-
బయోటెక్నాలజీలో సాంకేతికతకు కీలక పాత్ర
న్యూఢిల్లీ: భవిష్యత్తులో బయోటెక్నాలజీ రంగ వృద్ధిలోనూ, కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలోనూ సాంకేతికత చాలా కీలక పాత్ర పోషించగలదని బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్–షా తెలిపారు. నియంత్రణ ప్రక్రియలను సంస్కరించేందుకు, నూతన ఔషధాలను చాలా తక్కువ వ్యవధిలోనే మార్కెట్కు చేర్చేందుకు, వివిధ రంగాల్లో టెక్నాలజీని మరింత సమర్ధంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గ్లోబల్ టెక్నాలజీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు వివరించారు. ఒక ఐడియా అత్యంత తక్కువ సమయంలో, ఏడాది వ్యవధిలోనే ప్రయోగశాల నుంచి మార్కెట్కు చేరగలిగితే బాగుంటుందని, ఇందుకోసం మన నియంత్రణ ప్రక్రియలను సమూలంగా సంస్కరించాల్సిన అవసరం ఉందని మజుందార్–షా చెప్పారు. దీనికోసం జనరేటివ్ ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్, డేటా ఆనలిటిక్స్ మొదలైనవి ఉపయోగపడగలవని ఆమె పేర్కొన్నారు. సాధారణంగా ఉత్పత్తులను ఆమోదించడానికి సంబంధించి టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో నియంత్రణ సంస్థలు చాలా నెమ్మదిగా వ్యవహరిస్తుంటాయని మజుందార్–షా తెలిపారు. నియంత్రణ అధికారులకు టెక్నికల్ నైపుణ్యాలు ఉండి, టెక్నాలజీపై అవగాహన ఉంటేనే అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలన్న లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. -
హాజీరా స్టీల్ ప్లాంటు పనులు వేగవంతం
అహ్మదాబాద్: హాజీరా ఉక్కు ప్లాంటు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆర్సెలర్మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీనివాస్ మిట్టల్ తెలిపారు. ఇది 2026 నాటికల్లా అందుబాటులోకి రాగలదని ’వైబ్రెంట్ గుజరాత్’ సదస్సు 20 ఏళ్ల వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టులో దాదాపు 20,000 మంది పైచిలుకు వర్కర్లు పాలుపంచుకుంటున్నారని మిట్టల్ చెప్పారు. ఆర్సెలర్మిట్టల్లో భాగమైన ఏఎంఎన్ఎస్ ఇండియా గతేడాది అక్టోబర్లో హాజీరా ప్లాంటు సామరŠాధ్యలను 15 మిలియన్ టన్నులకు పెంచుకునేందుకు రూ. 60,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు, తొలి దశలో ఉత్పత్తిని రెట్టింపు చేయాలని, ఆ తర్వాత మూడింతలు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు మిట్టల్ చెప్పారు. భారత్ దిగుమతులను తగ్గించుకుని, స్వావలంబన సాధించేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. జీ20 సదస్సు విజయవంతం కావడం భారత్ ఖ్యాతిని మరింతగా ఇనుమడింపచేసిందని మిట్టల్ చెప్పారు. అటు, గుజరాత్లో సామాజిక–ఆర్థిక అభివృద్ధికి, పెట్టుబడుల రాకకు ఇన్వెస్టర్ల సదస్సు ఎంతగానో ఉపయోగపడుతోందని వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా వెల్స్పన్ సంస్థ చైర్మన్ బీకే గోయెంకా తెలిపారు. సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్పై కసరత్తు చేసేందుకు జపానీస్ వ్యాపార బృందాన్ని నవంబర్లో ఆహా్వనించే యోచనలో ఉన్నట్లు జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ తకాషి సుజుకీ తెలిపారు. తదుపరి వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సదస్సు వచ్చే ఏడాది జనవరి 10–12 మధ్య గాంధీనగర్లో నిర్వహించనున్నారు. -
పవన్ ముంజాల్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా హీరో మోటో కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ పవన్ ముంజాల్తోపాటు ఇతరుల నివాసాలు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, గుర్గావ్లో ఈ సోదాలు జరిగినట్లు వెల్లడించారు. పవన్ ముంజాల్తోపాటు ఇతర నిందితులపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద ఈడీ గతంలోనే కేసు నమోదు చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్(సీబీఐసీ) ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈడీ దర్యాప్తునకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని హీరో మోటో కార్ప్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఢిల్లీ, గుర్గావ్లో పవన్ ముంజాల్ నివాసం, రెండు ఆఫీసుల్లో సోదాలు జరిగాయని తెలియజేసింది. పన్నుల ఎగవేత కేసులో ఐటీ శాఖ గత ఏడాది మార్చిలో పవన్ ముంజాల్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. -
ఫ్యూచర్ రిటైల్కు బియానీ రాజీనామా ఉపసంహరణ
న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్కు ఇచ్చిన రాజీనామాను ప్రమోటర్ కిషోర్ బియానీ ఉపసంహరించుకున్నారు. జనవరి 23న ఆయన రాజీనామాను ప్రకటించారు. భారీ రుణ భారంతో ఉన్న ఫ్యూచర్ రిటైల్పై దివాలా పరిష్కార చర్యలు అమలవుతున్న విషయం తెలిసిందే. ఫ్యూచర్ రిటైల్ దివాలా పరిష్కార ప్రక్రియను చూస్తున్న నిపుణుడు.. కిశోర్ బియానీ రాజీనామాలోని అంశాల పట్ల ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. దీంతో కిశోర్ బియానీ మార్చి 10వ తేదీ లేఖతో తన రాజీనామాను వెనక్కి తీసుకున్నట్టు ఫ్యూచర్ రిటైల్ స్టాక్ ఎక్సేంజ్లకు సమాచారం ఇచ్చింది. రుణ దాతలకు రూ 14,809 కోట్ల నష్టానికి మాజీ డైరెక్టర్లు, ప్రస్తుత డైరెక్టర్లు కారణమయ్యారంటూ ఈ వారం మొదట్లో రిజల్యూషన్ ప్రొఫెషనల్, ఫ్యూచర్ రిటైల్ సంయుక్తంగా జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు దరఖాస్తు దాఖలు చేయడం గమనార్హం. వారి నుంచి ఈ మొత్తాన్ని వసూలుకు ఆదేశాలు జారీ చేయాలని కోరాయి. -
మిస్త్రీకి టాటా చెల్లదు!
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి నాటకీయ ఫక్కీలో ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీకి ఎట్టకేలకు ఊరట లభించింది. మళ్లీ ఆయన్ను ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమించాలని, గ్రూప్ సంస్థల బోర్డుల్లో డైరెక్టరుగా కొనసాగించాలని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఆదేశించింది. టాటా సన్స్ చైర్మన్గా ఎన్.చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. అలాగే, టాటా సన్స్ స్వరూపాన్ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నుంచి ప్రైవేట్ కంపెనీగా మార్చడం కూడా చెల్లదని ఎన్సీఎల్ఏటీ స్పష్టం చేసింది. వీటికి సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది. ఈ ఆదేశాలు నాలుగు వారాల్లో అమల్లోకి వస్తాయి. ఈ లోగా దీనిపై టాటా గ్రూప్ అప్పీలు చేసుకోవచ్చని ఎన్ఎస్ఎల్ఏటీ తెలిపింది. ‘2016 అక్టోబర్ 24న టాటా సన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో మిస్త్రీకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు చట్టవిరుద్ధం. కాబట్టి మళ్లీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఆయన బాధ్యతలు చేపట్టవచ్చు. అలాగే, టాటా కంపెనీల్లో డైరెక్టరుగా కూడా ఉండవచ్చు. ఈ నేపథ్యంలో మిస్త్రీ స్థానంలో చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధం అవుతుంది’ అని జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ్ సారథ్యంలోని ద్విసభ్య బెంచ్ తుది ఉత్తర్వులిచ్చింది. మరోవైపు, డైరెక్టర్ల బోర్డు లేదా వార్షిక సర్వసభ్య సమావేశంలో మెజారిటీ అనుమతులు అవసరమయ్యే ఏ నిర్ణయాలను ముందస్తుగా తీసుకోకూడదంటూ టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాను, టాటా ట్రస్ట్స్ నామినీని ఆదేశించింది. మిస్త్రీకి వ్యతిరేకంగా ఆర్టికల్ 75లోని నిబంధనలు ప్రయోగించరాదంటూ డైరెక్టర్ల బోర్డుకు, షేర్హోల్డర్లకు సూచించింది. అటు, టాటా సన్స్ స్వరూపాన్ని పబ్లిక్ కంపెనీ నుంచి ప్రైవేట్ కిందకు మార్చాలన్న కంపెనీల రిజిస్ట్రార్ (ఆర్వోసీ) నిర్ణయాన్ని అప్పిలేట్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. దీన్ని రికార్డుల్లో సత్వరం సరిచేయాలంటూ ఆర్వోసీని ఎన్సీఎల్ఏటీ ఆదేశించింది. ఇక, మిస్త్రీకి వ్యతిరేకంగా 2018 జూలై 9న ఎన్సీఎల్టీ ఇచ్చిన ఆదేశాల్లో చేసిన కొన్ని వ్యాఖ్యలను కూడా తప్పుబట్టింది. ఇవి మిస్త్రీ ప్రతిష్టను దెబ్బతీసేవిగా ఉన్నాయని, వీటిని రికార్డుల నుంచి తొలగించాలని పేర్కొంది. అయితే, మిస్త్రీని డైరెక్టరుగా కొనసాగించడం మినహా... ఆయన్ను చైర్మన్గా పునర్నియమించాలన్న ఆదేశాలను సస్పెన్షన్లో ఉంచాలని టాటా సన్స్ న్యాయవాది ఎన్సీఎల్ఏటీని అభ్యర్థించారు. చట్టపరంగా చర్యలు: టాటా సన్స్ ట్రిబ్యునల్ ఆదేశాలు చూస్తుంటే అడిగిన దానికి మించే మిస్త్రీకి ఊరటనిచ్చినట్లు కనిపిస్తోందని టాటా సన్స్ వ్యాఖ్యానించింది. టాటా సన్స్, ఇతర లిస్టెడ్ టాటా కంపెనీల షేర్హోల్డర్లు.. చట్టబద్ధంగా షేర్హోల్డర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎన్సీఎల్ఏటీ ఏ విధంగా తిరస్కరిస్తుందన్న దానిపై స్పష్టత లేదని పేర్కొంది. ‘మా కేసు బలంగా ఉందని గట్టిగా విశ్వసిస్తున్నాం. తాజా ఆదేశాలకు సంబంధించి చట్టపరంగా ముందుకు వెడతాం‘ అని ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, తాజా పరిణామాలతో చంద్రశేఖరన్ టాటా గ్రూప్ ఉద్యోగులకు లేఖ రాశారు. లీగల్ అంశాలను సంస్థ చూసుకుంటుందని.. సిబ్బంది తమ కార్యకలాపాలపై దృష్టిపెట్టి, వాటాదారుల ప్రయోజనాలను కాపాడాలని పేర్కొన్నారు. గ్రూప్ కంపెనీల షేర్లు పతనం.. అపీలేట్ ట్రిబ్యునల్ ఆదేశాల నేపథ్యంలో.. టాటా గ్రూప్ కంపెనీల షేర్లు 4 శాతం దాకా క్షీణించాయి. బీఎస్ఈలో టాటా గ్లోబల్ బెవరేజెస్ 4 శాతం, టాటా కాఫీ 3.88 శాతం, టాటా మోటార్స్ 3.05 శాతం పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్లో టాటా మోటార్స్ షేరు అత్యధికంగా క్షీణించింది. అటు ఇండియన్ హోటల్స్ కంపెనీ 2.48 శాతం, టాటా కెమికల్స్ 1.65 శాతం, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ 1.22 శాతం, టాటా పవర్ కంపెనీ 0.98 శాతం తగ్గాయి. మూడేళ్ల పోరాటం.. ► 2016 అక్టోబర్ 24: టాటా సన్స్ చైర్మన్గా మిస్త్రీ తొలగింపు. తాత్కాలిక చైర్మన్గా రతన్ టాటా నియామకం. ► 2016 డిసెంబర్ 20: మిస్త్రీ తొలగింపును సవాల్ చేయడంతో పాటు టాటా సన్స్లో అవకతవకలు, మైనారిటీ షేర్హోల్డర్ల హక్కులు కాలరాస్తున్నారని ఆరోపిస్తూ మిస్త్రీ కుటుంబానికి చెందిన సంస్థలు ఎన్సీఎల్టీని (ముంబై) ఆశ్రయించాయి. ► 2017 జనవరి 12: అప్పటి టీసీఎస్ సీఈవో, ఎండీ ఎన్ చంద్రశేఖరన్ను చైర్మన్గా నియమిస్తున్నట్లు టాటా సన్స్ ప్రకటించింది. ► 2017 ఫిబ్రవరి 6: టాటా గ్రూప్ సంస్థల హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్ బోర్డు నుంచి డైరెక్టరుగా మిస్త్రీ తొలగింపు. ► 2017 మార్చి 6: మిస్త్రీ కంపెనీల పిటిషన్ను ఎన్సీఎల్టీ కొట్టేసింది. మైనారిటీ షేర్హోల్డర్ల తరఫున పిటిషన్ వేయాలంటే 10 శాతం వాటాలైనా ఉండాలన్న నిబంధనకు ఇది విరుద్ధంగా ఉందని పేర్కొంది. మిస్త్రీ కుటుంబానికి టాటా సన్స్లో 18.4 శాతం వాటాలు ఉన్నప్పటికీ.. ప్రిఫరెన్షియల్ షేర్లను పక్కన పెడితే కేవలం 3% వాటా మాత్రమే ఉండటం ఇందుకు కారణం. ఆ తర్వాత 10% వాటాల నిబంధన నుంచి మినహాయింపునివ్వాలంటూ మిస్త్రీ సంస్థలు చేసిన విజ్ఞప్తిని కూడా ఏప్రిల్ 17న ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది. ► 2017 ఏప్రిల్ 27: ఎన్సీఎల్టీ ఆదేశాలపై మిస్త్రీ సంస్థలు ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. ► 2017 సెప్టెంబర్ 21: 10 శాతం వాటాల నిబంధన మినహాయింపు విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఎన్సీఎల్ఏటీ.. మిగతా ఆరోపణలపై విచారణ జరపాలంటూ ఎన్సీఎల్టీని సూచించింది. ► 2017 అక్టోబర్ 5: కేసును ముంబై నుంచి ఢిల్లీకి మార్చాలంటూ ఎన్సీఎల్టీ ప్రిన్సిపల్ బెంచ్ను మిస్త్రీ సంస్థలు కోరాయి. అయితే, దీన్ని తిరస్కరించిన ప్రిన్సిపల్ బెంచ్.. రెండు సంస్థలకు కలిపి రూ. 10 లక్షల జరిమానా విధించింది. ► 2018 జూలై 9: టాటా గ్రూప్, రతన్ టాటాపై మిస్త్రీ ఆరోపణల్లో పసలేదని పిటిషన్లను కొట్టేసిన ఎన్సీఎల్టీ (ముంబై) ► 2018 ఆగస్టు 3: ఎన్సీఎల్టీ తీర్పును సవాల్ చేస్తూ మిస్త్రీ సంస్థలు అపీలేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించాయి. ఆగస్టు 29న మిస్త్రీ వ్యక్తిగత పిటిషన్ను కూడా స్వీకరించిన ఎన్సీఎల్ఏటీ.. మిగతా పిటిషన్లతో కలిపి విచారణ చేయాలని నిర్ణయించింది. ► 2019 మే 23: వాదనలు ముగిసిన అనంతరం ఎన్సీఎల్ఏటీ తీర్పు రిజర్వ్లో ఉంచింది. ► 2019 డిసెంబర్ 18: మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్గా మళ్లీ నియమించాలంటూ ఆదేశాలిచ్చింది. అప్పీలు చేసుకునేందుకు టాటా సన్స్కు నాలుగు వారాల వ్యవధినిచ్చింది. ఇది గుడ్ గవర్నెన్స్ విజయం ట్రిబ్యునల్ తీర్పుతో మైనారిటీ షేర్హోల్డర్ల హక్కులు, గుడ్ గవర్నెన్స్ సూత్రాలకు విజయం లభించింది. ఈ విషయంలో మా వాదనలే నెగ్గాయి. ఎలాంటి కారణం లేకుండా, ముందస్తుగా చెప్పకుండా నన్ను టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గాను, ఆ తర్వాత డైరెక్టర్గాను తొలగించారు. వీటిని వ్యతిరేకిస్తూ మేం చేసిన వాదనలు సరైనవే అనడానికి తాజా తీర్పు నిదర్శనం. టాటా గ్రూప్ వృద్ధి చెందాలంటే కంపెనీలు, వాటి బోర్డులు, టాటా సన్స్ యాజమాన్యం.. బోర్డు, టాటా సన్స్ షేర్హోల్డర్లు .. అందరూ నిర్దిష్ట గవర్నెన్స్ నిబంధనలకు అనుగుణంగా కలిసి పనిచేయడం, అన్ని వర్గాల ప్రయోజనాలూ పరిరక్షించడం అవసరం. – సైరస్ మిస్త్రీ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement