-
‘ఉమా’ఉన్నంత కాలం నీళ్లు రావు
♦ మంత్రికి అవగాహన లేకే కృష్ణా బోర్డులో వాదన వినిపించలేదు ♦ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి కడప కార్పొరేషన్: రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నంత కాలం రాయలసీమకు మేలు జరగదని, సాగునీరు రావడం కష్టమేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్బాషా, మేయర్ సురేష్బాబుతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమలోని జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్, తెలుగుగంగ వంటి ప్రాజెక్టులకు నీరందించడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచాలని అప్పటి సీఎం వైఎస్సార్ నిర్ణయించిన నేపథ్యంలో.. దానికి వ్యతిరేకంగా ఉమా నాడు ధర్నా నిర్వహించారని, ప్రస్తుతం ఆయనే మంత్రిగా ఉన్నందున రాయలసీమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఇక్కడి రైతుల్లో లేదన్నారు. నదీ జలాల విషయంలో ఎక్కువ శాతం నీటిని తెలంగాణ రాష్ట్రం వాడుకుంటూ కూడా ఢిల్లీలో జరిగిన కృష్ణాబోర్డు ఎదుట తమకు అన్యాయం జరిగిందని వివరించిందన్నారు. తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్రావు సమగ్ర అవగాహనతో బోర్డు మీటింగ్కు హాజరు కాగా, ఏపీ మంత్రి మాత్రం అవగాహన లేకుండా వెళ్లినట్లు తెలుస్తోందన్నారు. శ్వేతపత్రం విడుదల చేయాలి ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఉన్న జనాభా నిష్పత్తి ఆధారంగా డెరైక్టరేట్, సెక్రటేరియేట్లోని అన్ని శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వాలని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టుల గురించి బోర్డు మీటింగ్లో ఒక్క మాట కూడా మాట్లాడకోవడం దారుణమన్నారు. అవే తప్పులు చేస్తున్న ప్రభుత్వం విభజన సమయంలో జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ఈనాటికీ ఆ ఊసే లేదని కడప ఎమ్మెల్యే ఎస్బీ అంజద్బాషా అన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని నిలదీయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సమావేశంలో నగర అధ్యక్షుడు నిత్యానందరెడ్డి పాల్గొన్నారు. -
చెరువులకు మహర్దశ
రూ. 600 కోట్లతో అంచనాలు వచ్చే వేసవి నుంచే పనులు 17న మంత్రితో ఎస్ఈల సమావేశం గుంటూరు: రాష్ట్రంలోని చెరువులకు ప్రత్యేక మరమ్మతులు చేసేందుకు మైనర్ ఇరిగేషన్శాఖ చర్యలు తీసుకుంటోంది. శిధిలావస్థకు చేరిన చెరువుల మరమ్మతుకు రూ. 600 కోట్లతో అంచనాలు రూపొందించింది. ఈ నెల 17వ తేదీన ఇరిగేషన్శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హైదరాబాద్లో ఆ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్లతో సమావేశమై తుది నిర్ణయానికి రానున్నారు. వచ్చే వేసవిలోనే చెరువుల మరమ్మతులు ప్రారంభించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 40 వేలకుపైనే చెరువులున్నాయి. వీటిలో వంద ఎకరాల్లోపు ఆయకట్టు కలిగిన చెరువుల సంఖ్య 35,376 ఉంటే, అంతకంటే ఎక్కువ ఆయకట్టు కలిగిన చెరువులు 6,361 ఉన్నాయి. వీటి ద్వారా 17.64 లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరా జరిగేది. కొంతకాలంగా ఈ చెరువులకు మరమ్మతులు లేకపోవడంతో మేట వేసుకుపోయి ఆయకట్టు విస్తీర్ణం సగానికి పడిపోయింది. స్థానిక సంస్థల అలక్ష్యం కారణంగా అనేక చెరువులు ఆక్రమణలపాలయ్యూరుు. కొన్ని ప్రాంతాల్లో పక్కా గృహాల నిర్మాణాలే జరిగాయి. ఈ పరిస్ధితులను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వ సహకారంతో చెరువులకు మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నెల రోజుల క్రితం వీటి అంచనాల రూపకల్పనకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దాదాపు 10 సర్కిళ్ల ఇంజినీర్లు అంచనాలు తయారుచేసి ప్రభుత్వానికి పంపారు. వీటిపై ఆ శాఖ చీఫ్ ఇంజినీర్ మహ్మద్ సాబ్జాన్ 12వ తేదీన సంబంధిత ఇంజినీర్లతో చర్చలు జరిపారు. 17 వ తేదీన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో జరగనున్న సమావేశానికి హైదరాబాద్ రావాలని ఆదేశించారు. గత సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 300 కోట్లతో చెరువులకు మరమ్మతులు చేసింది. ఈ మరమ్మతుల్లో మేట వేసిన మట్టిని తవ్వడం మినహా ఇతర పనులు జరగలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని చెరువుల గట్లు పటిష్టం చేసేందుకు రివిట్మెంట్లు, పశువుల వినియోగానికి అనువుగా ర్యాంపుల నిర్మాణాలు, గ్రీనరీ అభివృద్ధి, పరిరక్షణకు ఫెన్సింగ్ వంటివి అంచనాల్లో చేర్చారు. -
మంత్రా.. మజాకా..!
