-
వివో నుంచి గాల్లో ఎగిరే కెమెరా!..ఫోటోలు వైరల్!
ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారు వివో గింబల్ను అమర్చి ఉన్న కెమెరా ఫోన్ ఎక్స్ 50, ఎక్స్ 60 మోడళ్లను మార్కెట్లోకి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా వివో నుంచి మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ను త్వరలోనే ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. వివో ఇంటిగ్రేట్డ్ ఫ్లయింగ్ కెమెరాతో పనిచేసే స్మార్ట్ఫోన్పై పనిచేస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. డ్రోన్ లాంటి సామర్థ్యాలను కలిగి ఉన్న స్మార్ట్ఫోన్ను వివో రూపొందించనుంది. భవిష్యత్తులో రాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్కు తేలికపాటి డ్రోన్ను అమర్చనున్నారు. ఈ డ్రోన్ సహయంతో ఏరియల్ ఫోటోలను, వీడియోలను తీయవచ్చును. వివో 2020 డిసెంబర్లో వరల్డ్ ఇంటలెక్ట్చువల్ ప్రాపర్టీ కార్యాలయంలో ఈ స్మార్ట్ఫోన్కు పేటెంట్ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది.కాగా తాజాగా ఇప్పుడు గాల్లో తేలే కెమెరాతో ఉన్న వివో స్మార్ట్ ఫోన్ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. పేటెంట్ కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తోందని భావించడంలేదు. చాలా స్మార్ట్ఫోన్ కంపెనీలు పేటెంట్ కంపెనీ వద్ద సుమారు కొన్ని వేల స్మార్ట్ఫోన్ మోడళ్లకు పేటెంట్లు నమోదైన అందులో కేవలం కొన్ని మాత్రమే మార్కెట్లోకి వస్తున్నాయని పేటెంట్లను నమోదుచేసే సంస్థలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అంతకుముందు వివో గింబల్ సిస్టమ్ కెమెరాతో స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. వివో ఎక్స్ 50 ప్రో గింబల్ వ్యవస్థను కలిగి ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 13 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ను అమర్చారు. ఈ స్మార్ట్ ఫోన్లో 90Hz అధిక రిఫ్రెష్ రేటుతో 6.56 అంగుళాల AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. వివో ఎక్స్ 50 ప్రో ఆండ్రాయిడ్ 10 వెర్షన్ను కలిగి ఉంది . ఈ స్మార్ట్ఫోన్ ధర భారత్లో రూ .49,990. -
ఎగిరే కెమెరాలిక.. తిరుమలకు అండగా!
-
కూర్మనాథాలయంపై ఫ్లయింగ్ కెమెరా కన్ను!
- దేవాదాయ శాఖాధికారులు లేకుండా షూటింగ్ జరగడంపై అనుమానాలు - ఆందోళన చెందుతున్న భక్తులు శ్రీకూర్మం(గార),న్యూస్లైన్ : ప్రఖ్యాత క్షేత్రం శ్రీకూర్మంలోని కూర్మనాథాలయంపై కొందరు వ్యక్తులు ఫ్లయింగ్ కెమెరాతో చిత్రీకరణ జరపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు ఫ్లయిం గ్ కెమెరాతో వచ్చారు. శ్వేతపుష్కరిణి, గర్భగుడి, బేడా మండపం, తదితర స్థలాల్లో చిత్రీకరణ జరిపారు. ఈ సమయంలో ఆలయ అధికారులు, సిబ్బంది ఎవరూ లేరు. వాస్తవానికి, ఆలయంలో ఫోటోలు తీయటం, కెమెరాలు, సెల్ఫోన్లు వాడటం నిషిద్ధం. ఒకవేళ షూటిం గ్ జరపాలనుకుంటే ఉన్నతాధికారుల ప్రత్యేక అనుమతితో అధికారుల సమక్షంలో చేపట్టాలి. దీనికి సాధారణ కెమెరాలనే వినియోగించాలి. ఇప్పుడు అలా కాకుండా ఏకంగా ఫ్లయింగ్ కెమెరాను వినియోగించారు. రిమోట్ సాయంతో పనిచేసిన ఈ కెమెరా 10 నుంచి 20 అడుగుల పైకి వెళ్లి చిత్రీకరణ చేసింది. దేశంలోని ప్రముఖ ఆలయాలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని నిఘా వర్గాలు ఎప్పటికప్పడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు లేని సమయంలో ఎవరో తెలియని వ్యక్తులు ఫ్లయింగ్ కెమెరాతో చిత్రీకరణ జరపడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఇదిలా ఉండగా గతేడాది మూలవిరాట్కు మైనంతో అచ్చుతీయడం, శిలాశాసనాల డీకోడింగ్ అంశాలపై ఓ అర్చకుడు సస్పెండ్ కావడం, ఈవో బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఫ్లయింగ్ కెమెరాతో చిత్రీకరణపై ఆలయ కార్యనిర్వహణాధికారి వి.శ్యామలాదేవిని ‘న్యూస్లైన్’ ప్రశ్నించగా షూటింగ్ జరిపిందెవరో తమకు తెలియదన్నారు. గతంలో జాయింట్ కలెక్టర్ సీసీ ఫోన్ లో చెప్పిన సూచనల మేరకు జిల్లా వైభవంపై డాక్యుమెంటరీ షూటింగ్ రెండు సార్లు ఆల యంలో జరిగిందన్నారు. ఇప్పుడు కూడా వారే చిత్రీకరణ చేసి ఉండవచ్చన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement