-
కరీంనగర్ బస్టాండుకు రూ.5 లక్షలు తీసుకురండి..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘మేం మావోయిస్టులం మాట్లాడుతున్నాం.. పార్టీ చందా కోసం రూ.5 లక్షలు కావాలి. కరీంనగర్ బస్టాండుకు తీసుకురావాలి’అంటూ బెదిరించిన నకిలీ మావోలు పోలీసులకు చిక్కారు. ఇటీవల రామగుండం మేయర్ బంగి అనిల్కుమార్, పంకెన సర్పంచి శ్రీనివాస్కి మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖల గుట్టును పోలీసులు ఛేదించారు. దీని వెనక మావోయిస్టులు లేరని, తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు నలుగురు యువకులు పన్నిన పన్నాగమని తేల్చారు. శుక్రవారం భూపాలపల్లి పోలీసులు ఈ కేసు వివరాలు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. భూ పాలపల్లి జిల్లా పంకెన గ్రామానికి చెందిన ఎర్ని సోమయ్య, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎలుకలపెల్లికి చెందిన చిలుముల తిరుపతి, రామగుండం మండలం గోదావరిఖనికి చెందిన ఈర్ల రాంచందర్ ఎలాగైనా సులువుగా డబ్బు సంపాదించాలని అనుకున్నారు. ఈ క్రమంలో మావోయిస్టుల పేరుతో నాయకులను బెదిరించాలని నిర్ణయించారు. ఇందుకోసం గోదావరిఖనికి చెందిన జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు టేకుల సుదీర్ సాయం తీసుకున్నారు. యూట్యూబ్లో మావోయిస్టుల లెటర్హెడ్లను చూసి అలాంటివే నకిలీవి సృష్టించారు. పంకెన సర్పంచి శ్రీనివాస్, రామగుండం మేయర్ బంగి అనిల్కుమార్లకు పార్టీకి రూ.5 లక్షలు విరాళంగా ఇవ్వాలని బెదిరిస్తూ లేఖలు పంపారు. ఈనెల 15వ తేదీన ఈ లేఖలను హైదరాబాద్ నుంచి పోస్టు చేశారు. రెండు రోజుల అనంతరం వారిద్దరికి ఫోన్ చేసి కరీంనగర్ బస్టాండుకు వచ్చి డబ్బులు అప్పగించాలని బెదిరించారు. దీనిపై సర్పంచి శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు నిఘా పెట్టి ముందు సోమయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతనిచ్చిన సమాచారంతో మిగతావారిని అరెస్టు చేశారు. -
డబ్బు కోసం నకిలీ మావోయిస్టుగా..
మంచిర్యాల టౌన్ : అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఓ డిగ్రీ విద్యార్థి నకిలీ మావోయిస్టు అవతారమెత్డాడు. ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లను పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశాడు. ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించాడు. చివరికి పోలీసులు పన్నిన వ్యూహంలో అడ్డంగా దొరికిపోయూడు. గురువారం మంచిర్యాల పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఏఎస్పీ ఎస్.ఎం.విజయ్కుమార్ వివరాలు వెల్లడించారు. డబ్బు అవసరాలు.. పాత కక్షలతో.. చెన్నూర్ పట్టణంలోని మారెమ్మవాడకు చెందిన కొమటం మధూకర్ అలియాస్ మధు అలి యూస్ మదన్ అనే యువకుడు డిగ్రీ పూర్తి చేశాడు. అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిం చాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. అలాగే తనకు గత సాధారణ, ప్రాదేశిక ఎన్నికల సమయంలో కొంతమంది ప్రజాప్రతినిదులతో జరిగిన గొడవలతో వ్యక్తిగత కక్షలను పెంచుకున్న మధూకర్ నకిలీ మావోయిస్టు అవతారం ఎత్తాడు. అంతేకాకుండా తను కౌలు తీసుకున్న పొలంలో సాగు సమయంలో దాదాపు రూ.లక్షకు పైగా అప్పుల పాలయ్యాడు. అప్పులను తీర్చుకోవడం కోసం, పాత కక్షలతో ప్రజాప్రతినిధులను బెదిరించి డబ్బులు సంపాదించాలనుకున్నాడు. మహారాష్ట్ర గడ్చిరోలి దళ కమాండర్ రామన్న పేరుతో ప్రజాప్రతినిధులను, కాంట్రాక్టర్లను బెదిరింపులకు గురి చేయడమే లక్షంగా పెట్టుకున్నాడు. పార్టీ చందాగా రూ.లక్షలు డిమాండ్ ఈ క్రమంలో మంచిర్యాల కాలేజ్రోడ్లోని పాతగర్మిళ్లకు చెందిన బెల్లంకొండ వెంకటేశ్వర్రావు అలాయాస్ భాస్కర్రావుతో పాటు ఆయన కుమారుడు భార్గవ్కు కూడా ఫోన్ చేసి పార్టీ చందాగా రూ.లక్ష డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే కుటుంబ సభ్యులను చంపేస్తామని హెచ్చరించారు. దీంతో అనుమానం వచ్చిన కాంట్రాక్టర్ వెంకటేశ్వర్రావు ఫిబ్రవరి 14వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. మధూకర్ చెన్నూర్కు చెందిన మరో ముగ్గురు ప్రజాప్రతినిధులను కూడా మావోయిస్టు పేరుతో బెదిరింపు ఫోన్లు చేశాడు. ఇందులో కోటపల్లి మండల జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డితో ఎన్నికల సమయంలో జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకుని మావోయిస్టు పార్టీ చందాగా రూ.3 లక్షలు డిమాండ్ చేశాడు. అలాగే చెన్నూర్ ఎంపీపీ మైదం కళావతి భర్త మైదం రవితో జరిగిన గొడవలో కూడా అతనికి ఫోన్ చేసి పార్టీ చందాగా రూ.5 లక్షలు, గ్రామ పంచాయితీ ఎన్నికల్లో వార్డు సభ్యుడు బత్తుల సమ్మయ్యతో జరిగిన గొడవను దృష్టిలో ఉంచుకుని పార్టీ చందాగా కొంత మొత్తం డబ్బులు డిమాండ్ చేశాడు. వీరంతా పోలీసుల దర్యాప్తులో బాధితులుగా తేలారు. అంతా పక్షం రోజుల్లోనే... మంచిర్యాలకు చెందిన బెల్లంకొండ వెంకటేశ్వర్రావు ఫిర్యాదు మేరకు సీఐ వి.సురేశ్, పోలీస్ సిబ్బంది 15 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిని గురువారం మంచిర్యాల గర్మిళ్లలో అరెస్ట్ చేశారు. అతడి నుంచి రెండు సెల్ఫోన్లు, రెండు వాల్ పోస్టర్లు స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. కాగా, పాత కక్షలతో పాటు ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే నకిలీ మావోయిస్టు అవతారం ఎత్తినట్లు విచారణలో మధూకర్ అంగీకరించాడు. అతడిని రిమాండ్కు పంపారు. -
నకిలీ మావోయిస్ట్ అరెస్ట్
అదిలాబాద్: జల్సాలకు అలవాటు పడి కష్టపడకుండా డబ్బు సంపాదించడానికి మావోయిస్టు అవతారం ఎత్తాడో వ్యక్తి. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో గురువారం చోటుచేసుకుంది. చెన్నూరు మండలం కొమతంకు చెందిన ముధుకర్ అనే వ్యక్తి స్థానిక కాళాశాలలో డిగ్రి చదువుతున్నాడు. జల్సాలకు అలవాటుపడిన మధుకర్ సులభంగా డబ్బు సంపాదించడానికి నకిలీ మావోయిస్ట్ గా మారాలనుకున్నాడు. అంతే కొందరు ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ల ఫోన్ నెంబర్లను సేకరించాడు. దీంతో వారిని ఫోన్లలో బెదింరించడం ప్రారంభించాడు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాకు చెందిన దళ కమాండర్గా పరిచయం చేసుకుని అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చంపుతానని బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా వల పన్ని మధుకర్ ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు మంచిర్యాల ఏఎస్పీ విజయ్కుమార్ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. (మంచిర్యాల)
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement