breaking news
doctor mohan rao
-
కంటిజబ్బుకు నానో చికిత్స
- సీసీఎంబీ శాస్త్రవేత్తల ఘనత - సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ మోహన్రావు వెల్లడి సాక్షి, హైదరాబాద్: కనుగుడ్డును దెబ్బతీసి చివరకు అంధత్వానికి దారితీసే కెరటైటిస్ అనే వ్యాధికి తాము నానో కణాల ద్వారా చికిత్సను అభివృద్ధి చేసినట్లు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డెరైక్టర్ డాక్టర్ సీహెచ్.మోహన్రావు తెలిపారు. ఫంగస్ ద్వారా వ్యాపించే ఈ వ్యాధి వ్యవసాయ పనులు చేసేవారిలో ఎక్కువగా కనిపిస్తుందని, తగిన చికిత్స అందించకపోతే వ్యాధి సోకిన వారిలో కనీసం 30 శాతం మంది శాశ్వత అంధత్వానికి గురవుతారని ఆయన వెల్లడించారు. సీసీఎంబీ మాతృసంస్థ సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) 73వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కెరటైటిస్ కారక ఫంగస్ను నాశనం చేసేందుకు ఓ ప్రత్యేకమైన రసాయన సమ్మేళనాన్ని సిద్ధం చేశామని, దాన్ని కనుగుడ్డుపై ఎక్కువసేపు ఉండే లా చేసేందుకు నానోకణాల ను ఉపయోగించామని తెలి పారు. ఈ నానోకణాలు ఇన్ఫెక్షన్ స్థాయికి తగ్గట్టుగా మం దు విడుదల చేస్తాయని, జంతువుల్లో జరిగిన ప్రయోగాలు ఇప్పటికే సత్ఫలితాలిచ్చాయని చెప్పారు. ఈ చికిత్స విధానం మొత్తానికి పేటెంట్ పొందేందుకు దరఖాస్తు చేశామని, ప్రభుత్వ అనుమతితో త్వరలో మానవ ప్రయోగాలూ చేపడతామని మోహన్రావు వివరించారు. అన్నీ సవ్యంగా సాగితే రెండుమూడేళ్లలో ఈ చికిత్స అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఇతర కంటిజబ్బులతోపాటు, కేన్సర్ చికిత్సలకూ ఈ విధానాన్ని ఉపయోగించే అవకాశముందని తెలిపారు. అలాగే సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ మంజులారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రయోగాలు ఏటికేడాది పెరిగిపోతున్న యాంటీబయాటిక్ మందుల నిరోధకతకు ఓ వినూత్నమైన విరుగుడును వెలుగులోకి తెచ్చాయని మోహన్రావు తెలిపారు. -
‘ప్రాణాలతో చెలగాటం’పై విచారణ
కోల్సిటీ, న్యూస్లైన్ : గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఏరియా ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ను ప్రయోగశాలగా మార్చిన సూపరింటెండెంట్ వైఖరిపై ‘సాక్షి’ ప్రచురించిన కథనం సంచలం సృష్టించింది. ఉన్నతాధికారుల అనుమతి లే కుండా సూపరింటెండెంట్ హోదాలో అనస్తీషియా డాక్టర్ మోహన్రావు, ఓ మహిళతో నిబంధనలకు విరుద్ధంగా ఆపరేషన్లు చేస్తున్న వైనాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఈనెల 18న ‘ప్రాణాలతో చెలగాటం’ శీర్షికన ప్రచురితమై న కథనానికి అధికారులు స్పందిం చారు. విచారణ చేపట్టిన డీసీహెచ్ఎస్ డాక్టర్ భోజా బుధవారం ‘న్యూస్లైన్’తో ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడారు. ఆపరేషన్ థియేటర్లోకి అనుమతి లేకుండా ఎవరు వెళ్లడానికి వీల్లేదన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోహన్రావును వెంటనే బాధ్యతల నుంచి తొలగించినట్లు తెలిపారు. ఇక్కడే గైనకాలజిస్టుగా సేవలందిస్తున్న డాక్టర్ సూర్యశ్రీరావుకు సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. కాగా, అనస్థీషియాగా సేవలందించే డాక్టర్ మోహన్రావు ఆస్పత్రికి సంబంధం లేని మహిళతో ఏకంగా థియేటర్లో ఆపరేషన్లు చేయించడం, ప్రత్యేకంగా చూపించడంపై విచారణ చేపట్టినట్లు డీసీహెచ్ఎస్ వివరించారు. అక్రమంగా ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లోకి వచ్చిన సదరు మహిళ, ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రభుత్వాస్పత్రిలోని ఓపీ విభాగంలో, ఔట్సోర్సింగ్ ఉగ్యోగిగా పేషెంట్లకు చిట్టీలు రాస్తూ కొంతకాలం పని చేసినట్లు తెలిసింది. అసలు ఈ మహిళ ఎవరు? ఆస్పత్రి థియేటర్లోకి ఎలా వస్తోంది? తదితర వివరాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.