పించింది. ఖాదర్బాద్ నర్సింగరావు జైలు పాలైన దేశ భక్తుల కుటుంబ సభ్యులకు ఆశ్రయమిచ్చి నెలలు తరబడి భోజనాలను పెట్టి ఆదుకునేవారు. ఈయనతో పాటు దేశాయి కుప్పూరావు, కోడి నరసింహం, ఆత్మకూరు నాగభూషణం శెట్టి, టీ ఆర్కే శర్మ, గడ్డం సుబ్రమణ్యం, యరబోలు సుబ్బారెడ్డి, యాతం మహానందిరెడ్డి, రాజా శ్రీనివాస్లు ఉద్యమ పోరాటంతో నిస్వార్థంగా సేవలను అందించారు. స్వాతంత్ర ఉద్యమంలోని ఆస్తిని విరాళంగా ఇవ్వడమే కాక పోరాటాన్ని జరిపిన ఏకైక మహిళగా పద్మావతమ్మ ఆదర్శనీయంగా నిలిచింది. బ్రిటీష్ ప్రభుత్వంలో పోలీసులుగా పని చేసిన శ్యాముల్ బెనెటిక్ట్ సుభాష్చంద్రబోష్ ఇచ్చిన పిలుపు మేరకు ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరారు. కాంగ్రెస్ సభ్యురాలుగా పని చేసిన పద్మావతమ్మ స్వాతంత్య్ర అనంతరం కమ్యూనిష్టుగా మారారు. బైర్మల్ వీధిలో ఉన్న ఇప్పటి డాక్టర్ ఉదయ్శంకర్ హాస్పిటల్, వాసవీ భవన్, ప్రక్కనే ఉన్న దళితులు హాస్టల్ పలువురు నేతలు ఇళ్లలో సభల, సమావేశాలు జరిగేవి. నంద్యాలను సందర్శించిన గాంధీ, నెహ్రూ: జాతిపిత గాంధీజీ 1930లో నంద్యాలను సందర్శించి విక్టోరియా రీడింగ్ రూంలో జరిగిన సభలో ప్రసంగించారు. 1934లో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, 1937లో రాజాగోపాలచారి, 1952లో ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ పర్యటించారు. వీరితో పాటు టంగుటూరి ప్రకాశం పంతులు, వీవీ గిరి, సర్వేపల్లి రాధాకృష్ణన్, కళావెంకటరావు, కల్లూరి సుబ్బారావు, ఆచర్య రంగా, నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, గోపిరాజు రామచంద్రారావు, వెన్నెటి విశ్వనాథం, కడప కటిరెడ్డి, శ్రీమతి రామసుబ్రమ్మ, వాలిలాలు గోపాలక్రిష్ణయ్య నంద్యాలను సందర్శించారు. అప్పటి మున్సిపాలిటీ చైర్మన్ ఖాదర్బాద్ నర్సింగరావు వీరికి ఆహ్వానం పలికారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement