breaking news
Doubles Final
-
సాత్విక్-చిరాగ్ జోడి సంచలనం.. కొరియా ఓపెన్ కైవసం
భారత స్టార్ డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిలు కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచారు. ఆదివారం జరిగిన పరుషుల డబుల్స్ ఫైనల్లో ఈ ద్వయం.. ఇండోనేషియాకు చెందిన టాప్ సీడ్ ఫజర్ అల్పయాన్–ముహమ్మద్ రియాన్ జంటపై 17-21, 21-13, 21-14 తేడాతో విజయాన్ని సాధించారు. కాగా గత నెల ఈ జోడి ఇండోనేషియా ఓపెన్ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్లో తొలి గేమ్ను 17-21తో ఓడిపోయినప్పటికి రెండో గేమ్లో ఫుంజుకున్న సాత్విక్-చిరాగ్ శెట్టి జోడి ప్రత్యర్థి జంట సర్వీస్ను పదే పదే బ్రేక్ చేస్తూ ఆధిక్యంలో దూసుకెళ్లారు. 21-13తో రెండో గేమ్ను సొంతం చేసుకున్నారు. ఇక కీలకమైన మూడో గేమ్లోనూ బలమైన స్మాష్ సర్వీస్లతో విరుచుకుపడిన సాత్విక్-చిరాగ్ జోడి ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వకుండా 21-14తో గేమ్ను ముగించి చాంపియన్స్గా అవతరించారు. ఓవరాల్గా ఈ జంటకు ఇది మూడో BWF వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్ కావడం విశేషం. 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 🏆🤩 Satwik-Chirag win their 3️⃣rd #BWFWorldTour Super 500 title 🥳 📸: @badmintonphoto @himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #KoreaOpen2023#IndiaontheRise#Badminton pic.twitter.com/t0osXuHCFS — BAI Media (@BAI_Media) July 23, 2023 Korea Open: SatChi defeated Alfian/Ardianto in a 3 setter battle to win the title, 3rd title of the year.. What a great pair they have become, df. WN2 pair in SF and WN1 pair in Final.. #Badminton #KoreaOpen pic.twitter.com/JQt8p3BegQ — Aditya Narayan Singh (@AdityaNSingh87) July 23, 2023 చదవండి: #Gianluigi Donnarumma: దోపిడి దొంగల బీభత్సం.. గోల్కీపర్, అతని భార్యను బంధించి -
టైటిల్ పోరుకు సానియా–హర్డెస్కా జంట
స్ట్రాస్బర్గ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జోడీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఫ్రాన్స్లో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా–హర్డెస్కా ద్వయం 6–3, 6–3తో కైట్లిన్ క్రిస్టియన్ (అమెరికా)–లిద్జియా మరోజవా (రష్యా) జంటపై గెలిచింది. 69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సానియా–హర్డెస్కా జోడీ ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. నేడు జరిగే ఫైనల్లో నికోల్ (అమెరికా)–దరియా సావిల్లె (ఆస్ట్రేలియా) జంటతో సానియా–హర్డెస్కా తలపడతారు. -
సాకేత్కు డబుల్స్ టైటిల్
ఏటీపీ చాలెంజర్ టోర్నీ పుణే: గతవారం కెరీర్లో తొలి ఏటీపీ చాలెంజర్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ స్టార్ సాకేత్ మైనేని ఈ వారం డబుల్స్ టైటిల్ను సాధించాడు. శుక్రవారం జరిగిన పుణే ఏటీపీ చాలెంజర్ డబుల్స్ ఫైనల్లో సాకేత్-సనమ్ సింగ్ (భారత్) జంట 6-3, 6-2తో టాప్ సీడ్ సంచాయ్ రటివటానా-సొంచాట్ (థాయ్లాండ్) ద్వయ ంపై గెలిచింది. ఈ విజయంతో సాకేత్ జంటకు 3,100 డాలర్ల ప్రైజ్మనీ (రూ. లక్షా 89 వేలు)తోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సాకేత్ కెరీర్లో ఇది మూడో ఏటీపీ చాలెంజర్ టోర్నీ డబుల్స్ టైటిల్. సింగిల్స్లో సాకేత్ సెమీస్లో 6-7 (6/8), 4-6తో నాలుగో సీడ్ యూచి సుగిటా (జపాన్) చేతిలో ఓడిపోయాడు.