breaking news
drilling pipes manufacturing company
-
తెలంగాణకు శుభవార్త ! భారీ పెట్టుబడులకు ఆ కంపెనీ గ్రీన్ సిగ్నల్ ?
ఆయిల్ డ్రిల్లింగ్, రిగ్ సెక్టార్లో ప్రముఖ కంపెనీగా వెలుగొందుతున్న డ్రిల్మెక్స్పా సంస్థ తెలంగాణలో ఇన్వెస్ట్ చేసేందుకు సై అంది. ఈ మేరకు తెలంగాణలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టేందుకు డ్రిల్మెక్ స్పా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకోనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ప్రకటించారు. ఇటలీకి చెందిన డ్రిల్మెక్ స్పా ఆయిల్ డ్రిలింగ్, రిగ్గింగ్ సెక్టార్ ఎక్విప్మెంట్ తయారీలో ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థల్లో ఒకటిగా ఉంది. డ్రిల్మెక్ స్పా సుమారు రూ 1500 కోట్లు (200 మిలియన్ డాలర్ల) వ్యయంతో తెలంగాణ ఆయిల్ రిగ్ మెషినరీ తయారీ పరిశ్రమను స్థాపించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా కనీసం 2500ల మంది ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయిల్, నేచురల్ గ్యాస్ వెలికితీసే మెషినరీ తయారు చేయడంలో డ్రిలింగ్ స్పా కంపెనీకి వందేళ్లకు పైగా అనుభవం ఉంది. Let’s start this week with a piece of good news Drillmec SpA, Global oil-drilling rig manufacturing giant has decided to setup its manufacturing plant in #Telangana Formal MoU to be signed today 👍 Will be investing $200 MN (₹1,500) & providing employment to 2500 people — KTR (@KTRTRS) January 31, 2022 తెలంగాణలో గోదావరి తీరం వెంట అపారమైన నేచురల్ గ్యాస్ నిల్వలు ఉన్నాయి. గోదావరి వ్యాలీలో ఇప్పటికే ఓఎన్జీసీ పలు మార్లు సర్వేలు కూడా చేపట్టింది. ఇదే సమయంలో పాత భూగర్భ గనుల్లో నుంచి మిథేన్ వంటి గ్యాస్ వెలికితీ అంశంపై ఎప్పటి నుంచో సింగరేణి సంస్థ ప్రయత్నలు చేస్తోంది. డ్రిల్మెక్ స్పా వంటి గ్లోబల్ కంపెనీ తెలంగాణకు రావడం వల్ల నేచురల్ గ్యాస్ సెక్టార్లో తెలంగాణ పురోగతి సాధించే అవకాశం ఉంది. చదవండి: హైదరాబాద్లో సూపర్ కంప్యూటర్? రెడీ అయిన అమెరికా కంపెనీ! -
కృష్ణపట్నం తరలనున్న ఓసీటీఎల్!
ప్లాంటు తరలింపునకు రూ.200 కోట్ల వ్యయం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డ్రిల్లింగ్ పైపుల తయారీలో ఉన్న కామినేని గ్రూప్ కంపెనీ ఆయిల్ కంట్రీ ట్యూబ్యులార్ (ఓసీటీఎల్) నల్గొండ జిల్లా నార్కట్పల్లి వద్ద ఉన్న ప్లాంటును తరలిస్తోంది. కొన్ని నెలలుగా కార్మికులతో తలెత్తిన సమస్యల కారణంగా ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. దీంతో ప్లాంటును తరలించడం తప్ప మరో మార్గం లేదని సంస్థ నిర్ణయించింది. ఎటువంటి నోటీసు, సరైన కారణం లేకుండా కార్మికులు మూకుమ్మడిగా సమ్మెకు దిగారని బీఎస్ఈకి నవంబర్ 10న ఓసీటీఎల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. చమురు, సహజ వాయు నిక్షేపాల వెలికితీతలో ఉపయోగించే అయిదు రకాల భాగాలను తయారు చేసే కంపెనీ ప్రపంచంలో ఇదొక్కటే. ప్లాంటు వార్షిక సామర్థ్యం 1.5 లక్షల టన్నులు. ఓఎన్జీసీ, షెల్ తదితర కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. అమెరికా, మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి చేస్తోంది. కంపెనీకి ప్రధాన మార్కెట్ అయిన అమెరికా యాంటీ డంపింగ్ డ్యూటీ విధించడం కూడా వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఓసీటీఎల్కు రూ.5.87 కోట్ల నష్టం వాటిల్లింది. ప్లాంటులో సుమారు 700 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 9 నెలల్లో కొత్త ప్లాంటు.. ఓసీటీఎల్కు ఇప్పటి వరకు రూ.500 కోట్లు వెచ్చించామని కామినేని గ్రూప్ డెరైక్టర్ కామినేని శశిధర్ తెలిపారు. ప్లాంటు సామర్థ్యంలో 10-20 శాతంలోపే ఉత్పత్తి నమోదవుతోందని పేర్కొన్నారు. ప్లాంటు తరలింపు అంశంపై ఈ నెలలో బోర్డు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కొత్త ప్లాంటుకై కృష్ణపట్నం, విశాఖపట్నం, కాకినాడ ప్రాంతాలను కంపెనీ పరిశీలిస్తోంది. కృష్ణపట్నం వద్దే ఇది ఏర్పాటయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. పైపులను కంపెనీ ఈ పోర్టు నుంచే విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ప్లాంటు తరలింపు, కొత్త ప్రదేశంలో ఏర్పాటుకు రూ.200 కోట్ల వ్యయం అవుతుందని శశిధర్ తెలిపారు. 75 శాతం మెషినరీ పనికొస్తుందని చెప్పారు. పరిస్థితుల్లో మార్పు లేకపోతే నార్కట్పల్లిలో ఉన్న కామినేని స్టీల్ అండ్ పవర్, యునెటైడ్ సీమ్లెస్ ట్యూబ్యులర్ యూనిట్లను కూడా తరలించడం ఖాయమన్నారు. ఈ రెండు కంపెనీల కోసం సంస్థ రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టింది. రూ.3,000 కోట్లతో విస్తరణ చేపట్టాలని గతంలో భావించినప్పటికీ, తాజాగా ప్లాంట్లనే మరోచోటుకు తరలించాలని నిర్ణయించడం కొసమెరుపు.