కృష్ణా తీరం వెంబడి ఆక్రమణలు ఇంతకుముందు తెలియదా? బడా భవనాల స్వాధీనం సాధ్యమేనా! సర్వే సకాలంలో పూర్తయ్యేనా! మంత్రి ఉమ తీరుపై సొంత పార్టీలోనే చర్చ విజయవాడ : ఆయనకు జిల్లాలో అణువణువూ తెలుసు. ప్రతిపక్షంలో ఉండగా ఆయన తిరగని ప్రాంతం లేదు. తాగునీరు.. సాగునీరు.. అంటూ ప్రతి సమస్యపైనా ధర్నాలు చేశారు. రాష్ట్ర మంత్రి అయిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో జిల్లాలో అన్నీ తానై ముందుకుసాగుతున్నారు. అయితే, తాను కృష్ణా నది వెంబడి ఉన్న ఆక్రమణలను ఇంతకుముందెన్నడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తంచేయడంతో సొంత పార్టీ నేతలే ముక్కున వేలేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఈ ఆక్రమణలపై సర్వేచేసి సంక్రాంతిలోపు నివేదిక ఇవ్వాలని అధికారులను సైతం ఆదేశించారు. ఎవరా మంత్రి అనుకుంటున్నారా.. ఆయనే రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ప్రస్తుతం ఆయన వ్యవహారశైలి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నిజంగా తెలియదా..! కృష్ణా నదీ తీరంలో గుంటూరు జిల్లా వైపు 45, కృష్ణా జిల్లా వైపు 15 భారీ అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు గుర్తించారు. వీటిల్లో కొన్ని నీటిపారుదల శాఖ భూములను ఆక్రమించుకుని నిర్మించినవి కాగా, మరికొన్ని ప్రైవేటు భూముల్లో తాత్కాలిక నిర్మాణాలకు అనుమతులు తీసుకుని బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. ఈ భవనాలన్నీ ఒక్క రోజులో నిర్మాణం జరగలేదు. డిసెంబర్ 31వ తేదీన మంత్రి ఉమ విలేకరులను తీసుకుని కృష్ణానదిలో పర్యటిస్తూ ఈ భవనాలను చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. వీటి గురించి సమగ్రంగా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కృష్ణా, గుంటూరు జిల్లాల నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అయితే, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని ఉమాకు ఈ అక్రమ నిర్మాణాల గురించి ఇంతకుముందు తెలియదా.. గతంలో కృష్ణానది ఇసుక తిన్నెల్లో.. భవానీద్వీపంలో... ధర్నాలు నిర్వహించినప్పుడు ఈ భవనాలు కనిపించలేదా...అప్పట్లో వీటి గురించి ఎందుకు పట్టించుకోలేదు.. ఇప్పుడే వీటిపై దృష్టి సారించడంలో ఆంతర్యం ఏమిటీ.. అనే విషయాలపై అధికార పార్టీలోనే జోరుగా చర్చ సాగుతోంది. పథకం ప్రకారమేనా... తుళ్లూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో అక్కడ భూముల రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో అక్రమ నిర్మాణాలపై మంత్రి ఉమా పథకం ప్రకారమే దృష్టిసారించారనే ప్రచారం జరుగుతోంది. అక్రమంగా నిర్మించిన భవనాలను సర్వే చేసి వాటి వివరాలను సేకరించే వరకే మంత్రి పరిమితమవుతారా.. లేక వాటిని స్వాధీనం చేసుకునే వరకు పట్టు బిగిస్తారా.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణంలోనే ప్రముఖుల బస! కృష్ణానది ఒడ్డున బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజుకు గెస్ట్హౌస్ ఉంది. ఇది నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినదే. రాజకీయ ప్రముఖులు, ముఖ్య అధికారులు ఇక్కడకు తరచూ వచ్చి వెళ్తుంటారు. మంత్రి ఉమ హడావుడి చేసి పది రోజులు గడవకముందే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఇదే గెస్ట్హౌస్లో బస చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల బీజేపీ పదాధికారుల సమావేశం కూడా నిర్వహించారు. ఉమ హడావుడిని