breaking news
earth quick
-
బంగాళాఖాతంలో భూకంపం..చెన్నైలో భూప్రకంపనలు
సాక్షి,చెన్నై: బంగాళాఖాతంలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.1గా నమోదైంది. ఈ క్రమంలో చెన్నైలోని పలుచోట్ల స్వల్పంగా భూమి కంపించింది. భూకంప కేంద్రం చెన్నై నగరానికి తూర్పు-ఈశాన్య దిశలో 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు గుర్తించారు. మధ్యాహ్నం 12.23 గంటల ప్రాంతంలో భూమి కంపించిందని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సీస్మాలజీ వెల్లడించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పై భూకంపం ఎటువంటి ప్రభావం చూపలేదని రాష్ట్ర విపత్తులశాఖ తెలిపింది. చదవండి:మేము మోసపోతే.. ప్రభుత్వం ఆదుకోవడం చరిత్ర’ Earthquake of Magnitude:5.1, Occurred on 24-08-2021, 12:35:50 IST, Lat: 14.40 & Long: 82.91, Depth: 10 Km ,Location: 296km SSE of kakinada, Andhra Pradesh, India for more information download the BhooKamp App https://t.co/6qwi4D40KO @ndmaindia @Indiametdept pic.twitter.com/dLB55CDm36 — National Center for Seismology (@NCS_Earthquake) August 24, 2021 -
భూకంప వదంతులతో రోడ్లపైనే జాగారం
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో భూకంప వదంతులు ....ప్రజలకు కంటిమీద కునుక లేకుండా చేశాయి. భూకంపం వస్తోందని పుకార్లతో జనాలంతా నిద్ర పోకుండా రాత్రంతా రోడ్లపైనే జాగారం చేశారు. కరీంనగర్ జిల్లాల్లో భూకంప పుకార్లు షికారు చేయటంతో జనాలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. దీనికి తోడు భూకంప పుకార్లు సెల్ఫోన్ల ద్వారా మూరుమూల గ్రామాలకు పాకి పోవటంతో ఎవరికి వారు తమ బంధువులకు ఫోన్లు ద్వారా సమాచారం అందించారు. దాంతో వారు కూడా నిద్ర పోకుండా జాగారం చేశారు. కరీంనగర్ జిల్లాతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భూకంప వదంతులు షికార్లు చేశాయి. కాగా భూకంప వదంతులను ఆ శాఖ కొట్టిపారేసింది. వదంతులు నమ్మవద్దని ప్రజలకు సూచించింది. -
భూమ్ షేక్