-
సముద్రం సాక్షిగా... మత్స్యకారులకు ఉపయోగపడే స్టార్టప్
మౌనంగా కనిపించే సముద్రం ఒక మహా విద్యాలయం. అక్కడ ప్రతి కెరటం ఒక పాఠం నేర్పుతుంది. ఒక ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న క్రమంలో దేవ్లీనా భట్టాచార్జీ మత్స్యకారుల జీవితాలను దగ్గరి నుంచి చూసింది. సముద్రం సాక్షిగా మత్స్యకారులకు ఉపయోగపడే స్టార్టప్ గురించి ఆలోచించింది. ‘న్యూమర్8’ రూపంలో ఆమె కల సాకారం అయింది... యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఇఎస్ఎ)లో ఒక ప్రాజెక్ట్లో భాగంగా పనిచేస్తున్నప్పుడు దేవ్లీనా భట్టాచార్జీకి మత్య్సకారుల జీవన విధానం గురించి క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం వచ్చింది. మత్స్యకారుల సంక్షేమం కోసం డాటాసైన్స్ను ఎలా ఉపయోగించవచ్చు... అనే కోణంలో మేధోమథనం చేస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అది ‘న్యూమర్8’ పేరుతో స్టార్టప్కు శ్రీకారం చుట్టడానికి కారణం అయింది. వాతావరణ సూచనల నుంచి మార్కెట్ సూచనల వరకు ఎన్నోరకాలుగా మత్స్యకారులకు ఉపయోగపడే స్టార్టప్ ఇది. బెంగళూర్ యూనివర్శిటీలో ఎంసీఏ చేసినా లీనాకు రకరకాల సమస్యలకు సంబంధించి సృజనాత్మక పరిష్కారాల గురించి ఆలోచించడం అంటే ఇష్టం. ఎవరి సహాయం లేకుండానే తన పొదుపు మొత్తాలతో ‘న్యూమర్ 8’ను మొదలుపెట్టింది. డాటా సైంటిస్ట్లు, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జిఐఎస్) నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుంది. ప్రతిభావంతురాలైన నందిని కార్తికేయన్ను సీటీవోగా నియమించింది. సీయీవోగా లీనా స్టార్టప్కు సంబంధించిన రోజువారి వ్యాపారవ్యవహారాలను పర్యవేక్షిస్తే, సీటీవోగా నందిని సాంకేతిక విషయాల బాధ్యతలను చూస్తుంది. ‘న్యూమర్ 8’లోని ‘వోఫిష్’ యాప్లో అడ్వైజరీ, మార్కెట్ లింకేజి, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ విషయాలలో మత్స్యకారులకు ఉపయోగపడే ఫీచర్లు ఉన్నాయి. ‘వోఫిష్’ శాటిలైట్ ఇమేజ్ డాటా ఎనాలసిస్ అనేది మత్య్సకారులకు చేపల వేటలో ఉపయోగపడుతుంది. వేటకు ఎక్కువ సమయం తీసుకోకపోవడమే కాదు, ఇంధనాన్ని పొదుపు చేయడంలో ఉపయోగపడుతుంది. ‘వోఫిష్’లోని మార్కెట్ లింకేజ్ ఫీచర్తో మత్స్యకారులకు అవసరమైన వలలు, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాల ఏర్పాటుకు వీలవుతుంది. దీంతోపాటు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మత్స్యకారులు తమ ఉత్పత్తులను ఆన్లైన్ డిస్ట్రిబ్యూటర్లకు అమ్ముకోవచ్చు. ‘న్యూమర్8’ తాజాగా సముద్రపు నాచుపై దృష్టి పెట్టింది. ఔషధ, ఆహార, రసాయనిక పరిశ్రమలలో ప్రపంచవ్యాప్తంగా సముద్రపు నాచుకు డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్రలోని ‘మహిళా ఆర్థిక్ వికాస్ మహామండల్’ అనే స్వచ్ఛందసంస్థ భాగస్వామ్యంతో మత్య్సకారుల కుటుంబాలకు చెందిన మహిళలకు సముద్రపు నాచు ఉత్పత్తుల ద్వారా ఉపాధి కల్పించే ప్రణాళికను న్యూమర్ 8 సిద్ధం చేసింది. చదవండి: Expiry Date: ఎక్స్పైరీ డేట్ ఎందుకు? ఆ తర్వాత వాడితే ఏమవుతుందో తెలుసా! -
ఆక్వా ల్యాబ్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
కైకలూరు : జిల్లాలో ప్రయివేటు ఆక్వా ల్యాబ్లు తప్పనిసరిగా మత్స్యశాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మత్స్య శాఖ జిల్లా సహాయ సంచాలకుడు పి.కోటేశ్వరరావు చెప్పారు. కైకలూరులోని మత్స్యశాఖ కార్యాలయానికి ఆయన బుధవారం వచ్చారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నంబరు 49 ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రయివేటు ల్యాబ్లను ఒకే గొడుకు కిందకు తీసుకువస్తుందన్నారు. జిల్లాలో 30 ప్రయివేటు ఆక్వా ల్యాబ్లు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. సీపా, ఎంపెడా వంటి సంస్థల ద్వారా కాకినాడ, కైకలూరు ప్రాంతాల్లో ప్రయివేటు ల్యాబ్ టెక్నీషియన్లకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. జిల్లాలో 48వేల హెక్టార్లలో మంచినీటి చెరువులు, 15 వేల హెక్టార్లులో ఉప్పునీటి చెరువులు ఉన్నాయని వివరించారు. ఇప్పటి వరకు మంచినీటి చెరువులు 25 వేలు, ఉప్పునీటి చెరువులు 3వేల వరకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలిపారు. చెరువుల అనుమతులకు సంబంధించి ఆటో క్యాడ్లు జతచేయని కారణంగా 433 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. చెరువులను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోలేని చేపల రైతులకు డిసెంబరు 31వ తేదీలోపు రూ.500, 2017 మార్చి 31వ తేదీలోపు అయితే రూ.700 అపరాధ రుసుంతో దరఖాస్తులు అందించాలని చెప్పారు. సబ్సిడీపై పరికరాలు.. మత్స్యశాఖ పాలసీలో భాగంగా ఆక్వా రైతులకు సబ్సిడీపై పరికరాలను అందిస్తున్నట్లు కోటేశ్వరరావు చెప్పారు. జిల్లాలో ఐదు ఎకరాలలోపు రొయ్యల రైతులకు 50శాతం సబ్సిడీపై ఒక్కో రైతుకు 4 ఎరియేటర్లు చొప్పున 150 మందకి అందించామన్నారు. ఎస్సీ, ఎస్టీ ఆక్వా రైతులకు ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం రూ.7 కోట్లు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, బీసీలకు 50 శాతం సబ్సిడీపై చేపల వలలను అందిస్తున్నట్లు వివరించారు. వేటకు ఉపయోగించే ఐబీఎం ఇంజిన్ రూ.1.20లక్షలకు 60 శాతం సబ్సిడీతో మత్స్యకారులకు అందజేస్తున్నట్లు చెప్పారు. కైకలూరు మత్స్యశాఖ ల్యాబ్ను త్వరలోనే అప్ గ్రేడ్ చేసి పూర్తిస్థాయిలో ఆధునికీకరిస్తామని ఆయన తెలిపారు. మత్స్య శాఖ కైకలూరు ఏడీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement