breaking news
fake orders
-
సుప్రీం పేరుతో డిజిటల్ స్కాం
సాక్షి, న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం పేరుతో ఉత్తుత్తి ఉత్తర్వులు చూపించి వృద్ధ దంపతుల నుంచి రూ.కోటికి పైగా డబ్బు కాజేసిన ఘటనపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా న్యాయస్థానాల పేర్లతో జరిగే డిజిటల్ నేరాలతో ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతామని పేర్కొంది. వ్యవస్థ గౌరవం దెబ్బతింటుందని తెలిపింది. ఇవి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. డిజిటల్ స్కాంలపై తక్షణ ప్రతిస్పందన తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్, జాయ్మాల్య భాగ్చీల ధర్మాసనం నోటీసులు పంపింది. తమను డిజిటల్ అరెస్టు చేయాలంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసిన ఆదేశాల ఫోర్జరీ పత్రాలను బాధిత పిటిషనర్లు చూపించారు. కేటుగాళ్లు సెప్టెంబర్ 3 నుంచి 16వ తేదీ మధ్యలో సీబీఐ, ఈడీ అధికారులుగా, జడ్జీలుగా నటిస్తూ ఆడియో, వీడియో కాల్స్ ద్వారా కోర్టు నకిలీ ఉత్తర్వులను చూపించి, అరెస్టు, నిఘా అంటూ బెదిరించారని బాధితులు కొన్ని పత్రాలను చూపారు. వీటితో పలు దఫాలుగా రూ.1.05 కోట్లు కాజేశారన్నారు. హరియాణాలోని అంబాలాకు చెందిన వృద్ధ దంపతులు ఇటీవల ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్కి ఈ మోసంపై సెప్టెంబర్ 21న లేఖ రాశారు. వృద్ధ దంపతులకు జరిగిన అన్యాయంపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. బాధితుల ఫిర్యాదుపై సుమోటోగా విచారణ చేపట్టింది. విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నమిది..న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థల పేరిట సృష్టించిన ఫోర్జరీ పత్రాలతో న్యాయస్థానంపై ప్రజలకు గల విశ్వాసం దెబ్బతింటుందని ధర్మాసనం ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసింది. జడ్జీల సంతకాలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారి సంతకాలు, కోర్టు స్టాంప్ కూడా వేయడం తీవ్రమైన అంశమని పేర్కొంది. ‘జడ్జీ్జల సంతకాలతో సృష్టించిన ఫోర్జరీ పత్రాలు న్యాయస్థానంపై ప్రజల విశ్వాసంతోపాటు, వ్యవస్థ మూలాలు దెబ్బ తింటాయి. ఇటువంటి క్రిమినల్ చర్యలను సాధారణ మోసం, సైబర్ క్రైమ్గా పరిగణించకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. భవిష్యత్లో న్యాయస్థానాల పేర్లతో ప్రజలను మోసం చేసే ఘటనలను ఉపేక్షించరాదని పేర్కొంది. త్వరగా ప్రతిస్పందన తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. ఈవ్యవహారంలో తాము భారత అటార్నీ జనరల్ సహాయం కోరుతున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఇది ఈ వృద్ధ దంపతుల సమస్య మాత్రమే కాదని, యావత్ దేశ ప్రజానీకం సమస్య అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం పోలీసులను దర్యాప్తు వేగవంతం చేయమని చెప్పి వదిలేయడానికి వీలు లేదని పేర్కొంది. కేవలం ఇదొక్క కేసు మాత్రమే కాదు. ఇటువంటి నేరాలు దేశంలోని వివిధ ప్రాంతాలలో చాలా జరిగినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇటువంటి విస్తృత ప్రభావం కలిగిన నేరపూరిత చర్యలను పూర్తిగా దర్యాప్తు జరిపి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర అధికారులు సమన్వయంగా కృషి చేయాల్సిన అవసరముందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసులో సాయం అందించాలని అటార్నీ జనరల్ను కోరిన ధర్మాసనం, వృద్ధ దంపతుల కేసు దర్యాప్తు పురోగతిని తెలియజేయాలంటూ హరియాణా ప్రభుత్వం, అంబాలా సైబర్ క్రైమ్ విభాగాలను ఆదేశించింది. -
రద్దయిన పాత నోట్లను మార్చుకోవచ్చా..? కేంద్రం కీలక ప్రకటన!
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పాత రూ.500, రూ. 1000 నోట్లను ఇప్పుడు కూడా మార్చుకోవచ్చా.. ఇంకా ఈ అవకాశం ఉందా.. పాత కరెన్సీ నోట్ల మార్పిడి అంశానికి సంబంధించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన లెటర్ అంటూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: Ola Holi Offer: తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు! దాదాపు ఏడేళ్ల క్రితం 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ డీమానెటైజేషన్ను ప్రకటించారు. పాత రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేసి వాటికి బదులుగా రూ.500, రూ.2000 కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా విదేశీ పౌరులు ఇప్పటికీ తమవద్ద ఉన్న పాత ఇండియన్ కరెన్సీ నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంటూ ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేసిందంటూ ఓ లెలర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదీ చదవండి: Women’s Day 2023: ఈ బ్యాంకును నడిపించేది ఆమే.. ఏకైక మహిళా చీఫ్! దీనిపై భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ చేసి ఆ ఆర్డర్ నకిలీదని తేల్చింది. రద్దు చేసిన కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు విదేశీ పౌరులకు కల్పించిన అవకాశం 2017లోనే ముగిసిందని తెలిపింది. An order issued in the name of @RBI claims that exchange facility for Indian demonetized currency notes for foreign citizens has been extended#PIBFactCheck ✅This order is #fake ✅The exchange facility for Indian demonetized currency notes for foreign citizens ended in 2017. pic.twitter.com/cF0IwMu3Wb — PIB Fact Check (@PIBFactCheck) March 6, 2023 -
అక్రమార్కులకే అందలం
ఐసీడీఎస్లో మారని తీరు అవినీతి ఆరోపణలున్న ఉద్యోగికి పదోన్నతి నకిలీ ఆర్డర్లతో నియామకాల కేసులో చర్యలు శూన్యం ఇప్పటికే ఓ సీడీపీవో, సీనియర్ అసిస్టెంట్ పదవీ విరమణ ఆదిలాబాద్ : ఐసీడీఎస్లో తీరు మారడం లేదు. అక్రమార్కులనే అందలం ఎక్కిస్తున్నారు. గతంలోనూ సీడీపీవో స్థాయి అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాజాగా శాఖ తోపాటు స్వయంగా అప్పటి కలెక్టర్ను బురిడీ కొట్టించి నకిలీ ఆర్డర్లతో అంగన్వాడీ వర్కర్లుగా పదోన్నతి కల్పించిన వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకోలేదు. పెపైచ్చు ఓ అక్రమార్కుడికి పదోన్నతి కల్పించిన వ్యవహారం వెలుగులోకి వచ్చిం ది. గతంలో లక్సెట్టిపేటలో జరిగిన నకిలీ ఆర్డర్ల కేసులో ప్రధాన సూత్రధారుడిగా ఆరోపణలున్న సదరు ఉద్యోగికి తా జాగా సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతి కల్పించడం చర్చనీయమైంది. ఇద్దరు పదవీ విరమణ.. ఒకరికి పదోన్నతి.. లక్సెట్టిపేట ప్రాజెక్టు పరిధిలో 2012లో 13 మంది అంగన్వాడీ హెల్పర్లకు అంగన్వాడీ వర్కర్స్గా పదోన్నతి కల్పించారు. కొన్ని నెలలపాటు వారు వర్కర్లుగా పనిచేస్తూ వేతనాలు కూడా పొందారు. అప్పట్లో ఓ సూపర్వైజర్ బదిలీ జరగగా కొత్తగా వచ్చిన సూపర్వైజర్ అంగన్వాడీ వర్కర్లకు సంబంధించిన రికార్డులు పరిశీలించగా అక్రమం వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీ హెల్పర్లుగా కొన్లేళ్ల నుంచి పనిచేస్తున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి అంగన్వాడీ వర్కర్లుగా నియమించినట్లు బయటపడింది. ఆ సమయంలో ఆ ప్రాజెక్టు సీడీపీవో, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ముగ్గురు కలిసి నకిలీ పత్రాలతో అసలు శాఖతో సంబంధం లేనివారిని కొన్నేళ్లుగా హెల్పర్లుగా పనిచేస్తున్నట్లు పత్రాలు సృష్టించి వారికి నేరుగా అంగన్వాడీ వర్కర్లుగా నియమించినట్లు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించే ఐసీడీఎస్లో సెల క్షన్ కమిటీ నియామకాల వ్యవహారాన్ని చేపడుతోంది. అయితే నకిలీ ప్రొసిడింగ్లతో అప్పట్లో కలెక్టర్నే బురిడి కొట్టించి న ఘనత ఈ ప్రబుద్ధులది. దీంతో అప్ప ట్లో కలెక్టర్ ఆదేశాల మేరకు పీడీ విచారణ చేపట్టి సదరు అంగన్వాడీ వర్కర్లను తొలగించారు. ఈ వ్యవహారంలో సీడీపీవో, సీనియర్ అసిస్టెంట్, జూని యర్ అసిస్టెంట్ ఒక్కో అంగన్శాడీ వర్కర్ నుంచి సుమారు రూ.3 లక్షల వరకు వసూలు చేసి నకిలీ ప్రొసిడింగ్లు సృష్టించారని శాఖపరమైన విచారణలోను తేలింది. కాగా అంగన్వాడీ వర్కర్లుగా తొలగింపునకు గురైన వారు తమను తిరిగి కొనసాగించాలని హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు విచారణ సాగుతుంది. అయితే దాదాపు మూడేళ్లు దాటిన ఇప్పటి వరకు సీడీపీఓ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సీడీపీఓ, సీనియర్ అసిస్టెంట్లు పదవీ విరమణ పొందారు. అవినీతి అధికారులు రిటైర్డ్ అయిపోయిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వారు అన్ని రకాల లబ్ధిపొందడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో శాఖపరమైన విచారణ జరిగినా అధికారులు తీసుకున్న చర్యలేంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పైగా పదోన్నతి.. లక్సెట్టిపేట నకిలీ ఆర్డర్ల కేసులో అప్పట్లో జూనియర్ అసిస్టెంట్పైనే ప్రధానం గా ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంలో సీడీపీవోతో కలిసి ఆయనే ల క్షల రూపాయలు తీసుకొని అసలు హెల్పర్లు కాని వారికే వర్కర్లుగా నియమించారని శాఖ విచారణలో స్పష్టమైంది. ఆర్డర్లకు సంబంధించి సీడీపీవో, జూనియర్ అసిస్టెంట్ల సంతకాలు చేసిన కాపీలను విచారణలో స్వాధీనం చేసుకున్నారు. ఇం త జరిగినా వారిపై చర్యలు తీసుకోలేదు. లక్సెట్టిపేట నుంచి బదిలీ జరిగి నిర్మల్ లో పనిచేస్తున్న సదరు జూనియర్ అసిస్టెంట్కు తాజాగా సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతి కల్పించి వరంగల్ జిల్లాకు బదిలీ చేయడం చర్చనీయమైంది. కేసులో ప్రధాన వ్యక్తులైన ముగ్గురిలో ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ విషయమై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ శైలజను వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు.


