breaking news
Four Women
-
ఎండకు గొడుగు పట్టారు..
మండుతున్న ఎండల్లో రోడ్డు మీద పుచ్చకాయ ముక్కలు కనిపిస్తే వెంటనే ఆగిపోతాం.ఓ కప్పు తాజా పుచ్చకాయ ముక్కలు తిని సేదదీరుతాం. ఇంటి నుంచి బయటకు వచ్చిన పని పూర్తి చేసుకుని తిరిగి ఇల్లు చేరేలోపు ఏర్పడే అవసరం అది. మరి అదే ఎండలో ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడి ప్రకోపాన్ని భరిస్తూ పుచ్చకాయ ముక్కలమ్ముకునే వ్యక్తి పరిస్థితి ఏంటి? 52.9 డిగ్రీలకు చేరిన ఎండలో ఎన్ని పుచ్చకాయలు తింటే అతడికి సాంత్వన దొరుకుతుంది. తనకు, తన తల మీద నాట్యమాడుతున్న సూర్యుడికి మధ్య ఏ అడ్డూ లేదు. వర్షాకాలంలో మొక్కజొన్న కండెలు కాలుస్తూ, ఎండాకాలంలో పండ్ల ముక్కలమ్ముకుంటూ... బతుకు బండి ఈడ్చడానికి ఏ ఎండకా గొడుగు పట్టే తనకు గొడుగుపట్టేదెవరు? ఎండనే గొడుగు చేసుకుని బతుకీడుస్తున్న ఇలాంటి వాళ్లకు గొడుగులు పంచుతున్నారు ఢిల్లీలోని నలుగురు యువతులు అనూష అత్రీ, భావని సింగ్, ఖుషీ సింగ్, వశిఖా మెహతా.‘సమాజంలో సహాయం అవసరమైన వాళ్లు అనేకమంది ఉన్నారని కరోనా సమయంలో తెలిసింది’ అంటూ తమ సేవా ప్రస్థానాన్ని వివరించారు. ‘సేవ’ అవసరం ఉంది! ‘‘మా సర్వీస్ కరోనా సమయంలో మాస్క్లు పంచడంతో మొదలైంది. కరోనా కరాళనృత్యం చేస్తున్న రోజుల్లో కూడా శ్రామికులు కొంతమంది మాస్కు కూడా లేకుండా పనులకు వెళ్లడం మమ్మల్ని ఆందోళన పరిచింది. తమ ఆరోగ్యభద్రత కోసం కనీసంగా కూడా జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు. వాళ్ల అలసత్వం, నిర్లక్ష్యానికి కారణం చైతన్యం లేకపోవడంతోపాటు జాగ్రత్తలు తీసుకోవడానికి తగిన వెసులుబాటు లేకపోవడం. కనీసం మాస్కు అయినా ఇవ్వగలిగితే మంచిది కదా అనుకున్నాం. మా పేరెంట్స్ మాకు ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులో కొంత తీసి మాస్కులు కొని పంచాం. ఒకసారి మురికి వాడల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆశ్చర్యం కలిగించే ఎన్నో విషయాలు తెలిశాయి. వాళ్లు ఆరోగ్యం పట్ల కనీస జాగ్రత్తలు కూడా పాటించడం లేదని తెలిసి హెల్త్ క్యాంపులు పెట్టి ఉచితంగా మందులిచ్చాం. సమాజానికి చేయాల్సిన సేవ చాలా ఉందని తెలిసి ‘వారియర్స్ వితవుట్ ఏ కాజ్’ పేరుతో ఎన్జీవో ్రపారంభించాం. చదువు అవసరాన్ని తెలియచేయాల్సిన పరిస్థితి ఇంకా దేశంలో నెలకొని ఉందంటే నమ్ముతారా? చదువు జీవితాన్ని మెరుగుపరుస్తుందని వివరించినప్పటికీ వారిలో ఏదో నిర్లిప్తత. హెల్త్ అవేర్నెస్, ఎడ్యుకేషన్ అవేర్నెస్తోపాటు రుతుక్రమ పరిశుభ్రత కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. వీటితోపాటు ఫైనాన్షియల్ లిటరసీ కోసం వర్క్షాప్లు నిర్వహిస్తున్నాం. మేము సర్వీస్ అందిస్తున్న వాళ్లలో చాలామందికి తమకు చేతనైన పని చేసి ఓ వంద రూపాయలు సంపాదించుకోవడం తెలుసు. కానీ పని దొరకని రోజు కూడా భోజనం చేయాలంటే ఈ రోజు సంపాదించిన వందలో ఓ పది రూపాయలు దాచుకోవాలని తెలియదు. పని దొరక్కపోతే పస్తులుండడమే ఇంతవరకు వాళ్లకు తెలిసిన జీవితం. అలాంటి కుటుంబాలలో మహిళలను సమీకరించి వాళ్లు చేసే పనులతోనే డబ్బు సంపాదించుకునే వెసులుబాటు కల్పించాం. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆడవాళ్లందరికీ ఊలుతో స్వెట్టర్లు, టోపీలు అల్లడం వచ్చి ఉంటుంది. వాళ్లను సంఘటిత పరిచి క్రోషియో నిట్టింగ్ బ్యాగ్లు, ఊలు ఉత్పత్తుల తయారీని ్రపోత్సహించాం. ఆ మహిళలను స్థానికంగా ఎగ్జిబిషన్లు నిర్వహించే సంస్థలతో అనుసంధానం చేయగలిగాం. ఈ ఏడాది ‘బీట్ ద హీట్’ క్యాంపెయిన్ చేపట్టాం. ఇందులో భాగంగా రోడ్డు పక్కన బండి పెట్టుకుని పుచ్చకాయ ముక్కలమ్మేవాళ్లు ఇతర చిన్న చిన్న వస్తువులమ్ముకునే వాళ్లకు మొత్తం ఐదువేల మందికి గొడుగులిచ్చాం. పండ్లు, సోడాలమ్ముకునే వాళ్ల కంటే స్టవ్ పెట్టి వండే వాళ్ల పరిస్థితి ఇంకా ఘోరం. ఎర్రటి ఎండలో బండి మీద స్టవ్ పెట్టుకుని బ్రెడ్ ఆమ్లెట్, బజ్జీలు వేసే వాళ్ల తల కూడా పెనంతో సమానంగా వేడెక్కి పోతుంటుంది. అలాంటి ఎందరో మేమిచ్చిన గొడుగును వాళ్ల బండికి కట్టుకుని రోజంతా హాయిగా పని చేసుకుంటున్నారు. మా సర్వీస్ని ఢిల్లీ, నోయిడాల నుంచి దేశంలోని బెంగళూరు, చండీగర్, ముంబయి, హైదరాబాద్లకు విస్తరించాం. ఇంకా అన్ని రాష్ట్రాల్లో మా నెట్వర్క్ను విస్తరిస్తాం’’ అని చెప్పారు. -
మళ్లీ బరి తెగించిన పాకిస్తాన్.
-
మళ్లీ బరి తెగించిన పాకిస్తాన్
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి బరితెగింపు చర్యలకు పాల్పడింది. సరిహద్దు ప్రాంతాల్లో జవాన్లుతో పాటు పౌరులు లక్ష్యంగా పాక్ రేంజర్లు మంగళవారం కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాన్నిఉల్లంఘిస్తూ... ఆర్ఎస్ పురా సెక్టార్లో కాల్పులు జరపగా ఆరుగురు పౌరులతోపాటు ఒక ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. భారత సైన్యం చేతిలో చావు దెబ్బ తింటున్న పాకిస్థాన్ సైన్యం సామాన్యులపై తన ప్రతాపం చూపిస్తోంది. సరిహద్దు వెంబడి గ్రామాలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తోంది. నౌషెరా, రాజౌరీ, ఆర్నియా, సాంబా, ఆర్ఎస్ పుర సెక్టార్లలో పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. నౌషెరాలో మోటార్లతోనూ దాడులు చేశారు. భారత భద్రతా దళాలు వాటిని బలంగా తిప్పి కొట్టాయి. అయితే పాక్ కాల్పుల్లో జమ్మూలో ఒక ఆర్మీ జవాన్ అమరుడయ్యాడు. ఇక సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతున్న పాకిస్థాన్ సైన్యానికి... అంతే స్థాయిలో మన జవాన్లు సమాధానం చెబుతున్నారు. అక్టోబర్ 19వ తేదీ నుంచి పాక్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఉండటంతో... దాదాపు ప్రతిరోజూ తుపాకుల మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. బీఎస్ఎఫ్ జరిపిన కాల్పులలో దాదాపు 15 మంది పాక్ రేంజర్స్తోపాటు మరికొందరు పౌరులు కూడా మరణించినట్లు తెలుస్తోంది. గడిచిన పదకొండు రోజుల్లో బీఎస్ఎఫ్ దళాలు చిన్నపాటి ఆయుధాలతో 35 వేల బుల్లెట్లు కాల్చాయి. వీటిలో ఎంఎంజీలు, ఎల్ఎంజీలు, రైఫిళ్లు తదితరాలున్నాయి. ఇవి కాక.. 3000 దీర్ఘశ్రేణి మోర్టార్ షెల్స్ను కాల్చాయి. అలాగే తక్కువ దూరం వెళ్లగల మోర్టార్ షెల్స్ రెండువేలు కాల్చాయి. ఈ 11 రోజుల్లో పాకిస్థాన్ దాదాపు 60 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిందని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఇక పాకిస్థాన్ వంకర బుద్ది మారడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా సరిహద్దులో చొరబాట్లు ఆగడం లేదు. ముఖ్యంగా కశ్మీర్లో చొరబాట్లు కొనసాగుతున్నాయి. బలగాల కళ్లుకప్పి గీత దాటేందుకు ముష్కరులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఒక వీడియోను రిలీజ్ చేసింది. రాత్రి పూట చెట్ల మధ్య నక్కి బోర్డర్ క్రాస్ చేసేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సాగించిన చొరబాటు యత్నాన్ని బిఎస్ఎఫ్ భగ్నం చేసింది. -
సరిహద్దులో పాక్ చొరబాట్లు వీడియో విడుదల