తగ్గించేందుకే గోకరాజు గంగరాజు తమ పార్టీ అగ్రనేతను ఇక్కడకు తీసుకొచ్చారా.. అనే అనుమానాలను పలువురు వ్యక్తంచేస్తున్నారు. నోటీ సులే ఇవ్వలేదట... ప్రకాశం బ్యారేజీ నుంచి వైకుంఠపురం వరకు అనేక సంవత్సరాలుగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. వాటి యజమానులకు ఇప్పటి వరకు ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇక్కడ లంకభూముల్లో సుమారు ఆరువేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటి లీజు గడువు పూర్తయినా ఖాళీ చేయాలని లీజుదారులకు అధికారులు నోటీసులు ఇవ్వలేదు. లీజు పూర్తవగానే వారే స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని, తాము నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. సకాలంలో సర్వే పూర్తి అనుమానమే... విలేకరులతో కలిసి కృష్ణానదిలో పర్యటిస్తున్న సమయంలో మంత్రి ఉమా అధికారులతో మాట్లాడుతూ సంక్రాంతిలోపు కృష్ణానదీ కరకట్టను సర్వే చేసి వందేళ్ల రికార్డు ఆధారంగా అక్రమ కట్టడాలపై తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సంక్రాంతి పండుగ పూర్తి కాగానే కృష్ణా కరకట్ట ఆక్రమణలపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి నిబంధనలు అతిక్రమించిన భవనాలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. అయితే మంత్రి చెప్పిన సమయంలో సర్వే పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు. కరకట్ట ఆక్రమణలపై కృష్ణారివర్ కన్సర్వేటర్ ఆర్డీవోలకు లేఖ రాశారు. ఈ మేరకు ఆర్డీవోలు తహశీల్దార్లకు లేఖ రాశారు. అయితే ఇప్పుడు గ్రామాల్లో ఉన్న రికార్డులను, ఇరిగేషన్ శాఖ వద్ద ఉన్న రికార్డులతోపాటు భవన యజమానుల వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి, ఆ తర్వాత ఫీల్డ్ సర్వే చేసిన తర్వాతే అక్రమ నిర్మాణాలను గుర్తించడం సాధ్యమవుతుందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా అధికారులు రాజధాని నేపథ్యంలో ఇతర పనుల్లో బిజీగా ఉన్నారు. అందువల్ల పూర్తిస్థాయిలో ఆక్రమణల గుర్తింపునకు మరో నెలరోజులకు పైగా పట్టే అవకాశం ఉంది. ఈలోపు హడావుడి తగ్గి మళ్లీ యథాస్థితి నెలకొంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
పట్టిసీమ ఎత్తిపోతలకు రూ.1,250 కోట్లు
సాక్షి, హైదరాబాద్: పోలవరం, గూటాల మధ్య పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మా ణం అవసరమేనని మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. నిర్మాణం చేపట్టిన ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు. శుక్రవా రం అసెంబ్లీ లాబీల్లో మంత్రులు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. గోదావరిపై పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రూ. 1,250 కోట్లు ఖర్చవుతుందని యనమల చెప్పారు. రాష్ర్టం విడిపోక ముందు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేసిన రూ. 5,000 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలిపారు. గతంలో ఖర్చు పెట్టిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని తాము కోరినా కేంద్రం తిరస్కరించిందన్నారు. గోదావరి జలాల విషయంలో వైఎస్సార్సీపీ అనవరంగా రాజ కీయం చేస్తోందని విమర్శించారు. ఎత్తిపోతల పథకాన్ని పనులు ప్రారంభించిన ఏడాదిలోగా పూర్తి చేస్తామని మంత్రి దేవినేని తెలిపారు. -
పనితీరే కొలమానం
మాఫియా ఆగడాలను అరికట్టండి బదిలీల్లో మంత్రుల జోక్యం ఉండదు సమావేశంలో మంత్రి దేవినేని మైనింగ్ శాఖ అధికారుల పనితీరుపై అసహనం విజయవాడ : ఉద్యోగులంతా రాజీపడకుండా పారదర్శకంగా పనిచేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హితవు పలికారు. ఉద్యోగుల బదిలీలకు పనితీరే కొలమానమని, ఉద్యోగుల బదిలీ వ్యవహరంలో మంత్రుల జోక్యం ఉండదని సృష్టం చేశారు. బుధవారం స్థానిక నీటి పారుదల శాఖ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు, చేపట్టనున్న కార్యక్రమాలపై మంత్రులు సమావేశంలో చర్చించారు. శాఖల వారీగా అధికారులు ఆయా శాఖల గురించి సమావేశంలో వివరించగా మంత్రి దేవినేని పలు శాఖల అధికారుల తీరుపై ఆగ్రహం, అసహనం వక్తం చేశారు. మంత్రి దేవినేని మాట్లాడుతూ ఉద్యోగులు అవినీతికి దూరంగా పూర్తి పారదర్శకతతో పనిచేయాలని హితవు పలికారు. రాష్ట్ర రాజధాని ఇక్కడే నిర్మితం కానున్న నేపథ్యంలో వివిధ శాఖల ద్వారా చేపట్టాల్సిన పనులు, ఇతర కార్యక్రమాల వివరాలపై అధికారులు పూర్తిస్థాయిలో నివేదికలు సిద్ధం చేయాలని చెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ పథకాలపై, ఇతర అభివృద్ధి పనులపై తప్పనిసరిగా సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే ఐదేళ్లు అధికారులంతా అవినీతికి దూరంగా పనిచేయాలని ఆదేశించారు. జన్మభూమి కార్యక్రమంలో అందిన 5.40 లక్షల దరఖాస్తులు పరిష్కరించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, దీనికోసం అధికారులంతా పూర్తిస్థాయిలో తమకు సహకరించాలని కోరారు. విద్యుత్ శాఖపై మాట్లాడుతూ సబ్-స్టేషన్ల నిర్మాణం, వీటీ పీఎస్ కొత్త విద్యుత్ లైన్కు అవసరమైన భూసేకరణ, ఇతర కార్యక్రమాలను రెవెన్యూ అధికారుల సమన్వయంతో పూర్తిచేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్పై మాట్లాడుతూ 970 పంచాయతీలకుగానూ 400 మంది అధికారులు మాత్రమే ఉన్నారని, జిల్లా కలెక్టర్తో సంప్రదించి పారదర్శకంగా వీఆర్వోల బదిలీలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లావైద్య ఆరోగ్య శాఖపై మాట్లాడుతూ జిల్లాలో 178 మెడికల్ ఆఫీసర్ పోస్ట్లకు గానూ 44 మంది మాత్రమే పనిచేస్తున్నారని చెప్పారు. ఖాళీలున్న 534 ఏఎన్ఎం పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై మాట్లాడుతూ గత ఏడాది పదో తరగతి పరీక్షల్లో 9 స్థానం వచ్చిందని, వచ్చే సంవత్సరం మెదటి మూడు స్థానాల్లో ఉండడానికి విశేషంగా కృషిచేయాలని సూచించారు జిల్లా పౌరసరఫరాలశాఖ,మార్కెటింగ్శాఖపై మాట్లాడారు. రైతులకు సుబాబుల బకాయిలు ఎగ్గొట్టిన వారిపై పోలీసుల సహకారంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మైనింగ్ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నగర పాలక సంస్థ, వీజీటీఎం ఉడా, ఇతర విభాగాలపై సమీక్ష నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దె అనూరాధ, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్ మాట్లాడారు. కలెక్టర్ రఘు నందన్రావు మాట్లాడుతూ ఈపాస్ విధానంతో ఆధార్ను అనుసంధానం చేసి ప్రభుత్వ పథ కాలను ప్రజలకందించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జేసీ మురళీ, విజయవాడ సీపీ ఏబీ వెంకటేశ్వరరావు , ఉడా వైస్ చైర్మన్ పి.ఉషాకుమారి, ఎస్పీ విజయ్కుమార్, సబ్కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లాముఖ్య ప్రణాళికాధికారి శర్మ, ఇరిగేషన చీఫ్ ఇంజినీర్ సుధాకర్, డ్వామా పీడీ మధులత, డీఎంహెచ్వో నాగ మల్లేశ్వరి, డీపీవో నాగరాజు వర్మ, వివిధ విభాగాల ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement