breaking news
dharma sagar reservoir
-
'ధర్మసాగర్'ను పరిశీలించిన కడియం
ధర్మసాగర్: వరంగల్ నగరం సమీపంలోని ధర్మసాగర్ రిజర్వాయర్ను తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదివారం సందర్శించారు. గోదావరి జలాలను ఆహ్వానిస్తూ ఆయన కొబ్బరికాయ కొట్టారు. అధికారులతో కలసి గోదావరి జలాల పంపింగ్ను ఆయన పరిశీలించారు. గ్రేటర్ వరంగల్ ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చూస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఏటూరునాగారం మండలం దేవాదుల నుంచి ఈ నెల11వ తేదీన అత్యవసర పంపింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్కు నీటిని పంప్ చేసి అక్కడి నుంచి వరంగల్కు నీరందిస్తున్నారు. -
ధర్మసాగర్ రిజర్వాయర్లో నిట్ విద్యార్థి గల్లంతు
ధర్మసాగర్: వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ధర్మసాగర్ రిజర్వాయర్లో మంగళవారం ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. వరంగల్ నిట్కు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు రిజర్వాయర్ చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో విద్యార్థులు రిజర్వాయర్ లో దిగారు. ఖమ్మం జిల్లాకు చెందిన సామినేని నిఖిల్ (22) ప్రమాదవశాత్తూ జారీపడి గల్లంతయ్యాడు. తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.