breaking news
FDA Inspection
-
మెక్డొనాల్డ్స్కు వార్నింగ్ నోటీసు
ముంబై : మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్లు తీవ్ర వివాదంలో కూరుకుపోతున్నాయి. ఓ వైపు కన్నాట్ ప్లాజా రెస్టారెంట్ల(సీపీఆర్ఎల్) 50:50 జాయింట్ వెంచర్ విక్రమ్ బక్షితో వివాదం, మరోవైపు ఆ రెస్టారెంట్లలో ఆహార భద్రత ప్రమాణాల ఉల్లంఘన మెక్డొనాల్డ్స్ను ఇరకాటంలో పడేస్తున్నాయి. తాజాగా ముంబైలోని సెంట్రల్ రీజన్లో గల మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్పై స్టేట్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) జరిపిన అకస్మిక దాడిలో, ఆ అవుట్లెట్ ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడం లేదని తేలింది. అకస్మాత్తుగా జరిపిన తనిఖీలో హైస్ట్రీట్ ఫీనిక్స్లోని మెక్ డొనాల్డ్స్ అవుట్లెట్ ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని ఉల్లంఘించిందని తేలిందని ఎఫ్డీఏ రిపోర్టు చేసింది. అనారోగ్య పరిస్థితుల్లో ఆహారాన్ని వండుతున్నారని, తమ లైసెన్సు కాఫీని కూడా ప్రాముఖ్యంగా చూపించడం లేదని పేర్కొంది. ఈ రెస్టారెంట్ చైన్కు ప్రస్తుతం వార్నింగ్ నోటీసు జారీచేశామని, ఒకవేళ పరిస్థితులు మెరుగుపడకపోతే, వచ్చే 15 రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సౌత్, వెస్ట్ రాష్ట్రాల్లో మెక్డొనాల్డ్స్ ఫ్రాంచైజీని హార్డ్క్యాసిల్ రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాయి. వారు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఎఫ్డీఏ నుంచి కొన్ని ప్రశ్నలను ఎదుర్కొన్నామని, వాటికి సమాధానాలను కూడా ఎఫ్డీఏకి సమర్పించామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. -
దివీస్ లాభం 9 శాతం అప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దివీస్ ల్యాబ్స్ నికర లాభం 9 శాతం పెరిగి రూ. 268 కోట్లకు చేరింది. ఇక ఆదాయం రూ. 860 కోట్ల నుంచి రూ. 976 కోట్లకు పెరిగింది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 మధ్య కాలంలో తమ విశాఖపట్నం ప్లాంట్లోని రెండో యూనిట్లో అమెరికా ఎఫ్డీఏ తనిఖీలు నిర్వహించినట్లు సంస్థ తెలిపింది. ఎఫ్డీఏ సూచనలకు సంబంధించి తాము చేపట్టిన దిద్దుబాటు చర్యలు మొదలైన వాటి గురించి ఇప్పటికే వివరణనిచ్చినట్లు పేర్కొంది. తదుపరి ఎఫ్డీఏ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని చెప్పింది.