breaking news
dmk alliance
-
ఉత్తరాదిలో ‘ఇండియా’కూటమి ఓటమికి డీఎంకేనే కారణం: తమిళిసై
చెన్నై: ఉత్తరాదిలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తరచూ ఓటమి పాలవ్వడానికి తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ కొత్త భాష్యం చెప్పారు. ఇండియా కూటమి ఓటమికి తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీయే కారణమని విశ్లేషించారు. శనివారం ఆమె చెన్నైలోని రాజ్భవన్ సమీపంలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.దేశాన్ని సమైక్యంగా ఉంచేందుకు పటేల్ కృషి చేశారని, డీఎంకే మాత్రం బిహారీలు, ఉత్తర భారతీయులపై వివక్ష చూపుతోందని తమిళిసై విమర్శించారు. ముఖ్యంగా బిహార్ ప్రజల గురించి డీఎంకే దారుణంగా మాట్లాడుతోందని దుయ్యబట్టారు. ‘‘బిహారీలు అజ్ఞానులంటూ డీఎంకే మంత్రి కేఎన్ నెహ్రూ అంటున్నారు. బల్లలు ఊడ్చడం, మరుగుదొడ్లను శుభ్రం చేయడంలో బిహారీలు మంచి పనివారని డీఎంకే వ్యాఖ్యలు చేసింది. బిహారీలు గోమూత్రం తాగేవారంటూ ఏకంగా చట్టసభల్లో డీఎంకే నేతలు విమర్శలు చేశారు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. డీఎంకే వల్లే ఉత్తరాదిలో ఇండియా కూటమి ఓడిపోతోందని స్పష్టం చేశారు.మోదీ నుంచి మొదలు..ఇటీవల బిహార్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ తొలుత డీఎంకే అంశాన్ని లేవనెత్తారు. డీఎంకే తమిళనాడులో ఉన్న ఉత్తరాది కార్మికులను వేధిస్తోందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలను డీఎంకే నేతలు ఖండిస్తున్న నేపథ్యంలో.. తమిళనాడు బీజేపీ నేతలు ప్రతివిమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళిసై శనివారం డీఎంకేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
Lok sabha elections 2024: మాణిక్కం ఠాగూర్ వర్సెస్ రాధిక
సాక్షి, న్యూఢిల్లీ: డీఎంకేతో పొత్తులో భాగంగా తమిళనాడులో పోటీ చేస్తున్న తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తును కాంగ్రెస్ వేగవంతం చేసింది. శుక్రవారం జరిగిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో విరుధునగర్ సహా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. విరుధునగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ మరోసారి బరిలో దిగుతున్నారు. మరోవైపు ఈ స్థానాన్ని సినీ నటి రాధికా శరత్కుమార్కు కేటాయిస్తూ బీజేపీ కూడా శుక్రవారమే నిర్ణయం తీసుకుంది! దాంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. 2009లో కూడా ఇక్కడ మాణిక్కం నెగ్గారు. 2014లో డీఎంకే, కాంగ్రెస్ విడిగా పోటీ చేయడంతో అన్నాడీఎంకే అభ్యర్థి టి.రాధాకృష్ణ భారీ గెలుపొందారు. 2019లో కాంగ్రెస్, డీఎంకే కలిసి పోటీ చేయడంతో మాణిక్కం ఠాగూర్ మరోసారి నెగ్గారు. డీఎంకే మద్దతుతో ఈసారీ సునాయాసంగా నెగ్గుతామని కాంగ్రెస్ భావిస్తోంది. -
తమిళులకు డీఎంకే–కాంగ్రెస్ ద్రోహం చేశాయి: నడ్డా
సాక్షి ప్రతినిధి, చెన్నై: పదేళ్ల యూపీఏ పాలనలో తమిళనాడు ప్రజలకు డీఎంకే–కాంగ్రెస్ కూటమి మేలు చేయకపోగా తీరని ద్రోహం చేసిందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి లోక్సభ ఉప ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల కూటమి అభ్యర్థుల కోసం ఆయన ఆదివారం ప్రచారం చేశారు. తిరునల్వేలిలోనూ పర్యటించారు. ‘కుటుంబరాజకీయం, అవినీతిమయ పాలనలో ఆరితేరిన డీఎంకే, కాంగ్రెస్లతో దేశానికి అరిష్టం. తమిళనాడులో జల్లికట్టు క్రీడపై నిషే«ధానికి కాంగ్రెస్ హయాంలో పర్యావరణశాఖ మంత్రిగా ఉన్న జైరాం రమేష్ కారణం. ఆనాడు యూపీఏలో భాగస్వామి అయిన డీఎంకే ఈ నిషేధంపై నోరుమెదపలేదు. 2జీ కుంభకోణమే డీఎంకే మౌనానికి కారణం. మోదీ ప్రధాని అయిన తరువాతనే తమిళుల సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై నిషేధం తొలగింది’అని అన్నారు. పశ్చిమబెంగాల్లో రెండో విడత పోలింగ్లో బీజేపీ గాలి వీచిందని అన్నారు. కేరళలో స్వల్ప మెజార్టీతోనైనా అధికారంలోకి వస్తామనే నమ్మకం ఉందని చెప్పారు. నాలుగు రాష్ట్రాల్లోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
మోడీ సభలకు ఏర్పాట్లు షురూ
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో గెలుపే లక్ష్యంగా డీఎంకే కూటమి ఉరకలు తీస్తోంది. తమ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయూలని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నిర్ణయించారు. అందుకు తగ్గ ఏర్పాట్లలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ నిమగ్నమయ్యూరు. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ నేతృత్వంలో కూటమి ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఇందులో డీఎండీకే, పీఎంకే, ఎండీఎంకే, ఐజేకే, కొంగునాడు పార్టీలు ఉన్నాయి. అత్యధిక స్థానాల్ని కైవశం చేసుకోవడమే లక్ష్యంగా ఈ కూటమి నేతలు ఉరకలు తీస్తున్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా డీఎండీకే నేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత వేర్వేరుగా సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. ఎండీఎంకే నేత వైగో కూడా ప్రచార బాటకు శ్రీకారం చుట్టారు. తాను విరుదునగర్ నుంచి పోటీ చేస్తున్నప్పటికీ, కూటమి అభ్యర్థుల విజయం కోసం ప్రచారాన్ని వేగవంతం చేశారు. అలాగే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, పీఎంకే నేత రాందాసు తమకు పట్టున్న చోట్ల ప్రచార సభలతో దూసుకెళుతున్నారు. తమ ప్రచారాలకు అనూహ్య స్పందన వస్తుండడంతో పాటు మోడీ నామ జపం మారుమోగుతోంది. దీంతో ప్రచారానికి మోడీని ఆహ్వానించాలని నిర్ణయించారు. రాష్ట్ర పార్టీ వినతికి స్పందించిన మోడీ రెండు చోట్ల ప్రచార సభలకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఏర్పాట్లలో నాయకులు బిజీ ప్రచారానికి మోడీ వస్తుండడంతో అందుకు తగ్గ ఏర్పాట్లపై బీజేపీ రాష్ట్ర నాయకులు దృష్టి కేంద్రీ కరించారు. ఆయన ప్రచార సభల వేదికల్ని ఎంపిక చేస్తున్నారు. కన్యాకుమారి, చెన్నైలో మోడీ ప్రచార సభలను నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ మేరకు సభల ఏర్పాట్లతో పాటు ముఖ్య నాయకుల్ని పిలిపించి వారి ద్వారా కూడా ప్రచారం చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. పార్టీ పార్లమెంటరీ నేత సుష్మాస్వరాజ్ సైతం ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మోడీ ప్రచార సభ వేదికపై బీజేపీ కూటమిలోని పార్టీల మిత్రులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంగా మదురైలో పొన్ రాధాకృష్ణన్ను మీడియా కదిలించగా మోడీ ప్రచార సభలకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఆయన పర్యటనల వివరాల మేరకు ఇక్కడ వేదికల్ని సిద్ధం చేస్తామన్నారు.


